2025 నూతన సంవత్సరానికి సంబంధించి దేశంలోని ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజల సంక్షేమం కోసం తమ అంకితభావాన్ని వ్యక్త పరుస్తూ… కొత్త ఏడాది ప్రతి ఒక్కరికీ శాంతి, సంపద మరియు ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టాలని కోరుకున్నారు.

భారత రాష్ట్రపతి ద్రౌపది మూర్ము దేశ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ, “నూతన సంవత్సరం మనలో కొత్త ఆశలు, కొత్త సంకల్పాలను తీసుకురావాలని ఆశిస్తున్నాను. ఐక్యత, సహనంతో ముందుకు సాగుతూ మన దేశ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, “2025 సంవత్సరం ప్రతి ఒక్కరికీ విజయాలను తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. మన దేశం ఆర్థిక మరియు సాంకేతిక రంగాల్లో మరింత ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. ఈ ఏడాది మనకు సరికొత్త అవకాశాలు మరియు విజయాలను అందించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ట్విట్టర్ ద్వారా తన సందేశాన్ని వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, “మన దేశ ప్రజల శ్రేయస్సే నా ధ్యేయం. కొత్త సంవత్సరంలో ప్రజల సమస్యలపై మరింతగా కృషి చేస్తాం. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించే దిశగా ముందుకు సాగుతాం. ప్రభుత్వాన్ని సమస్యలపై ఎండగడుతాం” అని పేర్కొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, “తెలంగాణ ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు. మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు నిర్విరామంగా పనిచేస్తుంది. ఈ సంవత్సరం రైతులు, విద్యార్థులు మరియు యువతకు మరింత సపోర్ట్ అందిస్తాం” అని తెలియజేశారు.

డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ,”2025 నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబం సంతోషం, శాంతి, సమృద్ధితో వుండాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయడానికి మా పార్టీ & ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నాం” అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, “2025 నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబం సంతోషం, శాంతి, సమృద్ధితో వుండాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయడానికి మేము అహర్నిశలు కృషి చేస్తున్నాం” అని అన్నారు.

జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. “ప్రతి కుటుంబంలో శాంతి, సంతోషం అలలించాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిబద్ధంగా పని చేస్తానని” ఆయన పేర్కొన్నారు. 2025లో రాష్ట్రం కొత్త విజయాలను సాధించాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు.

BRS జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, BRS జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, “ఉద్యమ స్ఫూర్తితో, తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నాను. 2025లో తెలంగాణ కోసం మా ప్రణాళికలను మరింత బలంగా అమలు చేసి ప్రజల కొరకు పోరాడుతాం” అని తెలిపారు.

వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, “ప్రజల సంక్షేమమే మా ధ్యేయం. 2025లో వారి కోసం నిరంతరం పోరాడుతాం” అని పేర్కొన్నారు.

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పాలకుర్తి ఎంఎల్ఏ మామిడాల యశస్విని రాజారామ్మోహన్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. “2025 సంవత్సరం ప్రతి ఒక్కరికీ సంతోషం, ఆరోగ్యం, సమృద్ధిని తీసుకురావాలి. నియోజకవర్గ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను” అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి కూడా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. “ప్రజల సమస్యల పరిష్కారం కోసం మా కృషి కొనసాగుతుంది. ఈ సంవత్సరం ప్రజల ఆశయాలను నెరవేర్చే విధంగా పనిచేస్తాను” అని ఆమె తెలిపారు.

