Friday, April 3, 2026
32.2 C
Hyderabad

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం ఒక చారిత్రక అవసరం కాగా, ఆ బాధ్యతను నిర్వర్తించాల్సిన పాలకుల నిర్ణయాలు భిన్నంగా ఉండటం వల్ల, అవి ప్రజాభిప్రాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. గత ఐదేళ్ల పరిపాలనలో రాజధాని చుట్టూ జరిగిన పరిణామాలు రాజకీయ దిశ, నాయకత్వ స్థిరత్వం, ప్రజల నమ్మకం వంటి అంశాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తాయి.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం ఒక చారిత్రక అవసరం కాగా, ఆ బాధ్యతను నిర్వర్తించాల్సిన పాలకుల నిర్ణయాలు భిన్నంగా ఉండటం వల్ల, అవి ప్రజాభిప్రాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. గత ఐదేళ్ల పరిపాలనలో రాజధాని చుట్టూ జరిగిన పరిణామాలు రాజకీయ దిశ, నాయకత్వ స్థిరత్వం, ప్రజల నమ్మకం వంటి అంశాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తాయి.

పాలకులకు రాజధానిపై స్పష్టమైన దిశా నిర్దేశం లేకపోవడం ప్రధాన సమస్యగా నిలిచింది. 2019లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, అప్పటివరకు అమలులో ఉన్న అమరావతి రాజధాని అభివృద్ధి నమూనాను పూర్తిగా మారుస్తూ, “మూడు రాజధానుల” సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చింది. విశాఖపట్నం (కార్యనిర్వాహక), అమరావతి (శాసన), కర్నూలు (న్యాయ) కేంద్రాలుగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనను ప్రకటించింది. ఈ నిర్ణయం అధికార, పరిపాలన వికేంద్రీకరణను ప్రస్థావించినప్పటికీ, అమలు విధానం, ఆర్థిక వెసులుబాటు, చట్టపరమైన సవాళ్లపై స్పష్టత లేకపోవడం వల్ల ప్రజల్లో అనుమానాలు పెరిగాయి.

అమరావతి రైతుల సమస్యలు సవాల్ గా మారాయి. 29వేల మంది రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన నేపథ్యంలో, వారి ఆశలు, ఆకాంక్షలు, పరిహారాలు, అంచనాలు అమలు కాలేదనే భావన బలపడింది. ఆ ఐదేళ్లలో రాజధాని నిర్మాణానికి గణనీయమైన పురోగతి కనిపించకపోవడం, మౌలిక వసతుల అభివృద్ధి నిలిచిపోవడం వంటివి ప్రభుత్వంపై విమర్శలకు దారితీశాయి. రైతులు నిరసనలకు దిగడం, దీర్ఘకాలిక ఆందోళనలు కొనసాగడం ఈ అసంతృప్తిని మరింత బలపరిచాయి.

విధానాలలో స్థిరత్వం లేకపోవడం కూడా ఒక ప్రధాన విమర్శగా మారింది. మొదట మూడు రాజధానులు అన్న ప్రభుత్వం, తర్వాత వివిధ సందర్భాల్లో విభిన్న వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాజాగా “మావిగన్” (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు) వంటి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను ముందుకు తేవడం ద్వారా రాజకీయ సందిగ్ధత మరింత పెరిగింది. ఒక రాష్ట్రానికి రాజధాని అనే అంశం దీర్ఘకాలిక ప్రణాళిక, భారీ పెట్టుబడులు, చట్టబద్ధత వంటి అంశాలతో ముడిపడి ఉంటుంది. అలాంటి సందర్భంలో తరచూ మారే ప్రకటనలు పాలనలో అనిశ్చితిని ప్రతిబింబిస్తాయి.

ఆర్థిక నిర్వహణపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర అప్పులు ఐదేళ్లలో గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. సంక్షేమ పథకాల అమలు కోసం భారీగా ఖర్చు చేయడం ఒకవైపు ఉంటే, మూలధన వ్యయాలు తగ్గడం, మరోవైపు ఆర్థిక సమతుల్యతపై ప్రశ్నలు లేవనెత్తింది. దీని ప్రభావం మౌలిక వసతుల అభివృద్ధిపై పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పరిపాలన కేంద్రీకరణ, నిర్ణయాలలో పారదర్శకత లోపం కూడా చర్చకు వచ్చింది. కీలక నిర్ణయాలు కనీస, విస్తృత చర్చ లేకుండా తీసుకోవడం, పైగా ఈ విమర్శలను సహించకపోవడం వంటి ఆరోపణలు ప్రతిపక్షం తరఫున తరచూ వినిపించాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో విభిన్న అభిప్రాయాలకు స్థానం ఉండాలి అనే సూత్రం నేపథ్యంలో ఈ విమర్శలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.

అయితే, గత ప్రభుత్వం తన నిర్ణయాలను సమర్థించుకుంది. ప్రాంతీయ అసమానతలను తగ్గించడం, అభివృద్ధిని వికేంద్రీకరించడం, విశాఖపట్నంలాంటి నగరాలను పరిపాలనా కేంద్రాలుగా అభివృద్ధి చేయడం ద్వారా ఆర్థిక అవకాశాలను పెంచవచ్చని వాదించింది. సంక్షేమ పథకాల ద్వారా పేదల జీవితాల్లో మార్పు తీసుకువచ్చామని కూడా పేర్కొంది. ఈ వాదనలపై కొన్ని వర్గాల్లో మద్దతు లభించినప్పటికీ, మిగతా వర్గాలు వ్యతిరేకించాయి.

రాజధాని కేవలం రాజకీయ నినాదంగా కాకుండా, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే కీలక కేంద్రంగా చూడాలి. దీని కోసం దీర్ఘకాలిక దృష్టి, విధానాలలో స్థిరత్వం, చట్టబద్ధత, ప్రజల నమ్మకం అవసరం. తరచూ మారే నిర్ణయాలు, అస్పష్ట ప్రకటనలు ప్రజల్లో అయోమయాన్ని పెంచుతాయి.

అందువల్ల, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, రాజధాని అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, సమగ్ర అభివృద్ధి దృష్టితో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ, పారదర్శకంగా, శాస్త్రీయంగా, ఆర్థికంగా సాధ్యమైన మార్గాన్ని ఎంచుకోవడం మాత్రమే స్థిరమైన పరిష్కారానికి దారితీస్తుంది.

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

31-03-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి త్రయోదశి ఉదయం 06.43 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం పుబ్బ మధ్యాహ్నం 03.08 వరకు ఉపరి ఉత్తర యోగం గండ మధ్యాహ్నం 03.36 వరకు ఉపరి వృద్ధి కరణం తైతుల ఉదయం 06.43...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News