Trending News
Thursday, October 2, 2025
22.8 C
Hyderabad
Trending News

పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం

వచ్చే డిసెంబర్ నాటికి దేవాదుల ప్రాజెక్టు పనులన్ని పూర్తి

రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

గత పదేళ్ల నుంచి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రాష్ట్ర సాగునీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేట శివారులోని దేవాదుల పంపింగ్ స్టేషన్ పేజ్ -3 ప్యాకేజ్ 3 లో ఏర్పాటుచేసిన నూతన మోటార్ల ద్వారా నీటి విడుదల కార్యక్రమాన్ని రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో పరిశీలించి, దేవాదుల నీటి పంపింగ్ ను స్విచ్ ఆన్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. అక్కడే ఉన్న సాగునీటిపారుదల శాఖ అధికారులు, ఆస్ట్రియాకు చెందిన ఇంజనీర్ల బృందంతో మంత్రులు సమావేశమై నీటి పంపింగ్ సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుండి ధర్మసాగర్ రిజర్వాయర్ కు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కే ఆర్. నాగరాజు , యశస్విని రెడ్డిలతో చేరుకున్నారు. దేవాదుల పైపు ద్వారా రిజర్వాయర్ లోకి వస్తున్న నీటి ప్రవాహాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు పూజలు చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర సాగునీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి అన్ని ఫేజ్ లు, అన్ని లింకులు, అన్ని మోటార్లు, అన్ని పంపులను పూర్తి చేస్తామన్నారు. ఒక పంపును ఆన్ చేసి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగలుగుతున్నామని అన్నారు. మరో రెండు పంపులను 15 రోజుల్లోగా ఆన్ చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా రాజవరంలోని పంపింగ్ పనులను పూర్తి చేస్తామన్నారు. గత పదేళ్లుగా పెండింగ్లో ఉన్న దేవాదుల, ఉమ్మడి నల్గొండలోని ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేస్తామన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించే విధంగా సాగునీటి ప్రణాళిక రూపకల్పనతో తమ ప్రభుత్వం ముందుకెళుతుందన్నారు. దేవాదుల ప్రాజెక్టు మోటార్ పంపులు ద్వారా నీటి విడుదల కార్యక్రమానికి రావడం జరిగిందన్నారు. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఇచ్చిన ప్రతి హామీని ఇందిరమ్మ ప్రభుత్వం శ్రద్ధతో నెరవేరుస్తుందన్నారు. ఆనాడు దేవాదుల ప్రాజెక్టును ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. దేవాదుల మూడో దశకు సంబంధించి ప్రారంభించాలనుకున్నామని, కొన్ని సాంకేతిక కారణాలవల్ల ఆలస్యం అయిందన్నారు. కొన్ని అనివార్య కారణాల వలన కొంత ఆలస్యమైనప్పటికీ రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ శాఖ అధికారులతో పనులను పూర్తి చేయించే విధంగా టెక్నికల్ ఇబ్బందులు వచ్చిన వాటన్నింటినీ అధిగమించి ఈరోజు విజయవంతంగా నీటి పంపింగ్ను చేసినట్లు పేర్కొన్నారు. సుమారు 600 క్యూసెక్కుల నీటిని విడుదలవుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాలను ఇందిరమ్మ ప్రభుత్వం మరింత సస్యశ్యామలం చేస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజలూ, ముఖ్యంగా రైతుల పక్షపాతి అయిన ఇందిరమ్మ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో మరింత మేలు జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, సాగునీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Latest News

శుక్రవారం అక్టోబర్ 03 –2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం ఏకాదశి తిధి ఏకాదశి పగలు 02.28 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం శ్రవణ ఉదయం 06.46 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ధృతి రాత్రి 06.46 వరకు ఉపరి శూల కరణం భద్ర సాయంత్రం...

ఓ మహాత్మా..|POETRY

నిన్న,నేడు,రేపు రోజు ఏదైనా వాదం ఒక్కటే 'గాంధేయవాదం' ఇది నొప్పి తెలియకుండా సూదిచ్చే యంత్రం కొట్టకనే దెబ్బలు చరిచే తంత్రం ఎదుటి వానిలో ఆలోచన రేపే మంత్రం 'మహాత్మాగాంధీ' శాంతికి బ్రాండ్ అంబాసిడర్ నాయకత్వానికి నిదర్శనం ఉద్యమానికి ఊపిరి మొత్తానికి భారతదేశ 'మనిమకుటం' ఒక్కమాటతో జనాలకు జవసత్వాలు నింపి స్వతంత్ర భావజాలాన్ని పంచి అలుపెరుగని...

విజయదశమి అంటే ఏంటి? దసరాను ఎలా ఆచరించాలి?|ESSAY|ARTICLES

కృతయుగంలో రాక్షస సంహారంలో భాగంగా ఆది పరాశక్తి శుంభ నిశుంభ రక్తబీజ మొదలైన రాక్షసులతో పాటు మహిషాసురుడిని సంహరించి లోక రక్షణ చేసిన కారణంగా ఆ రోజు ఆనందంగా అమ్మవారిని ఆరాధించాలి అనుగ్రహం...

గీ బ్లడ్ గ్రూపున్నోల్లు తొందరగ సావరట!?|ADUGU TRENDS

మనిసికి లోకం మీద పేమ కంటే, పానం మీద తీపే ఎక్కువ. ఎవలికైనా శానా కాలం బతకాల్ననే ఉంటది. గదైతాది. ఎవలికి ఎంత రాసి పెట్టి ఉంటే గంతే? అనుకుంటుం గనీ, ఇగో.....

దసరా వైశిష్ట్యం విజయోస్తు!|EDITORIAL

హిందువులు జరుపుకునే పండగలలో దసరా పండగకు విశిష్ట స్థానం ఉంది. ఈ విజయ దశమికి సంబంధించి పలు పురాణగాథలు చెలామణిలో ఉన్నాయి. రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం...

గురువారం అక్టోబర్ 02 –2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం విజయదశమి దసరాపండుగ గాంధీ జయంతి తిధి దశమి పగలు 02.38 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.03 వరకు ఉపరి శ్రవణ యోగం సుకర్మ రాత్రి 08.03 వరకు ఉపరి ధృతి కరణం...

డైబర్ లేని ఆటోలొత్తానయి!?|ADUGU TRENDS

ఇగో గీ ఆటోలకు డైబరుండడు. ఇగ మనం గా ఆటో ఎక్కి యేడికి పోవాల్నో సెప్తె సక్కగ గాడికే తీస్కపోతది. గదేంది? పట్నాలల్ల రద్దీ ఉంటది గదా? గదెట్ల తీస్కపోతది? మనమెట్ల పోతం?...

ఆదివాసీల అస్తిత్వ పోరాటం!|EDITORIAL

“ఆదివాసులు” మూల వాసులు. భారత దేశంలోని స్వదేశీ జనజాతులు. ప్రత్యేక సంప్రదాయ జీవన విధానం, భూభాగాలు, వనరులు, భాషలు, సంస్కృతులు కలిగి ఉన్న సమాజాలు. “లంబాడీలు లేదా బంజారాలు” ప్రత్యేక సంప్రదాయ జీవన...

బుధవారం అక్టోబర్ 01–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం మహర్నవమి తిధి నవమి పగలు 02.19 వరకు ఉపరి దశమి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా యోగం అతిగండ రాత్రి 08.56 వరకు సుకర్మ కరణం కౌలవ సాయంత్రం 04.18 వరకు గరజి వర్జ్యం పగలు 01.24...

క్రికెట్ ను ఆటగానే చూడాలి!|EDITORIAL

‘ఓటమి చావు కన్నా భయంకరమైంది.’ ప్రపంచంలో, జీవితంలో గెలుపోటములు లేనిదెక్కడ? కానీ, యుద్ధంలో గెలుపోటములు గెలిచినా, ఓడినా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. యుద్ధంలో చావు అమరత్వాన్నిస్తే, ఒక్కోసారి క్రీడల్లో ఓటమి మరణశాసనాన్ని కూడా...

ఆ స్నేహితులను చూసి స్నేహమే సలాం చేసింది!|FRIENDSHIP

పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు సమయంలో ఎప్పుడు.. ఎప్పుడాని కండ్లల్లో వొత్తులేసుకొని సూడాల్సిన స్థితి వొచ్చింది. యెందుకంటే గతంలో కరోనా సమయంలో ముందొకసారి, ఆ తర్వాతొకసారి, మళ్లీ రెండు సమయాల్లో మా ఆత్మీయ...

యెహె తియ్! గీ ఆటకు వానడ్డమా?|ADUGU TRENDS

యేడాదికోపాలొచ్చే పండుగాయె. తీరొక్క పూలతో పాడి, ఆడే ఆటాయె. ఇగ గా వానదేవునికి కండ్లు కుట్టి, కుండపోత పోయబట్టె. ఇగ గిదంత పని గాదని, గా ఆడోళ్ళు ఏం చేసిండ్లో సూత్తె మీరు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News