Trending News
Friday, March 6, 2026
35.9 C
Hyderabad
Trending News

స్వయం సమృద్ధే ఈ సంక్షోభానికి విరుగుడు!|EDITORIAL

వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉండనుంది.

భారత్ తన ముడి చమురు అవసరాల్లో 85% దిగుమతులపైనే ఆధారపడుతోంది. హార్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో 20% రవాణా జరుగుతుంది. ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో ఇరాన్ ఈ చమురు రావాణా మార్గాన్ని మూసివేసింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు కొరత ఏర్పడి, ధరలు అమాంతం పెరుగనున్నాయి. తద్వారా పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు కూడా పెరుగుతాయి. దాంతో రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసరాల ధరలు కూడా ఎగబాకడం అనివార్యం.

చమురు ధరల పెరుగుదలతో వాణిజ్య లోటు పెరుగుతుంది. ఇప్పటికే దిగుమతులు ఎక్కువగా, ఎగుమతులు తక్కువగా ఉన్న నేపథ్యంలో డాలర్ డిమాండ్ పెరిగి రూపాయి విలువ పడిపోతుంది. రూపాయి బలహీనపడితే దిగుమతుల ఖర్చు మరింత పెరుగుతుంది. ఇది ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచే దుష్ప్రభావం కలిగిస్తుంది. ద్రవ్యోల్బణం 6 శాతానికి మించి పెరిగితే సామాన్యుల జీవన వ్యయం గణనీయంగా పెరుగుతుంది.

భారత్ ప్రతి ఏడాది 5–6 మిలియన్ టన్నుల కందిపప్పు, పెసరపప్పు వంటి పప్పుదినుసులను మయన్మార్, కెనడా, ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అలాగే సోయా ఆయిల్‌ను అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా నుంచి, సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ఉక్రెయిన్, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ సరుకులు ఎక్కువగా సూయెజ్ కాలువ, హార్ముజ్ జలసంధి మార్గాల ద్వారా వస్తాయి. ఈ మార్గాల్లో అంతరాయం కలిగితే నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దాంతో రవాణా, బీమా ఖర్చులు పెరిగి చివరకు వినియోగదారులపై భారమవుతుంది. అలాగే జీడిపప్పు, పిస్తా, ఎండు ద్రాక్ష, ఆప్రికాట్ వంటి డ్రైఫ్రూట్స్ దిగుమతులు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. సరఫరా తగ్గితే ధరలు పెరగడం ఖాయం. ఇది మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం వేస్తుంది.

మన దేశ జనాభా 147 కోట్లకు చేరుకుంది. వివిధ నివేదికల ప్రకారం ఇప్పటికీ 28% మంది పేదరికంలో జీవిస్తున్నారు. దేశ సంపదలో సగానికి మించి, కేవలం 10% మంది ధనవంతుల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ధరల పెరుగుదల పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాలను మరింత కష్టాల్లోకి నెడుతుంది.

వ్యవసాయ రంగం బలహీనపడటం, నిరుద్యోగం పెరగడం, విద్యా–వైద్య సేవలు ఖరీదైనవిగా మారడం వంటి అంశాలు ఇప్పటికే సామాజిక ఒత్తిడిని పెంచుతున్నాయి. యుద్ధ ప్రభావంతో ద్రవ్యోల్బణంతో, జీవన వ్యయం పెరగడం వల్ల అప్పుల భారమూ అధికమవుతుంది. ఇది ఆత్మహత్యలు, సామాజిక అస్థిరత వంటి సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది.

మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? చమురు దిగుమతులను తగ్గించుకుంటూ, ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహించాలి. పప్పుదినుసులు, నూనె గింజల ఉత్పత్తిని దేశీయంగా పెంచాలి. రైతులకు కనీస మద్దతు ధర, నిల్వ సదుపాయాలు, ప్రాసెసింగ్ యూనిట్లు కల్పించాలి. కీలక దిగుమతులపై సమయానుకూల నియంత్రణలు విధించి దేశీయ ఉత్పత్తిదారులను రక్షించాలి. పేదల కోసం నేరుగా నగదు బదిలీలు, ఆహార భద్రత పథకాలు బలోపేతం చేయాలి.

యుద్ధాలు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు కలిగించినా, వాటి ప్రభావాలు దీర్ఘకాలికంగా తీవ్రం. ప్రపంచీకరణ యుగంలో ఒక చోట సంక్షోభం మొత్తం ప్రపంచాన్ని తక్షణమే ప్రభావితం చేస్తుంది. కాబట్టి భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయాలి. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయ ఉత్పత్తి, వినియోగాన్ని పెంచుకోవాలి.

సమయోచిత విధానాలు అమలు చేస్తే దాని ప్రభావాన్ని నియంత్రించడమే కాదు తగ్గించుకోవడం కూడా సాధ్యమే. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ఆర్థిక సంస్కరణలకు పూనుకుంటేనే దేశం దీర్ఘకాలికంగా ఆర్థికంగా బలపడుతుంది.

Latest News

పురుగుల బెడదకు.. బెల్లం పానకం శిట్కా!?|ADUGU TRENDS

పంటలకు పట్టే పురుగులు రైతులకు శాపంగ మారుతానయి. ఇగ గవాటిని సంపడానికి పురుగుల మందులు కొట్టాలె. కర్సు బాగైతది. మల్ల గా మందులతోటి పురుగులు సత్తలేవు. పంటల దిగుబడొత్తలేదు. ఎరువులు, పురుగుల మందులెక్కువై...

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు...

06-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి తదియ సాయంత్రం 05.20 వరకు ఉపరి చవితి నక్షత్రం హస్త ఉదయం 09.15 వరకు ఉపరి చిత్త యోగం గండ ఉదయం 07.05 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర సాయంత్రం 05.22...

ఓలి రంగుల్లెక్క మెరపకాయెల రాసులు!?|ADUGU TRENDS

మెరపకాయెను కూడ కూరగాయల్లెక్కనే పండిత్తరు. మనం తినే బువ్వకు కారం, రుసిని ఇత్తది. గిదీన్ని మన తెలంగాణ, ఏపీల్నే గదేనుల్ల.. గుంటూరు, వరంగల్ ల ఇరగమరగ పండిత్తరు. గీ మెరపకాయెల ఉండే 'క్యాప్సైసిన్'...

05-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఉత్తర ఉదయం 08.11 వరకు ఉపరి హస్త యోగం శుల ఉదయం 07.49 వరకు ఉపరి గండ కరణం గరజి సాయంత్రం 04.39...

బర్నర్ల మురికిని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

మన ఆడోల్లు ఎంత ఇకమతులు పడ్డా అరవై పది దినాలకు గా గ్యాస్ స్టౌ బర్నర్లు మురికి పడతనే ఉంటయి. గ వాటిని కడగాల్నంటే మస్తు తిప్పలైతది. అల్కగ గా బర్నర్ల మురికిని...

హార్ముజ్ జలసంధి ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!|EDITORIAL

ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు...

04-03-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి సాయంత్రం 04.29 వరకు ఉపరి విదియ నక్షత్రం పుబ్బ ఉదయం 07.30 వరకు ఉపరి ఉత్తర యోగం ధృతి ఉదయం 08.58 వరకు ఉపరి శుల కరణం కౌలవ సాయంత్రం 04.29...

వచన సాహిత్యం ప్రజల సాహిత్యం!|ESSAY

ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో...

దుర్గంథాన్ని పోగొట్టే సుగంథం!?|ADUGU TRENDS

ఎన్కటేమో గనీ, ఇగిప్పుడైతే నీల్లకు ప్లాటిక్, స్టీలు, రాగి సీసాలే వాడుతాండ్రు. ప్రిజ్జులనే కాదుల్లా, యేడికిపోయినా, గవాటినే తీస్కపొతాండ్రు, లేకపోతే కొనుక్కుని తాగుతాండ్రు. గనీ గవి వాడంగ, వాడంగ... దుర్వాసన వేస్తయి. దుర్గంథం...

విపత్కర ఇరాన్ కు వివేకంతోనే విజయం!|EDITORIAL

అమెరికా–ఇరాన్ విభేదాలు, ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలు, ప్రాంతీయ అభద్రతా భావ రాజకీయాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం సృష్టించడం సులువు కానీ, దాని ఫలితాలను భరించడం మాత్రం దేశాలకు, ప్రజలకు మాత్రం...

03-03-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--శుక్లపక్షం కేతుగ్రస్త గ్రస్తోదయ చంద్రగ్రహణం పగలు 03.20 నుండి రాత్రి 06.47 వరకు తిధి పూర్ణిమ సాయంత్రం 04.49 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం మఖ ఉదయం 07.28 వరకు ఉపరి పుబ్బ యోగం సుకర్మ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News