Monday, April 6, 2026
35.2 C
Hyderabad

రాష్ట్రాల పురోగతే దేశ ప్రగతి!|EDITORIAL

మరో పక్షం రోజుల్లో కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ కసరత్తుల్లో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇటీవల రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ప్రీ–బడ్జెట్‌ సమావేశం నిర్వహించారు. దేశంలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని ఈ భేటీ మరోసారి బహిర్గతం చేసింది. రాష్ట్రాలు తమ అభివృద్ధి అవసరాల కోసం కేంద్రాన్ని దేబిరించాల్సిన పరిస్థితి. రాజకీయ భేదాభిప్రాయాల ఆధారంగా నిధుల కేటాయింపులు జరుగుతుండటం దేశ ప్రజాస్వామ్యానికి ఆందోళన కలిగించే అంశాలు.

ప్రీ బడ్జెట్‌ సమావేశంలో తెలంగాణ నుంచి భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్‌ నుంచి పయ్యావుల కేశవ్‌ హాజరై తమ రాష్ట్రాల అవసరాలు, ఆకాంక్షలను కేంద్రం ముందు ఉంచారు. అయితే ఈ వినతులు కొత్తవేమీ కావు. ఏటా ఇదే విధంగా విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు కేంద్రం ప్రకటించిన బడ్జెట్లలో నిధుల కేటాయింపులు, రాష్ట్రాలు ఆశించిన విధంగా లేవు. ఏ పథకానికి ఎంత ఖర్చు చేశారో, ఏ రాష్ట్రానికి ఎంత న్యాయం జరిగిందో తెలిపే పారదర్శక వ్యవస్థ కనిపించడం లేదు.

బడ్జెట్‌ కేవలం లెక్కల పుస్తకం కాదు. అది దేశ అభివృద్ధికి దిశానిర్దేశం చేసే విధాన పత్రం. అన్ని రాష్ట్రాలను సమానంగా చూసే దృక్పథం అందులో ప్రతిఫలించాలి. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మద్దతు ఇచ్చే రాష్ట్రాలకు ఒక రకంగా, భిన్న రాజకీయ వైఖరులు గల రాష్ట్రాలకు మరో రకంగా నిధుల పంపిణీ జరుగుతుండడాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.

ఈసారి ప్రీ–బడ్జెట్‌ సమావేశంలో కేంద్రంలో ఎన్‌డిఎ కూటమిలో భాగస్వామ్య రాష్ట్రాలు కూడా నిధుల కోసం గళం విప్పాయి. జీఎస్‌టీ పరిహారం కొనసాగించాలని, పెరిగిన ఆర్థిక భారం దృష్ట్యా అదనపు గ్రాంట్లు ఇవ్వాలని బీహార్‌ సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు కోరడం పరిస్థితి తీవ్రతను అర్థం చేస్తున్నాయి. పన్నుల వసూళ్లలో రాష్ట్రాల వాటాను తగ్గించడం, గ్రాంట్లను ఆలస్యం చేయడం, అప్పుల పరిమితులను కఠినతరం చేయడం వంటి కేంద్ర ప్రభుత్వ విధానాలే ఈ దుస్థితికి ప్రధాన కారణాలు.

కేంద్ర ఆర్థిక విధానాల వల్ల అత్యధికంగా నష్టపోయిన రాష్ట్రాల్లో కేరళ ముందుంది. సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న కేరళపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. గత ఐదేళ్లలో దాదాపు రూ.57 వేల కోట్ల మేర నిధులకు కోత పెట్టడమే కాకుండా, పన్నుల వాటాను 3.89 శాతం నుంచి 1.92 శాతానికి తగ్గించింది. దీనివల్ల ఒక్క 2024–25 ఆర్థిక ఏడాదిలో కేరళ ప్రజలు సుమారు రూ.27 వేల కోట్లలు నష్టపోయారు. జీఎస్‌టీ సంస్కరణల కారణంగా మరో రూ.9 వేల కోట్లు నష్టం వాటిల్లింది. ఈ ఆర్థిక దిగ్బంధానికి నిరసనగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సత్యాగ్రహానికి దిగాల్సి రావడం పరిస్థితి ఎంత తీవ్రమో సూచిస్తోంది.

ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఈ ఏకపక్ష విధానాలపై కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపీఏ మౌనం పాటించడం దారుణం. సమాఖ్య హక్కుల పరిరక్షణలో ప్రతిపక్షాలు ఏకోన్ముఖంగా పోరాడకపోవడం, కేంద్ర ప్రభుత్వానికి మరింత బలాన్నిస్తోంది. బరితెగించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోంది.

తెలంగాణ ఫ్యూచర్‌ సిటీ, మూసీ సుందరీకరణ, నవోదయ విద్యాలయాలు, రోడ్ల విస్తరణ, ఎస్సీఆర్‌ఎస్పీకి జాతీయ హోదా, ట్రిపుల్‌ ఆర్‌ వంటి కీలక ప్రాజెక్టుల కోసం నిధులు కోరింది. ఆంధ్రప్రదేశ్‌ అమరావతి రాజధాని నిర్మాణానికి కొనసాగింపు నిధులు, పోలవరం ప్రాజెక్టుకు పూర్తి సహాయం, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు, విశాఖపట్నం–రాయలసీమ మౌలిక సదుపాయాల అభివృద్ధికి అదనపు కేటాయింపులు కోరింది. ఇవన్నీ ఏళ్లుగా వినిపిస్తున్న డిమాండ్లే. తెలంగాణ, ఏపీ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి ఇవే అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నా ఫలితం కనిపించడం లేదు.

నిధుల కేటాయింపుల్లో సమానత, పారదర్శకత, రాజకీయ భేదాలకు అతీతమైన దృక్పథం అత్యవసరం. బలమైన రాష్ట్రాలే బలమైన కేంద్రాన్ని నిర్మిస్తాయి. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిస్తే దేశ ప్రగతి కుంటుపడుతుంది. సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ఏకపక్ష వైఖరిని విడనాడి, రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాల హక్కులను గౌరవించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో, ఈ ఆర్థిక, అభివృద్ధి అసమానతలు, అసంతృప్తులకు దారితీస్తాయి. ఆవేదనలు, నిరసనలు, ఆందోళనలుగా మారి దేశవ్యాప్తంగా అంతర్గత సమస్యలు పెరుగే ప్రమాదం లేకపోలేదు. ఈ లోగా కేంద్రం మేల్కొంటే మంచిది.

Latest News

06-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ చవితి ఉదయం 11.47 వరకు ఉపరి పంచమి నక్షత్రం అనూరాధ రాత్రి 12.45 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం సిద్ది మధ్యాహ్నం 01.40 వరకు ఉపరి వ్యతీపాత కరణం బాలవ ఉదయం 11.47...

గా ఊల్లె.. అందరికీ ఒకటే వంట!?|ADUGU TRENDS

గా ఊల్లె నిజంగా రోజూ పండుగే? ఎవలింట్లా పొయ్యి ఎలగదు. ఊరంతటికీ ఒకటే పొయ్యి. కులం లేదు మతం లేదు. గా ఊరంతా ఒకటే కుటుంబం. రోజూ అంతా కలిసే ఉంటరు. ఒకదగ్గరనే...

గ్రామాలు బలపడితేనే దేశాభివృద్ధి!|EDITORIAL

మనది గ్రామీణ భారతం. గ్రామాలతోనే దేశం బాగుపడుతుంది. అభివృద్ధి అనగానే “ట్రిలియన్ డాలర్ ఎకానమీ”, “ఫ్యూచర్ సిటీలు” వంటి ఆకర్షణీయమైన లక్ష్యాలు ముందుకు వస్తున్నాయి. అయితే, ఈ లక్ష్యాలు సాధ్యమవ్వాలంటే గ్రామాలు బలపడటం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 05, 2026 నుండి ఏప్రిల్ 11, 2026 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నా ఫలితాలు మంచిగా ఉంటాయి....

గిట్లంటే, గీ గ్యాస్ సిలండర్ మూతొత్తది!?|ADUGU TRENDS

ఇండ్లల్ల గ్యాస్ అయిపోయిందని తెల్వంగనే పక్కన పడేత్తం. కనీ, గా గ్యాస్ అయిపోయిందా? లేదా అని సూడాల్నంటే, గా మూత తీయాలె. గది తీయాల్నంటే మస్తు భయమైతది. కనీ, గా మూత తీసుడు...

యుద్ధం: వాస్తవాలు, అపోహలు, ప్రభావాలు|EDITORIAL

ప్రపంచం వేగంగా మారుతోంది. ఒక చోట చోటు చేసుకునే సంఘటనలు మరో చోట జీవన విధానాన్ని అంతకంటే వేగంగా ప్రభావితం చేస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధం, ఉద్రిక్తతలు వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది....

04-04-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు విదియ ఉదయం 08.22 వరకు ఉపరి తదియ నక్షత్రం స్వాతి రాత్రి 07.58 వరకు ఉపరి విశాఖ యోగం హర్షణ మద్యాహ్నం 01.00 వరకు ఉపరి వజ్ర కరణం గరజి ఉదయం 08.22...

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News