హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. విదేశీ పర్యటనలు ముగించి భారీ పెట్టుబడులతో హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రాజా రా రెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

