Trending News
Sunday, March 1, 2026
24.5 C
Hyderabad
Trending News

చీప్… లిక్కర్ కేసు?!|EDITORIAL

లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రే నెలల తరబడి జైలులో ఉండటం, మాజీ ఉప ముఖ్యమంత్రి రెండేళ్లకు పైగా నిర్బంధంలో ఉండటం, తెలంగాణ సీఎం కూతురు, మాజీ ఎంపీ, ప్రముఖ నాయకురాలు అరెస్టు కావడం వంటివన్నీ ప్రజాభిప్రాయంపై ప్రభావం చూపాయి. అయితే, విచారణ సుదీర్ఘకాలం సాగి, చివరకు అభియోగాలు నిలవకపోతే, ఆ కాలంలో ఆ వ్యక్తుల రాజకీయ, సామాజిక జీవితం, పరువు నష్టం, ఇమేజీ డ్యామేజీ అవడం, ప్రజల్లో, పార్టీపై ప్రభావం వంటి వాటికి బాధ్యులెవరు?

అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే వారిని నిర్దోషులుగా భావించవచ్చా? ఈ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పై కోర్టుకు, ఆపై కోర్టుకు, ఇంకో పై కోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు. ఈ దశలో బలహీనపడిన కేసు, ఉన్నత న్యాయస్థానాల తీర్పులు వేర్వేరు దిశల్లో వెళ్లవచ్చు. చట్ట ప్రక్రియకు గౌరవం ఇవ్వాలి. కోర్టులు తుది నిర్ణయాధికారులు. కాబట్టి రాజకీయ వ్యాఖ్యానాల కంటే, న్యాయపరమైన స్పష్టత ముఖ్యం.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

దేశ రాజకీయాల్లో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు పరిణామాలు ఇప్పుడు కీలక మలుపు తిరిగాయి. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ, కల్వకుంట్ల కవిత సహా పలువురు నేతలకు భారీ ఊరట లభించింది. తాజాగా విచారణ చేపట్టిన రౌస్ అవెన్యూ కోర్టు నిందితులందరిపై నమోదైన సరైన ఆధారాలు లేకుండానే కేసులు నమోదు చేశారని, నిరూపించలేకపోయారని, ఈ కేసులో సీబీఐ అధికారులపై కేసులు పెట్టాలని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అభియోగాలు ఎన్నైనా మోపొచ్చు కానీ, వాటిని నిరూపించే సాక్ష్యాధారాలే ముఖ్యం.

కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ దేశంలో అత్యున్నత విచారణ సంస్థలుగా పేరుగాంచాయి. వీటి చర్యలు చట్టబద్ధత, పారదర్శకత, వాస్తవాధారాలపై నిలబడాలి. అయితే ఈ కేసులో కోర్టు అడిగిన ప్రశ్నలకు ఆ రెండు సంస్థలు జవాబివ్వలేకపోయాయి. రాజకీయ కక్షతో పెట్టిన కేసుగా ఇప్పటి దాకా వస్తున్న ఆరోపణలు నిజమనే విధంగానే దర్యాప్తు సంస్థల తీరు ఉంది. వాటిని బలపరుస్తున్నట్లుగానే కోర్టు తీర్పును బట్టి తెలుస్తోంది. దర్యాప్తు సంస్థలు రాజకీయ ప్రభావాలకు అతీతంగా పనిచేయాలన్నది మూల సూత్రం. ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదయ్యే ప్రతి సందర్భంలో “రాజకీయ ప్రతీకారం” అన్న ఆరోపణలు వినిపించడం కూడా సాధారణమైంది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఈ విమర్శలు కొత్తవేమీ కావు.

దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పాగా, ఇతర రాష్ట్రాల్లో విస్తరణకు ప్రయత్నాలు, పంజాబ్ లో సాధించిన విజయం రాజకీయ సమీకరణాలను మార్చాయి. సరిగ్గా ఆ సమయంలోనే లిక్కర్ పాలసీ కేసు వెలుగులోకి రావడం, అరెస్టులు జరగడం అనుమానాలకు తావిచ్చింది. ముఖ్యమంత్రే నెలల తరబడి జైలులో ఉండటం, మాజీ ఉప ముఖ్యమంత్రి రెండేళ్లకు పైగా నిర్బంధంలో ఉండటం, తెలంగాణ సీఎం కూతురు, మాజీ ఎంపీ, ప్రముఖ నాయకురాలు అరెస్టు కావడం వంటివన్నీ ప్రజాభిప్రాయంపై ప్రభావం చూపాయి.
అయితే, న్యాయ ప్రక్రియలో అరెస్టు అనేది శిక్ష కాదు. అది విచారణలో భాగం మాత్రమే! కానీ విచారణ సుదీర్ఘకాలం సాగి, చివరకు అభియోగాలు నిలవకపోతే, ఆ కాలంలో వ్యక్తుల రాజకీయ, సామాజిక జీవితం దెబ్బతినడం సహజం. అనివార్యం. పరువు నష్టం, ఇమేజీ డ్యామేజీ అవడం, ప్రజల్లో, పార్టీపై ప్రభావం తిరిగి పూడ్చుకోవడం కష్టం. ఈ మొత్తానికి బాధ్యులెవరు?

మరోవైపు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే వారిని పూర్తిగా నిర్దోషులుగా భావించవచ్చా? ఈ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పై కోర్టుకు, ఆపై కోర్టును సవాల్ చేస్తూ ఇంకో పై కోర్టుకు, ఇలా సుప్రీం కోర్టు దాకా అప్పీలు చేసుకోవచ్చు. ఈ దశలో బలహీనపడిన కేసు, ఉన్నత న్యాయస్థానాల తీర్పులు వేర్వేరు దిశల్లో వెళ్లవచ్చు. చట్ట ప్రక్రియకు గౌరవం ఇవ్వాలి. కోర్టులు తుది నిర్ణయాధికారులు. కాబట్టి రాజకీయ వ్యాఖ్యానాల కంటే, న్యాయపరమైన స్పష్టత ముఖ్యం.

అయితే, ఈ కేసు పరిణామాల నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పని చేస్తున్నాయా? లేదా? లేకపోతే, వాటి స్వతంత్రతను ఎలా కాపాడాలి? నియామక విధానంలో మార్పులు అవసరమా? పార్లమెంటరీ పర్యవేక్షణ బలోపేతం చేయాలా? లేక న్యాయపరమైన పర్యవేక్షణ సరిపోతుందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు చర్చించాల్సిన ఆవశ్యకత ఉంది.

అవినీతి, అధికార దుర్వినియోగం కూడా ప్రమాదమే. ఒకదాన్ని అడ్డుకునే పేరుతో మరొకదాన్ని పెంపొందించ కూడదు. చట్టం ముందు అందరూ సమానమనే భావన బలపడాలి. అదే సమయంలో, చట్ట అమలు సంస్థలు కూడా తమ చర్యలకు జవాబుదారీగా ఉండాలి.

ఈ కేసు రాజకీయంగా ఎవరికీ లాభమో, ఎవరికి నష్టమో ఆయా పార్టీలు, నేతలు నిర్ణయించుకోవాలి. కానీ, సాక్ష్యాలు బలంగా ఉంటేనే కేసులు నిలబడతాయి. దోషులకు శిక్షలు పడతాయి. లేకపోతే అనుమానాలు పెరుగుతాయి. ఇలాంటి కేసుల నమోదులో రాజకీయ ప్రభావాలు? కక్షలు, ప్రలోభాలు? లొంగదీసుకోవడాలు వంటివేవున్నా, దర్యాప్తు సంస్థల స్వయం ప్రతిపత్తికి సవాల్ గా నిలుస్తున్నాయి. మన దేశంలో రాజకీయ కేసులు నిలబడవనే నానుడి మారోసారి రుజువైంది.

Latest News

గాలిపోతే… వాలిపోతడు!?|ADUGU TRENDS

అవుమల్ల నిజమే! బస్సో, కారో, సైకిలో, సైకిల్ మోటరో ఇగ ఏదో ఒకదాని మీద పోతుంటం. పుసుక్కున గా ట్యూబు టైర్లు పేలుతయి. లేకపోతే పంక్చర్ అయితయి అనుకోండ్రి? ఏం శేస్తం? ఉంటే...

కోర్టుల వ్యాఖ్యలు వ్యవస్థల లోపాలకు హెచ్చరికలు!|EDITORIAL

దేశంలో ఒకేసారి వెలుగులోకి వచ్చిన రెండు సంఘటనలు రాజ్యాంగ వ్యవస్థల మధ్య సంబంధాన్ని, అలాగే చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేశాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మార్చి 01 నుండి మార్చి 07 వరకు వార రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ రంగంలో మంచి పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది....

రాజకీయ పార్టీగా మావోయిస్టు పార్టీ!?|POLITICAL PARTY|MAOIST

ఏర్పాటు దిశగా మాజీ మావోల ఆలోచన!|EX MAOIST పార్టీ, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ రద్దు|PEOPLES LIBERATION GERILLA ARMY హోంమంత్రి అమిత్‌షాతో చర్చిద్దామన్న సీఎం|HOME MINISTER|CM|REVANTH REDDY కేంద్రం ఓకే అంటే, బహిరంగ సభ ద్వారా...

పదాలను పలికించే పలక!?|ADUGU TRENDS

పలకంటే అ ఆ ఇ ఈ అచ్చరాలు దిద్దేది. పంతుల్లు గా పలక మీదనే అచ్చరాలు రాసి, దిద్దిపిత్తరు. ఇగ పోరగాండ్లు అమ్మ ఒడిలకంటే, బడిలనే అచ్చరాలు నేర్సుకుంటరు. గట్లనే అచ్చరాలు, అచ్చరాలు...

శనివారం ఫిబ్రవరి 28–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--శుక్లపక్షం తిధి ద్వాదశి రాత్రి 08.30 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పునర్వసు ఉదయం 09.38 వరకు ఉపరి పుష్యమి యోగం సౌభాగ్య సాయంత్రం 05.15 వరకు ఉపరి శోభ కరణం బవ ఉదయం 09.27...

కుక్కర్ల ఎసరు పొంగకుండ గీ కిటుకు!?|ADUGU TRENDS

ఎక్కువ సేపు ఉడికేటివి, తొందర్గ ఉడకాల్నంటే ఏం శేత్తం? కుక్కర్ల ఏత్తం. మరి గా కుక్కర్లు కాస్త ఎసరు ఎక్కువ పోస్తిమా... ఇగ గది గా యిజిల్ యేసేటప్పుడు బయటకు పొంగుతాంటది. లోపల...

ఓటర్ల జాబితాసవ ‘రణం’?!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి ఎన్నికల ప్రక్రియే ప్రాణం. రాజ్యంగం ఆత్మ. ఓటు హక్కు ప్రజాస్వామిక రాజ్యాంగాలకు మూలం. అయితే, ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్- సర్) కార్యక్రమం చుట్టూ నెలకొన్న...

శుక్రవారం ఫిబ్రవరి 27–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--శుక్లపక్షం తిధి ఏకాదశి రాత్రి 10.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఆరుద్ర ఉదయం 10.56 వరకు ఉపరి పునర్వసు యోగం ఆయస్మాన్ రాత్రి 08.00 వరకు ఉపరి సౌభాగ్య కరణం వణజి ఉదయం 11.30...

ఫ్లాష్..ఫ్లాష్…|FLASH|IAS|TRANSFERS

తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు! 45 మందికి కొత్త బాధ్యతలు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టి ఉత్తర్వులు జారీ...

ఐసు గడ్డలతోటి మాడు మాయం!?|ADUGU TRENDS

ఎంత ఇగురంగ ఉన్నా, ఒక్కోపాలి వంట గిన్నెలు అడుగంటుతయి. పొయ్యి మీద గిన్నె పెట్టి యాది మరిస్తిమా? ఇగ గంతే సంగతులు. గిన్నె మాడి బొగ్గైతది. ఇగ గిట్లైనంక మన ఆడోల్లు మస్తు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News