Saturday, March 28, 2026
35.2 C
Hyderabad

POK|పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలి

RSS|ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ MOHAN BHAGAVAT|మోహన్‌ భగవత్‌ పిలుపు

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని సత్నాలో జరిగిన సింధీ క్యాంప్‌ గురుద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) సర్సంఘ్‌చాలక్‌ మోహన్‌ భగవత్‌ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో జరుగుతున్న ప్రజా తిరుగుబాట్లు, ఉద్రిక్తతల నేపథ్యంలో భగవత్‌ మాట్లాడుతూ, పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. భారతదేశాన్ని ఒక ఇల్లుతో పోల్చిన ఆయన, ఆ ఇంటిలోని ఒక గది పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌గా ఉందని, దానిని ఎవరో ఆక్రమిస్తే నిశ్శబ్దంగా ఉండకూడదని వ్యాఖ్యానించారు. ఇంటి గదిని తిరిగి స్వాధీనం చేసుకోవడం మన కర్తవ్యమని, భారతదేశం అవిభక్త భారతదేశం కావాలని గుర్తుచేశారు.

భగవత్‌ మాట్లాడుతూ, భారతదేశం అనే ఇల్లు మొత్తం ఒకటే. మన ఇంట్లోని ఒక గది పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ రూపంలో ఆక్రమించబడింది. దాన్ని మనం తిరిగి పొందాలి. ఇది రాజకీయ విషయం కాదు, మన ఆత్మగౌరవం, జాతి ఏకత్వం అంశం. అవిభక్త భారతదేశాన్ని తిరిగి నిర్మించాలనే దిశగా అందరం కృషి చేయాలి అని అన్నారు. సభలో ఆయన వ్యాఖ్యలకు హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.

ఇక భగవత్‌ మరో కీలక అంశాన్ని ప్రస్తావిస్తూ, మనమంతా ఒకటే. మతం, భాష, ప్రాంతం వేరు అయినా మన మూలం ఒకటే. మనమంతా హిందువులమే. సింధీ సోదరులను చూసి ఆనందంగా ఉంది. వారు పాకిస్తాన్‌కు వెళ్లలేదు, అవిభక్త భారతదేశంలోని ఒక ప్రాంతానికి వెళ్లారు. పరిస్థితులు వారిని వేరుచేశాయి కానీ ఆ ఇల్లూ, ఈ ఇల్లూ వేరు కావు” అని అన్నారు. ఇంటి ఒక గదిని ఎవరో బలవంతంగా ఆక్రమించుకున్నారు. కానీ అది మనదే కాబట్టి, మనం దానిని తిరిగి తీసుకోవాల్సిందే అని ఆయన పిలుపునిచ్చారు.

ఇక పీఓకేలో ఇటీవల హింసాత్మక నిరసనలు చెలరేగాయి. పాక్‌ ప్రభుత్వం, సైన్యం చేస్తున్న అణచివేత చర్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు 12 మంది మరణించగా, అనేకమంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో భగవత్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

పాకిస్తాన్‌ పాలనలో ఉన్న పీఓకే ప్రాంత ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. జమ్మూ కశ్మీర్‌ జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీ ఈ ఉద్యమానికి నేతృత్వం వహిస్తోంది. నిరసనలను అణచివేయడానికి ప్రయత్నించిన పాక్‌ ప్రభుత్వం చివరకు ఆ కమిటీతో చర్చలు జరిపి 25 అంశాలపై ఒప్పందం కుదుర్చుకుంది. హింసలో మరణించిన వారికి పరిహారం ఇవ్వడంతో పాటు, ముజఫరాబాద్‌, పూంచ్‌ డివిజన్లలో అదనంగా రెండు ఇంటర్మీడియట్‌, సెకండరీ విద్యా బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు పాకిస్తాన్‌ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తారిక్‌ ఫజల్‌ చౌదరి వెల్లడించారు.

పీఓకేలో పెరుగుతున్న అసంతృప్తి, ప్రజల్లో ఆగ్రహం నేపథ్యంలో మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలు జాతీయస్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఆయన పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలని పిలుపునివ్వడం, భారతీయ ఏకత్వం పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌ వైఖరిని మరోసారి స్పష్టంచేసింది. దేశ సార్వభౌమ్యానికి భగవత్‌ వ్యాఖ్యలు నూతన ఉత్సాహాన్ని నింపాయని, భారత జాతి ఐక్యతకు ఇది ప్రేరణగా నిలుస్తుందని ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Latest News

దెబ్బకు సోఫా జిడ్డు సఫా!?|ADUGU TRENDS

ఎన్కటికి ఇండ్లల్ల నులక మంచాలు, ఎత్తు పీటలు, శెక్క బెంచీలు, కుర్సీలుంటే సాలయ్యేది. ఇగిప్పుడు గయన్నీ పోతానయి. ఇనుప, కేన్ కుర్సీలు, సోఫాలొచ్చె. గా సోఫాలకు లోపల మెత్తటి దూది.. గదేనుల్ల కుషన్,...

ద్రవ్యోల్బణ సవాళ్ళకు పరిష్కారాలివే!|EDITORIAL

ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువ పతనం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు...

28-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి దశమి ఉదయం 10.27 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.24 వరకు ఉపరి ఆశ్లేష యోగం సుకర్మ రాత్రి 09.35 వరకు ఉపరి ధృతి కరణం గరజి ఉదయం 10.28...

బంకులకి బాహు బలి!?|ADUGU TRENDS

వచ్చి రాని యుద్ధం వచ్చె. బొచ్చెడు కట్టాలు తెచ్చె. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబట్టె. నో స్టాకు బోర్డులు పెట్టబట్టిరి. కొరతే లేదని సర్కారోల్లు అనబట్టిరి. అసలు మా దగ్గర పెట్రోలే లేదని...

ట్రంప్ మూర్ఖత్వానికి ప్రపంచం మూల్యం!|EDITORIAL

ప్రపంచంలో యుద్ధాలు కొత్తేమీ కావు. కానీ, ఆ యుద్ధాల పరిణామాలు, ప్రభావాలు తీవ్రం. ఈసారి యుద్ధం మొదలైన తీరే విచిత్రం. ఏకపక్షం. అగ్రరాజ్యం అమెరికా సామ్రాజ్యవాదానికి, ట్రంపు టెంపరితనానికి పరాకాష్ట. అయితే, అమెరికా–ఇరాన్...

27-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం శ్రీరామనవమి శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం తిధి నవమి మధ్యాహ్నం 12.22 వరకు ఉపరి దశమి నక్షత్రం పునర్వసు సాయంత్రం 05.34 వరకు ఉపరి పుష్యమి యోగం అతిగండ రాత్రి 12.08 వరకు ఉపరి సుకర్మ కరణం కౌలవ మధ్యాహ్నం...

గా దారం ఊసిపోదు! శార్జింగ్ వైరు తెగిపోదు!?|ADUGU TRENDS

ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం అన్నరు. ఇగిప్పుడైతే సెల్లే! ఎవల సేతుల సూసినా సెల్లే. పుస్తకానికి శెల్లు శీటీ రాసేసి, సెల్లుకు విల్లు రాసేసిండ్రు. మరి గా సెల్లు పోన్ల శార్జింగుంటేనే గది...

చమురు సంక్షోభమే సంస్కరణలకు సానుకూలం!|EDITORIAL

భారత్‌ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ఇంధన భద్రత ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని, సవాళ్లను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్‌ను అస్థిర పరుస్తున్నాయి. ఈ పరిణామాలు దిగుమతులపై...

26-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి అష్టమి పగలు 02.35 వరకు ఉపరి నవమి నక్షత్రం ఆరుద్ర రాత్రి 06.55 వరకు ఉపరి పునర్వసు యోగం సౌభాగ్య ఉదయం 05.55 వరకు ఉపరి శోభ కరణం బవ పగలు 02.35...

రైతంటే గీ ఇగురుమున్నాయినే పో!|ADUGU TRENDS

ఇప్పటోల్లకేమో గనీ, ఎన్కటోల్లకు, నడీడుకొచ్చినోల్లకు ఎడ్ల బండంటే తెలుత్తది. దాన్ని ఎక్కిన అనుభవం ఉంటది. ఎన్కటికి యాడికిపోయినా ఎడ్లబండ్లే. సైకిలుంటే మహా, స్కూటరు, సైకిలు మోటరుంటే ఓ మోతుబరి, ఇగ కారున్నోల్లు దొరలు,...

పునర్విభజన పార్టీలకు పండగే!|EDITORIAL

జనాభా ఆధారంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల స్థానాలను పునర్విభజించడం అనే ప్రక్రియ, ప్రజాప్రాతినిధ్యపు వ్యవస్థకు అవసరమైన సంస్కరణ కాగా, రాజకీయ ప్రయోజనాల పరంగానూ ఎంతో లాభదాయకం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా...

25-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి సప్తమి సాయంత్రం 04.44 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మృగశిర రాత్రి 08.30 వరకు ఉపరి ఆరుద్ర యోగం ఆయుష్మాన్ ఉదయం 09.00 వరకు ఉపరి సౌభాగ్య కరణం గరజి ఉదయం 06.05...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News