Saturday, March 28, 2026
35.2 C
Hyderabad

రేవంత్ ప్రజలను మభ్య పెట్టడమే తప్ప చేసిందేమి లేదు

రాస్ట్రం దివాళా తీయడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం 

సిఎం రేవంత్ పై విరుచుకుపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు 

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టి వ‌చ్చిన హామీల‌ను అమ‌లు చేసే స్థితిలో లేరు” అని పేర్కొన్నారు. ‘‘People who blame others for their failures never overcome them, they simply move from problem to problem’’ అనే జాన్ సి. మాక్స్‌వెల్‌ రాసిన మాటలను ఉటంకిస్తూ, ‘‘ప్రతి ఒక్కరు తమ విఫలతలకు ఇతరులను నిందిస్తే, వారు ఎప్పటికీ ఆ విఫలత నుంచి బయటపడలేరు’’ అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా, ‘‘రేవంత్ రెడ్డి ఒక్కసారిగా భయంతో హామీలను అమలు చేయడం మానేశాడు’’ అంటూ హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి, ‘‘రాష్ట్రమే దివాళా తీసింది’’ అని ప్రచారం చేస్తూ ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారు అని ఆరోపించారు. ‘‘7 లక్షల కోట్ల అప్పుతో కాదు, 4 లక్షల 17 వేల కోట్ల అప్పుతో రాష్ట్రం వుందని అసెంబ్లీలో కూడా చెప్పాను’’ అని హరీశ్‌రావు చెప్పారు.

హరీశ్‌రావు విమర్శిస్తూ, ‘‘రేవంత్ రెడ్డి అంతటా ప్రజలకు హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయకుండానే రాష్ట్రాన్ని దివాళా తీస్తున్నాడు’’ అని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు రావడం లేదు, నిరుద్యోగం పెరిగింది, ఉద్యోగాల అవకాశాలు తగ్గాయి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిపివేయబడ్డాయని సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డారు.

కేటీఆర్ పై పెట్టిన తప్పుడు కేసు గురించి మాట్లాడుతూ…., ‘‘ఫార్ములా ఈ రేసు నిర్వహించడం, హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చడం అనేది కేటీఆర్ చేసిన గొప్ప ప్రాజెక్ట్. 2023లో రూ. 30 కోట్ల ప్రభుత్వ ఖర్చుతో జరిగిన ఈ రేసు రాష్ట్రానికి రూ. 700 కోట్ల జీఎస్డీపీగా లాభం కలిగించింది’’ అని హరీశ్‌రావు చెప్పారు. కానీ, రేవంత్ రెడ్డి ‘‘ఇంటి రంగు మార్చి, మధ్యంతరంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసి ఒలింపిక్స్ నిర్వహిస్తామని ప్రకటనలు చేస్తున్నాడు’’ అంటూ రేవంత్ పై సెటైర్లు వేశారు.

రేవంత్ రెడ్డి ‘‘మూసీ బ్యూటిఫికేషన్’’ పేరుతో లూటిఫికేషన్ చేస్తున్నారని, ఈ అంశంపై ప్రజల ముందు ఆధారాలతో తప్పిదాలను చూపించారని హరీశ్‌రావు ఆరోపించారు. అలాగే, ‘‘కేటీఆర్ పై వ్యతిరేకంగా కొంతకాలంగా కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి’’ అని ఆయన మండిపడ్డారు.

హరీశ్‌రావు, ‘‘రేవంత్ రెడ్డి దేశంలోని ప్రఖ్యాత ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన సీఈఓను జైలులో వేయాలని అంటున్నారు అని, ఇది ఎంత వరకు సరైన చర్య’’ అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ‘‘రేవంత్ రెడ్డి గర్వంగా చెప్పుకోవడమేంటో’’ రేవంత్ కే తెలియాలి అన్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాలపై మరోసారి విమర్శలు చేస్తూ, ‘‘రైతులపై, విద్యార్థులపై, ఆటో డ్రైవర్లపై, అంగన్‌వాడీ ఉద్యోగులపై కేసులు పెట్టడం సాధారణంగా మారిపోయింది’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘మా నాయకులు మాత్రం ఎప్పటికీ వెనకడుగు వేయరు, కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నాం’’ అని హరీశ్‌రావు చెప్పారు.

అంతేకాక, ‘‘రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రతిష్ఠ గాయపడింది’’ అని ఆయన తేల్చి చెప్పారు. ‘‘కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ జాతీయ పటంలో శక్తివంతమైన రాష్ట్రంగా ఎదగాలనే ఆశతో ముందుకు సాగిందని తమ ప్రభుత్వం వున్న రోజులను హరీశ్‌రావు గుర్తు చేశారు.

Latest News

దెబ్బకు సోఫా జిడ్డు సఫా!?|ADUGU TRENDS

ఎన్కటికి ఇండ్లల్ల నులక మంచాలు, ఎత్తు పీటలు, శెక్క బెంచీలు, కుర్సీలుంటే సాలయ్యేది. ఇగిప్పుడు గయన్నీ పోతానయి. ఇనుప, కేన్ కుర్సీలు, సోఫాలొచ్చె. గా సోఫాలకు లోపల మెత్తటి దూది.. గదేనుల్ల కుషన్,...

ద్రవ్యోల్బణ సవాళ్ళకు పరిష్కారాలివే!|EDITORIAL

ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువ పతనం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు...

28-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి దశమి ఉదయం 10.27 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.24 వరకు ఉపరి ఆశ్లేష యోగం సుకర్మ రాత్రి 09.35 వరకు ఉపరి ధృతి కరణం గరజి ఉదయం 10.28...

బంకులకి బాహు బలి!?|ADUGU TRENDS

వచ్చి రాని యుద్ధం వచ్చె. బొచ్చెడు కట్టాలు తెచ్చె. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబట్టె. నో స్టాకు బోర్డులు పెట్టబట్టిరి. కొరతే లేదని సర్కారోల్లు అనబట్టిరి. అసలు మా దగ్గర పెట్రోలే లేదని...

ట్రంప్ మూర్ఖత్వానికి ప్రపంచం మూల్యం!|EDITORIAL

ప్రపంచంలో యుద్ధాలు కొత్తేమీ కావు. కానీ, ఆ యుద్ధాల పరిణామాలు, ప్రభావాలు తీవ్రం. ఈసారి యుద్ధం మొదలైన తీరే విచిత్రం. ఏకపక్షం. అగ్రరాజ్యం అమెరికా సామ్రాజ్యవాదానికి, ట్రంపు టెంపరితనానికి పరాకాష్ట. అయితే, అమెరికా–ఇరాన్...

27-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం శ్రీరామనవమి శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం తిధి నవమి మధ్యాహ్నం 12.22 వరకు ఉపరి దశమి నక్షత్రం పునర్వసు సాయంత్రం 05.34 వరకు ఉపరి పుష్యమి యోగం అతిగండ రాత్రి 12.08 వరకు ఉపరి సుకర్మ కరణం కౌలవ మధ్యాహ్నం...

గా దారం ఊసిపోదు! శార్జింగ్ వైరు తెగిపోదు!?|ADUGU TRENDS

ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం అన్నరు. ఇగిప్పుడైతే సెల్లే! ఎవల సేతుల సూసినా సెల్లే. పుస్తకానికి శెల్లు శీటీ రాసేసి, సెల్లుకు విల్లు రాసేసిండ్రు. మరి గా సెల్లు పోన్ల శార్జింగుంటేనే గది...

చమురు సంక్షోభమే సంస్కరణలకు సానుకూలం!|EDITORIAL

భారత్‌ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ఇంధన భద్రత ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని, సవాళ్లను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్‌ను అస్థిర పరుస్తున్నాయి. ఈ పరిణామాలు దిగుమతులపై...

26-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి అష్టమి పగలు 02.35 వరకు ఉపరి నవమి నక్షత్రం ఆరుద్ర రాత్రి 06.55 వరకు ఉపరి పునర్వసు యోగం సౌభాగ్య ఉదయం 05.55 వరకు ఉపరి శోభ కరణం బవ పగలు 02.35...

రైతంటే గీ ఇగురుమున్నాయినే పో!|ADUGU TRENDS

ఇప్పటోల్లకేమో గనీ, ఎన్కటోల్లకు, నడీడుకొచ్చినోల్లకు ఎడ్ల బండంటే తెలుత్తది. దాన్ని ఎక్కిన అనుభవం ఉంటది. ఎన్కటికి యాడికిపోయినా ఎడ్లబండ్లే. సైకిలుంటే మహా, స్కూటరు, సైకిలు మోటరుంటే ఓ మోతుబరి, ఇగ కారున్నోల్లు దొరలు,...

పునర్విభజన పార్టీలకు పండగే!|EDITORIAL

జనాభా ఆధారంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల స్థానాలను పునర్విభజించడం అనే ప్రక్రియ, ప్రజాప్రాతినిధ్యపు వ్యవస్థకు అవసరమైన సంస్కరణ కాగా, రాజకీయ ప్రయోజనాల పరంగానూ ఎంతో లాభదాయకం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా...

25-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి సప్తమి సాయంత్రం 04.44 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మృగశిర రాత్రి 08.30 వరకు ఉపరి ఆరుద్ర యోగం ఆయుష్మాన్ ఉదయం 09.00 వరకు ఉపరి సౌభాగ్య కరణం గరజి ఉదయం 06.05...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News