Wednesday, April 1, 2026
33.2 C
Hyderabad

Incognito|అజ్ఞాతంలోంచి… అజ్ఞాతంలోకి…!?|MAOIST|POLICE

అజ్ఞాతం వీడినా, అంతు చిక్కని ఆచూకీ
జనజీవన స్రవంతిలో కలిసినా జనంలోకి రాలే
వారం గడిచినా ఊరు, వాడ, కడప తొక్కలే
కనిపించినా, కనిపించకుండా పోయింది
కొత్త జీవితమా? పాత నరకమా?
GOVERNMENT|సర్కార్ గోప్యతా? POLICE|పోలీసుల భద్రతా?
శాంతికి సానుకూలమా? అశాంతికి అనుకూలమా?
ప్రభుత్వం, పోలీసులు వెంటనే సమాధానం చెప్పాలి
స్పష్టత కోసం ఎదురు చూస్తున్న రక్తసంబంధీకులు
మాజీ మావోయిస్టును చూపించండి: గ్రామస్థులు
పోరుబాట వీడి, జనంబాట పట్టిన POTHULA PADMA|పోతుల పద్మ ఎక్కడ?

45 ఏళ్ళ అజ్ఞాతవాసం ఆమెకు తిరిగి అజ్ఞాతవాసాన్నే మిగిల్చింది. అలుపెరుగని పోరాటంలో కుంగిపోకుండా, ఆమె లొంగిపోయినా… వన జీవనాన్ని వదిలి, జన జీవన స్రవంతిలో కలిసినా, ఆమె ఇంకా జన జీవనంలోకే రాలే! ఆమె లొంగిపోయి వారం గడిచినా… ఊరు, వాడ, కడప తొక్కలే!! ఇంత కాలంగా అగుపించని ఆమె కనిపించినా, ఎక్కడా కనిపించకుండా పోయింది. సమసమాజం కోసం, ఉరిమే ఉప్పెనైన ఆమె కోసం, ఊరుకు ఊరే ఎదురుచూస్తున్నది. రక్త సంబంధీకులు, బంధువులు ఆమె రాక కోసం నిలువెల్లా కనులై కాచుక్కూచుకున్నారు. కొత్త జీవితమా? పాత నరకమా? ఇది సర్కార్ గోప్యతా? పోలీసుల భద్రతా? ఈ అజ్ఞాతంలోంచి… అజ్ఞాతం దేనికి సంకేతం? శాంతికి సానుకూలమా? అశాంతికి అనుకూలమా? ప్రభుత్వం, పోలీసులు వెంటనే సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలను పోతుల పద్మ అలియాస్ సుజాతక్క అలియాస్ కల్పన సొంతూరు, జోగులాంబ గద్వాల జిల్లా, గట్టు మండలం, పెంచికలపాడు సంధిస్తోంది. తమ అనుమానాలను పటాపంచలు చేయాలని ఊరు, వాడా, కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. బరువెక్కిన గుండెలతో డిమాండ్ చేస్తున్నారు

గద్వాల, సెప్టెంబర్ 18 (అడుగు న్యూస్):
జోగులాంబ గద్వాల జిల్లా, గట్టు మండలం, పెంచికలపాడు గ్రామానికి చెందిన పోతుల పద్మ అలియాస్ సుజాతక్క అలియాస్ కల్పన ఇటీవల అజ్ఞాతవాసం వీడి తెలంగాణ డీజీపీ జితేందర్ ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. నాలుగున్నర దశాబ్దాల క్రితం అడవిబాట పట్టిన పద్మ, మావోయిస్టు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించి పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలిగా ఎదిగారు. ఆమెపై ప్రభుత్వం ప్రకటించిన రూ.25 లక్షల రివార్డుతో పాటు, వందలాది కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 13, 2025న డీజీపీ ఎదుట ఆమె అధికారికంగా లొంగిపోయినట్టు ప్రకటించగా, రాష్ట్రవ్యాప్తంగా ఇది పెద్ద చర్చనీయాంశమైంది.

అయితే లొంగిపోయి వారం రోజులు దాటినా పద్మ ఎక్కడ ఉన్నారన్న దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లభించకపోవడం కుటుంబ సభ్యుల్లో, గ్రామస్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆమె లొంగిపోయిన వెంటనే స్వగ్రామానికి వస్తారని కుటుంబ సభ్యులు భావించినా ఇప్పటి వరకు ఇంటికి రాకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలోని ప్రజలు కూడా పద్మ మళ్లీ తమ ఊరికే వస్తారని భావించి ఆనందపడ్డారు. టీవీ చానల్స్, పత్రికలలో లొంగిపోయిన వార్తలు రావడంతో సంతోషించిన ఆమె బంధువులు, ఇప్పుడు ఆచూకీ తెలియక ఆవేదన చెందుతున్నారు.

45 ఏళ్ల క్రితం పద్మ గ్రామం విడిచి వెళ్లడంతో కుటుంబ సభ్యులు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఏదో ఒక రోజు తిరిగి వస్తుందని ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పుడు లొంగిపోయిందనే వార్త విన్నప్పుడు వారు ఆనందబాష్పాలు రాల్చారు. కానీ వారం రోజులుగా ఆమె ఎక్కడ ఉన్నారన్న విషయంపై స్పష్టత లేకపోవడంతో గురువారం కుటుంబ సభ్యులు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. పద్మను తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో తహసీల్దార్ రాజు స్వయంగా పెంచికలపాడు గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గ్రామ పెద్దలు, పద్మ సోదరులతో సమావేశమై వివరాలు సేకరించారు. పంచానామా కూడా నిర్వహించారు. వారి వెంట వీఏఓ రంగన్న, సిబ్బంది గోపాల్, పరశురాములు, వడ్ల భీమప్ప, జంగిటి సుంకన్న, దెయ్యం చౌడప్ప, వుల్లి గోవిందు, గాజుల గంగప్ప, నర్సింహులు, గోవిందు తదితరులు వున్నారు. ఈ సందర్భంగా ముక్త కంఠంతో పద్మను గ్రామానికి తీసుకురావాలని అధికారులను కోరారు.
పోతుల పద్మ అలియాస్ సుజాతక్క అలియాస్ కల్పన లొంగుబాటు కీలకాంశం. ఇప్పుడామె భవిష్యత్తు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై, పోలీసుల చర్యలపై ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వం పునరావాసం పేరుతో లొంగిపోయిన మావోయిస్టులకు కొత్త జీవితాన్ని కల్పిస్తుందని ప్రకటించినా, పద్మ లొంగుబాటు తర్వాత ఆమె ఆచూకీ రహస్యంగా ఉంచడంపై చర్చలు సాగుతున్నాయి. లొంగిపోయిన వారిని భద్రతా కారణాల దృష్ట్యా రహస్యంగా ఉంచడం సాధారణమే అయినప్పటికీ, ఆమె కుటుంబానికి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం అసంతృప్తికి, మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది.

గ్రామస్తులు మాట్లాడుతూ, ‘నాలుగు దశాబ్దాలుగా ఆమె కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు లొంగిపోయింది అంటే మళ్లీ మా ఊరికి వస్తుందని భావించాం. కానీ ఎక్కడ ఉందన్న విషయం తెలియకపోవడంతో ఆందోళన చెందుతున్నాం. కనీసం అధికారుల ద్వారా అయినా ఆమెను ఒకసారి కలిసే అవకాశం కల్పించాల’ని డిమాండ్ చేస్తున్నారు.

లొంగుబాటు తర్వాత పద్మ కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. 40 ఏళ్లకు పైగా అడవిలో గడిపిన ఒక మావోయిస్టు నేత లొంగిపోవడం ఒక వైపు శాంతి ప్రక్రియకు అనుకూల పరిణామంగా భావిస్తుండగా, మరో వైపు ఆమెను స్వగ్రామానికి రానివ్వకపోవడం తిరిగి ఆశాంతికి దారి తీస్తాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రతా కారణాల వల్లనే ఈ చర్యలు తీసుకుంటున్నారని అధికార వర్గాలు అంటున్నప్పటికీ, పద్మ కుటుంబం మాత్రం తమ కుటుంబసభ్యురాలిని వెంటనే తమకు అప్పగించాలని పట్టుబడుతోంది.

మొత్తం మీద పోతుల పద్మ లొంగిపోవడం రాష్ట్రంలో పెద్ద సానుకూల పరిణామంగా నిలిచినప్పటికీ, ఆమె ఆచూకీపై అధికారుల గోప్యత ఇప్పుడు కుటుంబ సభ్యులకు ఆవేదనగా, గ్రామస్తులకు ఆందోళనగా మారింది. త్వరలోనే ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టతనివ్వాలని, ఆమెను స్వగ్రామంలో కుటుంబ సభ్యులను కలిసేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Latest News

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

31-03-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి త్రయోదశి ఉదయం 06.43 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం పుబ్బ మధ్యాహ్నం 03.08 వరకు ఉపరి ఉత్తర యోగం గండ మధ్యాహ్నం 03.36 వరకు ఉపరి వృద్ధి కరణం తైతుల ఉదయం 06.43...

30-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి ద్వాదశి ఉదయం 07.35 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం మఖ మధ్యాహ్నం 03.09 వరకు ఉపరి పుబ్బ యోగం శూల సాయంత్రం 05.15 వరకు ఉపరి గండ కరణం బాలవ ఉదయం 07.34...

ఎండ యేడికి సల్లని రేకులు!?|ADUGU TRENDS

ఎండా కాలం రానే వచ్చె. ఎండ యేడికి ఇండ్లల్లనే కుమ్ముల పెట్టినట్లు ఉడకబడితిమి. ఎండ యేడి 50 డిగ్రీల దగ్గర దగరికి శేరబట్టె. ఇగ కూలర్లు, ఏసీలు ఎన్ని పెట్టినా, యేడ సరిపోతయి?...

ట్రంప్ కట్టడెలా? అమెరికా నిలువరింపెలా?|EDITORIAL

పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, చమురు సరఫరాలపై ఏర్పడుతున్న అనిశ్చితి కలిపి అస్థిర దిశలో ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు, దూకుడు నిర్ణయాలు అంతర్జాతీయంగా సంచలనాలై,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మార్చి 29 నుండి ఏప్రిల్ 04 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. పనుల్లో ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ...

దెబ్బకు సోఫా జిడ్డు సఫా!?|ADUGU TRENDS

ఎన్కటికి ఇండ్లల్ల నులక మంచాలు, ఎత్తు పీటలు, శెక్క బెంచీలు, కుర్సీలుంటే సాలయ్యేది. ఇగిప్పుడు గయన్నీ పోతానయి. ఇనుప, కేన్ కుర్సీలు, సోఫాలొచ్చె. గా సోఫాలకు లోపల మెత్తటి దూది.. గదేనుల్ల కుషన్,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News