Monday, April 6, 2026
35.2 C
Hyderabad

ఎన్నికల సంస్కరణలపై చిత్తశుద్ధేది?|EDITORIAL

భారత ప్రజాస్వామ్యానికి ఆత్మ పారదర్శక ఎన్నికలు. ఇది రాజకీయాలతో కూడిన సున్నిత అంశం. అయితే, ‘ఎన్నికల సంస్కరణల’పై పార్లమెంటులో జరుగుతున్న చర్చ రాజకీయ రచ్చగా మారిపోయింది. పాలక బీజేపీ, ఎన్డీఏ పూర్తి స్థాయి సంస్కరణల ముసాయిదా ప్రకటించకపోవడం ఒక సమస్య కాగా, ఆ ముసాయిదానేగాక, ఎన్నికల పాదర్శకతపై విపక్షం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన అధికార, విపక్ష కూటములు రాజకీయ ఎజెండాలకే ప్రాధాన్యమివ్వడం వల్ల సమస్య పరిష్కారం కాకపోగా, మరింత జఠిలం అవుతున్నది.

మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

భారత ప్రజాస్వామ్యానికి ఆత్మ పారదర్శక ఎన్నికలు. ఇది రాజకీయాలతో కూడిన సున్నిత అంశం. అయితే, ‘ఎన్నికల సంస్కరణల’పై పార్లమెంటులో జరుగుతున్న చర్చ రాజకీయ రచ్చగా మారిపోయింది. పాలక బీజేపీ, ఎన్డీఏ పూర్తి స్థాయి సంస్కరణల ముసాయిదా ప్రకటించకపోవడం ఒక సమస్య కాగా, ఆ ముసాయిదానేగాక, ఎన్నికల పాదర్శకతపై విపక్షం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన అధికార, విపక్ష కూటములు రాజకీయ ఎజెండాలకే ప్రాధాన్యమివ్వడం వల్ల సమస్య పరిష్కారం కాకపోగా, మరింత జఠిలం అవుతున్నది.

“ఎన్నికల పారదర్శకత, ఖర్చుల నియంత్రణ, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం” ప్రతిపాదిక సంస్కరణల లక్ష్యమని పాలకపార్టీ పేర్కొంటోంది. ఓటర్ల జాబితాల సమీక్ష, డిజిటల్ ధృవీకరణ, పార్టీ నిధులపై పర్యవేక్షణ వంటి అంశాలను ఇది ముందుకు తెచ్చింది. ప్రభుత్వం దీన్ని దేశ ప్రజాస్వామ్యాన్ని బలపరిచే “సిస్టమ్ అప్‌గ్రేడ్”గా అభివర్ణించింది. అయితే ప్రతిపక్షం, ఈ సంస్కరణల వెనుక రాజకీయ లాభనష్టాల ‘హిడెన్ ఎజెండా’ దాగి ఉందని అనుమానిస్తోంది.

ప్రతిపక్షం ముఖ్యంగా రెండు అంశాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఒకటి, ఈ సంస్కరణలు ఓటర్ల గోప్యతను ప్రభావితం చేస్తాయా? రెండవది, ఇవి అధికార వ్యవస్థకే ఎక్కువ నియంత్రణను అందిస్తాయా? ప్రత్యేకంగా, డిజిటల్ ధృవీకరణ ప్రక్రియలో ఆడిట్, పారదర్శకత లేకుంటే, అధికార యంత్రాంగం ఎన్నికలపై పరోక్ష ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. పాలకపక్షం దీనిని “అసత్య ప్రచారం”గా కొట్టి పారేసినా, చర్చలో ఈ అనుమానం ప్రధాన బిందువుగా నిలిచింది.

ఈ వాదోపవాదాలు రాజకీయ భిన్నాభిప్రాయాలకు బలం చేకూర్చాయి. చిన్న పార్టీల నుండి వచ్చిన ప్రతిస్పందనలు ఆసక్తికరంగా ఉన్నాయి. పెద్ద పార్టీల రాజకీయ సమీకరణల్లో తాము అడుగంటిపోతామనే ఆందోళనతో వారు ఈ సంస్కరణలను మళ్లీ సమీక్షించాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ పార్టీలకు, కేంద్ర ఎన్నికల సంస్కరణ అంటే ఎప్పుడూ భయమే. అయితే, వారు పాలకపక్షంతో నేరుగా విభేదించకపోయినా, బలహీన ప్రతిపక్షాలపై సానుభూతి వ్యక్తం చేస్తూ, తమ స్థానాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ చర్చలో మరో ముఖ్యాంశం రాజకీయ నిధులు. నిధుల వ్యవస్థను పారదర్శకంగా మారుస్తామని పాలకపక్షం చెప్పినా, ప్రతిపక్షం మాత్రం ఇది కొన్ని పెద్ద కార్పొరేట్ సంస్థలకు మాత్రమే అనుకూలంగా మారుతుందని విమర్శిస్తోంది. నిధులపై పారదర్శకత వెనుక రాజకీయ, ఆర్థిక సమీకరణలు దాగి ఉన్నాయన్న అనుమానాలను వ్యక్తం చేస్తోంది. దీనిపై సమగ్ర చర్చ లేకపోవడం, విషయాన్ని మరింత అనుమానాస్పదంగా మార్చింది.

ఇక, ఎన్నికల్లో ధన ప్రవాహం, రాజకీయాలు, ఎన్నికలు ఖరీదైనవిగా మారడం, వంశపారంపర్యం, జీవితాంతం కొందరు చట్టసభల్లో తిష్ట వేయడం, దొంగ ఓట్లు, ఓట్లకు నోట్లు వంటి అంశాలను చర్చించి, సంస్కరించాల్సి ఉంది.

‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’పై ప్రభుత్వం స్పష్టతనివ్వకపోవడం ఆందోళనకరం. వరుస ఎన్నికలు ప్రజలకు, ప్రభుత్వాలకు, యంత్రాంగానికి, భారంగా మారుతున్నాయి. జన గణన, కులగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన, రిజర్వేషన్లు కూడా తప్పనిసరి. పక్కాగా ఓటర్ల జాబితా, ఎప్పటికప్పుడు సవరణలు అవసరం, అన్నింటికంటే ఎన్నికల సంఘాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడమేగాక, స్వతంత్రంగా తీర్చిదిద్దాలి.

ఎన్నికల్లో రెండు పర్యాయాలకంటే మించి పోటీ చేసే అవకాశం లేకుండా చేయడం, ఎన్నికల్లో ధనబలం, కండబలం ప్రభావం తగ్గించేందుకు చట్టాలను బలోపేతం చేయడం అత్యవసరం. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల వ్యవస్థకు పటిష్ఠమైన మార్గదర్శకాలు రూపొందించాల్సిన బాధ్యతను పార్లమెంటు నిర్వర్తించాలి.

పేదలకు చట్టసభల్లో ప్రవేశం లభించేలా విధి, విధానాలు, ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించడం వంటి విస్తృత మార్పులు దేశ ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తాయి. నిరంతరం కొత్త నాయకులు ఎన్నికవుతేనే అవినీతి, బంధుప్రీతి, కొన్ని వర్గాల పాలన, ఏకస్వామ్యం, నిరంకుశ రాజకీయాలు అంతమవుతాయి. ఓటు వేసే బాధ్యతను తప్పనిసరి చేయడం, ఓటు వేయని వారిపై చర్యలు తీసుకోవడం కూడా చర్చించదగిన అంశాలు. అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కలిగిన ఎన్నికల విధానం ఉంటేనే భారతదేశ ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది.

Latest News

06-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ చవితి ఉదయం 11.47 వరకు ఉపరి పంచమి నక్షత్రం అనూరాధ రాత్రి 12.45 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం సిద్ది మధ్యాహ్నం 01.40 వరకు ఉపరి వ్యతీపాత కరణం బాలవ ఉదయం 11.47...

గా ఊల్లె.. అందరికీ ఒకటే వంట!?|ADUGU TRENDS

గా ఊల్లె నిజంగా రోజూ పండుగే? ఎవలింట్లా పొయ్యి ఎలగదు. ఊరంతటికీ ఒకటే పొయ్యి. కులం లేదు మతం లేదు. గా ఊరంతా ఒకటే కుటుంబం. రోజూ అంతా కలిసే ఉంటరు. ఒకదగ్గరనే...

గ్రామాలు బలపడితేనే దేశాభివృద్ధి!|EDITORIAL

మనది గ్రామీణ భారతం. గ్రామాలతోనే దేశం బాగుపడుతుంది. అభివృద్ధి అనగానే “ట్రిలియన్ డాలర్ ఎకానమీ”, “ఫ్యూచర్ సిటీలు” వంటి ఆకర్షణీయమైన లక్ష్యాలు ముందుకు వస్తున్నాయి. అయితే, ఈ లక్ష్యాలు సాధ్యమవ్వాలంటే గ్రామాలు బలపడటం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 05, 2026 నుండి ఏప్రిల్ 11, 2026 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నా ఫలితాలు మంచిగా ఉంటాయి....

గిట్లంటే, గీ గ్యాస్ సిలండర్ మూతొత్తది!?|ADUGU TRENDS

ఇండ్లల్ల గ్యాస్ అయిపోయిందని తెల్వంగనే పక్కన పడేత్తం. కనీ, గా గ్యాస్ అయిపోయిందా? లేదా అని సూడాల్నంటే, గా మూత తీయాలె. గది తీయాల్నంటే మస్తు భయమైతది. కనీ, గా మూత తీసుడు...

యుద్ధం: వాస్తవాలు, అపోహలు, ప్రభావాలు|EDITORIAL

ప్రపంచం వేగంగా మారుతోంది. ఒక చోట చోటు చేసుకునే సంఘటనలు మరో చోట జీవన విధానాన్ని అంతకంటే వేగంగా ప్రభావితం చేస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధం, ఉద్రిక్తతలు వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది....

04-04-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు విదియ ఉదయం 08.22 వరకు ఉపరి తదియ నక్షత్రం స్వాతి రాత్రి 07.58 వరకు ఉపరి విశాఖ యోగం హర్షణ మద్యాహ్నం 01.00 వరకు ఉపరి వజ్ర కరణం గరజి ఉదయం 08.22...

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News