Trending News
Sunday, December 7, 2025
28.2 C
Hyderabad
Trending News

మీకో దండం మీ పార్టీకో దండం

Bjp| బీజేపీకి Ghoshamahal| గోషామహల్ mla| ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా |resignation

Leaders| నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి,

Hinduism| హిందుత్వానికి తాను అంకితమంటూ లేఖ | letter

గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచిన రాజాసింగ్, భార‌తీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ నేతృత్వం తనను లక్ష్యంగా చేసుకొని మోసం చేసిందని, రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు పేరును ప్రకటించడంతో తనకు జరిగిన అన్యాయాన్ని భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంగా తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు రెండు పేజీల కృతజ్ఞతా, తన అభిప్రాయాల లేఖను ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు.

రాజాసింగ్ లేఖలో పేర్కొన్న విషయాలను చూస్తే, ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. లక్షలాది కార్యకర్తలు, ప్రజలు పార్టీలో విశ్వాసంతో నిలబడిన తరుణంలో, పార్టీ తొలి సారిగా తెలంగాణలో అధికారంలోకి రానుందన్న ఆశలు వ్యక్తమవుతున్న వేళ, పార్టీ అధిష్ఠానం తీసుకున్న ఈ నిర్ణయం ఆశావాదాన్ని అణిచేసేలా ఉందని రాజాసింగ్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం కేవలం వ్యక్తిగతంగా తనకే కాకుండా, అనేకమంది బీజేపీ కార్యకర్తలకు, నమ్మకమైన ఓటర్లకు తీవ్ర నిరాశ కలిగించిందన్నారు.

పార్టీలో అనుభవం కలిగిన ఎంతో మంది సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నప్పటికీ, వారికి అవకాశం ఇవ్వకుండా కర్టెన్ వెనుక ఉండే నేతల సూచనల మేరకు తీసుకున్న ఈ నిర్ణయం తీవ్రంగా బాధించింది అన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం తీసుకున్న నిర్ణయంగా రాజాసింగ్ భావిస్తున్నట్లు లేఖలో తెలిపారు . ఇది వేల మంది కార్యకర్తల త్యాగాలను విస్మరించడమేనని అన్నారు.

తాను బీజేపీకి అంకితమైన కార్యకర్తగా, ప్రజల ఆశీర్వాదంతో వరుసగా మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ఉన్నా కూడా, ఇలాంటి అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండలేనని పేర్కొన్నారు. ఇది వ్యక్తిగత కారణక వల్ల తీసుకున్న నిర్ణయం కాదని, కార్యకర్తల వేదనను ప్రతిబింబించడమే అని లేఖలో వివరించారు. తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, సరైన నాయకత్వాన్ని ఎంపిక చేయకపోవడం వల్ల ఆ ఆశను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

రాజాసింగ్ తన లేఖ చివరి పేజీలో, పార్టీకి రాజీనామా చేసినా, హిందుత్వ సిద్ధాంతం, తన ధర్మ సేవ, గోషామహల్ ప్రజల పట్ల తన బాధ్యత మారదని పేర్కొన్నారు. హిందూ సమాజానికి తన సహకారం మరింత బలంగా కొనసాగుతుందని, ధైర్యంగా తన గొంతును వినిపిస్తానని స్పష్టం చేశారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పునః ఆలోచించాలని ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, బీఎల్ సంతోష్ తదితరులను కోరారు. తెలంగాణ బీజేపీకి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని, అలాంటి సమయంలో సరైన నాయకత్వాన్ని ఎంపిక చేసి ఆ అవకాశాన్ని వదులుకోకూడదని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, తన రాజీనామాను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, తెలంగాణ శాసనసభ స్పీకర్‌ ప్రసాద్ కుమార్ కి తెలియజేయాలని కోరారు. ఈ ఉదంతం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. మూడుసార్లు గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా చేయడం ద్వారా, పార్టీలో నూతన రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికతో భిన్నాభిప్రాయాలు, అంతర్గత సంఘర్షణలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ఈ నేపథ్యంలో పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర నాయకత్వం సమీక్షిస్తే మంచిదని అనేక బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే రాజాసింగ్ ఇక నుంచి ఏ రాజకీయ నిర్ణయం తీసుకుంటారో, ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారో అన్నది రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. అయితే ఆయన ఇప్పటికీ హిందుత్వ సిద్ధాంతానికి అంకితమని స్పష్టంగా చెప్పడం ద్వారా, రాజకీయ ప్రయాణం కొనసాగించే సూచనలు లేఖలో కనిపిస్తున్నాయి.

ఇక పార్టీ నాయకత్వంపై విమర్శలు చేసిన రాజాసింగ్ లేఖ బీజేపీలో చర్చలకు తావిస్తోంది. పార్టీ కేంద్ర నేతలు ఈ లేఖను ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు, నాయకత్వ మార్పు పై మళ్లీ సమీక్ష జరగుతుందా? అన్నదానిపై రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా చూస్తున్నారు.

Latest News

సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని సర్పంచ్ రేసులో|PANCHAYATI TRENDS

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పంచాయతీలో అరుదైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా రైతులు, స్థానిక నాయకులు సర్పంచ్ పదవికి పోటీ చేసే గ్రామ రాజకీయాల్లో ఈసారి సాఫ్ట్‌వేర్ కంపెనీ...

తంగెడాకులతోటి ఇనుప ధాతువు తయారు?!|ADUGU TRENDS

ఆకే కదాని తీసిపారేయొద్దు! పువ్వే కదాని పీకి పారేయొద్దుల్లా!! ఏ పుట్టల ఏ పాముందో! అన్నట్లు... గా ఏ ఆకుల ఏం బలముందో ఎవరికి ఎరుక?! గిప్పటి దాకా మనకు ఆకులు, అలములల్ల ఔషధ...

కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం సాధ్యమేనా?!|EDITORIAL

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సఫలం కాలేకపోతోంది? ప్రజల నాడీ పట్టుకోవడంలో విఫలమవుతోందా? ప్రజా సమస్యలను గుర్తించలేకపోతోందా? గుర్తించినా వాటిని సరైన రీతిలో డీల్ చేయలేకపోతోందా? అధికార బీజేపీని ఎదుర్కోలేకపోతోందా? మోదీ,...

ఈ రోజు /వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

డిసెంబర్ 07--2025 నుండి డిసెంబర్ 13--2025 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీ శక్తి మరియు నిర్ణయాత్మకత మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తిపరమైన రంగంలో, మీరు ఎదుర్కొంటున్న ఎత్తు తక్కువలను...

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News