తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం టికెట్లు నేడు విడుదల కానున్నాయి. ఈ రోజు ఆన్లైన్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టిటిడి పాలకమండలి విడుదల చేయనుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటాను విడుదల చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ పాలక మండలి అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా, తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం జరుగుతోంది. అలాగే… నిన్న ఒక్క రోజునే 78892 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అటు 25930 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే హుండీ ఆదాయం 3.55 కోట్లుగా నమోదు అయింది.

