మచిలీపట్నం, హైదరాబాద్లో గ్రీన్కో ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో భాగస్వామిగా ఉన్న గ్రీన్కో సంస్థపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ప్రాజెక్టుల నిర్వహణ, నిధుల వినియోగంపై అనుమానాలు రావడంతో అధికారులు వివరాలను పరిశీలిస్తున్నారు. సంస్థ డాక్యుమెంట్లు, లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఏసీబీ బృందం, అవినీతికి సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు చర్యలు తీసుకుంటోంది.

