Monday, April 6, 2026
35.2 C
Hyderabad

సమగ్ర ఎన్నికల సంస్కరణలపై చర్చించాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడాలంటే ఎన్నికల వ్యవస్థ పటిష్టంగా, పారదర్శకంగా, ప్రజాప్రయోజనాలను కాపాడే విధంగా ఉండాలి. అయితే ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ, నిధుల వ్యయం, దోపిడీ రాజకీయాలు, ఓటర్ల ఆకర్షణ కోసం జరుగుతున్న అక్రమాలు, రాజకీయాల్లో క్రిమినల్ చొరబాటు, క్రిమినల్సే అభ్యర్థులు కావడం వంటి అనేక సమస్యలు ప్రజాస్వామ్య ఉనికినే దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సమగ్ర ఎన్నికల సంస్కరణలపై భారత పార్లమెంట్‌లో పార్టీల రాజకీయాలకు అతీతమైన అర్థవంతమైన నిష్పాక్షిక సీరియస్ చర్చ జరగడం అత్యవసరం.

దేశంలో ఎన్నికలు నిర్వహణలో తలెత్తుతున్న ప్రధాన సమస్యల్లో మొదటిది అత్యధిక ఎన్నికల వ్యయం. ఖర్చుల నియంత్రణకు నిబంధనలు ఉన్నప్పటికీ, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంటోంది. నల్ల ధనం ప్రవాహం ఎన్నికల వ్యవస్థను భయంకరంగా దెబ్బతీస్తోంది. ఎన్నికల నిధుల పారదర్శకత కోసం రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల పద్ధతిని పూర్తిగా ప్రజలకు తెలిసేలా చేయాలి. కార్పొరేట్ ఫండింగ్‌పై కఠిన నియంత్రణలు విధించాలి. ఇదంతా పటిష్టమైన చట్టాల రూపకల్పన ద్వారానే సాధ్యం. ఈ అంశంపై గతంలో ఎన్నో కమిటీలు సూచనలు ఇచ్చినా అమలు మాత్రం జరగలేదు. దీనిపై పార్లమెంట్‌లో లోతైన చర్చతో పాటు ఆచరణాత్మక నిర్ణయాలు తప్పనిసరిగా రావాలి.

మరో ప్రధాన సమస్య రాజకీయాల్లో నేర చరితులు. క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తులు ఎన్నికల రాజకీయాల్లో రోజురోజుకు పెరుగుతున్నారు. రాజకీయాలను, పార్టీలను, ప్రభుత్వాలను వారే శాసిస్తున్నారు. కేసులు ఎదుర్కొంటున్న వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించే చర్యలు తీసుకోవాలి. ‘తప్పు నిరూపించబడే వరకు నిర్దోషి’ అనే చట్టపరమైన న్యాయ సూత్రం ఉన్నా, తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులు ఉన్న వ్యక్తులు శాసన, చట్ట సభల్లో ఉండటం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. ఈ అంశంపై కూడా పార్లమెంటులో అఖిలపక్ష చర్చ జరగాలి.

ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, తప్పిదరహితంగా మార్చడానికి ఏం చేయాలనేది? బ్యాలెట్ పద్ధతా? ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగమా? వీటిపై ఏకాభిప్రాయ సాధన అవసరం. అధికారంలో ఉన్న పార్టీలపై, విపక్షాలు ఓడిన ప్రతిసారీ ఓటింగ్ యంత్రాలపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. గెలుపోటములు మారినా, ఓడిన వారి పద్ధతి మారడం లేదు. అంటే ట్యాంపరింగ్ కు నిజంగా అవకాశం ఉందా? లేదా? ఉంటే గనక ఈవీఎంల వినియోగం ఎందుకు? ఒకవేళ ఆ అనుమానాలే ఉంటే, తొలగించాలి. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ఎందుకు తీసుకోకూడదు? ప్రతిపక్షం ఈవీఎంలపై అభ్యంతరాలు లేవనెత్తితే, వాటినే వినియోగించాలనడంలో అధికార పార్టీ ఔచిత్యమెంత? దీనిపై చర్చ జరగడమే కాదు. భవిష్యత్తులో అనుమానాలకే తావులేని, ఓ నిర్ణయం తీసుకోవడం అందరికీ, ముఖ్యంగా ప్రజాస్వామ్య మనుగడకు మంచిది.

వీటితోపాటు ఓటర్ల జాబితాలు తప్పులు లేకుండా ఉండటం, ఓటర్లకు అవగాహన కల్పించడం కూడా ముఖ్యం. సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, అబద్ధ ప్రచారం, తప్పుడు సమాచారం వ్యాప్తి వంటి సమస్యలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతున్నందున, వీటిని నియంత్రించే విధానాలు కూడా రూపుదిద్దాలి.

ప్రతి ఎన్నిక తర్వాత వ్యవస్థలోని లోపాలను చర్చించడమే కాకుండా, వాటిని సరిదిద్దాలి. ఎన్నికల కమిషన్‌కు మరింత స్వతంత్రత, ఆర్థిక స్వయం ప్రతిపత్తి ఇవ్వడంపై కూడా చర్చించాలి.
భారత ప్రజాస్వామ్య భవిష్యత్తు ఎన్నికల వ్యవస్థ బలోపేతంపై ఆధారపడి ఉంది. ఇది కేవలం రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం కాదు, దేశంలోని ప్రతి ఓటరు హక్కును కాపాడేందుకు అవసరమైన చర్య. కాబట్టి సమగ్ర ఎన్నికల సంస్కరణలపై భారత పార్లమెంట్‌లో సమగ్రమైన, బాధ్యతాయుతమైన చర్చ జరగడం అనివార్యం. మరి ఈ దిశగా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తాయా? చర్చిస్తాయా?

Latest News

06-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ చవితి ఉదయం 11.47 వరకు ఉపరి పంచమి నక్షత్రం అనూరాధ రాత్రి 12.45 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం సిద్ది మధ్యాహ్నం 01.40 వరకు ఉపరి వ్యతీపాత కరణం బాలవ ఉదయం 11.47...

గా ఊల్లె.. అందరికీ ఒకటే వంట!?|ADUGU TRENDS

గా ఊల్లె నిజంగా రోజూ పండుగే? ఎవలింట్లా పొయ్యి ఎలగదు. ఊరంతటికీ ఒకటే పొయ్యి. కులం లేదు మతం లేదు. గా ఊరంతా ఒకటే కుటుంబం. రోజూ అంతా కలిసే ఉంటరు. ఒకదగ్గరనే...

గ్రామాలు బలపడితేనే దేశాభివృద్ధి!|EDITORIAL

మనది గ్రామీణ భారతం. గ్రామాలతోనే దేశం బాగుపడుతుంది. అభివృద్ధి అనగానే “ట్రిలియన్ డాలర్ ఎకానమీ”, “ఫ్యూచర్ సిటీలు” వంటి ఆకర్షణీయమైన లక్ష్యాలు ముందుకు వస్తున్నాయి. అయితే, ఈ లక్ష్యాలు సాధ్యమవ్వాలంటే గ్రామాలు బలపడటం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 05, 2026 నుండి ఏప్రిల్ 11, 2026 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నా ఫలితాలు మంచిగా ఉంటాయి....

గిట్లంటే, గీ గ్యాస్ సిలండర్ మూతొత్తది!?|ADUGU TRENDS

ఇండ్లల్ల గ్యాస్ అయిపోయిందని తెల్వంగనే పక్కన పడేత్తం. కనీ, గా గ్యాస్ అయిపోయిందా? లేదా అని సూడాల్నంటే, గా మూత తీయాలె. గది తీయాల్నంటే మస్తు భయమైతది. కనీ, గా మూత తీసుడు...

యుద్ధం: వాస్తవాలు, అపోహలు, ప్రభావాలు|EDITORIAL

ప్రపంచం వేగంగా మారుతోంది. ఒక చోట చోటు చేసుకునే సంఘటనలు మరో చోట జీవన విధానాన్ని అంతకంటే వేగంగా ప్రభావితం చేస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధం, ఉద్రిక్తతలు వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది....

04-04-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు విదియ ఉదయం 08.22 వరకు ఉపరి తదియ నక్షత్రం స్వాతి రాత్రి 07.58 వరకు ఉపరి విశాఖ యోగం హర్షణ మద్యాహ్నం 01.00 వరకు ఉపరి వజ్ర కరణం గరజి ఉదయం 08.22...

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News