మణిపుర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్లకు బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుసుకున్న అనంతరం ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ భల్లాకు సమర్పించారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ బీరెన్ సింగ్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో, ఆయన ముందుగానే రాజీనామా చేయడం గమనార్హం.

