Trending News
Tuesday, December 16, 2025
22.2 C
Hyderabad
Trending News

శ్రీలంకపై భారీ విజయం సాధించిన భారత్

మలేషియాలో జరుగుతున్న అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు అదిరిపోయే ప్రదర్శన చేస్తోంది. గురువారం జరిగిన చివరి గ్రూపు మ్యాచ్‌లో భారత్ 60 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించి గ్రూప్ దశను అజేయంగా ముగించింది. ఈ విజయంతో భారత్ సూపర్-6 రౌండ్‌కు అర్హత సాధించింది.

భారత విజయంలో తెలుగమ్మాయిలు గొంగడి త్రిష, షబ్నమ్ షకీల్ కీలక పాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన గొంగడి త్రిష 44 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 49 పరుగులు చేసి దూకుడుగా ఆడింది. త్రిష పోరాటంతో భారత్ పోరాడగల స్కోరు సాధించగలిగింది. తదుపరి ఛేదనలో, భారత బౌలర్లు శ్రీలంకను కేవలం 58 పరుగులకే కట్టడి చేశారు. పేసర్ షబ్నమ్ షకీల్ తన తొలి ఓవర్‌లోనే వికెట్ తీసి ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టింది. షబ్నమ్ 2/9 తో రాణించగా, పారునిక సిసోడియా, జోషిత రెండేసి వికెట్లు తీసి శ్రీలంక బ్యాటింగ్ లైనప్‌ను కుదిపేశారు.

భారత్ బౌలింగ్ ధాటికి శ్రీలంక జట్టు నిలబడలేకపోయింది. వారి ఇన్నింగ్స్‌లో రష్మిక సెవ్వండి(15) టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శన వల్ల శ్రీలంక జట్టు ఏ విధంగా విలవిలలాడిందో స్పష్టమైంది. ఈ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన గొంగడి త్రిషకు “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు దక్కింది. ఆదివారం సూపర్-6 రౌండ్‌లో భారత్ మలేషియాతో తలపడనుంది.

Latest News

ఒక్క ఓటు… ఫలితం తారుమారు|PANCHAYATI TRENDS

ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు శక్తి ఎంత గొప్పదో మరోసారి నిరూపితమైంది. తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కేవలం ఒక్క ఓటు తేడాతో వెలువడిన ఫలితం ఇప్పుడు...

గీ హెల్మెట్ పెట్టుకుంటేనే బండి శాలైతది!?|ADUGU TRENDS

గా హెల్మెట్ పెట్టుకోకుండా సైకిల్ మోటార్లే నడపొద్దని సర్కార్ చెప్తాంది. మనమేమన్నా ఇంటున్నమా ఏంది? గది లేకుండనే బండ్లు నడుపుతున్నం. యాక్సిడెంట్లైతే పానాలు తీసుకుంటున్నం. ఇగ గిట్ల జరగొద్దని ఓ పొల్లగాడు, స్మార్ట్...

బీజేపీ: పరాజయాల పరంపర!|EDITORIAL

లెఫ్ట్ పార్టీలకు నెలవైన కేరళ తిరువనంతపురం మున్సిపాల్టీలో బీజేపీ విజయం సాధించిన సమయ, సందర్భంలోనే తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అదే బీజేపీ స్వతంత్రులకంటే తక్కువ సీట్లతో నాల్గో స్థానానికి పరిమితమైంది. రాష్ట్రంలో 8...

మంగళవారం డిసెంబర్ 16 –2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణపక్షం తిధి బ.ద్వాదశి రాత్రి 11.58 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం స్వాతి పగలు 03.05 వరకు ఉపరి విశాఖ యోగం అతిగండ పగలు 01.06 వరకు ఉపరి సుకర్మ కరణం కౌలవ పగలు 01.12...

TELUGU|తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది

ఘనంగా ఆటా అంతర్జాతీయ సాహిత్య సదస్సు ఉత్సాహంగా పాల్గొన్న సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, సాహిత్య అభిమానులు జయహో తెలుగు సాహిత్యం అంటూ కొనియాడిన ఆటా ప్రతినిధులు ఆటా అంతర్జాతీయ సదస్సులో పలువురు వక్తలు తెలుగు భాషను, సంస్కృతిని కాపాడుకొని...

సోమవారం డిసెంబర్ 15 –2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణపక్షం తిధి బ.ఏకాదశి రాత్రి 10.05 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం చిత్త పగలు 12.50 వరకు ఉపరి స్వాతి యోగం శోభ పగలు 12.51 వరకు ఉపరి అతిగండ కరణం బవ ఉదయం 11.24...

మరీ నేనెట్లా.. ఓడిపోయిన?|PANCHAYATI TRENDS

ఎన్నికలంటే గెలుపోటములు సహజమే. అయితే కొందరికి ఓటమి రాజకీయంగా మాత్రమే కాదు… మానసికంగా కూడా తట్టుకోలేని బాధను మిగిల్చుతుంది. నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం ఔరవాణి గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు అలాంటి హృదయవిదారక...

గీ తలుపు తాళం దొంగలకు కూడా దొరకది!?|ADUGU TRENDS

తలపు తాళం, గొల్లెం, బల్లెం దొంగలకు అడ్డమా ఏంది? కనీ, ఇగ గా దొంగలకు కూడా దొరకకుండ గీ తలుపు, తాళం చేసిన ఇకమతు మస్తుగుందుల్లా...! గోడను తలుపు లెక్క చేసిండు. తులుపును గోడ...

భారతీయ ‘ఆత్మ’ను ఆవిష్కరిద్దామా!?|EDITORIAL

‘మహాత్మా గాంధీ ఉపాధి హామీ’ పథకాన్ని ‘బాపు గ్రామీణ్ రోజ్ గార్ యోజన’ పథకంగా మారుస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. భారతదేశంలో ఊళ్ళు, పట్టణాలు, ప్రభుత్వ పథకాలు, వీధుల పేర్లు మారుస్తూ ఉండటం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

డిసెంబర్ 14- నుండి డిసెంబర్- 20 వరకు వార ఫలాలు మేష రాశి ఈ వారం మీకు కొత్త ప్రాజెక్టులు లేదా విధుల్లో నేతృత్వం చూపించే అవకాశాలు ఏర్పడతాయి. పనిస్థలంలో మీరు చూపించే కృషి మరియు...

STARTUP|స్టార్టప్‌లకు ATA|ఆటా ప్రోత్సహించడం అభినందనీయం

హాజరైన పలువురు ఐటీ ప్రముఖులు|IT INTERNATIONAL|అంతర్జాతీయ వేదికగా ఆటా స్టార్టప్ పిచ్ డే IIT HYDERABAD|ఐఐటీ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహణ ఐటీ రంగంలో స్టార్టప్ కంపెనీలను అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) ప్రోత్సహించడం అభినందనీయం అని పలువురు...

రైజింగ్ రేవంత్!|RAISING|REVANTH REDDY|CM

పిచ్చ పీక్స్ సీఎం ఇమేజీ గ్రాఫ్!! -డా. మార్గం లక్ష్మీనారాయణ 6 ఖండాలు, 42దేశాలు, 154మంది అతిథులు, 1686 మంది ప్రతినిధులు, అనేక మంది ప్రముఖుల మధ్య తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8, 9...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News