Monday, April 6, 2026
35.2 C
Hyderabad

సంకటంలో స్థానిక సంస్థల ఎన్నికలు!?|EDITORIAL

దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు అయితే, రాష్ట్రంలో పల్లెలు ఎవరికీ పట్టని కొమ్మలుగా మిగిలిపోయాయి. ఒకవైపు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విధించిన సెప్టెంబర్ 30 గడువు ముంచుకొస్తున్నది. మరోవైపు ఎన్నికల సంఘం ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నది. ఇంకోవైపు సర్పంచ్ లు లేని కారణంగా కేంద్రం ప్రతి ఏటా ఇచ్చే గ్రాంట్లు, దానికి సమానంగా వచ్చే రాష్ట్ర సర్కార్ నిధులు కలిపి రూ.6వేల కోట్లు నిలిచిపోయాయి. అభివృద్ధి ఆగిపోయింది. రాష్ట్ర సర్కార్ నిధులేవీ లేకపోవడంతో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. ఖర్చులు పెట్టలేక అప్పుల పాలవుతున్నామని కార్యదర్శులు మొత్తుకుంటున్నారు. ప్రత్యేకాధికారుల పాలన ప్రజారంజకంగా లేదు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల తర్వాతే ఎన్నికలంటున్న బిల్లుకు, రాష్ట్రపతి, గవర్నర్ల ఆమోదం లభించలేదు. అవి పొందేలా కూడా కనిపించడం లేదు. ఈలోగా రెండేళ్ల కాలం ఆవిరైంది. మరి ఈ దశలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? అన్నది జవాబులేని ప్రశ్నలా మారింది.
అడుగు’ చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ అందిస్తోన్న ‘సంకటంలో స్థానిక ఎన్నికలు!?’ 

స్థానిక సంస్థల ఎన్నికలు సంకట స్థితిలో పడ్డాయి. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్నదానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఒకవైపు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విధించిన సెప్టెంబర్ 30 గడువు దగ్గర పడుతున్నది. మరోవైపు ఎన్నికల సంఘం ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నది. ఇంకోవైపు సర్పంచ్ లు లేని కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే గ్రాంట్లు నిలిచిపోయాయి. అభివృద్ధి ఆగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లు, నిధులేవీ లేకపోవడంతో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. చిల్లర ఖర్చులు చేయలేక అప్పుల పాలవుతున్నామని గ్రామ కార్యదర్శులు మొత్తుకుంటున్నారు. ప్రత్యేకాధికారుల పాలన ప్రజారంజకంగా లేదు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల తర్వాతే ఎన్నికలంటున్న రాష్ట్ర ప్రభుత్వం బిల్లుకు, రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందలేదు. పొందేలా కనిపించడం లేదు. మరి ఈ దశలో స్థానిక సంస్థల ఎన్నికలు అసలు ఎప్పుడు జరుగుతాయి? అన్నది జవాబులేని ప్రశ్నలా మారింది.

స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసి రెండేండ్లు కావస్తున్నది. సర్పంచ్ ల పదవీ కాలం 2023 జనవరి 31తో ముగిసింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీకాలం 2023 మే నెలలోనే ముగిసింది. ఈ దశలో ఎన్నికలు ఆలస్యమవుతుండటం తో ప్రభుత్వం ప్రత్యేకాధికారుల పాలన ను ప్రవేశపెట్టింది. ఈ అంశంపై కొందరు కోర్టుకు వెళ్ళడంతో, 2023 జులైలో తెలంగాణ హైకోర్టు ప్రభుత్వం పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. 2025 జూన్‌లో హైకోర్టు మరింత స్పష్టంగా నిర్దేశిత ఆదేశాలిచ్చింది. 30 రోజుల్లో వోటర్ల జాబితా, రిజర్వేషన్ల ప్రకటన జరిపి, 60 రోజుల్లో పూర్తి ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహంచాలని ఆదేశించింది.
ఇందుకు అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిచాలని తలపోసింది. చట్టబద్ధత కోసం బిల్లు, ఆర్డినెన్స్, గవర్నర్, రాష్ట్రపతి ఆమోదాలు అవసరం. కాబట్టి, మంత్రిమండలి ఆమోదించి, అసెంబ్లీలో చర్చించి, ఏకగ్రీవం చేసి, ఆ ప్రక్రియను చేపట్టింది. అయితే, గవర్నర్, రాష్ట్రపతిల ఆమోదం నేటికీ లభించలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీ జంతర మంతర్ లో ఒక రోజు దీక్షను చేపట్టింది. ఆ తర్వాత మరోసారి కేబినెట్ నిర్ణయం మేరకు, అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించి, స్థానిక సంస్థలకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కేంద్రానికి, గవర్నర్లకు మరోసారి పంపించింది. ఇది సాధ్యం కాపోతే, పార్టీ పరంగా బీసీలకు 42శాతం టికెట్లు ఇవ్వాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది.

ఈ భావనలెలా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం కూడా జనాభాతోపాటు కుల గణనకు సిద్ధపడింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేసి ఉంది. ఇదొక అవరోధంగా మారింది. మరోవైపు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రావడం లేదు. ముంచుకొస్తున్న సెప్టెంబర్ లోగా ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్నది తేలడం లేదు. ప్రభుత్వమూ చెప్పడంలేదు. ఆ మధ్య హై కోర్టు ఆదేశిత నిర్ణీత గడువులోగా ఎన్నికలు జరుపుతామని సీఎం చెప్పారు. కానీ దానిపైనా స్పష్టత కొరవడింది.

ఇక సర్పంచ్ ల ఎన్నికలు జరగని కారణంగా, కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ కమిషన్ గ్రామ పంచాయతీలకు ప్రతి ఏటా ఇచ్చే నిధులను నిలిపివేసింది. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను కలుపుకుని 3వేల కోట్లకు పైగా నిధులు నిలిచి ఉన్నాయి. కేంద్ర గ్రాంట్ కు సమానంగా రాష్ట్ర గ్రాంటు అంటే మరో 3వేల కోట్లు కలిపి మొత్తం 6వేల కోట్లకు పైగా నిధులు నిలిచిపోయాయి. దీంతో గ్రామ పంచాయతీల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా తిష్ట వేసి ఉన్నాయి. ఈ దశలో పంచాయతీ ఎన్నికల పంచాయితీ తమకు వద్దని నేతలు దూరం ఉంటున్నారు.

తాజాగా బీసీ రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందడానికి, బీహార్ ఎన్నికల తర్వాతే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని తలపోస్తున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి. బీసీ రిజర్వేషన్లకు చట్టాలు సహా, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అడ్డంకిగా మారాయి. ఇదే తరుణంలో అధికార కాంగ్రెస్ ప్రజా, ప్రజాస్వామిక ప్రయోజనాలకంటే, పార్టీ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. బీసీలకు రిజర్వేషన్లపై పార్టీలు నెపాన్ని ఎదుటి పార్టీలమీద తోస్తూ తప్పించుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో ప్రజలు, ప్రజాస్వామ్యం, స్థానిక సంస్థలు అపహాస్యం పాలవుతున్నాయి.

 

Latest News

06-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ చవితి ఉదయం 11.47 వరకు ఉపరి పంచమి నక్షత్రం అనూరాధ రాత్రి 12.45 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం సిద్ది మధ్యాహ్నం 01.40 వరకు ఉపరి వ్యతీపాత కరణం బాలవ ఉదయం 11.47...

గా ఊల్లె.. అందరికీ ఒకటే వంట!?|ADUGU TRENDS

గా ఊల్లె నిజంగా రోజూ పండుగే? ఎవలింట్లా పొయ్యి ఎలగదు. ఊరంతటికీ ఒకటే పొయ్యి. కులం లేదు మతం లేదు. గా ఊరంతా ఒకటే కుటుంబం. రోజూ అంతా కలిసే ఉంటరు. ఒకదగ్గరనే...

గ్రామాలు బలపడితేనే దేశాభివృద్ధి!|EDITORIAL

మనది గ్రామీణ భారతం. గ్రామాలతోనే దేశం బాగుపడుతుంది. అభివృద్ధి అనగానే “ట్రిలియన్ డాలర్ ఎకానమీ”, “ఫ్యూచర్ సిటీలు” వంటి ఆకర్షణీయమైన లక్ష్యాలు ముందుకు వస్తున్నాయి. అయితే, ఈ లక్ష్యాలు సాధ్యమవ్వాలంటే గ్రామాలు బలపడటం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 05, 2026 నుండి ఏప్రిల్ 11, 2026 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నా ఫలితాలు మంచిగా ఉంటాయి....

గిట్లంటే, గీ గ్యాస్ సిలండర్ మూతొత్తది!?|ADUGU TRENDS

ఇండ్లల్ల గ్యాస్ అయిపోయిందని తెల్వంగనే పక్కన పడేత్తం. కనీ, గా గ్యాస్ అయిపోయిందా? లేదా అని సూడాల్నంటే, గా మూత తీయాలె. గది తీయాల్నంటే మస్తు భయమైతది. కనీ, గా మూత తీసుడు...

యుద్ధం: వాస్తవాలు, అపోహలు, ప్రభావాలు|EDITORIAL

ప్రపంచం వేగంగా మారుతోంది. ఒక చోట చోటు చేసుకునే సంఘటనలు మరో చోట జీవన విధానాన్ని అంతకంటే వేగంగా ప్రభావితం చేస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధం, ఉద్రిక్తతలు వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది....

04-04-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు విదియ ఉదయం 08.22 వరకు ఉపరి తదియ నక్షత్రం స్వాతి రాత్రి 07.58 వరకు ఉపరి విశాఖ యోగం హర్షణ మద్యాహ్నం 01.00 వరకు ఉపరి వజ్ర కరణం గరజి ఉదయం 08.22...

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News