Saturday, March 14, 2026
36.1 C
Hyderabad

‘జల్ జీవన్ మిషన్’ తో నీటి సమస్యలు సమసేనా!?|EDITORIAL

నీటి సమస్య వనరుల లభ్యత, వినియోగ విధానం, దుర్వినియోగం, సమర్థవంతమైన నిర్వహణలపై ఆధారపడింది. గ్రామీణ భారతావనికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’ ను దేశవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ పథకం వల్ల దేశంలో నీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అయ్యాయా? అవుతున్నాయా? ఆ ‘మిషన్’ క‘న్నీటి’ని తుడిచేనా? నీటి సమస్యలు సమసేనా!?

నీటి సమస్య వనరుల లభ్యత, వినియోగ విధానం, దుర్వినియోగం, సమర్థవంతమైన నిర్వహణలపై ఆధారపడింది. గ్రామీణ భారతావనికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’ ను దేశవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ పథకం వల్ల దేశంలో నీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అయ్యాయా? అవుతున్నాయా? ఆ ‘మిషన్’ క‘న్నీటి’ని తుడిచేనా? నీటి సమస్యలు సమసేనా!?

2019 ఆగస్టు 15న ప్రకటించిన జల్ జీవన్ మిషన్ ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి రోజుకు కనీసం 55 లీటర్ల తాగునీటిని పైప్ లైన్ ద్వారా అందించడం. ఈ పథకం ప్రారంభానికి ముందు దేశంలోని 19 కోట్ల గ్రామీణ కుటుంబాల్లో, కేవలం 3 కోట్ల కుటుంబాలకు మాత్రమే నల్లాలు ఉండేవి. అంటే కేవలం 17% కుటుంబాలకే మంచినీరు నేరుగా ఇంటికి చేరేది. కానీ, గత కొన్ని ఏళ్ళల్లో ఈ పథకం వేగంగా అమలవడం వల్ల 2026 నాటికి 15 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలకు నల్లాల ద్వారా నీరు అందుతోంది. ఇది గ్రామీణ జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలకమైన అంశం. మహిళలు రోజూ గంటల తరబడి నీరు తెచ్చే కష్టాలు తగ్గడం, గ్రామాల్లో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడడం వంటి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి.

అయితే, ఈ సానుకూల విజయాల మధ్య దేశంలో నీటి వనరుల వాస్తవ పరిస్థితి ప్రతికూలంగానే గాక, ఆందోళనకరంగా ఉంది. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలోనే నివసిస్తుంటే, ప్రపంచ నీటి వనరుల్లో దేశానికి కేవలం 4% మాత్రమే ఉన్నాయి. దేశంలో ఉపయోగించదగిన మొత్తం నీటి వనరులు 1,123 బిలియన్ క్యూబిక్ మీటర్లు మాత్రమే. ఇందులో ఉపరితల జలాలు 690 బిలియన్ క్యూబిక్ మీటర్లు కాగా, భూగర్భ జలాలు 433 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా నమోదయ్యాయి.

ఇక దేశంలో ఉపయోగించే నీటిలో సుమారు 80% వ్యవసాయ రంగానికే వెళ్తోంది. గృహ వినియోగం 6% మాత్రమే కాగా, పరిశ్రమలు 5% నీటిని వినియోగిస్తున్నాయి. అంటే నీటి వినియోగంలో వ్యవసాయ రంగం ప్రధాన పాత్ర పోషిస్తోంది. వరి, చెరకు వంటి అధిక నీరు అవసరమయ్యే పంటలు పెద్ద మొత్తంలో నీటిని వినియోగిస్తున్నాయి.

భూగర్భ జలాల వినియోగంలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశంలో తాగునీటి అవసరాల్లో 85%, సాగునీటిలో 60% వరకు భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉన్నాయి. అయితే, అధికంగా బోర్లు తవ్వడం, నిరంతరంగా నీటిని పంపింగ్ చేయడం వల్ల అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి అడుగంటి పోతున్నాయి. కేంద్ర గణాంకాల ప్రకారం దేశంలోని 700కి పైగా ప్రాంతాలు ‘ఓవర్ ఎక్స్ ప్లోయిటెడ్’ స్థితికి చేరాయి.

నీటి లభ్యతలో గత కొన్ని దశాబ్దాల్లో పెద్ద మార్పు వచ్చింది. 1951లో ప్రతి వ్యక్తికి ఏడాదికి 5,200 క్యూబిక్ మీటర్ల నీరు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం అది 1,500 క్యూబిక్ మీటర్ల కంటే తక్కువకు పడిపోయింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం దీన్ని ‘వాటర్ స్ట్రెస్’ పరిస్థితిగా పరిగణిస్తున్నారు. జనాభా పెరుగుదల, నగరీకరణ, పరిశ్రమల విస్తరణ వంటి కారణాల వల్ల భవిష్యత్తులో ఈ ఒత్తిడి మరింత పెరగే అవకాశం ఉంది.

దక్షిణ భారత రాష్ట్రాల్లో కూడా నీటి ఒత్తిడి అధికంగానే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యవసాయ అవసరాల కోసం భూగర్భ జలాల వినియోగం అధికంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం భూగర్భ జల వినియోగంలో 86% వ్యవసాయానికే వెళ్తోంది. తెలంగాణలో కూడా రైతులలో ఎక్కువ శాతం మంది భవిష్యత్తులో నీటి లభ్యతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో నీటి సంక్షోభానికి ప్రధాన కారణాలు అనేకం ఉన్నాయి. సంప్రదాయ వరద సాగు పద్ధతులు భారీగా నీటిని వృథా చేస్తున్నాయి. నగరాల్లో మురుగు నీరు, పరిశ్రమల వ్యర్థాలు, నదులు, చెరువులను కాలుష్యానికి గురిచేస్తున్నాయి. చెరువులు, సరస్సులు ఆక్రమణలకు గురవడం వల్ల సహజ నీటి నిల్వ వ్యవస్థలు బలహీనపడ్డాయి. అంతేకాకుండా వర్షపు నీటిని సేకరించే, నిలువ చేసే పద్ధతులు చాలా ప్రాంతాల్లో సరైన స్థాయిలో అమలు కావడం లేదు.

ఈ నేపథ్యంలో జల్ జీవన్ మిషన్ ప్రధానంగా నీటి సరఫరా మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టిన పథకం మాత్రమే. పైప్‌లైన్లు వేయడం ద్వారా నీటిని ఇంటికి చేరవేయడం సాధ్యమే కానీ, నీటి వనరులు తగ్గిపోతే సరఫరా వ్యవస్థలు కూడా పనిచేయలేవు. కొన్ని ప్రాంతాల్లో వేసవికాలంలో ఈ సమస్య తీవ్రత ప్రస్ఫుటమవుతోంది.

దేశంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే సమగ్ర నీటి నిర్వహణ అవసరం. వర్షపు నీటి సంరక్షణను ప్రోత్సహించడం, డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సాగు పద్ధతులను విస్తరించడం, తక్కువ నీరు అవసరమయ్యే పంటలను ప్రోత్సహించడం, చెరువులు, రిజర్వాయర్లను పునరుద్ధరించడం వంటి చర్యలు కీలకం. ప్రజలలో నీటి వినియోగంపై అవగాహన పెంచడం కూడా అంతే ముఖ్యమైన అంశం.

జల్ జీవన్ మిషన్ గ్రామీణ భారతానికి తాగునీటి అందుబాటును పెంచడంలో గొప్ప ముందడుగు. కానీ. అది నీటి సంక్షోభానికి పూర్తి పరిష్కారం మాత్రం కాదు. నీటి సంరక్షణ, సమర్థ వినియోగం, సమగ్ర విధానాలు సమన్వయం చేసి అమలు చేసినప్పుడే భారతదేశం భవిష్యత్తులో నీటి భద్రతను సాధించగలదు. నీటిని కేవలం వనరుగా కాకుండా జీవనాధారంగా భావించి పరిరక్షించే సంస్కృతి ఏర్పడితేనే ఈ సంక్షోభానికి దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుంది.

Latest News

ఈవీలేవీ? ఈవీలపై క్లారిటీలేవీ?|EV|TELANGANA|CM|GOVERNMENT

మొన్న సీఎం|CM|REVANTH REDDY, నిన్న డిప్యూటీ సీఎం|DEPUTY CM|BHATTI VIKRAMARKA MALLU ప్రకటనల సారాంశమేంటి?|SUMMARY ప్రస్తుత వాహనాలనేం చేస్తారు?|OLD VEHICLES కొత్తవి సరే, పాతవాటి పరిస్థితేంటి? ఇప్పటికే తుప్పుపట్టిన వాహనాల సంగతేంటి? ఇం‘ధన’ ఖర్చు తగ్గించడానికి వేల కోట్ల వ్యయమా? ఉన్న...

ఎలుకలు రాకుండ అదిరే శిట్కా!?|ADUGU TRENDS

ఎలుక సొర్రిందని ఇల్లు తగుల బెట్టుకుంటమా? ఏంది? యెట్లన్న శేసి గా ఎలుకను బయిటికి తోలుతం. ఇల్లును మాత్రం మంచిగ కాపాడుకుంటం. మరైతే ఇంట్లకు ఎలుకలు రాకుండ ఏం శేయాల్నో, ఎట్లెట్ల శేయాల్నో...

రాహుల్ పరిపక్వ విపక్ష నేతేనా!?|EDITORIAL

భారత రాజకీయాల్లో విపక్ష నాయకత్వం ఎప్పుడూ ప్రజాస్వామ్య పరిరక్షణకు అత్యంత కీలకం. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విధానాలను సమీక్షించడం, ప్రత్యామ్నాయ మార్గాలను చూపడం, అవసరమైన సూచనలు చేయడం, తద్వారా ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడం విపక్షం...

14-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి ఏకాదశి పూర్తిగ రోజంత నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 02.53 వరకు ఉపరి శ్రవణ యోగం వరీయాన్ ఉదయం 09.01 వరకు ఉపరి పరిఘ కరణం బవ సాయంత్రం 06.24 వరకు ఉపరి బాలవ రాహుకాలం...

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

‘పునర్జన్మ’ ప్రాప్తి…! జీవ ‘కారుణ్య’ విముక్తి!!|ADUGU|SPECIAL STORY

-‘బ్రెయిన్ డెడ్’ కు ‘కామా’, ‘కోమా’కు ‘ఫుల్ స్టాప్’!!!|BRAIN DEAD|COMA జీవితం విచిత్రం. పుట్టుక వరమైతే, మరణం శాపం. అనివార్యం. ఇందుకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. బ్రెయిన్ ‘డెడ్’ అయిన మహిళ, ఒక్క...

రూపాయికే బూట్లు!?|ADUGU TRENDS

శిత్తం శివుని మీద.. భక్తి శెప్పుల మీద అన్నరు. గీ సామెతను చపల చిత్తానికి వాడినప్పటికీ, పాదరచ్చలు... మన ఆరోగ్యానికి కూడా రచ్చణే! గందుకే గవాటిని మనం యేసుకుంటం. ఇగ బూట్లైతే పాదాలకు...

12-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి నవమి రాత్రి తెల్ల 04.10 వరకు ఉపరి దశమి నక్షత్రం మూల రాత్రి 10.51 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ది ఉదయం 08.20 వరకు ఉపరి వ్యతీపాత కరణం తైతుల పగలు...

ప్లాస్టిక్ ఇటికెలతోటి ఇల్లు!?|ADUGU TRENDS

గీ అన్న ఇకమతు సూత్తే, బుర్ర గిర్రున తిరుగుతది. ఇగిప్పుడు అంతా ప్లాస్టిక్ మయమే అయింది. పుట్టిన కానుండి, గిట్టేదాక, గా ప్లాస్టిక్ లేకుండ పనైతలేదు. ఎంత ముప్పని శెప్పినా, నీల్ల కానుంచి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News