Friday, April 3, 2026
30.2 C
Hyderabad

MINORITY|మైనార్టీ ‘మంత్రాం’గం! CONGRESS|కాంగ్రెస్ పన్నాగం

JUBILEE HILLS|జూబ్లీ గెలుపే కీలకం
MUSLIMS|ముస్లీంల ఓట్లకై గాలం
రేపు మంత్రిగా AZAHARUDDIN|అజహర్ ప్రమాణం?
AIMIM|ఎంఐఎం వ్యతిరేకం
అజహర్ కే అధిష్టానం
అజ్జూకే సై అన్న సీఎం|CM|REVANTH REDDY

హైదరాబాద్, అక్టోబర్ 29 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక టీమిండియా పూర్వ కెప్టెన్, మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ అజహరుద్దీన్ కి కలిసొచ్చింది. జూబ్లీలో మైనార్టీ ఓట్లే కీలకం కావడం అజహర్ ని కీలకం చేసింది. గతంలో జూబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అజహర్, పార్టీ మాట మీద ఈసారి నవీన్ కోసం పోటీ నుంచి తప్పుకోవడం ఆయన సిన్సియార్టీకి కారణమైంది. కనీసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకుండానే ఆయనను మంత్రి పదవి వరించనుంది. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కు మద్దతుగా పోటీ చేయని ఎంఐఎం వ్యతిరేకించినా, సీఎం రేవంత్ రెడ్డి సై అనగా, కాంగ్రెస్ అధిష్టానం అజహరుద్దీన్ నే ఎంచుకుంది. దీంతో అజ్జూ భాయ్ రేపే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అటు కాంగ్రెస్ కు, ఇటు బీఆర్ఎస్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దివంగతులవడంతో అనివార్యమైన జూబ్లీ ఉప ఎన్నికలో విజయం కూడా రెండు ప్రధాన పార్టీలకు అనివార్యంగా మారింది. జూబ్లీని నిలబెట్టుకోవడం బీఆర్ఎస్ కు, గెలవడం అధికార కాంగ్రెస్ కు ప్రాధామ్యంగా మారింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. రెండు పార్టీలు రాష్ట్రంలోని తమ కేడర్ మొత్తాన్ని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే మోహరించాయి. కాంగ్రెస్ డివిజన్ కు ఇద్దరు మంత్రులు చొప్పున బాధ్యతలు అప్పగించిగా, మాజీ మంత్రులు, ముఖ్య నేతలందరినీ బీఆర్ఎస్ జూబ్లీలో దింపింది. ఇదే సమయంలో కులాలు, మతాల వారీగా ఓట్లు కీలకం కావడంతో ఆయా ఓట్లు లక్ష్యంగా ఆ రెండు పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలకు దిగాయి. ముస్లీంలకు కాంగ్రెస్ ఏమీ చేయలేదని, రెండేండ్లు పూర్తి కావస్తున్నా, మంత్రివర్గంలో ఒక్క మంత్రి పదవిని కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ కాంగ్రెస్ ను విమర్శించింది. ఇదే అదనుగా కాంగ్రెస్ తమదైన శైలిలో మైనార్టీకి మంత్రి పదవిని కట్టబెట్టేందుకు సిద్ధమైంది.

జూబ్లీ హిల్స్ లో మతాలు, కులాల వారీగా ఓటర్లు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుషులు 2,08,561 మంది, మహిళలు 1,92,779 మంది, ఇతరులు 25 మంది ఉన్నారు. ఓటర్లలో బీసీలు 1.34 లక్షల మంది ఉండగా, ముస్లింలు 1.20 లక్షల మంది ఉన్నారు. కమ్మ సామాజిక వర్గ ఓట్లు 22,746 ఉన్నాయి. రెడ్డి ఓట్లు 17,641 ఉన్నాయి. ఎస్సీల ఓట్లు 28,350 కాగా, ఎస్సీల్లో మాదిగ ఓట్లు 15,693, మాల ఓట్లు 12657 ఉన్నాయి. లంబాడీల ఓట్లు 11364, క్రైస్తవుల ఓట్లు 19,396 ఉన్నాయి.

కీలకంగా మారిన ముస్లింల ఓట్లు
మొత్తం ఓట్లల్లో 25శాతానికి మించిన ఓట్లు ముస్లీంల ఓట్లే ఉన్నాయి. ఈ ఓటర్లను ఆకర్షించడం అన్ని పార్టీలకు ముఖ్యమైంది. బీజేపీకి ఎలాగూ పడని ముస్లింల ఓట్లు గతంలో బీఆర్ఎస్ కు పడ్డాయి. కానీ ఈసారి ఎన్నికల్లో నవీన్ గతంలో ఒకసారి ఎంఐఎం నుంచి పోటీ చేసి ఉన్నారు. ప్రస్తుతం ఆ పార్టీకి అభ్యర్థి పోటీలో లేరు. మద్దతు కాంగ్రెస్ కు ప్రకటించినప్పటికీ, ఆ ఓట్లు ఎటు పడతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనికి తోడు కాంగ్రెస్ ముస్లింలకు ఏం చేసిందని బీఆర్ఎస్ ప్రశ్నించడంతో ముస్లింల ఓట్ల కోసం ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితిలో కాంగ్రెస్ పడింది.

గతానికి భిన్నంగా..
గతానికి భిన్నంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలకు టికెట్లిచ్చినప్పటికీ పెద్దగా ఎవరూ గెలవలేకపోయారు. షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. గతంలో జూబ్లీ నుంచే పోటీ చేసిన అజహరుద్దీన్ 16వేల పై చిలుకు ఓట్లతో ఓడిపోయారు. ముస్లిం లెజిస్టేచర్లలో కనీసం ఒకరికి మంత్రి పదవి ఇవ్వడం ఆనవాయితీ. దీంతో రెండేండ్లు కావస్తున్నా ఎవరికీ అవకాశం రాలేదు.

పార్టీ ఆదేశం.. ఉప ఎన్నికకు దూరం
అజహరుద్దీన్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మళ్ళీ పోటీ చేయాలని భావించారు. కానీ ఆ స్థానం నవీన్ యాదవ్ కు దక్కింది. దీంతో అజహర్ ను ఎమ్మెల్సీని చేయాలని కోదండరామ్ 10తో కేబినెట్ గవర్నర్ కు సిఫారసు చేసింది. అది పెండింగులో ఉంది. అయినప్పటికీ అజహర్ ను మంత్రిని చేయాలని సీఎం సహా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.

అజ్జూ భాయక్ కే అవకాశం
ప్రస్తుత మంత్రివర్గంలో 15మంది మంత్రులుండగా, మరో ముగ్గురికి అవకాశం ఉంది. ప్రస్తుతం అజహరుద్దీన్ కు మాత్రమే మంత్రి పదవిని ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాని అజహర్ ని మంత్రిని చేసి, వచ్చే 6 నెలల్లో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానంలో అజహర్ ని గెలిపించాలని పార్టీ భావిస్తోంది.
కాగా, మొదటి సారి 12మంది మంత్రులు ప్రమాణం చేయగా, ఇటీవల ముగ్గురికి అవకాశం దక్కింది. మరో ముగ్గురికి ఉన్న అవకాశాల్లో ఇప్పుడు అజహర్ మంత్రి అవుతున్నారు. మరో రెండు ఖాళీలను నింపడానికి సామాజికి, ప్రాంతీయ సమీకరణలను చేస్తున్నట్లు తెలుస్తోంది.

రాజకీయ ప్రస్థానమిలా
టీమిండియా కెప్టెన్ గా క్రికెట్ ఆడిన అజహర్ 2009 ఫిబ్రవరి 19న కాంగ్రెస్ లో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. 2014లో రాజస్థాన్ లోని టోంక్ సవాయీ మాధోపుర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిఓడిపోయారు. అజహరుద్దీన్‌ 2019 ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండి, 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రకటించిన రెండో జాబితాలో జూబ్లీహిల్స్‌ అభ్యర్థిగా ప్రకటించబడ్డారు. ఏ సభలో సభ్యుడు కానప్పటికీ ఇప్పుడు ఏకంగా మంత్రి అవుతున్నారు. కాగా, 28ననే అజహర్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మంత్రిగా ప్రమాణం చేయడానికి రెడీ గా ఉండాల్సిందిగా సీఎం అజహర్ ను కోరినట్లు తెలిసింది.

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News