జనగామ జిల్లా పోలీసు శాఖలో సేవలందించేందుకు ట్రైనీ ఐపీఎస్ అధికారిని ప్రభుత్వం నియమించింది. యూపీఎస్సీ 2023 ఫలితాల్లో 88వ ర్యాంక్ సాధించిన మనన్ భట్, జనగామలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) గా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం రాత్రి ఆయన చార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా జనగామ ఏసీపీ పార్థసారథి, సీఐ దామోదరరెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
జమ్మూ కశ్మీర్ రాష్ట్రం శ్రీనగర్కు చెందిన మనన్ భట్ ఐఐటీ శ్రీనగర్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో బ్యాచిలర్స్ పూర్తిచేశారు. ఆ తర్వాత సివిల్స్ పరీక్షకు సన్నద్ధమై 2023లో ప్రతిష్టాత్మక ఐపీఎస్ ర్యాంక్ సాధించారు. 2021లో ఆయన అసిస్టెంట్ రిజిస్ట్రార్గా ఉద్యోగం సాధించినప్పటికీ, ఐఏఎస్ మరియు ఐపీఎస్ వంటి అత్యున్నత పదవుల కోసం ప్రయత్నించి విజయం సాధించారు. ప్రస్తుతం ట్రైనీ ఐపీఎస్ అధికారిగా జనగామలో కొద్ది రోజులు సేవలందించనున్నారు. 88వ ర్యాంక్తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన భట్, తన పట్టుదలతో ప్రజలకు సర్వీస్ అందించేందుకు సిద్దపడ్డారు.

