Friday, April 3, 2026
33.2 C
Hyderabad

Unexpected|ఊహించని Two States| ఇరు రాష్ట్రాల President|అధ్యక్షుల ఎంపిక|Selection

New| నూతన Presidents| అధ్యక్షులతో BJP| బీజేపీకి కలిసొచ్చేనా…

Eatala Rajender| ఈటెలకు ఊహించని దెబ్బ అంటూ … ప్రచారం

Telangana| తెలంగాణ ఆధ్యక్షుడి ఎంపికలో AP CM| ఏపీ సీఎం MARK| మార్క్ ఉందంటూ… మరో ప్రచారం |CAMPAIGN

అధ్యక్షుల ఎంపికపై విరుచుకుపడ్డ mla| ఎమ్మెల్యే రాజా సింగ్ |Raja Singh

Andhrapradesh| ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల ఎంపికలో పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఊహించిన పేరులకు భిన్నంగా, ఆశించని, ఊహించని అభ్యర్థులను ఎంపిక చేస్తూ నాయకత్వంలో కీలక మార్పులు చేసింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్‌ను, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావును ఎంపిక చేసిన విధానం పార్టీలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.

ఏపీలో పీవీఎన్ మాధవ్ ఎంపికపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేసినా, ఆయనకు ఆరెస్సెస్‌తో బలమైన సంబంధాలు, పార్టీకి చేసిన సేవలు, రాజకీయ ప్రస్థానం, స్వచ్ఛమైన వ్యక్తిత్వం ఈ ఎంపికకు బలమైన కారణాలు అని తెలుస్తుంది. మాధవ్ బీసీ వర్గానికి చెందినవారు, పార్టీ బలం పెరిగి, అన్ని వర్గాల వారికి బీజేపీ సమ న్యాయం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఆయన తండ్రి పీవీ చలపతి రావు కూడా గతంలో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉండడం ఈ ఎంపికను మరింత బలపరిచింది. వైఎస్సార్‌సీపీ-టీడీపీ సమీకరణాల మధ్య బీజేపీని ఒక బలమైన పార్టీగా నిలిపేందుకు మాధవ్ లాంటి మృదువైన నేత అవసరమన్న అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది.

తెలంగాణలో మరింత ఆసక్తికరంగా నాయకత్వ మార్పు చోటు చేసుకుంది. ఈటల రాజేందర్, అరవింద్, డీకే అరుణ వంటి బలమైన నాయకుల్ని పక్కనపెట్టి సీనియర్ నేత రామచందర్ రావుకు అవకాశమివ్వడంపై పార్టీ వర్గాల్లో అనేక చర్చలు మొదలయ్యాయి. ఎబివిపి నుండి రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, బీజేపీకి ఎనలేని సేవలందించిన ఆయన ఎన్నో బాధ్యతల్ని నిర్వర్తించారు. మృదుస్వభావంతో, అందరినీ కలుపుకుపోయే లక్షణంతో రామచందర్ రావు ఎంపిక పై ఆర్ఎస్ఎస్ స్థాయిలో ఆమోదం పొందినట్లుగా తెలుస్తోంది. పార్టీ నైతిక విలువలపై ఆయనకు ఉన్న నిబద్ధత, కార్యకర్తలతో ఉన్న అనుబంధం, రాష్ట్ర రాజకీయాలపై లోతైన అవగాహన ఆయన ఎంపికకు కారణం అని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు.

ఏపీ సీఎం మార్క్ ఉందా?

అయితే ఈ ఎంపికపైమరో పెద్ద రాజకీయ అంశం చర్చనీయాంశమవుతోంది. రామచందర్ రావు ఎంపికపై తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి ప్రభావం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. బీజేపీలో ఆయనకు సన్నిహితుడిగా పేరున్న రామచందర్ రావును ఎంపిక చేయడం వెనక చంద్రబాబు పాత్ర ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇది ఈటల రాజేందర్‌కు భారీ ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

అధ్యక్షుల ఎంపికపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే రాజా సింగ్

ఈ విషయంపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిని నావాడు, నీవాడు అంటూ ఎవరి సలహాలో వింటూ నియమించుకుంటే పార్టీ దెబ్బతింటుందని హెచ్చరించారు. బీజేపీలో నాయకుడిని బూత్ స్థాయి నుంచి ముఖ్య నాయకుడి వరకు ఓటేసి ఎన్నుకోవాలని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం మాత్రం వ్యూహాత్మకంగా, అందరినీ సమన్వయపరచగల నేతలను ఎంపికచేసినట్లు సంకేతాలు పంపిస్తోంది.

https://youtu.be/Ijlzc2xlW3w?feature=shared

ఈ మార్పుతో బీజేపీలో కూడా మార్పు ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇది పార్టీకి కొత్త ఊపు ఇచ్చే అవకాశం అయినప్పటికీ, అసంతృప్తి వర్గాలను సర్దుబాటు చేస్తారా..లేదా… వివాదాలకు కారణం అవుతారా… అనేది భవిష్యత్ నిర్ణయించాల్సిందే.

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News