Monday, March 30, 2026
35.2 C
Hyderabad

పోరు వద్దు! ఊరే ముద్దు!!|MAOIST|DGP

జనజీవన స్రవంతిలోకి…
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి|POTHULA PADMAVATHI

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (అడుగు న్యూస్):
తెలంగాణ మావోయిస్టు ఉద్యమానికి బలమైన నాయకురాలిగా ఉన్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి అలియాస్ మైనక్క, మైనాబాయి, సూజాత శనివారం తెలంగాణ డీజీపీ జితేందర్ సమక్షంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లో 2011లో ఎన్‌కౌంటర్‌లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు మలోజ్జుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ భార్య ఈ పద్మావతి. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడుకు చెందిన ఆమె, పటేల్ సుధాకర్ రెడ్డి, పోతుల సుదర్శన్ రెడ్డి అలియాస్ ఆర్కే, ఆయన భార్య సుగుణ వంటి విప్లవ కార్మికులను స్ఫూర్తిగా తీసుకుని విప్లవ మార్గంలో అడుగుపెట్టారు. 1982లో ఇంటర్మీడియెట్ చదువుతున్న సమయంలో పీపుల్స్ వార్ పార్టీలో చేరిన పద్మావతి, రాడికల్ స్టూడెంట్ యూనియన్ లో పని చేశారు. గ్రామాలకు తిరిగి వెళ్దాం అనే నినాదంతో గద్దర్, సుగుణలతో కలిసి గ్రామీణ స్థాయిలో పనిచేసి, కొంతకాలం జననాట్య మండలిలోనూ పనిచేశారు. కోఠిలో పీస్ బుక్ సెంటర్‌లో పనిచేసిన సమయంలో కిషన్‌జీతో పరిచయం ఏర్పడి, ఇద్దరూ వివాహం చేసుకుని ఒక కూతురికి జన్మనిచ్చారు. 1987లో గడ్చిరోలి జిల్లాలో పార్టీ నిర్మాణంలో చురుకుగా పనిచేసి, డిప్యూటీ కమాండర్ స్థాయికి ఎదిగారు. 1996లో చత్తీస్‌గఢ్ దక్షిణ బస్తర్‌లో డివిజనల్ కమిటీ మెంబర్ గా, బాసగూడ ఏరియా కార్యదర్శిగా, 2001లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. జనతన్ సర్కార్ గ్రామ కమిటీల పర్యవేక్షణ, సిఎన్ఎం, కేఏఎంఎస్, డిఏకెఎమ్ఎస్ వంటి ప్రజా సంఘాల సమన్వయం ఆమె బాధ్యతల్లో భాగమయ్యాయి. 2007లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి, ఎస్.యు.సి.ఓ.ఎం.ఓ వ్యవహారాలను పర్యవేక్షించారు. 2018లో జనతన్ సర్కార్ పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకున్న ఆమె, 2022లో దక్షిణ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శిగా, 2023లో కేంద్ర కమిటీ సభ్యురాలిగా ఎదిగారు. అంతేకాకుండా, కోయ బాషలో ముద్రించే పేతురి పత్రిక సంపాదకురాలిగానూ వ్యవహరించారు. అయితే, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పద్మావతి పార్టీకి కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న ద్వారా లేఖ పంపి, ఇక పార్టీ కార్యకలాపాలకు దూరమవుతున్నానని తెలిపారు. పోరు వద్దు, ఊరు ముద్దు అనే నినాదాన్ని పాటిస్తూ ప్రజాజీవనంలో కలవాలనుకుంటున్నానని ప్రకటించారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడుతూ, ఈ ఏడాది ఇప్పటి వరకు 404 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వీరిలో నలుగురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక డివిజనల్ కార్యదర్శి, 34 ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారని వెల్లడించారు. ప్రస్తుతం 74 మంది తెలంగాణకు చెందిన వారు మావోయిస్టు పార్టీలో ఉన్నారని, 15 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో 10 మంది తెలుగు వారేనని ఆయన తెలిపారు. గత ఏడాది 22 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మృతి చెందగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 10 మంది చనిపోయారని డీజీపీ వివరించారు. శాంతి చర్చల గురించి మాట్లాడుతూ, గతంలో కూడా ప్రయత్నాలు జరిగాయని కానీ ఎలాంటి ఫలితం రాలేదని అన్నారు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో తమను తాము కాపాడుకోవడానికే చర్చల ప్రతిపాదన తెరపైకి వస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న లొంగుబాటు విధానం కొనసాగుతుందని, విప్లవ మార్గంలో ఉన్నవారు ప్రజాజీవనంలో కలవాలని డీజీపీ పిలుపునిచ్చారు.

Latest News

30-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి ద్వాదశి ఉదయం 07.35 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం మఖ మధ్యాహ్నం 03.09 వరకు ఉపరి పుబ్బ యోగం శూల సాయంత్రం 05.15 వరకు ఉపరి గండ కరణం బాలవ ఉదయం 07.34...

ఎండ యేడికి సల్లని రేకులు!?|ADUGU TRENDS

ఎండా కాలం రానే వచ్చె. ఎండ యేడికి ఇండ్లల్లనే కుమ్ముల పెట్టినట్లు ఉడకబడితిమి. ఎండ యేడి 50 డిగ్రీల దగ్గర దగరికి శేరబట్టె. ఇగ కూలర్లు, ఏసీలు ఎన్ని పెట్టినా, యేడ సరిపోతయి?...

ట్రంప్ కట్టడెలా? అమెరికా నిలువరింపెలా?|EDITORIAL

పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, చమురు సరఫరాలపై ఏర్పడుతున్న అనిశ్చితి కలిపి అస్థిర దిశలో ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు, దూకుడు నిర్ణయాలు అంతర్జాతీయంగా సంచలనాలై,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మార్చి 29 నుండి ఏప్రిల్ 04 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. పనుల్లో ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ...

దెబ్బకు సోఫా జిడ్డు సఫా!?|ADUGU TRENDS

ఎన్కటికి ఇండ్లల్ల నులక మంచాలు, ఎత్తు పీటలు, శెక్క బెంచీలు, కుర్సీలుంటే సాలయ్యేది. ఇగిప్పుడు గయన్నీ పోతానయి. ఇనుప, కేన్ కుర్సీలు, సోఫాలొచ్చె. గా సోఫాలకు లోపల మెత్తటి దూది.. గదేనుల్ల కుషన్,...

ద్రవ్యోల్బణ సవాళ్ళకు పరిష్కారాలివే!|EDITORIAL

ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువ పతనం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు...

28-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి దశమి ఉదయం 10.27 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.24 వరకు ఉపరి ఆశ్లేష యోగం సుకర్మ రాత్రి 09.35 వరకు ఉపరి ధృతి కరణం గరజి ఉదయం 10.28...

బంకులకి బాహు బలి!?|ADUGU TRENDS

వచ్చి రాని యుద్ధం వచ్చె. బొచ్చెడు కట్టాలు తెచ్చె. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబట్టె. నో స్టాకు బోర్డులు పెట్టబట్టిరి. కొరతే లేదని సర్కారోల్లు అనబట్టిరి. అసలు మా దగ్గర పెట్రోలే లేదని...

ట్రంప్ మూర్ఖత్వానికి ప్రపంచం మూల్యం!|EDITORIAL

ప్రపంచంలో యుద్ధాలు కొత్తేమీ కావు. కానీ, ఆ యుద్ధాల పరిణామాలు, ప్రభావాలు తీవ్రం. ఈసారి యుద్ధం మొదలైన తీరే విచిత్రం. ఏకపక్షం. అగ్రరాజ్యం అమెరికా సామ్రాజ్యవాదానికి, ట్రంపు టెంపరితనానికి పరాకాష్ట. అయితే, అమెరికా–ఇరాన్...

27-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం శ్రీరామనవమి శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం తిధి నవమి మధ్యాహ్నం 12.22 వరకు ఉపరి దశమి నక్షత్రం పునర్వసు సాయంత్రం 05.34 వరకు ఉపరి పుష్యమి యోగం అతిగండ రాత్రి 12.08 వరకు ఉపరి సుకర్మ కరణం కౌలవ మధ్యాహ్నం...

గా దారం ఊసిపోదు! శార్జింగ్ వైరు తెగిపోదు!?|ADUGU TRENDS

ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం అన్నరు. ఇగిప్పుడైతే సెల్లే! ఎవల సేతుల సూసినా సెల్లే. పుస్తకానికి శెల్లు శీటీ రాసేసి, సెల్లుకు విల్లు రాసేసిండ్రు. మరి గా సెల్లు పోన్ల శార్జింగుంటేనే గది...

చమురు సంక్షోభమే సంస్కరణలకు సానుకూలం!|EDITORIAL

భారత్‌ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ఇంధన భద్రత ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని, సవాళ్లను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్‌ను అస్థిర పరుస్తున్నాయి. ఈ పరిణామాలు దిగుమతులపై...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News