Monday, April 6, 2026
35.2 C
Hyderabad

అప్పుల తప్పులు చేసే పాలకులనూ శిక్షించాల్సిందే!|EDITORIAL

మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ. ప్రజలే పాలకులు అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వారి తరపున పరిపాలకులు. మన పాలకులు మనకు జవాబుదారులు. మరి ఆచరణలో ఇది జరుగుతుందా? మనం తరచూ వినే.. పాలనలో పారదర్శకత, ప్రజల పట్ల నిబద్ధత, పథకాల అమలులో నిజాయితీ, అవినీతి రహిత అభివృద్ధి, అకౌంటబిలిటీ వంటివి ప్రభుత్వాల్లో ఉంటున్నాయా? అసలు మన పాలకులు ప్రజల పట్ల నిజాయితీగానే ఉంటున్నారా? మన పాలకులకు తరతరాలకు తరగని ఆస్తులు పెరిగి, ప్రభుత్వాలు ఎందుకు అప్పుల్లో కూరుకుపోతున్నాయి? ప్రభుత్వాలు చేస్తున్న అప్పులకు ఎవరు బాధ్యులు? ఎవరు బాధితులు? చిన్న చిన్న తప్పులకో, పొరపాట్లలో ఏళ్ళతరబడి జైలు జీవితాలు అనుభవిస్తున్న వారికి, వీరికి ఏంటి తేడా? కోట్లు కొల్లగొట్టి, ప్రజల ఆస్తులకు రక్షణగా నిలవాల్సిన వారు చేసే ఆర్థిక నేరాలకు శిక్షలుండవా? ఎంతో సామాజిక బాధ్యతతో నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని వదిలేసి, వారు మాత్రం కోట్లకు పడగలెత్తుతూ, ప్రభుత్వాలను లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టేసి, ప్రజల నెత్తిన ఆ భారాన్ని మోపుతున్న పాలకులకు శిక్షలు ఎందుకు ఉండటం లేదు? ప్రజాతీర్పునకు మించింది లేకపోయినా, మళ్ళీ మళ్ళీ వాళ్ళే పదవుల్లోకి వస్తూపోతూ ఉంటే ప్రజల సంగతేం కావాలి?

2025, మార్చి 30 నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 5, 62, 557 కోట్లు కాగా, తెలంగాణపై రూ.4, 42, 298 కోట్ల భారం ఉందని లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ప్రకటించింది. ఏపీ అప్పులో స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) 34.7 శాతంగా ఉండగా.. తెలంగాణ అప్పులో జీఎస్‌డీపీ 26. 2శాతంగా నమోదు అయింది. రాష్ట్రాల వారీగా తమిళనాడు అప్పు రూ.9,55,691 కోట్లతో ఆగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత వరస స్థానాల్లో రూ. 8, 57, 844 కోట్లతో ఉత్తరప్రదేశ్, రూ.8,12, 068 కోట్లతో మహారాష్ట్ర, రూ.7, 25, 456 కోట్లతో కర్ణాటక, రూ.7,14,196 కోట్లతో పశ్చిమబెంగాల్‌ ఉన్నాయి. అయితే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా ప్రకారం 2025, మార్చి 31వ తేదీ నాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి అప్పు రూ. 2, 67, 35, 462 కోట్లుగా ఉంటుందని కేంద్రం వివరించింది. అయితే మన దేశంలో యూపీఏ హయాంలో అప్పులు రూ. 60 లక్షల కోట్లు. ప్రస్తుత ఎన్డీఎ ప్రభుత్వంలో అదనంగా చేసిన రూ.100 లక్షల కోట్ల అప్పుతో కలిపితే, ప్రస్తుతం రూ.160 లక్షల కోట్లుకు చేరుకుంది. ఏపీ, తెలంగాణాల్లో గత ప్రభుత్వాలపై ప్రస్తుత ప్రభుత్వాలు చెబుతున్న లెక్క వేరుగా ఉంది. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం దాదాపు 14.70 లక్షల కోట్లు అప్పు చేయగా, తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఆరోపిస్తున్నాయి.

ఇక పాత రుణాలపై వడ్డీ చెల్లింపులు 23శాతం పెరిగితే, పౌరులకు ప్రభుత్వ సేవలు అందించడానికయ్యే ఖర్చు 35శాతం, రాష్ట్రాలకు పెన్షన్‌ చెల్లింపుల వ్యయం 23శాతం చొప్పున పెరిగాయి. కొవిడ్‌ వచ్చినా రాకున్నా రుణాలపై వడ్డీ చెల్లింపుల నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదు. ఉద్యోగులకు జీతాలు, పింఛన్ల చెల్లింపు తప్పనిసరి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు నడవడం ఎలా? అప్పులు తేవడం అనుత్పాదక రంగాల్లో ఖర్చు చేయడం, ఆ అప్పులపై వడ్డీ కట్టడానికి మరిన్ని అప్పులు చేయడం… ఇలా అప్పులు చేస్తూ పోతే, తర్వాత ముంచుకొచ్చే ఉపద్రవాలకు బాధ్యత ఎవరు వహిస్తారు?

గత, ప్రస్తుత పాలకుల వైఫల్యాలు, ధోరణుల కారణంగానే రాష్ట్రాలు, దేశం అప్పులకుప్పగా మారుతున్నాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల వరకు తీసుకుంటే, విభజన వల్ల జరిగిందేంటి? ఒకటి రెండు కుటుంబాలు బాగు పడ్డాయి తప్పితే రాష్ట్రాలు, ప్రజలు మాత్రం తీవ్రంగా నష్టపోయాయి. అప్పులు చేసి అభివృద్ధి చేస్తున్నామని చెప్పిన గత సీఎంలు కేసీఆర్‌, జగన్‌ లిద్దరూ రాష్టాల్రను దివాళా తీయించారు. పైగా అప్పులు చేశాం, ఆస్తులు పెంచామని దబాయిస్తున్నారు. వారు పెంచిన ఆస్తులేవీ? భూములను తనఖా పెట్టి కట్టిన భవనాలా? అక్కరకు రాని ప్రాజెక్టులా? ఈ వైపరీత్యాలకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఓ కారణం. రాష్ట్రాలు అప్పుల కుప్పలుగా మారుతుంటే చోద్యం చూస్తోందా? మనది సమాఖ్య పద్ధతిలోని ప్రజాస్వామ్యం. రాష్ట్రాలు వేరైనా, దేశం ఒక్కటే కదా? రాష్ట్రాలు కలిస్తేనే దేశం కదా? దేశంలోని ప్రభుత్వం రాష్ట్రాల అప్పులపై కూడా నిర్ణీత ఆంక్షలు పెట్టవచ్చు కదా? పైగా స్వయంగా అప్పులు చేస్తూ, అప్పులు చేయకుండా రాష్ట్రాలను కట్టడి చేయడంలోనూ పూర్తిగా విఫలం అయ్యారు.

ఇలా పాలకులు ఇష్టానుసారం అప్పులు చేసే పద్ధతిని ఆపేయాలి. జీతాలు సకాలంలో ఇవ్వలేక, అభివృద్ధి పనులు చేపట్టలేక, ఉన్నది ఉచితంగా దోచిపెడుతూ తామేదో ఘనకార్యం చేస్తున్నామని గొప్పలు చెప్పే వాళ్ళ తప్పులకు శిక్షలు పడాలి. ఇకముందు రాజకీయ పార్టీలు, నేతలు ఇలా బాధ్యతా రహితంగా వ్యవహరించకుండా కట్టడి చేయాలి. పాలన అంటే దోచుకోవడం, దాచుకోవడం, పంచిపెట్టడం, ఓటు బ్యాంకు రాజకీయాలు ఇకనుంచి పోవాలి. దుబారాను, దుబారా పథకాలను సమీక్షించాలి. ఇవ్వాళ పాలకులు చేసే తప్పిదాలు, అప్పులకు ప్రజలు కూడా బాధ్యులే, రేపటి బాధితులు కూడా. అందుకే సరైన పాలకులను ఎన్నుకోవాలి. సరైన పాలనను పొందాలి. తప్పు చేసే ప్రతి వారిని నిలదీయాలి. శిక్షించాలి.

Latest News

06-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ చవితి ఉదయం 11.47 వరకు ఉపరి పంచమి నక్షత్రం అనూరాధ రాత్రి 12.45 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం సిద్ది మధ్యాహ్నం 01.40 వరకు ఉపరి వ్యతీపాత కరణం బాలవ ఉదయం 11.47...

గా ఊల్లె.. అందరికీ ఒకటే వంట!?|ADUGU TRENDS

గా ఊల్లె నిజంగా రోజూ పండుగే? ఎవలింట్లా పొయ్యి ఎలగదు. ఊరంతటికీ ఒకటే పొయ్యి. కులం లేదు మతం లేదు. గా ఊరంతా ఒకటే కుటుంబం. రోజూ అంతా కలిసే ఉంటరు. ఒకదగ్గరనే...

గ్రామాలు బలపడితేనే దేశాభివృద్ధి!|EDITORIAL

మనది గ్రామీణ భారతం. గ్రామాలతోనే దేశం బాగుపడుతుంది. అభివృద్ధి అనగానే “ట్రిలియన్ డాలర్ ఎకానమీ”, “ఫ్యూచర్ సిటీలు” వంటి ఆకర్షణీయమైన లక్ష్యాలు ముందుకు వస్తున్నాయి. అయితే, ఈ లక్ష్యాలు సాధ్యమవ్వాలంటే గ్రామాలు బలపడటం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 05, 2026 నుండి ఏప్రిల్ 11, 2026 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నా ఫలితాలు మంచిగా ఉంటాయి....

గిట్లంటే, గీ గ్యాస్ సిలండర్ మూతొత్తది!?|ADUGU TRENDS

ఇండ్లల్ల గ్యాస్ అయిపోయిందని తెల్వంగనే పక్కన పడేత్తం. కనీ, గా గ్యాస్ అయిపోయిందా? లేదా అని సూడాల్నంటే, గా మూత తీయాలె. గది తీయాల్నంటే మస్తు భయమైతది. కనీ, గా మూత తీసుడు...

యుద్ధం: వాస్తవాలు, అపోహలు, ప్రభావాలు|EDITORIAL

ప్రపంచం వేగంగా మారుతోంది. ఒక చోట చోటు చేసుకునే సంఘటనలు మరో చోట జీవన విధానాన్ని అంతకంటే వేగంగా ప్రభావితం చేస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధం, ఉద్రిక్తతలు వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది....

04-04-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు విదియ ఉదయం 08.22 వరకు ఉపరి తదియ నక్షత్రం స్వాతి రాత్రి 07.58 వరకు ఉపరి విశాఖ యోగం హర్షణ మద్యాహ్నం 01.00 వరకు ఉపరి వజ్ర కరణం గరజి ఉదయం 08.22...

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News