Saturday, March 28, 2026
35.2 C
Hyderabad

అడ్డూ అదుపు లేని ధరల దోపిడీ!

ఆహార పంటలు అధికంగా పండుతున్న అన్నపూర్ణ లాంటి దేశంలో అదే ఆహార ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. రకరకాల పరోక్ష పన్నుల స్థానంలో వస్తువులు మరియ సేవల (జీఎస్టీ) పన్ను విధానం అమలుతో గతంలో మినహాయింపు ఉన్న వస్తువులు సహా అన్ని రకాల వస్తువులపై పన్నులు అధికమయ్యాయి. దీనికి తోడు అడ్డూ అదుపు లేని పెట్రో, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదల, వీటిపై కేంద్రం, రాష్ట్రాలు వేర్వేరుగా వేస్తున్న పన్నులు తడిసి మోపెడు అవుతున్నాయి. అసలు ఒక పన్నుల పద్ధతే లేకుండాపోయింది. ఆదాయ సముపార్జనే ధ్యేయంగా ప్రభుత్వాలు పని చేస్తుండటం పేదల పాలిట శాపంగా మారింది. అధికారం కోసం నానా గడ్డీ కరిచే పార్టీలు, పాలకులు మొసలి కన్నీరు కారుస్తూ, ప్రజలకు మేలు కంటే కీడే ఎక్కువగా చేస్తున్నాయి.

నిజానికి ఏకీకృత పన్ను విధానం పేరుతో తీసుకుని వచ్చిన జీఎస్టీ ఇప్పుడు సామాన్యులకు గుదిబండగా మారింది. పాన్‌, ఆధార్‌ లింక్‌ కూడా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారనుంది. దీనికితోడు కనీసం చార్జీగా వేయి రూపాయలను వడ్డిస్తున్నారు. తాజాగా యూపిఎ చెల్లింపులపై ట్యాక్స్‌ విధించే ఆలోచన దుర్మార్గం కాక మరోటి కాదు. అప్పుడెప్పుడో తుగ్లక్ కాలంలో జుట్టు పన్ను కూడా విధించారు. ఇప్పుడు అదే తరహాలో పన్నులేని పని, వస్తువు, సేవలు లేకుండా పోయాయి. పన్నుల రూపంలో ప్రజలు ఇల్లు గుల్ల చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

అన్ని రకాల వస్తు సేవలపై ప్రభావం చూపే పెట్రో, డీజిల్, గ్యాస్‌, జిఎస్టీ ధరల పెరుగుదలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అంతర్జాతీయ చమురు ధరలు పెరిగిన ప్రతిసారీ, దేశీయంగా పెట్రో ధరలను పెంచి తీరాలన్న నియమమేమీ లేదు. కానీ అలా పెంచడం వల్ల ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వాలు చూస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్, గ్యాస్ లు ఇప్పుడు కేంద్రానికి ప్రధాన ఆదాయవనరుగా మారింది. పెట్రో ధరల పెంపు ప్రభుత్వం అనుసరించే ద్రవ్య వ్యూహాన్ని బట్టి ఉంటుంది. ఈ ద్రవ్య వ్యూహాన్ని ప్రభుత్వాలు ఎప్పటి కప్పుడు మార్చుకునే వీలున్నా, అందుకు విరుద్ధంగా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అంతర్జాతీయ చములు నిలువలు, ధరల సాకుతో పెట్రో ధరలను తమకు ఇష్టం లేకున్నా పెంచవలసి వస్తోందని వాపోవడం ప్రభుత్వాల దొంగనాటకానికి నిదర్శనం. పెట్రో ఉత్పత్తుల ధరల్లో సగానికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులకే పోతుంది. ఈ పన్నులకి, అంతర్జాతీయ చమురు ధరలకి సంబంధమే లేదు. అయినా ఆ పన్నులను పెంచుకుంటూ ప్రభుత్వాలే ప్రజల్ని దోచుకుంటున్నాయి. కేంద్రం తన ఆదాయాన్ని పెంచుకోవడానికి పెట్రో పన్నులు పెంచుతోంటే, రాష్ట్రాలు కూడా అదే దారిలో నడుస్తున్నాయి. జీఎస్టీ అమలులోకి వచ్చా పన్నుల్లో కేంద్రం గుత్తాధిపత్యం పెరిగి, రాష్ట్రాల పన్నుల వాటా తగ్గిపోయింది. దీంతో రాష్ట్రాలు తమ పరిమితమైన ఆదాయ వనరులను పెంచుకోవడానికి పన్నులకు ఎగపడుతున్నాయి. పైగా పెట్రో ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి రావు. అందుకే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు పెట్రో ఉత్పత్తుల విూద పన్నులు వసూలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యక్ష పన్నులు విధించే అధికారం లేనందువలన వాటికి వేరే దారి లేదు. కాని కేంద్ర ప్రభుత్వం వేరు. వేర్వేరు మార్గాల్లో అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయినా, కావాలనే కేంద్రం ఆ మార్గాలను ఉపయోగించడంలేదు.

సంపన్న వర్గాలే పెట్రో ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగిస్తాయి గనుక పెట్రో ఉత్పత్తుల విూద ధరలు పెరిగితే ఆ భారం పేదల మీద పడదనేది తప్పుడు వాదన. ఒకప్పటి సంగతేమో కానీ, ఇప్పుడు పెట్రో ఉత్పత్తులను అధికంగా వినియోగిస్తున్నది పేద మధ్య తరగతి వర్గాలే. నిజానికి పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగితే, రవాణా చార్జీలు, వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. ఇదంతా ఒకదానిపై ఒకటిగా ఆధారపడి ఉండే చైన్ సిస్టమ్. ఆహార ధాన్యాలను, నిత్యావసర సరుకులను ఎక్కువగా ఉపయోగించేది కూడా నిరుపేద, మధ్యతరగతి వారే. ఉన్నత, సంపన్న వర్గాలు ఉత్పత్తి చేసే వస్తువులపై పెరిగే ధరల ప్రభావం కూడా వాటిని వినియోగించే పేద మధ్య తరగతి మీదే భారంగా పరిణమిస్తున్నది. అంతిమంగా ధరలు పెరిగి వినియోగం తగ్గుతుంది. కొనుగోలు శక్తి తగ్గుతుంది. నిరుద్యోగిత పెరుగుతుంది. ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అంతా కలిసి ఆర్థిక సంక్షోభానికి ఆస్కారం ఏర్పడుతుంది.

ప్రభుత్వాలకు నిజాయితీ ఉంటే ప్రత్యామ్నాయ ద్రవ్య విధానాన్ని అమలు చేయాలి. అదికూడా ప్రజలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించాలి. అప్పుడే ప్రజలపై భారం తగ్గుతుంది. జీఎస్టీతో ప్రజలు అల్లాడుతున్నా, పన్నులు కట్టలేక చస్తున్నా, పెట్రోల్‌ ధరలతో దాడులు చేస్తున్నా, పట్టించుకోని, పైగా వాటిని పెంచుతున్న ప్రధాని మోడీ, రాష్ట్రాలు మాత్రం వ్యాట్‌ ను తగ్గించాలని సూచిస్తున్నారు. రాష్ట్రాలను విశ్వాసంలోకి తీసుకోకుండానే, ప్రజల్ని విస్మరించి మరీ మోడీ ప్రజలపై పన్నుల, ధరల భారం మోపుతున్నారు.

ఇక ధరల పెరుగుదల సామాన్యుల సొంతింటి కలను ఛిద్రం చేస్తున్నది. బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. ఇవి ప్రభుత్వ అజమాయిషీ లేని అంశాల జాబితాలోకి చేరిపోయాయి. ఆదాయాలు పెరగని ప్రజలు ధరల పెరుగుదలను భరించే స్థితిలో ఉంటారా? పాలకులు ఆలోచించాలి. ఇవే పన్నులు, జీఎస్టీ, అధికర ధరలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే, అదే పాలకులు తమ జీత భత్యాల పెంపుపై మాత్రం ఏకాభిప్రాయంతో ఉంటారు. సేవ పేరుతో రాజకీయాలు చేస్తూ, పదవుల పేరుతో రాజభోగాలు అనుభవిస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలను విస్మరిస్తున్నారు.

Latest News

దెబ్బకు సోఫా జిడ్డు సఫా!?|ADUGU TRENDS

ఎన్కటికి ఇండ్లల్ల నులక మంచాలు, ఎత్తు పీటలు, శెక్క బెంచీలు, కుర్సీలుంటే సాలయ్యేది. ఇగిప్పుడు గయన్నీ పోతానయి. ఇనుప, కేన్ కుర్సీలు, సోఫాలొచ్చె. గా సోఫాలకు లోపల మెత్తటి దూది.. గదేనుల్ల కుషన్,...

ద్రవ్యోల్బణ సవాళ్ళకు పరిష్కారాలివే!|EDITORIAL

ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువ పతనం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు...

28-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి దశమి ఉదయం 10.27 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.24 వరకు ఉపరి ఆశ్లేష యోగం సుకర్మ రాత్రి 09.35 వరకు ఉపరి ధృతి కరణం గరజి ఉదయం 10.28...

బంకులకి బాహు బలి!?|ADUGU TRENDS

వచ్చి రాని యుద్ధం వచ్చె. బొచ్చెడు కట్టాలు తెచ్చె. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబట్టె. నో స్టాకు బోర్డులు పెట్టబట్టిరి. కొరతే లేదని సర్కారోల్లు అనబట్టిరి. అసలు మా దగ్గర పెట్రోలే లేదని...

ట్రంప్ మూర్ఖత్వానికి ప్రపంచం మూల్యం!|EDITORIAL

ప్రపంచంలో యుద్ధాలు కొత్తేమీ కావు. కానీ, ఆ యుద్ధాల పరిణామాలు, ప్రభావాలు తీవ్రం. ఈసారి యుద్ధం మొదలైన తీరే విచిత్రం. ఏకపక్షం. అగ్రరాజ్యం అమెరికా సామ్రాజ్యవాదానికి, ట్రంపు టెంపరితనానికి పరాకాష్ట. అయితే, అమెరికా–ఇరాన్...

27-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం శ్రీరామనవమి శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం తిధి నవమి మధ్యాహ్నం 12.22 వరకు ఉపరి దశమి నక్షత్రం పునర్వసు సాయంత్రం 05.34 వరకు ఉపరి పుష్యమి యోగం అతిగండ రాత్రి 12.08 వరకు ఉపరి సుకర్మ కరణం కౌలవ మధ్యాహ్నం...

గా దారం ఊసిపోదు! శార్జింగ్ వైరు తెగిపోదు!?|ADUGU TRENDS

ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం అన్నరు. ఇగిప్పుడైతే సెల్లే! ఎవల సేతుల సూసినా సెల్లే. పుస్తకానికి శెల్లు శీటీ రాసేసి, సెల్లుకు విల్లు రాసేసిండ్రు. మరి గా సెల్లు పోన్ల శార్జింగుంటేనే గది...

చమురు సంక్షోభమే సంస్కరణలకు సానుకూలం!|EDITORIAL

భారత్‌ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ఇంధన భద్రత ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని, సవాళ్లను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్‌ను అస్థిర పరుస్తున్నాయి. ఈ పరిణామాలు దిగుమతులపై...

26-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి అష్టమి పగలు 02.35 వరకు ఉపరి నవమి నక్షత్రం ఆరుద్ర రాత్రి 06.55 వరకు ఉపరి పునర్వసు యోగం సౌభాగ్య ఉదయం 05.55 వరకు ఉపరి శోభ కరణం బవ పగలు 02.35...

రైతంటే గీ ఇగురుమున్నాయినే పో!|ADUGU TRENDS

ఇప్పటోల్లకేమో గనీ, ఎన్కటోల్లకు, నడీడుకొచ్చినోల్లకు ఎడ్ల బండంటే తెలుత్తది. దాన్ని ఎక్కిన అనుభవం ఉంటది. ఎన్కటికి యాడికిపోయినా ఎడ్లబండ్లే. సైకిలుంటే మహా, స్కూటరు, సైకిలు మోటరుంటే ఓ మోతుబరి, ఇగ కారున్నోల్లు దొరలు,...

పునర్విభజన పార్టీలకు పండగే!|EDITORIAL

జనాభా ఆధారంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల స్థానాలను పునర్విభజించడం అనే ప్రక్రియ, ప్రజాప్రాతినిధ్యపు వ్యవస్థకు అవసరమైన సంస్కరణ కాగా, రాజకీయ ప్రయోజనాల పరంగానూ ఎంతో లాభదాయకం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా...

25-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి సప్తమి సాయంత్రం 04.44 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మృగశిర రాత్రి 08.30 వరకు ఉపరి ఆరుద్ర యోగం ఆయుష్మాన్ ఉదయం 09.00 వరకు ఉపరి సౌభాగ్య కరణం గరజి ఉదయం 06.05...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News