Monday, March 30, 2026
29.2 C
Hyderabad

Komuravelli|కొమురెల్లి మల్లన్న కొంటెతనమా!? Konda Surekha

-పట్నాలు తొక్కిప పాపగుణమా!?
-ఎప్పటికైనా శాంతి పూజ తప్పదా?
-అప్పటి వరకు ఈ అశాంతి వీడదా?
-సెంటి ‘మెంటలై’పోతున్న అనుచరులు!
-మంత్రి కొండా సురేఖకు వరుస వివాదాలు అందుకేనా!

కొమురెల్లి మల్లన్న కొంటెతనమో!? ‘పట్నాలు’ తొక్కిన పాపగుణమో!? కానీ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, అటవీశాఖల మంత్రి కొండా సురేఖ వివాదం మీద వివాదంగా తీవ్ర వివాదాల్లో కూరుకుపోతున్నారు. గత ఏడాదిగా ఆమె మాటలు మంటలు రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలు ఆమెపైనే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. ఎప్పటికైనా శాంతి పూజ తప్పదన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. అప్పటి వరకు ఈ అశాంతి వీడే అవకాశమే లేదని, భక్తి సెంటిమెంటుతో రగిలిపోతున్న ఆమె అనుచరులు సెంటి ‘మెంటలై’ పోతున్నారట! మంత్రి కొండా సురేఖకు వరుస వివాదాలు అందుకేనంటూ చెయ్యెత్తి జై కొడుతున్నారట! మరి ఈ వివాదాల నుంచి బయటపడటానికి కొండా దంపతులు ఏం చేస్తారన్నది ఆసక్తిగానే కాదు ఉత్కంఠగా మారింది.!

Konda Surekha| కొండా సురేఖ మంత్రి హోదాలో గత ఏడాది జనవరిలో చేర్యాల సమీపంలోని కొమురెల్లి మల్లన్నను దర్శించుకున్నారు. ఆ సందర్భంగా కొమురెల్లిలో ఎంతో భక్తి శ్రద్ధలతో, నిష్టతో వేసే పట్నాలను అనుకోకుండా పొరపాటుగా తన మనవడిని ఎత్తుకుని మంత్రి తొక్కారట. ఆ తర్వాత ఆ చర్యను సరిదిద్దుకున్నారు. అయితే, కొమురెల్లిలో పట్నాలను పిల్లలు, శివసత్తులు, ఒగ్గుపూజారులు మాత్రమే వాటిని తొక్కువచ్చని భక్తుల నమ్మిక. పట్నాలు కొమురెల్లి పట్నాలు మల్లన్న ఆలయంలో నిర్వహించే ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం. మల్లన్న ని ఆరాధించే ఒక భాగం. భక్తులు తమ కోరికలు, నమ్మకాలను స్వామికి తెలియజేసే ఒక మార్గం. భక్తులు పసుపు, కుంకుమ, ఇతర రంగుల పొడితో రంగోలి గీస్తారు. ఆలయం లోపల, వెలుపల వరండాలో మల్లన్న స్వామికి ముందు పట్నాలు వేస్తారు.

అయితే, ఆనాటి నుండి వరసగా ఏదో ఒక వివాదంలో మంత్రి సురేఖ ఉంటున్నారట. ఆమె ఏం మాట్లాడినా అదొక వివాదాస్పదం అవుతోందట. సాటి మహిళ, హీరోయిన్ సమంత విషయంలో నోరు జారి అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో మంత్రి స్థాయిలో కోర్టు మెట్లు ఎక్కారు.

ఆ మధ్య ఓ ఫోన్ ఆడియోలో ఆమె సంబాషణలు అన్ పార్లమెంటరీ భాషతో వివాదాస్పదమయ్యాయి. మొన్న ఒక ప్రెస్ మీట్ తర్వాత, అక్కడ మైకులు ఆన్ లో ఉన్నాయని కూడా చూసుకోకుండా, ‘మా అన్నయ్య వాళ్ళ మనుమడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివాడు, ఉద్యోగం ఇప్పంచండి’ అని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును అడిగి వైరల్ అయ్యారు. నిన్న వరంగల్ లో ప్రపంచ సుందరీమణుల ముందు వచ్చీ రాని ఇంగ్లీష్ లో మాట్లాడి నవ్వుల పాలయ్యారు.

పిల్లలతో ఓ స్కూల్ మీటింగులో ‘అటవీశాఖ మంత్రిగా ఉన్నాను. కాబట్టి నా దగ్గరకు కొన్ని కంపెనీల ఫైళ్ళ క్లియరెన్స్ కోసం వస్తాయి. మమూలుగా అలాంటి ఫైళ్ళు వచ్చినప్పుడు మంత్రులు డబ్బులు తీసుకుని క్లియర్ చేస్తారు. అప్పుడు వాళ్ళతో నేను అన్నా… మాకు ఒక్క నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు సమాజ సేవ చేయండి. మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి. మీ పేరు గుర్తుండి పోతుందని చెప్పా. అప్పుడు మా చేతుల్లో లేదు. పై వాళ్ళతో మాట్లాడతామని అరబిందో ఫార్మాకుచెందిన సదానందరెడ్డి చెప్పారు. చివరకు సిఎస్ఆర్ నిధులు రూ.4.5 కోట్లతో కాలేజీ భవనం కడతామని చెప్పినప్పుడు నాకు సంతోషం కలిగింది.’ అన్నారు.

ఆ వివాదాన్నుంచి తప్పించుకోవడానికి నోరు విప్పి మరో వివాదంలోకి కూరుకుపోయారు. ‘నిన్న వరంగల్‌లో నేను చేసిన వ్యాఖ్యలపై కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. నేను గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అప్పటి మంత్రులు ఏ పని చేయాలన్నా పైసలు తీసుకునేవారని మాత్రమే అన్నాను. ఇది అక్షర సత్యం. నా ఆ వ్యాఖ్యలకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను.’ అన్నారు.

మొత్తంగా మంత్రి సురేఖ, రాష్ట్ర కేబినెట్ లోనే కాంట్రవర్సీ లకు కేరాఫ్ గా మారారు. సురేఖ వ్యవహారంపై గతంలోనే ఎఐసీసీ అసహనం వ్యక్తం చేసింది. తాజా ఇష్యూతో తోటి మంత్రులు తల పట్టుకుంటున్నారట. మరోవైపు ఆమె మాటలు CM|సీఎం రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారుతున్నాయట.

అయితే, మల్లన్న పట్నం తొక్కినప్పటి నుండే ఇలా జరుగుతోందని ఆమె అనుచరులు తెగబాధ పడుతున్నారట. శివ సత్తులు, చిన్న పిల్లలు , ఒగ్గుపూజారులు మాత్రమే పట్నం తొక్కాలి కానీ తన మనువడితో పట్నం తొక్కిన మంత్రి సురేఖ పరేషాన్ అవుతోందని అమె అనుచరులు లోలోన కుమిలిపోతున్నారట. శాంతిపూజ చేస్తే తప్ప దోషం పోదని ఒగ్గుపూజారులు అంటున్నారట. మంత్రి కొండా సురేఖ అనుచరులు ఈ విషయాన్ని ఆమెకు ఎలా చెప్పాలో తెలియక లోలోన మథనపడుతున్నారట. పోనీ కొండా మురళీకి చెబుతామన్నప్పటికీ ఆయన వినిపించుకుంటారో లేదోనని ఆవేదన పడుతున్నారట. అందుకే ఒగ్గు పూజారుల ద్వారా Minister|మంత్రి కొండా సురేఖ దంపతులకైతే చేరవేయగలిగారట. ఇప్పటికే ఈ విషయాన్ని కొండా దంపతులకు ఒగ్గుపూజారులు చెప్పి చూశారట. ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతున్న కొండా దంపతులు మాత్రం దీర్ఘాలోచనలో పడ్డారట!? మరి వివాదాల నుంచి బయటపడటానికి కొండా దంపతులు ఏం చేస్తారన్నది ఆసక్తిగానే కాదు ఉత్కంఠగా మారింది!

Latest News

30-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి ద్వాదశి ఉదయం 07.35 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం మఖ మధ్యాహ్నం 03.09 వరకు ఉపరి పుబ్బ యోగం శూల సాయంత్రం 05.15 వరకు ఉపరి గండ కరణం బాలవ ఉదయం 07.34...

ఎండ యేడికి సల్లని రేకులు!?|ADUGU TRENDS

ఎండా కాలం రానే వచ్చె. ఎండ యేడికి ఇండ్లల్లనే కుమ్ముల పెట్టినట్లు ఉడకబడితిమి. ఎండ యేడి 50 డిగ్రీల దగ్గర దగరికి శేరబట్టె. ఇగ కూలర్లు, ఏసీలు ఎన్ని పెట్టినా, యేడ సరిపోతయి?...

ట్రంప్ కట్టడెలా? అమెరికా నిలువరింపెలా?|EDITORIAL

పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, చమురు సరఫరాలపై ఏర్పడుతున్న అనిశ్చితి కలిపి అస్థిర దిశలో ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు, దూకుడు నిర్ణయాలు అంతర్జాతీయంగా సంచలనాలై,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మార్చి 29 నుండి ఏప్రిల్ 04 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. పనుల్లో ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ...

దెబ్బకు సోఫా జిడ్డు సఫా!?|ADUGU TRENDS

ఎన్కటికి ఇండ్లల్ల నులక మంచాలు, ఎత్తు పీటలు, శెక్క బెంచీలు, కుర్సీలుంటే సాలయ్యేది. ఇగిప్పుడు గయన్నీ పోతానయి. ఇనుప, కేన్ కుర్సీలు, సోఫాలొచ్చె. గా సోఫాలకు లోపల మెత్తటి దూది.. గదేనుల్ల కుషన్,...

ద్రవ్యోల్బణ సవాళ్ళకు పరిష్కారాలివే!|EDITORIAL

ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువ పతనం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు...

28-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి దశమి ఉదయం 10.27 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.24 వరకు ఉపరి ఆశ్లేష యోగం సుకర్మ రాత్రి 09.35 వరకు ఉపరి ధృతి కరణం గరజి ఉదయం 10.28...

బంకులకి బాహు బలి!?|ADUGU TRENDS

వచ్చి రాని యుద్ధం వచ్చె. బొచ్చెడు కట్టాలు తెచ్చె. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబట్టె. నో స్టాకు బోర్డులు పెట్టబట్టిరి. కొరతే లేదని సర్కారోల్లు అనబట్టిరి. అసలు మా దగ్గర పెట్రోలే లేదని...

ట్రంప్ మూర్ఖత్వానికి ప్రపంచం మూల్యం!|EDITORIAL

ప్రపంచంలో యుద్ధాలు కొత్తేమీ కావు. కానీ, ఆ యుద్ధాల పరిణామాలు, ప్రభావాలు తీవ్రం. ఈసారి యుద్ధం మొదలైన తీరే విచిత్రం. ఏకపక్షం. అగ్రరాజ్యం అమెరికా సామ్రాజ్యవాదానికి, ట్రంపు టెంపరితనానికి పరాకాష్ట. అయితే, అమెరికా–ఇరాన్...

27-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం శ్రీరామనవమి శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం తిధి నవమి మధ్యాహ్నం 12.22 వరకు ఉపరి దశమి నక్షత్రం పునర్వసు సాయంత్రం 05.34 వరకు ఉపరి పుష్యమి యోగం అతిగండ రాత్రి 12.08 వరకు ఉపరి సుకర్మ కరణం కౌలవ మధ్యాహ్నం...

గా దారం ఊసిపోదు! శార్జింగ్ వైరు తెగిపోదు!?|ADUGU TRENDS

ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం అన్నరు. ఇగిప్పుడైతే సెల్లే! ఎవల సేతుల సూసినా సెల్లే. పుస్తకానికి శెల్లు శీటీ రాసేసి, సెల్లుకు విల్లు రాసేసిండ్రు. మరి గా సెల్లు పోన్ల శార్జింగుంటేనే గది...

చమురు సంక్షోభమే సంస్కరణలకు సానుకూలం!|EDITORIAL

భారత్‌ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ఇంధన భద్రత ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని, సవాళ్లను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్‌ను అస్థిర పరుస్తున్నాయి. ఈ పరిణామాలు దిగుమతులపై...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News