Trending News
Friday, March 6, 2026
35.9 C
Hyderabad
Trending News

చీప్… లిక్కర్ కేసు?!|EDITORIAL

లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రే నెలల తరబడి జైలులో ఉండటం, మాజీ ఉప ముఖ్యమంత్రి రెండేళ్లకు పైగా నిర్బంధంలో ఉండటం, తెలంగాణ సీఎం కూతురు, మాజీ ఎంపీ, ప్రముఖ నాయకురాలు అరెస్టు కావడం వంటివన్నీ ప్రజాభిప్రాయంపై ప్రభావం చూపాయి. అయితే, విచారణ సుదీర్ఘకాలం సాగి, చివరకు అభియోగాలు నిలవకపోతే, ఆ కాలంలో ఆ వ్యక్తుల రాజకీయ, సామాజిక జీవితం, పరువు నష్టం, ఇమేజీ డ్యామేజీ అవడం, ప్రజల్లో, పార్టీపై ప్రభావం వంటి వాటికి బాధ్యులెవరు?

అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే వారిని నిర్దోషులుగా భావించవచ్చా? ఈ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పై కోర్టుకు, ఆపై కోర్టుకు, ఇంకో పై కోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు. ఈ దశలో బలహీనపడిన కేసు, ఉన్నత న్యాయస్థానాల తీర్పులు వేర్వేరు దిశల్లో వెళ్లవచ్చు. చట్ట ప్రక్రియకు గౌరవం ఇవ్వాలి. కోర్టులు తుది నిర్ణయాధికారులు. కాబట్టి రాజకీయ వ్యాఖ్యానాల కంటే, న్యాయపరమైన స్పష్టత ముఖ్యం.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

దేశ రాజకీయాల్లో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు పరిణామాలు ఇప్పుడు కీలక మలుపు తిరిగాయి. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ, కల్వకుంట్ల కవిత సహా పలువురు నేతలకు భారీ ఊరట లభించింది. తాజాగా విచారణ చేపట్టిన రౌస్ అవెన్యూ కోర్టు నిందితులందరిపై నమోదైన సరైన ఆధారాలు లేకుండానే కేసులు నమోదు చేశారని, నిరూపించలేకపోయారని, ఈ కేసులో సీబీఐ అధికారులపై కేసులు పెట్టాలని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అభియోగాలు ఎన్నైనా మోపొచ్చు కానీ, వాటిని నిరూపించే సాక్ష్యాధారాలే ముఖ్యం.

కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ దేశంలో అత్యున్నత విచారణ సంస్థలుగా పేరుగాంచాయి. వీటి చర్యలు చట్టబద్ధత, పారదర్శకత, వాస్తవాధారాలపై నిలబడాలి. అయితే ఈ కేసులో కోర్టు అడిగిన ప్రశ్నలకు ఆ రెండు సంస్థలు జవాబివ్వలేకపోయాయి. రాజకీయ కక్షతో పెట్టిన కేసుగా ఇప్పటి దాకా వస్తున్న ఆరోపణలు నిజమనే విధంగానే దర్యాప్తు సంస్థల తీరు ఉంది. వాటిని బలపరుస్తున్నట్లుగానే కోర్టు తీర్పును బట్టి తెలుస్తోంది. దర్యాప్తు సంస్థలు రాజకీయ ప్రభావాలకు అతీతంగా పనిచేయాలన్నది మూల సూత్రం. ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదయ్యే ప్రతి సందర్భంలో “రాజకీయ ప్రతీకారం” అన్న ఆరోపణలు వినిపించడం కూడా సాధారణమైంది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఈ విమర్శలు కొత్తవేమీ కావు.

దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పాగా, ఇతర రాష్ట్రాల్లో విస్తరణకు ప్రయత్నాలు, పంజాబ్ లో సాధించిన విజయం రాజకీయ సమీకరణాలను మార్చాయి. సరిగ్గా ఆ సమయంలోనే లిక్కర్ పాలసీ కేసు వెలుగులోకి రావడం, అరెస్టులు జరగడం అనుమానాలకు తావిచ్చింది. ముఖ్యమంత్రే నెలల తరబడి జైలులో ఉండటం, మాజీ ఉప ముఖ్యమంత్రి రెండేళ్లకు పైగా నిర్బంధంలో ఉండటం, తెలంగాణ సీఎం కూతురు, మాజీ ఎంపీ, ప్రముఖ నాయకురాలు అరెస్టు కావడం వంటివన్నీ ప్రజాభిప్రాయంపై ప్రభావం చూపాయి.
అయితే, న్యాయ ప్రక్రియలో అరెస్టు అనేది శిక్ష కాదు. అది విచారణలో భాగం మాత్రమే! కానీ విచారణ సుదీర్ఘకాలం సాగి, చివరకు అభియోగాలు నిలవకపోతే, ఆ కాలంలో వ్యక్తుల రాజకీయ, సామాజిక జీవితం దెబ్బతినడం సహజం. అనివార్యం. పరువు నష్టం, ఇమేజీ డ్యామేజీ అవడం, ప్రజల్లో, పార్టీపై ప్రభావం తిరిగి పూడ్చుకోవడం కష్టం. ఈ మొత్తానికి బాధ్యులెవరు?

మరోవైపు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే వారిని పూర్తిగా నిర్దోషులుగా భావించవచ్చా? ఈ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పై కోర్టుకు, ఆపై కోర్టును సవాల్ చేస్తూ ఇంకో పై కోర్టుకు, ఇలా సుప్రీం కోర్టు దాకా అప్పీలు చేసుకోవచ్చు. ఈ దశలో బలహీనపడిన కేసు, ఉన్నత న్యాయస్థానాల తీర్పులు వేర్వేరు దిశల్లో వెళ్లవచ్చు. చట్ట ప్రక్రియకు గౌరవం ఇవ్వాలి. కోర్టులు తుది నిర్ణయాధికారులు. కాబట్టి రాజకీయ వ్యాఖ్యానాల కంటే, న్యాయపరమైన స్పష్టత ముఖ్యం.

అయితే, ఈ కేసు పరిణామాల నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పని చేస్తున్నాయా? లేదా? లేకపోతే, వాటి స్వతంత్రతను ఎలా కాపాడాలి? నియామక విధానంలో మార్పులు అవసరమా? పార్లమెంటరీ పర్యవేక్షణ బలోపేతం చేయాలా? లేక న్యాయపరమైన పర్యవేక్షణ సరిపోతుందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు చర్చించాల్సిన ఆవశ్యకత ఉంది.

అవినీతి, అధికార దుర్వినియోగం కూడా ప్రమాదమే. ఒకదాన్ని అడ్డుకునే పేరుతో మరొకదాన్ని పెంపొందించ కూడదు. చట్టం ముందు అందరూ సమానమనే భావన బలపడాలి. అదే సమయంలో, చట్ట అమలు సంస్థలు కూడా తమ చర్యలకు జవాబుదారీగా ఉండాలి.

ఈ కేసు రాజకీయంగా ఎవరికీ లాభమో, ఎవరికి నష్టమో ఆయా పార్టీలు, నేతలు నిర్ణయించుకోవాలి. కానీ, సాక్ష్యాలు బలంగా ఉంటేనే కేసులు నిలబడతాయి. దోషులకు శిక్షలు పడతాయి. లేకపోతే అనుమానాలు పెరుగుతాయి. ఇలాంటి కేసుల నమోదులో రాజకీయ ప్రభావాలు? కక్షలు, ప్రలోభాలు? లొంగదీసుకోవడాలు వంటివేవున్నా, దర్యాప్తు సంస్థల స్వయం ప్రతిపత్తికి సవాల్ గా నిలుస్తున్నాయి. మన దేశంలో రాజకీయ కేసులు నిలబడవనే నానుడి మారోసారి రుజువైంది.

Latest News

పురుగుల బెడదకు.. బెల్లం పానకం శిట్కా!?|ADUGU TRENDS

పంటలకు పట్టే పురుగులు రైతులకు శాపంగ మారుతానయి. ఇగ గవాటిని సంపడానికి పురుగుల మందులు కొట్టాలె. కర్సు బాగైతది. మల్ల గా మందులతోటి పురుగులు సత్తలేవు. పంటల దిగుబడొత్తలేదు. ఎరువులు, పురుగుల మందులెక్కువై...

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు...

06-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి తదియ సాయంత్రం 05.20 వరకు ఉపరి చవితి నక్షత్రం హస్త ఉదయం 09.15 వరకు ఉపరి చిత్త యోగం గండ ఉదయం 07.05 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర సాయంత్రం 05.22...

ఓలి రంగుల్లెక్క మెరపకాయెల రాసులు!?|ADUGU TRENDS

మెరపకాయెను కూడ కూరగాయల్లెక్కనే పండిత్తరు. మనం తినే బువ్వకు కారం, రుసిని ఇత్తది. గిదీన్ని మన తెలంగాణ, ఏపీల్నే గదేనుల్ల.. గుంటూరు, వరంగల్ ల ఇరగమరగ పండిత్తరు. గీ మెరపకాయెల ఉండే 'క్యాప్సైసిన్'...

స్వయం సమృద్ధే ఈ సంక్షోభానికి విరుగుడు!|EDITORIAL

వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం...

05-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఉత్తర ఉదయం 08.11 వరకు ఉపరి హస్త యోగం శుల ఉదయం 07.49 వరకు ఉపరి గండ కరణం గరజి సాయంత్రం 04.39...

బర్నర్ల మురికిని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

మన ఆడోల్లు ఎంత ఇకమతులు పడ్డా అరవై పది దినాలకు గా గ్యాస్ స్టౌ బర్నర్లు మురికి పడతనే ఉంటయి. గ వాటిని కడగాల్నంటే మస్తు తిప్పలైతది. అల్కగ గా బర్నర్ల మురికిని...

హార్ముజ్ జలసంధి ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!|EDITORIAL

ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు...

04-03-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి సాయంత్రం 04.29 వరకు ఉపరి విదియ నక్షత్రం పుబ్బ ఉదయం 07.30 వరకు ఉపరి ఉత్తర యోగం ధృతి ఉదయం 08.58 వరకు ఉపరి శుల కరణం కౌలవ సాయంత్రం 04.29...

వచన సాహిత్యం ప్రజల సాహిత్యం!|ESSAY

ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో...

దుర్గంథాన్ని పోగొట్టే సుగంథం!?|ADUGU TRENDS

ఎన్కటేమో గనీ, ఇగిప్పుడైతే నీల్లకు ప్లాటిక్, స్టీలు, రాగి సీసాలే వాడుతాండ్రు. ప్రిజ్జులనే కాదుల్లా, యేడికిపోయినా, గవాటినే తీస్కపొతాండ్రు, లేకపోతే కొనుక్కుని తాగుతాండ్రు. గనీ గవి వాడంగ, వాడంగ... దుర్వాసన వేస్తయి. దుర్గంథం...

విపత్కర ఇరాన్ కు వివేకంతోనే విజయం!|EDITORIAL

అమెరికా–ఇరాన్ విభేదాలు, ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలు, ప్రాంతీయ అభద్రతా భావ రాజకీయాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం సృష్టించడం సులువు కానీ, దాని ఫలితాలను భరించడం మాత్రం దేశాలకు, ప్రజలకు మాత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News