Trending News
Friday, February 20, 2026
21.2 C
Hyderabad
Trending News

జెండాలకతీతంగా అభివృద్ధి ఎజెండా!|EDITORIAL

స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాయి. ఇక రాజకీయాలు పక్కన పెట్టేయాలి. ప్రజలు ఎదురుచూస్తోన్న అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలి. గ్రామాలు, పట్టణాలు బలపడితేనే రాష్ట్రం, దేశం బలపడుతుంది. ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి ఎజెండాను రూపొందించి, అమలు చేయాలి.
గ్రామాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. పంచాయతీల్లో పారదర్శకత లేదు. నిధుల దుర్వినియోగం, స్థానిక స్థాయిలో పెరుగుతున్న అవినీతి గ్రామాభివృద్ధికి అడ్డంకులుగా మారాయి. అవినీతి రహిత పాలన గ్రామాల నుంచే ప్రారంభం కావాలి. పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయాలి. నిధుల కేటాయింపులు, అభివృద్ధి పనుల పురోగతి, ఖర్చుల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయాలి. సామాజిక ఆడిట్లను కఠినంగా అమలు చేస్తే బాధ్యతాయుత పరిపాలనకు మార్గం సుగమమవుతుంది.

గ్రామ సర్పంచ్‌ల పాత్ర అత్యంత కీలకం. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు పరిపాలన, ఆర్థిక నిర్వహణ, పంచాయతీరాజ్ చట్టం, అభివృద్ధి కార్యక్రమాల అమలు విధానంపై సమగ్ర శిక్షణ ఇవ్వాలి. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రామాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసేలా వారిని సిద్ధం చేయాలి. రాజకీయ ప్రేరణలతో కాకుండా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకునేలా దృఢమైన మార్గదర్శకాలు అవసరం.

మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. రోడ్లు దెబ్బతిన్నాయి, డ్రెయినేజీలు మూసుకుపోయాయి, చెత్త సేకరణలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇంటింటికీ చెత్త సేకరణ పద్ధతి అమలులో ఉన్నా, నిర్వహణ లోపంతో ఫలితం కనిపించడం లేదు. పారిశుధ్య కార్మికుల కొరత, సరిపడా వాహనాల లేమి సమస్యలను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. పెద్ద రోడ్లను శుభ్రపరిచే యంత్రాలను వినియోగంలోకి తేవాలి. ఓపెన్ డ్రెయినేజీలను మూసివేసి ఆధునిక మురుగునీటి వ్యవస్థను అభివృద్ధి చేయాలి.

తాగునీటి సమస్య పట్టణాల్లోనే కాదు, శివారు కాలనీల్లోనూ తీవ్రంగా ఉంది. మిషన్ భగీరథ ప్రచారం పెద్దఎత్తున జరిగినా, అనేక ప్రాంతాల్లో సరఫరా వ్యవస్థ సక్రమంగా లేదు. పైప్‌లైన్ల లీకేజీలు, తరచూ జరిగే మరమ్మతులు, కొత్త కాలనీలకు కనెక్షన్ల లోపం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ దశలో అమృత్ 2.0 కింద చేపట్టిన పనులను వేగవంతం చేయడం అత్యవసరం. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకుంటేనే పనులు గడువులో పూర్తి అవుతాయి.

మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల పరిస్థితిని ప్రత్యేకంగా పరిశీలించాలి. పన్నుల భారం పెరిగినా, మౌలిక సదుపాయాలు మాత్రం అందుబాటులోకి రావడం లేదు. రోడ్లు, డ్రెయినేజీలు, వీధిదీపాలు, శ్మశాన వాటికలు వంటి ప్రాథమిక అవసరాలు ఇప్పటికీ నెరవేరలేదు. విలీన ప్రక్రియ అభివృద్ధికి దోహదపడాలి గానీ, అదనపు భారంగా మారకూడదు.

అక్రమ నిర్మాణాలు పట్టణ ప్రణాళికను సవాల్ చేస్తున్నాయి. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నా, నియంత్రణలో లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణ ప్రణాళిక శాఖను బలోపేతం చేసి కఠినంగా అమలు చేస్తేనే శాస్త్రీయ పట్టణాభివృద్ధి సాధ్యమవుతుంది. లేదంటే భవిష్యత్తులో మరింత క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

ప్రజారోగ్యం పడకేసింది. దోమల విస్తృతి, వీధి కుక్కల సమస్య, కోతుల బెడద, పందుల సంచారం వంటి సమస్యలు గ్రామాల నుంచి పట్టణాల వరకు వ్యాపించాయి. ఫాగింగ్, శానిటేషన్ చర్యలు, పశుసంవర్ధక శాఖల సమన్వయం ద్వారా వీటిని నియంత్రించాలి. అంటువ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి.

నిధుల విడుదల, వినియోగంలో రాజకీయ ప్రాధాన్యత కంటే అవసరాల ప్రాముఖ్యత ఉండాలి. అభివృద్ధి పనుల ఎంపికలో ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఈ-గవర్నెన్స్, డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థల ద్వారా పనుల పురోగతిని పర్యవేక్షిస్తే పారదర్శకత పెరుగుతుంది.

ఈ సమస్యలన్నీ ఏళ్లుగా పేరుకుపోయిన నిర్లక్ష్య ఫలితమే. అయితే కొత్తగా ఎన్నికైన స్థానిక పాలకవర్గాలకు ఇది ఒక అవకాశం, ఒక సవాల్ కూడా. సమన్వయం, పారదర్శకత, కఠిన అమలు, ప్రజల భాగస్వామ్యం నాలుగు స్తంభాలు. రాజకీయ వాగ్దానాల నుంచి కార్యాచరణ దిశగా అడుగులు పడితేనే గ్రామాలు, పట్టణాలు నిజమైన అభివృద్ధి దిశగా సాగుతాయి. ఇదే ప్రజల ఆకాంక్ష.

Latest News

పెండ్లి పిల్ల మీద నో(కో)ట్ల కట్టలు!?|ADUGU TRENDS

పెండ్లంటే నూరేళ్ళ పంట. గందుకే ఆకాసమంత పందిరి, భూదేవంత పీటలేసి పెండ్లిల్లు శేత్తరు. ఉన్నోల్లు కోట్లకు కోట్లు కర్సు పెడ్తరు. కనీ, గీ వీల్లు గవన్నీ శేసిండ్లు. గంతకు మించి, పెండ్లి పిల్ల...

గురువారం, ఫిబ్రవరి 19–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--శుక్లపక్షం తిధి విదియ సాయంత్రం 04.35 వరకు ఉపరి తదియ నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి 09.43 వరకు ఉపరి ఉత్తరాభాద్ర యోగం సిద్ద రాత్రి 09.45 వరకు ఉపరి సాధ్య కరణం కౌలవ సాయంత్రం 04.36...

ఇనుప సువ్వలతో దెండెం ఇకమతు!?|ADUGU TRENDS

ఇంటి మీద, మిద్దెల మీద, మేడల మీద బట్టలారేసు కోవాల్నంటే మస్తు తిప్పలైతది. దండాలు కట్టాల్నంటే కూడా కట్టమే. గిదీనికి ఓ ఇకమతు ఉంది. కవాల్నంటే సూడుండ్రి. గీ పోటువల సూపినట్లు.. ఇనుప సువ్వతోటి...

మనం-వనమే జీవావరణం!|EDITORIAL

ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వన్యప్రాణులు గ్రామాలు, పట్టణాలలో సంచరించడం ఆందోళనకరంగా మారింది. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, అడవిపందులు, ఏనుగులు, కోతుల దాడులు కూడా పెరిగిపోతున్నాయి. వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడానికి ప్రధాన...

బుధవారం.ఫిబ్రవరి 18–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--శుక్లపక్షం ఫాల్గుణ మాసం ప్రారంభం తిధి పాడ్యమి సాయంత్రం 05.20 వరకు ఉపరి విదియ నక్షత్రం శతభిషం రాత్రి 09.54 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శివ రాత్రి 11.35 వరకు ఉపరి సిద్ద కరణం బవ...

బంగారాన్ని బయటికి తీసే ఉపాయం!?|ADUGU TRENDS

పొరపాటుగ బంగారం ఉంగురంపోతే ఏం సేత్తం? దబదబ యెత్కుతం. గదే ఓ బురదలోనో, నీటిలోనో పడిపోతే ఏం సేత్తం? ఇంకా ఆగమాగమైపోతం. అసలే బంగారం ధర పెరిగిపాయె. గిదీనికి గూడ ఓ ఇకమతు...

ప్రణాళికలతో ‘సాగ’డమే శ్రేయస్కరం|EDITORIAL

నీటి నిర్వహణలో స్పష్టత, ప్రాధాన్యతా క్రమం, కార్యాచరణలే అభివృద్ధికి అసలైన బలమైన పునాదులు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికాకుండానే కొత్త ప్రతిపాదనలను, ప్రణాళికలను సిద్ధం చేయడం, రాజకీయ వ్యాఖ్యలతో వివాదాలను రేకెత్తించడం మామూలైపోయింది. ఇది...

మంగళవారం, ఫిబ్రవరి 17–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు మాఘమాసం--కృష్ణపక్షం తిధి అమావాస్య సాయంత్రం 05.32 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ధనిష్ఠ రాత్రి 09.37 వరకు ఉపరి శతభిషం యోగం పరిఘ రాత్రి 01.06 వరకు ఉపరి శివ కరణం నాగవ సాయంత్రం 05.34 వరకు ఉపరి...

సోమవారం, ఫిబ్రవరి 16–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు మాఘమాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.17 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం శ్రవణ రాత్రి 08.50 వరకు ఉపరి ధనిష్ఠ యోగం వరీయాన్ రాత్రి 02.11 వరకు ఉపరి పరిఘ కరణం శకుని సాయంత్రం 05.18 వరకు ఉపరి...

శివ నామస్మరణతో మారుమ్రోగిన పాలకుర్తి|PALAKURTHI|SHIVARATRI

భక్తుల స్మరణతో పులకించిన సోమన్న గుట్ట ఘనంగా సోమన్న కళ్యాణం పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే యశస్విని సోమన్నను దర్శించుకున్న పలువురు ప్రముఖులు జనగామ జిల్లా, పాలకుర్తిలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తి పారవశ్యంతో కళకళలాడింది. శ్రీ సోమేశ్వర...

జీపీఓల వ్యవస్థ – అవస్థలు – పరిష్కారాలు|GPO|TELANGANA|ARTICLE

నిజాం కాలం నాటి పటేల్–పట్వారీ వ్యవస్థ నుంచి నేటి జీపీఓల దాకా వచ్చిన మార్పులు గ్రామ పరిపాలన స్వరూపాన్నే మార్చేశాయి. అయితే, ప్రతి మార్పు కొత్త అవకాశాలతోపాటు సరికొత్త సవాళ్లను కూడా మోసుకొచ్చింది. సాయి...

కజ్జూర పండ్ల గింజల్ని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

కజ్జూర పండ్లంటే ఎవరికైన ఇట్టమే. లొట్టలేసుకుంట చప్పరిస్తం. ఇగ శిన్న పిల్లలైతే గయి మస్తుగ తింటరు. గయి మనకు మస్తు బలాన్నిస్తయి. గయి గీ కాలంలనే దొరుకుతయి. గవాటిని నోట్లేసుకుని, పండును తిని...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News