కొండా FAMILY| కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసిన MLC| ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య |BASWARAJ SARAIAH
CONGRESS| కాంగ్రెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కొండా మురళీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. షోకాజ్ నోటీసు ఇచ్చినందుకు హాజరై నన్నెవ్వరూ పిలవలేదు అంటూ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. పార్టీలో మారలేదని చెబుతున్న కొండా కుటుంబం గతంలో అన్ని పార్టీల్లో చేరి తిరిగి వచ్చారని సారయ్య వ్యాఖ్యానించారు.
38 ఏళ్లుగా కాంగ్రెస్ను బతికించానంటూ కొండా మురళీ చెప్పిన మాటలను సారయ్య తప్పుబట్టారు. ఆయనకు రాజకీయ జన్మనిచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ తరువాత కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ, బిఆర్ఎస్ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చరిత్ర కొండా కుటుంబానిది. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను నేనే గెలిపించానంటూ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మండిపడ్డారు.
సారయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఈ కుటుంబం ఏం చేసింది? గతంలో సోనియా గాంధీని బూతులు తిట్టిన వ్యక్తి ఇప్పుడు పార్టీ సేవలు, పార్టీ నాయకత్వంపై గురించి మాట్లాడటం దారుణం. కులాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయ లాభాలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ. ఇలాంటి పార్టీ నేతగా ఉంటూ కుల ప్రాతిపదికన వ్యాఖ్యలు చేయడం అసహనానికి గురిచేస్తోందన్నారు.
ఇంకా, క్రమశిక్షణ సంఘంపై కూడా కొండా కుటుంబానికి నమ్మకం లేదు. అలా అయితే పార్టీ లోనే ఎందుకు ఉన్నారు? పార్టీ మారి తిరిగి వచ్చినవారు ఇప్పుడు పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించడం సరికాదు. జడ్పీటీసీ గా గెలవలేని కొండా మురళీ ఎమ్మెల్యేలను గెలిపించానని చెప్పడం అబద్ధం. పిచ్చిపిచ్చి మాటలు మానుకోవాలి. ఏ పార్టీలో ఉన్నా, ఆ పార్టీ నాయకత్వాన్ని తిట్టడం ఈ కుటుంబానికి అలవాటైంది” అంటూ ధ్వజమెత్తారు.
జూలై 5 వరకు కాంగ్రెస్ అధిష్టానం కొండా మురళిపై తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తాం. పార్టీ డిసిప్లిన్కు మించి ప్రవర్తించే వారిని సహించలేమంటూ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
ఇటీవల కొండా మురళీ, కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరై వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ లోపల కలకలం రేపుతున్నాయి. అధిష్టానం తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

