Monday, March 30, 2026
35.2 C
Hyderabad

తెలంగాణలో చారిత్రాత్మక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024) దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయంగా నిలిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ఈ సర్వే ఫలితాలను ప్రకటిస్తూ, దీన్ని సమాజ అభివృద్ధికి దిక్సూచి లాంటి మోడల్ డాక్యుమెంట్ గా అభివర్ణించారు. గత ఏడు దశాబ్దాలుగా బలహీన వర్గాలు, మైనారిటీలు ఎదురుచూస్తున్న డేటాను ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా అందించేందుకు చేపట్టిన ఈ సర్వే ఏడాది కాలంలో విజయవంతంగా పూర్తయిందని ఆయన తెలిపారు. ఈ నివేదికను మంత్రిమండలి ఆమోదించిందని, రాష్ట్రంలో అమలు చేయబోయే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి, రాజకీయ అవకాశాలకు ప్రాతిపదికగా ఉపయోగిస్తామని ప్రకటించారు.

ఈ సర్వే ద్వారా 46.25 శాతం బీసీలు, మైనారిటీల్లోని బీసీలు కలిపితే 56.33 శాతం బీసీలు ఉన్నట్లు వెల్లడైంది. ప్రభుత్వం వీరందరికీ సముచిత గౌరవం, అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని సీఎం తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బలహీన వర్గాల జనాభా గణాంకాలపై చర్యలు చేపట్టామని, ఈ నివేదికకు చట్టబద్ధత కల్పించేందుకు మంత్రిమండలి ఉపసంఘం ఆమోదం తెలిపిందని వివరించారు. సర్వే పూర్తయిన తర్వాత, వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధికి అవసరమైన సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి మరియు రాజకీయ అవకాశాల కోసం ప్రణాళిక రూపొందించి అమలు చేయాలన్న లక్ష్యంతో ఈ సర్వే చేపట్టామని స్పష్టం చేశారు.

ఈ సర్వే 2024 నవంబర్ 6న గవర్నర్ గారి సమక్షంలో ప్రారంభమై, డిసెంబర్ 25న పూర్తయింది. 50 రోజుల్లో 1,12,15,137 కుటుంబాలను (96.09 శాతం) నమోదు చేశామని వెల్లడించారు. ఫలితాల ప్రకారం, ఎస్సీలు 17.43 శాతం (61,84,319), ఎస్టీలు 10.45 శాతం (37,05,929), బీసీలు 46.25 శాతం (1,64,09,179), ముస్లిం మైనారిటీల్లో బీసీలు 10.08 శాతం (35,76,588) ఉన్నారని తెలిపారు. ముస్లిం మైనారిటీ బీసీలను కలుపుకుంటే మొత్తం బీసీల సంఖ్య 56.33 శాతంగా ఉన్నట్లు వెల్లడైంది. మైనారిటీ జనాభా 12.56 శాతం (44,57,012) ఉండగా, ముస్లిం మైనారిటీల్లో ఓసీలు 2.4 శాతం (80,424), హిందూ ఓసీలు 13.31 శాతం ఉన్నట్లు వెల్లడైంది. ముస్లిం మైనారిటీల్లోని ఓసీలను కలుపుకుంటే మొత్తం ఓసీల జనాభా 15.79 శాతం గా ఉందని తెలిపారు.

ఈ సర్వే డేటా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి అవసరమైన విధానాలను రూపొందించేందుకు ప్రభుత్వం ఉపయోగించనుందని ముఖ్యమంత్రి తెలిపారు. గత 75 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టని ఈ చర్యను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. 2023 డిసెంబర్ 7న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 4 ఫిబ్రవరి 2024న మంత్రిమండలి ఆమోదం పొంది, 6 ఫిబ్రవరి 2024న శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టామని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ప్రయత్నాలు న్యాయపరంగా నిలవకపోవడంతో, తెలంగాణ ప్రభుత్వం సర్వే పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.

ఈ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024 తెలంగాణకు కొత్త దశను అందించనుందని, ప్రభుత్వం సమాన అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Latest News

30-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి ద్వాదశి ఉదయం 07.35 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం మఖ మధ్యాహ్నం 03.09 వరకు ఉపరి పుబ్బ యోగం శూల సాయంత్రం 05.15 వరకు ఉపరి గండ కరణం బాలవ ఉదయం 07.34...

ఎండ యేడికి సల్లని రేకులు!?|ADUGU TRENDS

ఎండా కాలం రానే వచ్చె. ఎండ యేడికి ఇండ్లల్లనే కుమ్ముల పెట్టినట్లు ఉడకబడితిమి. ఎండ యేడి 50 డిగ్రీల దగ్గర దగరికి శేరబట్టె. ఇగ కూలర్లు, ఏసీలు ఎన్ని పెట్టినా, యేడ సరిపోతయి?...

ట్రంప్ కట్టడెలా? అమెరికా నిలువరింపెలా?|EDITORIAL

పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, చమురు సరఫరాలపై ఏర్పడుతున్న అనిశ్చితి కలిపి అస్థిర దిశలో ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు, దూకుడు నిర్ణయాలు అంతర్జాతీయంగా సంచలనాలై,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మార్చి 29 నుండి ఏప్రిల్ 04 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. పనుల్లో ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ...

దెబ్బకు సోఫా జిడ్డు సఫా!?|ADUGU TRENDS

ఎన్కటికి ఇండ్లల్ల నులక మంచాలు, ఎత్తు పీటలు, శెక్క బెంచీలు, కుర్సీలుంటే సాలయ్యేది. ఇగిప్పుడు గయన్నీ పోతానయి. ఇనుప, కేన్ కుర్సీలు, సోఫాలొచ్చె. గా సోఫాలకు లోపల మెత్తటి దూది.. గదేనుల్ల కుషన్,...

ద్రవ్యోల్బణ సవాళ్ళకు పరిష్కారాలివే!|EDITORIAL

ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువ పతనం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు...

28-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి దశమి ఉదయం 10.27 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.24 వరకు ఉపరి ఆశ్లేష యోగం సుకర్మ రాత్రి 09.35 వరకు ఉపరి ధృతి కరణం గరజి ఉదయం 10.28...

బంకులకి బాహు బలి!?|ADUGU TRENDS

వచ్చి రాని యుద్ధం వచ్చె. బొచ్చెడు కట్టాలు తెచ్చె. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబట్టె. నో స్టాకు బోర్డులు పెట్టబట్టిరి. కొరతే లేదని సర్కారోల్లు అనబట్టిరి. అసలు మా దగ్గర పెట్రోలే లేదని...

ట్రంప్ మూర్ఖత్వానికి ప్రపంచం మూల్యం!|EDITORIAL

ప్రపంచంలో యుద్ధాలు కొత్తేమీ కావు. కానీ, ఆ యుద్ధాల పరిణామాలు, ప్రభావాలు తీవ్రం. ఈసారి యుద్ధం మొదలైన తీరే విచిత్రం. ఏకపక్షం. అగ్రరాజ్యం అమెరికా సామ్రాజ్యవాదానికి, ట్రంపు టెంపరితనానికి పరాకాష్ట. అయితే, అమెరికా–ఇరాన్...

27-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం శ్రీరామనవమి శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం తిధి నవమి మధ్యాహ్నం 12.22 వరకు ఉపరి దశమి నక్షత్రం పునర్వసు సాయంత్రం 05.34 వరకు ఉపరి పుష్యమి యోగం అతిగండ రాత్రి 12.08 వరకు ఉపరి సుకర్మ కరణం కౌలవ మధ్యాహ్నం...

గా దారం ఊసిపోదు! శార్జింగ్ వైరు తెగిపోదు!?|ADUGU TRENDS

ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం అన్నరు. ఇగిప్పుడైతే సెల్లే! ఎవల సేతుల సూసినా సెల్లే. పుస్తకానికి శెల్లు శీటీ రాసేసి, సెల్లుకు విల్లు రాసేసిండ్రు. మరి గా సెల్లు పోన్ల శార్జింగుంటేనే గది...

చమురు సంక్షోభమే సంస్కరణలకు సానుకూలం!|EDITORIAL

భారత్‌ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ఇంధన భద్రత ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని, సవాళ్లను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్‌ను అస్థిర పరుస్తున్నాయి. ఈ పరిణామాలు దిగుమతులపై...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News