Trending News
Tuesday, July 1, 2025
24.2 C
Hyderabad
Trending News

ట్రంపు సరే, మోడీ సుంకాల మాటేమిటి!?

వడ్డీరేట్లు, పన్నులు ప్రజలకు, వ్యాపారులకు, ఉద్యోగులకు, అన్ని వర్గాలకు అనువుగా ఉండాలి. వారు భరించేవిగా ఉండాలి. పన్నులు కూడా హేతుబద్దంగా ఉండాలి. విపరీతంగా పన్నులు, వడ్డీలు వసూలు చేస్తే ప్రజలు భరించలేరని గుర్తించాలి. స్వయం ఉపాధి పొందే వారికి, చవువుకునే వారికి ఉపయుక్తంగా ఉండాలి. డబ్బు వినిమయం, వస్తు కొనుగోళ్లకు అవినాభావ సంబంధం ఉంది. డబ్బు మార్కెట్లో చలామణి అవుతూనే వస్తూత్పత్తి ప్రజలకు చేరాలి. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగేలా పరపతి విధానం ఉండాలి. అలాగే పెట్రో ధరలు, గ్యాస్‌ ధరలు కూడా ప్రజల కొనుగోలు శక్తికి మించి ఉండరాదు. ఇవి వస్తువుల ధరలను కూడా నియంత్రిస్తుంటాయి. వీటి ధరల ఆధారంగానే మార్కెట్లో వస్తువుల ధరలు పెరుగుతాయి. వీటిని బ్యాలెన్స్‌ చేయడం ప్రభుత్వం నడిపిస్తున్న వారికి అవసరం. అదేపనిగా ఉచిత పథకాల కారణంగా సమాజంలో పనిచేసే వారి సంఖ్య తగ్గిపోతున్నది. తిని కూర్చునే వారు పెరుగుతున్నారు. దీంతో వస్తూత్పత్తి కూడా తగ్గుతుంది. ఇకపోతే ధర పెరిగినంత మాత్రాన పెట్రోలు, డీజిల్, గ్యాస్‌ వినియోగాన్ని తగ్గించలేం. కనుక వాటి కోసం మనం వెచ్చించే మొత్తం పెరిగింది. ఐతే కార్మికుల, ఉద్యోగుల వేతనాలు మొత్తం మాత్రం పెరగడంలేదు. దీంతో మనం ఇతర వస్తువుల వినియోగాన్ని తగ్గించివేస్తున్నాం. ఇతర సరుకుల వినియోగం ఎప్పుడైతే తగ్గిందో, ఆ మేరకు ఆయా రంగాలలో మాంద్యం ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి ప్రభుత్వం పూనుకోవాలి. కాని అలా జరగడం లేదు. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగినప్పుడల్లా వాటి విూద వసూలు చేసే పన్నుల మొత్తం కూడా పెరుగుతోంది. ప్రస్తుత సంక్షోభాన్ని నివారించాలంటే ప్రజల కొనుగోలు శక్తిని పెంచే మార్గాలు అన్వేషించాలి. ఉపాధికల్పన మార్గాలను అన్వేషించాలి. కనీసం పెట్రో ఉత్పత్తుల విూద పన్నులను పెంచడం తగ్గిస్తే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. అప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకోగలరు. అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్రో ధరల పెరుగుదల వలన అదనపు ఆదాయం సమకూరుతోంది. ఆవిధంగా వచ్చిన అదనపు ఆదాయాన్ని ఉపాధి కల్పన వంటి రంగాలకు ఖర్చు చేయడం బదులు, కార్పొరేట్లకు మరిన్ని రాయితీల్విడానికో, వారి బకాయిలను మాఫీ చేయడానికో వినియోగిస్తోంది. అలాగే మరిన్ని ఉచిత పథకాలకు వెచ్చిస్తున్నారు.

వాస్తవానికి మన దేశంలో పెట్రోలు ధరలో 45.5 శాతం, డీజిల్‌ ధరలో 39.8 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులకే పోతుంది. పన్ను రూపంలో వసూలు చేసే దానిలో కేంద్రం రాష్ట్రాలతో వాటా పంచుకోవాలి. అందుచేత మోడీ ప్రభుత్వం నేరుగా పన్ను రూపంలో కాకుండా స్పెషల్‌ డ్యూటీ, రోడ్‌ సెస్‌, ఇన్‌ఫ్రాస్టక్చ్రర్‌ సెస్‌ వంటి పేర్లతో వసూలు చేస్తోంది. తరచూ ఆర్ధిక మాంద్యం ఏర్పడడం వల్ల సరుకుల వినిమయం తగ్గిపోతుంది. అదే విధంగా ద్రవ్యోల్బణం పెరుగుతూ వుంటుంది. మన రూపాయి విలువ పడిపోయినా, సరుకుల ధరలు పెరిగినా అది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగం 8 శాతం దాటింది. వీటికి తోడు మన దేశ వార్షిక జిడిపి వృద్ధి రేటు ముందు అంచనా వేసినట్టుగా ఉండడం లేదని తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి.

ట్రంప్‌ విధానాలు, పాలస్తీనా,ఉక్రెయిన్‌ యుద్ధం ఆర్ధిక వ్యవస్థవిూద ప్రభావం చూపనున్నాయని అంటున్నారు. వృద్ధిరేటు తక్కువగా ఉండడం, ద్రవ్యోల్బణం అధికంగా ఉండడం, నిరుద్యోగం తీవ్రంగా ఉండడం నేటి ఆర్థి దుస్థితికి తాజా ఉదాహరణాలు. ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగాయి. ఐతే మార్కెట్ల విూద గుత్తాధిపత్యం కలిగివున్న బడా కార్పొరేట్లు ఆ పెరిగిన ధరలను వినియోగదారుల విూదకు నెట్టి వేస్తున్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడం వలన దాని ప్రభావం రవాణా రంగం విూద పడుతుంది. దాని కారణంగా ఇతర సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. ఇవన్నీ కలిసి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీని పర్యవసానంగా శ్రామిక ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. దాని వలన సరుకుల వినియోగం తగ్గిపోతుంది. మార్కెట్‌ లోని సరుకులు చెల్లుబాటు కావు. అందువలన ఆర్ధిక మాంద్యం ఏర్పడుతుంది.

మనదగ్గర పంటలు బాగానే పండుతున్నాయి. మిర్చి, పప్పు ధాన్యాలు విపరీతంగా పండుతున్నాయి. వరి లెక్కకు మించి పండిస్తున్నారు. అయితే ఈ ధరలు ప్రజలకు చేరడం లేదు. తాజాగా ఆక్వా రైతులు ట్రంప్‌ దెబ్బకు విలవిల్లాడుతున్నారు. చికెన్‌, మటన్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్నా ఆక్వా సామాన్యులకు అందుబాటు లోకి లేదు. దానిని ప్రజల చెంతకు తీసుకుని వెళ్లాల్సి ఉంది. ప్రజలకు మనదేశంలో లభిస్తున్న ఆహార ఉత్పత్తులు సరసమైన ధరలకు చేరాలి. ప్రధానంగా రొయ్యలను ఇంటింటికీ చేరుకునేలా చేయాలి. 140 కోట్లు జనాభా ఉన్న మన దేశంలో మాంసాహారులు కూడా ఎక్కువే. అమెరికా సుంకాలకు భయపడి కూర్చోకుండా ఆక్వాను ప్రజలకు అందించేలా ప్రణాళికలు చేయాలి. ట్రంపం సుంకాలను విమర్శిస్తున్న మనం మన వద్ద మోడీ సుంకాలను పట్టించుకోవడం లేదు. దేశం ఆర్థికంగా నిలదొక్కుకుని ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే జిఎస్టీ వడ్డింపులు భారీగా తగ్గాలి. ఉచిత పథకాలను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టాలి. తాయిలాలను పక్కన పెట్టాలి. కిలో రూపాయికే బియ్యం పథకానికి పాతరేయాలి. వడ్డీరేట్లు మరింతగా తగ్గాలి. విద్యార్థులు తీసుకునే విద్యారుణాలపై వడ్డీ నామ మాత్రంగా ఉండేలా చూడాలి.

ఇలా ఆలోచన చేసినప్పుడే, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది. సంపాదించింది తిండికి కూడా సరిపోకపోతే దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని పాలకులు, వారికి సలహాలు ఇస్తున్న మేధావులు గుర్తించాలి.
……ఎండ్.

Latest News

Two Months|రెండు నెలల క్రితం Love Marriage|ప్రేమ వివాహం..

Sigachi|సిగాచీ Pharma|ఫార్మా Accident|ప్రమాదంలో Couple|దంపతులు Death|దుర్మరణం Sangareddy|సంగారెడ్డి District|జిల్లా Pashamailaram|పాశమైలారంలోని సిగాచీ ఫార్మా పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదం అనేక Families|కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సోమవారం ఉదయం చోటుచేసుకున్న రియాక్టర్‌ పేలుడు కారణంగా ఇప్పటివరకు...

బాధిత కుటుంబాలకు రూ. కోటి|1 crore పరిహారం

future| భవిష్యత్‌లో నివారణ చర్యలు Pasha Mailaram| పాశమైలారం విషాదం‌పై సీఎం రేవంత్ రెడ్డి | CM REVANTH REDDY SANGAREDDY| సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని...

KONDA FAMILY|కొండా చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

DISCPLINE|క్రమశిక్షణ కమిటీకే తప్పుడు నివేదిక! అన్ని పార్టీలు మారింది ఆ కుటుంబమే ‘కొండ’పై NAINI|నాయిని ఇంట్లో సుదీర్ఘంగా చర్చించిన CONGRESS|కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వరంగల్, మే 30 (అడుగు న్యూస్): కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై తప్పుడు...

భస్మాసుర హస్తం!?|KONDA MURALI|WARANGAL

వివాదాల నుంచి మరిన్ని వివాదాల్లోకి... కోరి కష్టాలు తెచ్చుకుంటున్న KONDA| కొండా దంపతులు HAND| చే’జేతులా చెడగొట్టుకుంటున్న రాజకీయ జీవితాలు ఆమొన్న డబ్బులు తీసుకుంటారంటూ MINISTERS| మంత్రులపై వ్యాఖ్యలు మొన్న MLA| ఎమ్మెల్యేల రాజీనామాలకు హెచ్చరికలు నిన్న పార్టీ నేతలపై...

DOCTORS|వైద్యులు ప్రత్యక్ష దైవాలు!|EDITORIAL

ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన మన దేశంలో ‘డాక్టర్స్ డే’ జరుపుకుంటున్నాం. ఇది వృత్తిపరంగా వైద్యుల సేవలను స్మరించుకోవడమే గాకుండా, అత్యున్నత సేవలందించే వైద్యులకు కృతజ్ఞత తెలియజేసే అరుదైన సందర్భం కూడా....

మంగళవారం జూలై 01–2025| RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం కుమార షష్ఠి తిధి శు.షష్ఠి పగలు 12.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం పుబ్బ ఉదయం 11.13 వరకు ఉపరి ఉత్తర యోగం వ్యతీపాత రాత్రి 06.17 వరకు ఉపరి వరీయాన్ కరణం తైతుల పగలు...

Bjp| బీజేపీ bc| బీసీలకు opposite| వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది: minister| మంత్రి పొన్నం ప్రభాకర్|ponnam prabhakar

బీజేపీ మరోసారి బీసీ లకు అన్యాయం చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ముగ్గురు బీసీ ఎంపీలు, సీనియర్ నేతలు ఉన్నప్పటికీ, వారికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వలేదన్నారు. బీసీ నాయకుడి నామినేషన్‌ను...

మీకో దండం మీ పార్టీకో దండం

Bjp| బీజేపీకి Ghoshamahal| గోషామహల్ mla| ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా |resignation Leaders| నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి, Hinduism| హిందుత్వానికి తాను అంకితమంటూ లేఖ | letter గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా మూడు...

SANGAREDDY|సంగారెడ్డిలో ఘోర రసాయన ప్రమాదం|CHEMICAL ACCIDENT

10 MEMBERS DEATH| 10 మంది దుర్మరణం, పలువురి పరిస్థితి విషమం ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మున్సిపాలిటీలోని పాశమైలారంలో ఉన్న సీగాచి కెమికల్స్‌ పరిశ్రమలో సోమవారం ఉదయం...

Unexpected|ఊహించని Two States| ఇరు రాష్ట్రాల President|అధ్యక్షుల ఎంపిక|Selection

New| నూతన Presidents| అధ్యక్షులతో BJP| బీజేపీకి కలిసొచ్చేనా... Eatala Rajender| ఈటెలకు ఊహించని దెబ్బ అంటూ ... ప్రచారం Telangana| తెలంగాణ ఆధ్యక్షుడి ఎంపికలో AP CM| ఏపీ సీఎం MARK| మార్క్ ఉందంటూ......

సోమవారం జూన్ 30–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం స్కంధ పంచమి తిధి శు.పంచమి ఉదయం 11.39 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం మఖ ఉదయం 10.02 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది రాత్రి 06.42 వరకు ఉపరి వ్యతీపాత కరణం బాలవ పగలు...

VEDA SAI CHAND| సాయిచంద్ యాదిలో

అమరచింతలో SAI CHAND| సాయిచంద్ విగ్రహావిష్కరణ |STATUE INAGURATION కళా ఉద్యమ స్ఫూర్తికి ఘన నివాళి |TRIBUTE MAHABUBNAGAR| మహబూబ్ నగర్ జిల్లా అమరచింత గ్రామంలో తెలంగాణ ప్రజానాట్య పరిషత్తు నాయకుడు, ప్రఖ్యాత గాయకుడు, మాజీ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News