గుమ్మడి నర్సయ్యకు జీవన సాఫల్య అవార్డు ప్రదానోత్సవంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి
కమ్యూనిస్టు యోధుడు ఇల్లెంద మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య రాజకీయ ప్రస్థానం ఆయన త్యాగం పోరాటం నిరాడంబరత చిత్తశుద్ధి ప్రజలతోనే నేటికీ జీవితం కొనసాగిస్తున్న స్పూర్తి అందరికీ ఆదర్శనీయమని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి అన్నారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని తిరుమల ఫంక్షన్ హాల్ లో సి.ఎన్.ఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో చింతలపల్లి నిర్మలాదేవి నారాయణ రావు జీవన సాఫల్య పురస్కారాన్ని గుమ్మడి నర్సయ్యకు ప్రదానోత్సవ కార్యక్రమంలో చింతలపల్లి భాస్కర్ రావు సభ అధ్యక్షత వహించగా, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, గుమ్మడి నర్సయ్యను శాలువతో సత్కరించి మెమొంటో,25000 నగదును సన్మాన పత్రాన్ని అందచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దామోదర రెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టుగా ఆయన జీవితం అంకితం చేశాడని ఆయన ప్రజలకు చేస్తున్న సేవ జనాదరణ అభినందనీయమని నేటి యువతే కాకుండా ప్రజా జీవితంలో అందరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. కీర్తి శేషులు సి. నారాయణ రావు తన రాజకీయ జీవితానికి మొదటి దశలో బాసటగా నిలిచి వారి కుటుంబమంతా అండగా నిలిచిందని అన్నారు.తల్లి తండ్రులను స్మరిస్తూ అవార్డు నెలకొల్పడం నేటీరోజుల్లో చాలా అరుదైన విషయమని అన్నారు.

అవార్డు గ్రహీత గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలో నా సేవల్ని నా జీవితాన్ని గుర్తించి సి.ఎన్.ఆర్్ విద్యాసంస్థల తరుపున అవార్డు ఇవ్వటం గర్వకారణమని అన్నారు.తన జీవితాంతం కమ్యూనిస్టు పార్టీలోనే ఉంటూ ఇల్లెందు ప్రజల గొంతుకగా నిస్వార్థ సేవ చేస్తానని ఆదీవాసీల హక్కుల కోసం జనంతోనే జీవిస్తూ సమసమాజం కోసం పేదరిక నిర్మూలనకోసం కూలిరేట్లకోసం గిట్టుబాటు ధరలకోసం పనిచేస్తానని తెలిపారు. ప్రభుత్వం పోడుభూముల సమస్యలు పరిష్కరించాలని ఆదివాసీ గిరిజనులకు పట్టాలివ్వాలని కోరారు. కమ్యూనిజం పోయిందని బాధపడాల్సిన అవసరం లేదని తరతరాలుగా త్యాగాలు చేసి కమ్యూనిస్టు పార్టీ పేదలకోసం పనిచేసిందని అదే లక్ష్యంతో మనమంతా ముందుకు సాగాలని సమసమాజం తప్పనిసరి గా ఏదో ఒకరోజు వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు బాల్ నర్సింహ్మా,ఆనంద్ జీ,సిపిఎం నాయకులు వర్దం పర్వతాలు,ఆర్.శ్రీనివాస్లు,ఐద్వామహిళాసంఘం అద్యక్షురాలు కందికొండగీత ,టి యు సిఐ.ఉపాద్రక్షురాలు ఎస్.ఎల్. పద్మ,,గుమ్మడి నర్సయ్య కూతురు ప్రొఫెసర్ అనురాధ, ప్రజాపంథ నాయకులు కృష్ణ ,బయోపిక్ డైరెక్టర్ పరమేశ్వర్ హివ్రాలే,డాక్టర్ నూర్జహాన్,కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి,నాగవరం బాల్ రాం ,డాక్టర్ రామ్ కిషన్ ,సమన్వయ కర్తలు వనపట్ల సుబ్బయ్య, కందికొండ మోహన్ కల్వకోలు మద్దిలేటి పి.వహీద్ ఖాన్, ఎదిరెపల్లి కాశన్న,ముచ్చర్ల దినకర్,వెంకటపతి గుడిపల్లి నర్సింహ్మా రెడ్డి , కాశీదాసు, ఆర్కల రాజేష్,విష్ణుమూర్తి గాయకుడు సత్తార్,గుడిపల్లి నిరంజన్ ,సి.భాస్కర్ రావు కుటుంబ సభ్యులు వెంకటేష్ చంద్రకళ, కవిత, ఫస్టియోద్దీన్,గౌస్ ,తదితరులు పాల్గొన్నారు.

