Monday, April 6, 2026
35.2 C
Hyderabad

విమోచనంపై ఎందుకింత విముఖత!?|EDITORIAL

చరిత్రను విస్మరించిన జాతి లేదా దేశం ముందడుగేయడం కష్టం. తెలంగాణ విమోచనమా? విలీనమా? విద్రోహమా? అన్న అంశంపై రాజకీయ పార్టీల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదు. బీజేపీ విమోచన దినోత్సవంగా, బీఆర్ఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవంగా, కాంగ్రెస్ ప్రజా పాలన దినోత్సవంగా, ఎవరికివారు ఇష్టం వచ్చిన రీతిగా నిర్వహిస్తున్నారు. పార్టీల స్వార్థపూరిత ప్రవర్తనల కారణంగా అసలు చరిత్ర మరుగున పడుతోంది. మన భవిష్యత్ తరాలకు వాస్తవ చరిత్ర అందకుండా, తెలియకుండా పోతోంది. ఇంకొంత వక్రీకరణ కూడా జరుగుతోంది. ఒక చారిత్రక సంఘటనపై ఇన్ని రకాలుగా కార్యక్రమం నిర్వహించడం విధి విపరీత వైచిత్రి.

విమోచనోత్సవంతో లబ్ది పొందాలన్న భావనలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒక్క కమ్యూనిస్టులు మాత్రమే దీనిపై బలంగా నిలబడ్డారు. అధికారికంగా విమోచనోత్సవం జరపాలని కోరుతున్నారు. అయినా అధికార కాంగ్రెస్‌ ఇందుకు సుముఖంగా లేదు. కేవలం ప్రజాపాలనతో విమోచన దినోత్సవాన్ని గట్టెక్కించాలని చూస్తోంది. కేసీఆర్‌ అధికారంలో ఉన్న పదేళ్లు కేవలం సమైక్యతా దినోత్సవం పేరిట ముగించారు. ఇప్పుడు ప్రజాపాలనతో సాగిస్తున్నారు. కేవలం నాటి రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ పెట్టిన పార్టీ, ముస్లిం ఓటు బ్యాంక్‌ కోసం బీజేపీ, కమ్యూనిస్టులు మినహా మిగతా పార్టీలు నానా గడ్డీ కరుస్తున్నాయనడానికి విమోచన దినోత్సవాన్ని ఉదాహరణగా చెప్పుకోచ్చు. అటు కేంద్రం ఇటు రాష్ట్రం వేర్వేరుగా… వేర్వేరు పేర్లతో ఉత్సవాలను నిర్వహించడం కూడా విచిత్రమే!

నిజాం రాజరికం నుంచి విముక్తమైన ప్రజల మనోభావాలకు అనుగుణంగా సెప్టెంబర్‌ 17న ఉత్సవాలు జరుపుకోవడం నేటివరకు అధికారికంగా జరగలేదు. కేవలం మహారాష్ట్ర, కర్నాటకలో మాత్రమే ఈ ఉత్సవాలు జరిపేవారు. అనూహ్యంగా కేంద్రం విమోచనోత్సవాలు జరపాలని మూడేళ్ల క్రితం నిర్ణయించడంతో, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దిగిరాక తప్పలేదు. ఈ యేడు యథావిధిగానే బీజేపీ తనవంతుగా కార్యక్రమం చేపట్టింది. రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈయేడు అతిథిగా వస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపాలనా దినోత్సవం పేరిట జెండా వందనం నిర్వహిస్తోంది. కేంద్రం మాత్రం సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో విమోచనోత్సవాలకు శ్రీకారం చుట్టింది. దీంతో హైదరాబాద్‌ లో జరిగే ఉత్సవాల్లో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జెండా ఎగురేస్తారని అన్నారు. రాంజీ గోండు త్యాగానికి ప్రతిఫలం, తెలంగాణ విమోచన దినోత్సవంగా బీజేపీ గుర్తు చేస్తోంది. ఒకే చెట్టుకు అత్యంత కిరాతకంగా వెయ్యి మంది తెలంగాణ ప్రజలను ఒకేసారి ఉరితీసిన నిర్మల్‌ వెయ్యి ఉరుల మర్రి ఘాతుకంలో అమరవీరులైన మన పూర్వీకులకు నివాళులు అర్పించనుంది. నిజాం రజాకార్లపై, బ్రిటిష్‌ సైన్యంపై గెరిల్లా యుద్ధం చేసిన మన రాంజీగోండు పోరాట స్ఫూర్తిని స్మరించుకుందాం అంటూ పిలుపునిస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాల్లో పాల్గొందాం, తెలంగాణ చరిత్రను తరువాతి తరానికి అందిద్దాం. అన్న నినాదంతో బీజేపీ ఏటా ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ యేడు కూడా పరేడ్‌ గ్రౌండ్‌లో విమోచనోత్సవాలను రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభిస్తారు.

నిజానికి తెలంగాణ విముక్తి కోసం ఎందరో పోరాడారు. ఎందరో మహిళలు తమ మాన, ప్రాణాలను పోగొట్టుకున్నారు. రజాకార్ల దాష్టీకానికి ఎందరో బలయ్యారు. సర్వస్వాన్ని త్యాగం చేసిన కొమురం భీం, రాంజీ గోండు, తుర్రేబాజ్‌ ఖాన్‌, షోయబుల్లాఖాన్‌, వందేమాతరం రామచంద్రరావు, నారాయణరావ్‌ పవార్‌, నల్లా నర్సింహులు, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, దాశరథి సోదరులు, కాళోజీ నారాయణరావు, పీవీ నరసింహారావు వంటి ఎందరో మహానుభావులను స్మరించుకునేందుకు ఇదొక సరైన సమయం. అలాగే ఎందరో పోరాట యోధులను గురించి గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. త్యాగాలను తర్వాతి తరాలకు అందజేసేలా చరిత్రను అందుబాటులోకి తీసుకుని రావాలి. పాఠ్యాంశాలుగా ముద్రించాలి.

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని జరుపుకోలేక పోవడానికి పూర్తిగా రాజకీయ దివాళాకోరుతనమే కారణం. ఘనమైన తెలంగాణ చరిత్రను మరుగున పడేసే ప్రయత్నాలు సరికాదు. ఏటా విమోచనోత్సవంపై జోరుగా వాద ప్రతివాదనలు, విమర్శలు సాగుతుండేవి. అయినా తెలంగాణలో కూడా విమోచనో త్సవాలకు మోక్షం దక్కలేదు. ఈ ఉత్సవాలు జరపాలంటేనే ఎందుకనో తెలంగాణ పాలకులు విముఖత చూపుతూ వచ్చారు. తెలంగాణకు ముందు విమోచనోత్సవాలకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్‌ అవతరణ తప్పమరోటి జరిగేది కాదు. దేశం ఆంగ్లేయుల పాలన నుంచి ఆగస్టు 15, 1947న స్వతంత్ర మైనప్పటికీ నాటి హైదరాబాద్‌ సంస్థానం మాత్రం ఇంకా విముక్తి పొందలేదు. స్వేచ్ఛావాయువులు పీల్చేందుకు దాదాపు 13 నెలలు పట్టింది. ఉక్కు మనిషి, నాటి కేంద్ర హోం మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ప్రత్యేకమైన చొరవతీసుకుని హైదరాబాద్‌పై పోలీసు చర్యకు ఉపక్రమించడం ద్వారా హైదరాబాద్‌ సంస్థా నాన్ని భారత్‌లో విలీనం చేశారు. ఈ కారణంగా నిజాం అరాచక పాలననుంచి ప్రజలకు విమోచన లభించింది.

బైరాన్‌పల్లి, పరకాల ఘటనలను ఎలా మరచి పోగలం. వందల మందిని నిలబెట్టి రజాకార్లు పిట్టలను కాల్చినట్లు కాల్చారు. గ్రామాలను లూటీ చేసి తమ వికృతరూపాన్ని ప్రదర్శించారు. భారతదేశానికి స్వాతంత్యర్ర వచ్చిందని త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తే నిజాం, రజాకార్లు జీర్ణించుకోలేక పరకాల ప్రజలపై హత్యాకాండకు పాల్పడి మరో జలియన్ వాలా బాగ్ ను తలపించిన నాటి ఘటన నేటి యువతకు తెలవాల్సిన అవసరం ఉంది. ఆనాటి పోరాటాలను స్మరిస్తూ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపాల్సి ఉంది. తెలంగాణ విమోచన దినోత్సవం జరపాల్సిన అవసరం గురించి ప్రజలకు తెలియపరచాలి. అమర వీరుల త్యాగాలను స్మరించుకోవాలి.

Latest News

06-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ చవితి ఉదయం 11.47 వరకు ఉపరి పంచమి నక్షత్రం అనూరాధ రాత్రి 12.45 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం సిద్ది మధ్యాహ్నం 01.40 వరకు ఉపరి వ్యతీపాత కరణం బాలవ ఉదయం 11.47...

గా ఊల్లె.. అందరికీ ఒకటే వంట!?|ADUGU TRENDS

గా ఊల్లె నిజంగా రోజూ పండుగే? ఎవలింట్లా పొయ్యి ఎలగదు. ఊరంతటికీ ఒకటే పొయ్యి. కులం లేదు మతం లేదు. గా ఊరంతా ఒకటే కుటుంబం. రోజూ అంతా కలిసే ఉంటరు. ఒకదగ్గరనే...

గ్రామాలు బలపడితేనే దేశాభివృద్ధి!|EDITORIAL

మనది గ్రామీణ భారతం. గ్రామాలతోనే దేశం బాగుపడుతుంది. అభివృద్ధి అనగానే “ట్రిలియన్ డాలర్ ఎకానమీ”, “ఫ్యూచర్ సిటీలు” వంటి ఆకర్షణీయమైన లక్ష్యాలు ముందుకు వస్తున్నాయి. అయితే, ఈ లక్ష్యాలు సాధ్యమవ్వాలంటే గ్రామాలు బలపడటం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 05, 2026 నుండి ఏప్రిల్ 11, 2026 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నా ఫలితాలు మంచిగా ఉంటాయి....

గిట్లంటే, గీ గ్యాస్ సిలండర్ మూతొత్తది!?|ADUGU TRENDS

ఇండ్లల్ల గ్యాస్ అయిపోయిందని తెల్వంగనే పక్కన పడేత్తం. కనీ, గా గ్యాస్ అయిపోయిందా? లేదా అని సూడాల్నంటే, గా మూత తీయాలె. గది తీయాల్నంటే మస్తు భయమైతది. కనీ, గా మూత తీసుడు...

యుద్ధం: వాస్తవాలు, అపోహలు, ప్రభావాలు|EDITORIAL

ప్రపంచం వేగంగా మారుతోంది. ఒక చోట చోటు చేసుకునే సంఘటనలు మరో చోట జీవన విధానాన్ని అంతకంటే వేగంగా ప్రభావితం చేస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధం, ఉద్రిక్తతలు వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది....

04-04-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు విదియ ఉదయం 08.22 వరకు ఉపరి తదియ నక్షత్రం స్వాతి రాత్రి 07.58 వరకు ఉపరి విశాఖ యోగం హర్షణ మద్యాహ్నం 01.00 వరకు ఉపరి వజ్ర కరణం గరజి ఉదయం 08.22...

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News