Monday, April 6, 2026
35.2 C
Hyderabad

‘ఫీల్ గుడ్’ గుండు సున్నా కావద్దు!|EDITORIAL

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక విజయంతో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంపై ఉన్న సందేహాలు కొంతమేరకు వీడిపోయినా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. గెలుపును బలుపుగా తీసుకుని సమస్యలను విస్మరించరాదు. విజయం ధైర్యాన్నివ్వాలి. కానీ, అహంకారానికి తావివ్వకూడదు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం మరింత సమర్థవంతంగా పని చేయడం, ప్రగతి ప్రభావాన్ని ప్రజల అనుభవంలోకి తేవడం ప్రభుత్వం, సీఎం ప్రథమ కర్తవ్యం కావాలి.

మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక విజయంతో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంపై ఉన్న సందేహాలు కొంతమేరకు వీడిపోయినా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నాయకుల అహంకారం, బండి సంజయ్‌ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం వంటి పరిణామాలతో ఏర్పడిన వాతావరణం కాంగ్రెస్‌కు అనుకూలంగా మారింది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ లు కుమ్మక్కయ్యాయనే ప్రచారం కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయంగా ముందుకు తెచ్చింది. ఇదే కొనసాగుతూ, గత రెండు ఉపఎన్నికలు కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్ కాంగ్రెస్‌కు విజయం చేకూర్చాయి. ఈ వాతావరణాన్ని సానూలంగా మలచుకున్న రేవంత్‌ వ్యూహాలు ఈ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాయి.
ఈ విజయాలను ప్రజాపాలనపై ‘ఫీల్ గుడ్’ గా తీసుకోవడానికి లేదు. ప్రభుత్వం పదేపదే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నట్లు ప్రచారం చేస్తోంది. వాటి ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరడంలేదు. ధరణి రద్దయి భూమాత వచ్చినప్పటికీ, భూ సమస్యలు అలాగే ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు, 1బి రికార్డులు, సెటిల్మెంట్ సంబంధిత అయోమయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థాయిలో భూ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది.

దేవాదాయ శాఖ దైవాదీనంగా మారింది. వేలాది ఎకరాల ఆలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. కానీ ఆ శాఖ మంత్రి కొండా సురేఖ వాటి గురించి కనీస అవగాహన లేకుండా వ్యవహరిస్తుండటం ఆందోళనకరం. అటవీ భూముల విషయంలోనూ ఇదే పరిస్థితి. ఆక్రమణలు, పోడులు కొనసాగుతూనే ఉన్నాయి.

రోడ్ల పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకరంగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయి. వరంగల్‌ హైవేపై పెద్దగా పనులు చేపట్టకపోవడం ప్రజలను విసిగిస్తోంది. పౌరసరఫరాలలో తెల్ల రేషన్‌ కార్డు దుర్వినియోగం, రేషన్‌ బియ్యంతో దొంగ వ్యాపారం వంటి అంశాలను మంత్రి పట్టించుకోవడం లేదు. తగిన దృష్టి పడకపోవడం సమస్యలను మరింత తీవ్రమయ్యేలా చేస్తోంది.
ఉద్యోగుల పనితీరుపై కూడా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. లంచం లేనిదే పనులు జరగడం లేదని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఏసీబీ దాడులతోనూ, ఉద్యోగుల్లో మార్పు కనిపించడం విచిత్రం, విడ్డూరం. ఫీ రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ దోపిడీలు ప్రభుత్వానికీ పెను సవాలుగా నిలుస్తున్నాయి. మంత్రులు, శాఖలు, ఉద్యోగులు తమ విధుల పట్ల నిర్లక్ష్యంతోపాటు, అవినీతికి అలవాటు పడ్డారన్న భావన ప్రజల్లో కలుగుతోంది. పాలన ప్రభావం ప్రభుత్వంపై పడుతుంది. ప్రభుత్వ బాధ్యత సీఎం ది. రేపటి పరిణామాలన్నీ సీఎం యే ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచీ, చెడు ఆయన ఖాతాలోకే కాబట్టి ఆయన క్రియాశీలకంగా స్పందించకపోతే వాటి పర్యవసానాలను భరించాల్సి వస్తుంది.

ఒక ఉప ఎన్నిక రాష్ట్రం మొత్తం ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించదు. కొంత మేరకు ఆ ప్రభావాన్ని చూపుతుందంతే. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక గెలిచినంత మాత్రాన ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని భావించడం ప్రమాదకరం. ఉపఎన్నికల్లో పార్టీ, ప్రభుత్వం మొత్తం శక్తిని కేంద్రీకరించడం వల్లే సాధ్యం అయింది. సాధారణ ఎన్నికల్లో ఇలా జరగదు. వనరులు, పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ వ్యతిరేకతను ఇప్పుడే గుర్తించకపోతే మూడేళ్ల తరువాత అది పెరిగి, పెద్దదై ప్రభుత్వాన్నే దగ్దె దించేయవచ్చు.

రేవంత్‌ ప్రస్తుతం పార్టీలో, ప్రభుత్వంలోనూ తన పట్టును ఒడిసిపట్టుకున్నారు. ప్రజాభిమానాన్ని పొందడానికి ఇంకా సుదూరం ప్రయాణించాల్సి ఉంది. సమస్యలను నేరుగా గుర్తించి వెంటనే పరిష్కరించడం తప్పనిసరి. మంత్రులు, అధికారులు సత్వరమే స్పందించి, బాధ్యతాయుతంగా మెలిగేలా కఠిన చర్యలు తీసుకోవాలి. సమీపిస్తున్న ఎన్నికల రీత్యా, స్థానిక, మున్సిపల్, జీహెచ్ఎంసీల సమస్యలను పరిష్కరించడం ద్వారా ఓటర్ల విశ్వాసాన్ని తిరిగి పొందవచ్చు.

బిహార్‌ ఫలితాలతో కాంగ్రెస్‌ జాతీయ స్థాయిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో తెలంగాణలో రేవంత్‌రెడ్డి విజయం పార్టీకి ఊపిరి పోసింది. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఆయన ప్రతిష్ఠను పెంచింది. కానీ, ఈ విజయాలే రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పులు తెచ్చేవేమీ కావు. రేవంత్‌ ఇకపై మరింత ప్రజల మధ్యకు వెళ్లి, సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, పరిష్కరిస్తేనే, తన నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవచ్చు.
గెలుపును బలుపుగా తీసుకుని సమస్యలను విస్మరించరాదు. విజయం ధైర్యాన్నివ్వాలి. కానీ, అహంకారానికి తావివ్వకూడదు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం మరింత సమర్థవంతంగా పని చేయడం, ప్రగతి ప్రభావాన్ని ప్రజల అనుభవంలోకి తేవడం ప్రభుత్వం, సీఎం ప్రథమ కర్తవ్యం కావాలి.

Latest News

06-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ చవితి ఉదయం 11.47 వరకు ఉపరి పంచమి నక్షత్రం అనూరాధ రాత్రి 12.45 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం సిద్ది మధ్యాహ్నం 01.40 వరకు ఉపరి వ్యతీపాత కరణం బాలవ ఉదయం 11.47...

గా ఊల్లె.. అందరికీ ఒకటే వంట!?|ADUGU TRENDS

గా ఊల్లె నిజంగా రోజూ పండుగే? ఎవలింట్లా పొయ్యి ఎలగదు. ఊరంతటికీ ఒకటే పొయ్యి. కులం లేదు మతం లేదు. గా ఊరంతా ఒకటే కుటుంబం. రోజూ అంతా కలిసే ఉంటరు. ఒకదగ్గరనే...

గ్రామాలు బలపడితేనే దేశాభివృద్ధి!|EDITORIAL

మనది గ్రామీణ భారతం. గ్రామాలతోనే దేశం బాగుపడుతుంది. అభివృద్ధి అనగానే “ట్రిలియన్ డాలర్ ఎకానమీ”, “ఫ్యూచర్ సిటీలు” వంటి ఆకర్షణీయమైన లక్ష్యాలు ముందుకు వస్తున్నాయి. అయితే, ఈ లక్ష్యాలు సాధ్యమవ్వాలంటే గ్రామాలు బలపడటం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 05, 2026 నుండి ఏప్రిల్ 11, 2026 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నా ఫలితాలు మంచిగా ఉంటాయి....

గిట్లంటే, గీ గ్యాస్ సిలండర్ మూతొత్తది!?|ADUGU TRENDS

ఇండ్లల్ల గ్యాస్ అయిపోయిందని తెల్వంగనే పక్కన పడేత్తం. కనీ, గా గ్యాస్ అయిపోయిందా? లేదా అని సూడాల్నంటే, గా మూత తీయాలె. గది తీయాల్నంటే మస్తు భయమైతది. కనీ, గా మూత తీసుడు...

యుద్ధం: వాస్తవాలు, అపోహలు, ప్రభావాలు|EDITORIAL

ప్రపంచం వేగంగా మారుతోంది. ఒక చోట చోటు చేసుకునే సంఘటనలు మరో చోట జీవన విధానాన్ని అంతకంటే వేగంగా ప్రభావితం చేస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధం, ఉద్రిక్తతలు వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది....

04-04-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు విదియ ఉదయం 08.22 వరకు ఉపరి తదియ నక్షత్రం స్వాతి రాత్రి 07.58 వరకు ఉపరి విశాఖ యోగం హర్షణ మద్యాహ్నం 01.00 వరకు ఉపరి వజ్ర కరణం గరజి ఉదయం 08.22...

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News