రాజకీయ చదరంగంలో అధికారులు పావులా? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రతిష్టితమైనప్పటికీ, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు కొన్ని సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఈ సవాళ్ళు, ముఖ్యంగా రాజకీయ పార్టీల అధికార పోరాటాల మధ్య అధికారుల పాత్ర మరింత సంక్లిష్టంగా మారుతోంది. అధికారుల సమర్థతను, పారదర్శకతను, నిబద్ధతను నిర్లక్ష్యం చేయడం ప్రజాస్వామ్య విధానంలో సరైనది కాదు. ఇది రాజకీయ చదరంగంలో అధికారులను బలిపశువులా మార్చే పరిస్థితులను కల్పిస్తోంది. దీంతో ప్రజాస్వామ్య విలువలకు విఘాతం ఏర్పడుతోంది. టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ రాసిన వ్యాసం
రాజకీయ చదరంగంలో అధికారులు పావులా?
భారతదేశం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రతిష్టితమైనప్పటికీ, ప్రజాస్వామ్య వ్యవస్థకు కొన్ని సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఈ సవాళ్ళు, ముఖ్యంగా రాజకీయ పార్టీల అధికార పోరాటాల మధ్య అధికారుల పాత్ర మరింత సంక్లిష్టంగా మారుతోంది. అధికారుల సమర్థతను, పారదర్శకతను, నిబద్ధతను నిర్లక్ష్యం చేయడం ప్రజాస్వామ్య విధానంలో సరైనది కాదు. ఇది రాజకీయ చదరంగంలో అధికారులను బలిపశువులా మార్చే పరిస్థితులను కల్పిస్తోంది. దీంతో ప్రజాస్వామ్య విలువలకు విఘాతం ఏర్పడుతోంది.
భారతదేశం నాటి రాచరికాల నుంచి రూపాంతరం చెంది, ఇవాళ ప్రజాస్వామ్య పాలనలో విరాజిల్లుతోంది. ఈ వ్యవస్థలో ప్రజలే నిర్ణేతలుగా ఉన్నప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు తమ స్వార్థాల కోసం అధికారులను బలిపశువుల వలె మారుస్తున్న దుస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్యంలో పార్టీల ఆధిపత్య పోరు కారణంగా, రాజకీయ వత్తిళ్లకు గురవడం మాత్రమే కాకుండా, అధికారులపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వివక్ష కొనసాగుతోంది.
ప్రభుత్వంలోని ప్రతి అధికారికీ నిర్దిష్టమైన నియమాలు, నిబంధనలు ఉన్నాయి. అధికారులు తప్పు చేసినట్లయితే, వారికీ అవసరమైన శిక్షలు, తగిన శాఖాపరమైన చర్యలు తప్పకుండా ఉండాలి. అయితే, రాజకీయ తగాదాలు, స్వార్థపు ధోరణుతో అధికారులపై కక్ష సాధించడం అనేది ప్రభుత్వానికి పాలనకు మేలు చేకూర్చదు. రాజకీయ స్వార్థంతో అధికారులకు పోస్టింగులు కేటాయించడం, వారి పనితీరును నిర్లక్ష్యం చేయడం అనేది చివరకు రాజకీయ సంస్కృతినే దెబ్బతీస్తుంది. అధికారులకు పోస్టింగులు పారదర్శకంగా ఉండాలి. రాజకీయ కక్షలు, ప్రభావాలకతీతంగా అధికారులకు పోస్టింగులివ్వాలి. ఇలా జరిగితే, ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత శక్తివంతంగా పని చేస్తుంది.
ప్రస్తుత ప్రభుత్వ విధానంలో విభాగాల ఆధారంగా, ప్రాంతీయ భేదాలు లేదా సామాజిక వర్గాల దృష్టి కోణంలో అధికారులను నియమించడం ఎంతవరకు సరైనది? చాలా చోట్ల ఇది అవినీతికి, అక్రమాలకు దారితీస్తుంది. పోస్టింగులలో సమానత్వం, పారదర్శకత అవసరం. స్వేచ్ఛ, సమానత్వం పాటిస్తేనే అధికారులు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా మారుతారు.
ప్రజల పన్నులు, ప్రజల శ్రమ మీద ఆధారపడి ప్రభుత్వాలు నడుస్తాయి. సమానత, సామాజిక, ప్రాంతీయ న్యాయాలు పాటించపోతే తిరుగుబాట్లు మొదలవుతాయి. ఇవి మాటలతో కాకుండా, కఠినమైన, ప్రజాస్వామ్య పద్ధతుల అమలుతోనే సాధ్యం.
రాజకీయ నాయకులు, అధికారులు ప్రజల కోసం కట్టుబడి పనిచేస్తూ, స్వార్థం లేకుండా ప్రభుత్వ విధానాలు అమలు చేస్తే, ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత శక్తివంతంగా మారుతింది. పోస్టింగులు, అధికారుల నియామకాలు పారదర్శకంగా, న్యాయపరంగా సాగితే, ప్రజాస్వామ్యలో మనం కోరుకున్న సమతుల్యత సాధ్యమవుతుంది.

– బండి సుధాకర్ గౌడ్
టీపీసీసీ అధికార ప్రతినిధి, 99123 71755

