వచ్చే ఏడాది పాకిస్థాన్లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ను ఐసీసీ ప్రకటించింది. ఈ టోర్నీ 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చ్ 9 వరకు జరగనుంది. భారత అభ్యర్థన మేరకు ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించబడుతుంది. భారత్ ఆడబోయే మ్యాచ్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరగనున్నాయి. ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రమే కాదు, 2025-2027 మధ్య జరుగబోయే అన్ని ఐసీసీ ఈవెంట్లలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్లు తటస్థ వేదికలపైనే జరుగుతాయి. అందులో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 (భారత్ ఆతిథ్యం), ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 (భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యం) వంటి కీలక టోర్నీల్లో కూడా పాకిస్థాన్ జట్టు భారత్కు రానివే. అలాగే, 2028 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ హక్కులను పాకిస్థాన్ పొందడంతో, ఆ టోర్నీ కూడా తటస్థ వేదికలపైనే జరుగుతుంది.
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారతదేశం-పాకిస్థాన్ (India vs Pakistan) మ్యాచ్ 2025 ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికపై జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొననున్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉన్నాయి, గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి.
2025 ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్:
- ఫిబ్రవరి 19: పాకిస్తాన్ v న్యూజిలాండ్, కరాచీ
- ఫిబ్రవరి 20: ఇండియా v బంగ్లాదేశ్, దుబాయ్
- ఫిబ్రవరి 21: అఫ్గాన్ v దక్షిణాఫ్రికా, కరాచీ
- ఫిబ్రవరి 22: ఆస్ట్రేలియా v ఇంగ్లండ్, లాహోర్
- ఫిబ్రవరి 23: ఇండియా v పాకిస్తాన్, దుబాయ్
- ఫిబ్రవరి 24: బంగ్లాదేశ్ v న్యూజిలాండ్, రావల్పిండి
- ఫిబ్రవరి 25: ఆస్ట్రేలియా v దక్షిణాఫ్రికా, రావల్పిండి
- ఫిబ్రవరి 26: అఫ్గాన్ v ఇంగ్లండ్, లాహోర్
- ఫిబ్రవరి 27: పాకిస్తాన్ v బంగ్లాదేశ్, రావల్పిండి
- ఫిబ్రవరి 28: అఫ్గాన్ v ఆస్ట్రేలియా, లాహోర్
- మార్చ్ 1: దక్షిణాఫ్రికా v ఇంగ్లండ్, కరాచీ
- మార్చ్ 2: ఇండియా v న్యూజిలాండ్, దుబాయ్
- మార్చ్ 4: సెమీ ఫైనల్ 1, దుబాయ్
- మార్చ్ 5: సెమీ ఫైనల్ 2, లాహోర్
- మార్చ్ 9: ఫైనల్ – లాహోర్ (భారత్ ఫైనల్కు వెళ్లినట్లయితే దుబాయ్ వేదిక)

