Mallu Ravi|మల్లు రవిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న Alampur|అలంపూర్ నేతలు|Leaders
Jogulamba Gadwal|జోగులాంబ గద్వాల District|జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ నాగర్కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, మాజీ జడ్పీ చైర్పర్సన్ Saritha Thirupathayya|సరితా తిరుపతయ్య, డీసీసీబీ చైర్మన్ Vishnuvardhan Reddy|విష్ణువర్థన్ రెడ్డి పై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అలంపూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు Telangana|తెలంగాణ PCC|పీసీసీ Chief|అధ్యక్షుడు MAHESH KUMAR GOUD|మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి MEENAKSHI NATARAJAN|మీనాక్షి నటరాజన్లకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ, జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి గద్వాల వచ్చిన ఎంపీ మల్లు రవి, అధికార కార్యక్రమం అనంతరం BRS|బీఆర్ఎస్ MLA|ఎమ్మెల్యే Vijayudu|విజయుడిని తన వాహనంలో తీసుకెళ్లి కాంగ్రెస్ నాయకుల ఇండ్లకు వెళ్లి సన్మానాలు చేయించడం పార్టీని దెబ్బతీసే విధంగా ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో తమ సొంత పార్టీ కార్యకర్తల విజ్ఞప్తులను పట్టించుకోకుండా, బీఆర్ఎస్ కార్యకర్తల అభ్యర్థనలపై స్పందించడమే కాకుండా, పరిష్కారానికి కృషి చేయడం అవమానకరమని విమర్శించారు.
గత సంవత్సరం నుంచి కాంగ్రెస్ నాయకులను పట్టించుకోకుండా, బీఆర్ఎస్ నేతల పెండింగ్ బిల్లులను క్లియర్ చేయించి 10 శాతం కమిషన్ వసూలు చేశారంటూ మల్లు రవిపై ఆరోపణలు చేశారు. అంతేకాదు, అలంపూర్ నియోజకవర్గంలోని తుమ్మిళ్ల లిఫ్ట్ కింద మల్లమ్మ కుంట ప్రాజెక్టుకు మారుగా చిన్నోనిపల్లి రిజర్వాయర్ ద్వారా RDS రైతులకు నీటివితరణ సాధ్యమని తప్పుదారి పట్టించే ప్రకటనలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించారని నేతలు పేర్కొన్నారు. ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని హెచ్చరించారు.
మరోవైపు, సరితా తిరుపతయ్య కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిని తన నివాసానికి ఆహ్వానించి, సత్కారాలు చేయడంతో పాటు, ఎంపీ మల్లు రవితో కలిసి గంటల కొద్దీ ఏకాంతంగా చర్చలు జరపడం పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా ఉందన్నారు. ఈ చర్యలు కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించాయని పేర్కొన్నారు. డీసీసీబీ చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి కూడా మల్లు రవికి ఏజెంట్గా వ్యవహరిస్తూ, కాంగ్రెస్ కార్యకర్తలకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులతో కలిసి పనిచేస్తున్నారని విమర్శించారు.
ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ విధానాలకు విరుద్ధంగా, కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తూ, ప్రజల్లో అపోహలు కలిగిస్తున్న పై నేతలపై తగిన చర్యలు తీసుకుని గద్వాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కాపాడాలని అలంపూర్ కాంగ్రెస్ నేతలు పార్టీ అధిష్టానాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మెన్ కుమార్, గ్రంథాలయ చైర్మెన్ శ్రీనివాస్,రాష్ట్ర అధికార ప్రతినిధి సెక్షవలి ఆచారి, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నాగ శిరోమణి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సులోచన, శాంతి, మహబూబ్ పాషా, అన్ని మండలాల అధ్యక్షులు, నాగరాజు,RDS Ex చైర్మెన్ సీతారాం రెడ్డి, మద్దిలేటి,దేవేంద్ర,హాసన్ ,జయన్న,రుక్మనంద రెడ్డి , జగన్ మోహన్ నాయుడు,రాము ,గోపాల్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

