Tuesday, March 24, 2026
33.2 C
Hyderabad

ఆట విడుపుగా సీఈసీ అభిశంసన!?|EDITORIAL

ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ సంస్థల పాత్ర అత్యంత కీలకం. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాత ధోరణి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే ప్రధాన ఆధారం. ఇటీవలి పరిణామాల్లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల పరిశీలన (సర్) ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాల నుండి భారీగా పేర్లు తొలగింపు జరిగింది. దీంతో సర్ పై రాజకీయ వర్గాల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తరుణంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌పై అభిశంసన నోటీసులు ఇవ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై ప్రతిపక్షాలు మార్చి 13న పార్లమెంట్ ఉభయ సభల్లో అభిశంసన తీర్మానానికి నోటీసులు ఇచ్చాయి. ప్రత్యేక ఓటర్ల సవరణలో సీఈసీ అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారని, ప్రతిపక్షాలపై పక్షపాత ధోరణి ప్రదర్శించారని ఆరోపించాయి. 193 మంది ఎంపీలు ఈ నోటీసుపై సంతకాలు చేశారు. ఆర్టికల్ 324(5) ప్రకారం, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానంలోనే సీఈసీని అభిశంసించవచ్చు. అయితే, ఈ నోటీసులను లోకసభలో స్పీకర్, రాజ్యసభలో చైర్మన్ పరిశీలించి, అనుమతించాల్సి ఉంటుంది. అయితే, పార్లమెంట్ చరిత్రలో సీఈసీపై అభిశంసన తీర్మానం రావడం ఇదే మొదటిసారి.

త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 1 కోటి 40 లక్షల ఓటర్ల పేర్లు జాబితాల నుండి తొలగించబడినట్టు అంచనా. ఒక్క పశ్చిమ బెంగాల్‌లోనే 60 లక్షలకు పైగా ఓట్లు తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు, 17.4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇలా విస్తృత స్థాయిలో ఓటర్ల జాబితా సవరణలు సహజంగానే అనుమానాలకు తావిస్తాయి.

ఆశ్చర్యకరంగా ఓటు తొలగింపులపై ప్రజల నుంచి పెద్దగా ఫిర్యాదులు రాకపోవడం విచిత్రం. సాధారణంగా ఒకరి ఓటు తొలగిస్తే, దానికి తగిన ప్రతిస్పందన వెంటనే వెలువడుతుంది. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపించకపోవడం ఈ ప్రక్రియపై అధికార వర్గాల వాదనకు బలం చేకూరుస్తోంది. మరోవైపు, ప్రతిపక్షాలు మాత్రం ఈ చర్యలను తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

ప్రధానంగా పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ సర్ పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమకు అనుకూల ఓటర్ల తొలగింపే లక్ష్యంగా తొలగింపులు జరిగాయని వారు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలకు బలమైన ఆధారాలు సమర్పించడంలో వారు ఇప్పటి విఫలమవుతూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. అభిశంసన అసాధారణ రాజ్యాంగ ప్రక్రియ. రాజ్యాంగ ఉన్నత హోదాలో ఉన్న సీఈసీ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేదని నిరూపితమైతేనే తీర్మానం ఆమోదం పొందుతుంది. పైగా, పార్లమెంట్‌లో తగిన మెజారిటీ అవసరం కావడం వల్ల ఈ తీర్మాణం వీగిపోయే అవకాశాలే ఎక్కువ.

భారత ఎన్నికల సంఘం స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థ. అది అధికారంలో ఉన్న పార్టీకి కాకుండా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. అలాంటి సంస్థపై అభిశంసన నోటీసులు ఇవ్వడం అంటే, ఆ సంస్థ నిష్పాక్షికతపై అనుమానాలు రేకెత్తడమన్నమాట. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదేనా? ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసమేనా? అన్నది ఆలోచించాల్సిన అంశం.

అయితే, ఎన్నికల సంఘం మాత్రం తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. “ఒక్క అర్హత కలిగిన ఓటరు కూడా తన ఓటు హక్కు కోల్పోకుండా చూసుకున్నాం. అలాగే ఒక్క అనర్హుడూ ఓటు వేయకుండా నిరోధించాం.” అని స్పష్టం చేసింది. ఇక దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అప్పీలేట్ ట్రిబ్యునళ్లు రోజుకు లక్ష ఫిర్యాదులను పరిష్కరిస్తున్నాయని సీఈసీ వివరిస్తోంది.

పశ్చిమ బెంగాల్‌లో చీఫ్ సెక్రెటరీని తొలగించడం, డీజీపిని బదిలీ చేయడం వంటి చర్యలను ఎన్నికల సంఘం తీసుకుంది. ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతాన్ని నిరూపించే చర్యగా చెప్పుకుంటున్నా, ఇది రాజకీయంగా మరింత వివాదాస్పదంగా మారింది.

ఎన్నికల సమయంలో కుల, మత, ప్రాంతీయ రాజకీయాలు ప్రబలడం కొత్తేమీ కాదు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాలను తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ వంటి చర్యలు ఎన్నికల ఫలితాలపై ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయన్నది ఆసక్తిగా మారింది.

అభిశంసన ప్రయత్నం విజయవంతమవుతుందా? ప్రస్తుత రాజకీయ సమీకరణాలు, పార్లమెంట్ లో పార్టీల బలాబలాలను బట్టి చూస్తే, అది కష్టమేనని చెప్పాలి. అధికార పక్షానికి ఆధిక్యమే దీనికి ప్రధాన కారణం. అందువల్ల ఇది రాజకీయ ఒత్తిడికి గురిచేసే ప్రక్రియగానే మిగిలే అవకాశం ఉంది.

భారత రాజ్యాంగం ప్రకారం అభిశంసన శక్తివంతమైన తొలగింపు సాధనం. ఆయుధం. అయితే, అది బాధ్యతాయుతంగా, విజయవంతంగానే ఉపయోగించాలి. లేకపోతే అది రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఎన్నికలు సమర్థవంతంగా, నిష్పక్షపాతంగా జరగడం ప్రజాస్వామ్యానికి ఆవశ్యం. అందువల్ల ఈ అభిశంసన వ్యవహారంలో అన్ని పార్టీలు బాధ్యతతో వ్యవహరించడం అత్యవసరం.

Latest News

ఇంట్లనే గోడ సిన్మా!?|ADUGU TRENDS

ఎన్కటికి గోడ సిన్మా, గా తర్వాత తడకల టాకీసుల్ల తెర సిన్మా, ఇగ థియేటర్లల్ల సిన్మా గిట్ల సిన్మాలు గూడ మారుతూ వత్తానయి. గట్లనే ప్రొజెక్టర్లను పెట్టి సిన్మాలు, డాక్యుమెంటరీలు, న్యూస్ రీల్లు,...

క్షయ రహిత భారత్ : సామాజిక బాధ్యత!|EDITORIAL

వైద్యశాస్త్రం ఎంతో పురోగమించినా, ప్రాణాంతక వ్యాధులకు సైతం చికిత్సలు అందుబాటులోకి వచ్చినా, 'క్షయ'-టీబీ వ్యాధి మాత్రం ఇప్పటికీ ప్రపంచాన్ని, ముఖ్యంగా భారతదేశాన్ని వణికిస్తూనే ఉంది. గణాంకాలను పరిశీలిస్తే గుండె గుబేల్ మంటుంది. ప్రపంచవ్యాప్తంగా...

24-03-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి షష్టి రాత్రి 07.19 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రోహిణి రాత్రి 10.11 వరకు ఉపరి మృగశిర యోగం ప్రీతి పగలు 12.11 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం కౌలవ ఉదయం 08.30...

23-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి పంచమి రాత్రి 09.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం కృత్తిక రాత్రి 11.50 వరకు ఉపరి రోహిణి యోగం విస్కంబ పగలు 03.15 వరకు ఉపరి ప్రీతి కరణం బవ ఉదయం 10.51...

గ్యాస్ సిలిండరే కట్టెల పొయ్యి!?|ADUGU TRENDS

అంతా గ్యాసే! ఇంటింటా, వంటింటా.. ఓటల్లు, పంక్చన్ హాల్లు.. ఏడ సూసినా గ్యాసే. ఇగిప్పుడు గా యుద్ధం సేయబట్టి, గా గ్యాస్ కు కొరతొచ్చె. మరి గ్యాస్ లేకపోతే ఎల్లదాయె. ఇగ కట్టెల...

ఆర్థిక నియంత్రణ, క్రమశిక్షణే అసలైన సవాళ్ళు!?|EDITORIAL

ప్రస్తుత బడ్జెట్‌లో సంక్షేమం–అభివృద్ధి మధ్య బ్యాలెన్స్ తప్పినట్లు కనిపిస్తోంది. రుణాలపై అధికంగా ఆధారపడటం, ఆదాయ అంచనాల్లో అనిశ్చితి, వ్యయ నియంత్రణలో నిర్లక్ష్యం వంటి అంశాలు దీర్ఘకాలిక ఆర్థిక ఆరోగ్యానికి సవాళ్ళుగా మారవచ్చు. ఉచిత...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మార్చి 22 నుండి మార్చి 28 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కొత్త పనులు చేపట్టే ధైర్యం వస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న విషయాలపై చర్చలు...

తీపి రోగమున్నోల్లకు తీపి వార్త!?|ADUGU TRENDS

మధుమేహం, శెక్కెర, షుగర్ పేరేదైనా గదే తీపి రోగం. గా తీపి రోగానికి మందుల్లేక, అదుపు శేయడం అలివిగాక, శానా మంది యమ యాతన పడుతున్నరు. 2022 నాటికే గీ భూమ్మీద 83...

21-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి తదియ రాత్రి 02.09 వరకు ఉపరి చవితి నక్షత్రం అశ్విని రాత్రి 02.51 వరకు ఉపరి భరణి యోగం ఐంద్ర రాత్రి 09.07 వరకు ఉపరి వైధృతి కరణం తైతుల పగలు 03.06...

తెలంగాణ బడ్జెట్ 2026-27:సమగ్ర విశ్లేషణ|TELANGANA|BUDGET|ANALYSIS

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ కేవలం అంకెల సమాహారం మాత్రమే కాదని, ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ఒక సంకల్ప పత్రమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత...

తెలంగాణ బడ్జెట్:సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రూ. 3.24 లక్షల కోట్లు|TELANGANA|BUDGET

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. "ప్రజల ప్రయోజనాలే...

20-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి విదియ రాత్రి తెల్ల 04.03 వరకు ఉపరి తదియ నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.02 వరకు ఉపరి అశ్విని యోగం బ్రహ్మ రాత్రి 11.45 వరకు ఉపరి ఐంద్ర కరణం బాలవ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News