Trending News
Thursday, October 2, 2025
22.8 C
Hyderabad
Trending News

పేదల పెన్నిధి, ప్రజల పక్షపాతి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి!|EDITORIAL

ఉప రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డిని ఏకగీవ్రంగా ఎంపిక చేయడంతో ఎన్నిక అనివార్యం అయింది. బలాబలాలను బట్టి ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్‌ గెలుపు లాంఛనమే. అయితే ఈ రెండు అభ్యర్థిత్వాలు అద్భుతమైనవే. వాళ్ల రంగాల్లో వారు అత్యున్నతంగా నిలిచారు. ఈ ఎన్నిక ద్వారా దేశంలోని అత్యున్నత వ్యక్తుల వ్యక్తిత్వాలను, పనితీరును, సమర్థతను తెలుసుకునే సదవకాశం ప్రజలకు దక్కింది. అయితే మోదీ ప్రధాని అయిన తర్వాత గత మూడు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ దక్షిణాదికి చెందని వ్యక్తులే అభ్యర్థులుగా నిలిచే అవకాశం రావడం విశేషం. అందులోనూ ఆంధ్రాకు చెందిన వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి కాగా, ఇప్పుడు తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిగా నిలుస్తుండటం దక్షిణాదికి మాత్రమే కాదు, దేశానికి కూడా గర్వకారణం.

ఇప్పటివరకు 16 ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగగా, సర్వేపల్లి రాధాకృష్ణన్‌, గోపాల్‌ స్వరూప్‌ పాఠక్‌, జస్టిస్‌ మహమ్మద్‌ హిదయతుల్లా, శంకర్‌దయాళ్‌శర్మలు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన అన్ని ఎన్నికల్లో ప్రతిపక్షాలు తమ అభ్యర్థులను నిలబెట్టాయి. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టాక 2017లో తొలిసారి జరిగిన ఎన్నికలో అధికారపార్టీ అభ్యర్థి వెంకయ్యనాయుడుపై ప్రతిపక్షాలు గోపాలకృష్ణ గాంధీని నిలబెట్టాయి. 2022లో జరిగిన ఎన్నికలో జగదీప్‌ ధన్‌ఖడ్‌పై కర్ణాటకకు చెందిన మార్గరెట్‌ అల్వాను రంగంలోకి దింపాయి. ఇప్పుడు తెలంగాణకు చెందిన జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేశాయి. ఈ మూడు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ప్రతిపక్షాల అభ్యర్థులు దక్షిణాదివారే కావడం విశేషం.

ఫలితాలేమైనప్పటికీ జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి ప్రగతిశీల న్యాయ కోవిదుడు. నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా ఉండే వ్యక్తి. ఆయన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఇచ్చిన తీర్పులను పరిశీలిస్తే ఇది అర్థం అవుతుంది. ఆయన సుదీర్ఘ కాలం ఎన్నో హోదాల్లో పనిచేశారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం నిరంతరం ధైర్యంగా పోరాడారు. అంతకుమించి పేదల పక్షపాతిగా పేరుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్యనాయుడు తర్వాత పోటీ చేస్తున్న రెండో తెలుగు వ్యక్తి.

జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి 1946 జులై 8న రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 1971లో ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో పట్టా పొంది అదే సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. సీనియర్‌ న్యాయవాది కె.ప్రతాప్‌రెడ్డి వద్ద జూనియర్‌గా చేరారు. హైదరాబాద్‌ సిటీ- సివిల్‌కోర్టు, హైకోర్టుల్లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 1988-90 మధ్య హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. 1990లో ఆరు నెలలపాటు- కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు స్టాండింగ్‌ కౌన్సిల్‌గానూ పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి న్యాయ సలహాదారుగా, స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలందించారు. 1993లో ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1995 మే 2న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005 డిసెంబరు 5న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2007 జనవరి 12 నుంచి 2011 జులై 7 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. 2013 మార్చిలో గోవా తొలి లోకాయుక్తగా నియమితులయ్యారు. ఆనాటి గోవా సిఎం పణిక్కర్‌ ఏరికోరి సుదర్శన్‌ రెడ్డిని లోకాయుక్తకు నియమించారు. పారికర్ అంచనాలకు మించి, అత్యంత సమర్థవంతంగా, పారదర్శకంగా ఆ పదవిని నిర్వహించి వన్నె తెచ్చారు. ప్రస్తుతం ఐఏఎంసీ శాశ్వత ట్రస్టీగా, బీసీ కులగణన అధ్యయన కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.

జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి మానవ హక్కుల పరిరక్షణకు పెద్దపీట వేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పలు కీలక తీర్పులు వెలువరిం చారు. ఛత్తీస్‌గఢ్‌లో తీవ్రవాదులను ఎదుర్కోవడానికి ఏర్పడిన సల్వాజుడుంను నిషేధిస్తూ తీర్పు ఇచ్చారు. మానవ హక్కుల పరిరక్షణ, చట్టబద్ధ పాలన లక్ష్యంగా ఈ తీర్పు వెలువరించారు. ఆర్మీ వైద్య కళాశాలలో పదవీ విరమణ పొందిన సైనికులు, సైనిక సిబ్బంది వితంతువుల పిల్లలకు అడ్మిషన్‌లు నిరాకరించడం చెల్లదని, దీనివల్ల అణగారిన వర్గాలకు న్యాయం జరగదన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించడంలో భాగంగా న్యాయమూర్తులపై ఆరోపణలతో వచ్చే ప్రజాప్రయోజన పిటిషన్‌లను అనుమతించరాదని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తూ అసైన్డ్‌ భూములకు భూసేకరణ చట్టం కింద చట్టబద్ధమైన పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
ఇప్పటి వరకు ఉప రాష్ట్రపతిగా ఉన్న జగదీప్‌ దన్‌ఖడ్‌ పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తొలిరోజే రాజీనామా చేశారు. ఈ హఠాత్పరిణామం, ఉప రాష్ట్రపతి పదవి విలువపై చర్చకు దారితీసింది. ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌తో పోటీకి నిలబెట్టేందుకు జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని ఇండియా కూటమి ఎంపిక చేసింది. సుదర్శన్‌రెడ్డి గతంలో నిజాయితీతో నడిచిన న్యాయకోవిదుడు.
మొత్తంగా ఇప్పుడుసుదర్శన్‌ రెడ్డి వ్యక్తిత్వం, అతని తీర్పుల గురించి ప్రజలు తెలుసుకునే అవకాశం వచ్చింది. ఓ రకంగా ఇది సుదర్శన్‌ రెడ్డ ఔన్నత్యాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చే ఎన్నికగా చూడాలి.

Latest News

శుక్రవారం అక్టోబర్ 03 –2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం ఏకాదశి తిధి ఏకాదశి పగలు 02.28 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం శ్రవణ ఉదయం 06.46 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ధృతి రాత్రి 06.46 వరకు ఉపరి శూల కరణం భద్ర సాయంత్రం...

ఓ మహాత్మా..|POETRY

నిన్న,నేడు,రేపు రోజు ఏదైనా వాదం ఒక్కటే 'గాంధేయవాదం' ఇది నొప్పి తెలియకుండా సూదిచ్చే యంత్రం కొట్టకనే దెబ్బలు చరిచే తంత్రం ఎదుటి వానిలో ఆలోచన రేపే మంత్రం 'మహాత్మాగాంధీ' శాంతికి బ్రాండ్ అంబాసిడర్ నాయకత్వానికి నిదర్శనం ఉద్యమానికి ఊపిరి మొత్తానికి భారతదేశ 'మనిమకుటం' ఒక్కమాటతో జనాలకు జవసత్వాలు నింపి స్వతంత్ర భావజాలాన్ని పంచి అలుపెరుగని...

విజయదశమి అంటే ఏంటి? దసరాను ఎలా ఆచరించాలి?|ESSAY|ARTICLES

కృతయుగంలో రాక్షస సంహారంలో భాగంగా ఆది పరాశక్తి శుంభ నిశుంభ రక్తబీజ మొదలైన రాక్షసులతో పాటు మహిషాసురుడిని సంహరించి లోక రక్షణ చేసిన కారణంగా ఆ రోజు ఆనందంగా అమ్మవారిని ఆరాధించాలి అనుగ్రహం...

గీ బ్లడ్ గ్రూపున్నోల్లు తొందరగ సావరట!?|ADUGU TRENDS

మనిసికి లోకం మీద పేమ కంటే, పానం మీద తీపే ఎక్కువ. ఎవలికైనా శానా కాలం బతకాల్ననే ఉంటది. గదైతాది. ఎవలికి ఎంత రాసి పెట్టి ఉంటే గంతే? అనుకుంటుం గనీ, ఇగో.....

దసరా వైశిష్ట్యం విజయోస్తు!|EDITORIAL

హిందువులు జరుపుకునే పండగలలో దసరా పండగకు విశిష్ట స్థానం ఉంది. ఈ విజయ దశమికి సంబంధించి పలు పురాణగాథలు చెలామణిలో ఉన్నాయి. రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం...

గురువారం అక్టోబర్ 02 –2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం విజయదశమి దసరాపండుగ గాంధీ జయంతి తిధి దశమి పగలు 02.38 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.03 వరకు ఉపరి శ్రవణ యోగం సుకర్మ రాత్రి 08.03 వరకు ఉపరి ధృతి కరణం...

డైబర్ లేని ఆటోలొత్తానయి!?|ADUGU TRENDS

ఇగో గీ ఆటోలకు డైబరుండడు. ఇగ మనం గా ఆటో ఎక్కి యేడికి పోవాల్నో సెప్తె సక్కగ గాడికే తీస్కపోతది. గదేంది? పట్నాలల్ల రద్దీ ఉంటది గదా? గదెట్ల తీస్కపోతది? మనమెట్ల పోతం?...

ఆదివాసీల అస్తిత్వ పోరాటం!|EDITORIAL

“ఆదివాసులు” మూల వాసులు. భారత దేశంలోని స్వదేశీ జనజాతులు. ప్రత్యేక సంప్రదాయ జీవన విధానం, భూభాగాలు, వనరులు, భాషలు, సంస్కృతులు కలిగి ఉన్న సమాజాలు. “లంబాడీలు లేదా బంజారాలు” ప్రత్యేక సంప్రదాయ జీవన...

బుధవారం అక్టోబర్ 01–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం మహర్నవమి తిధి నవమి పగలు 02.19 వరకు ఉపరి దశమి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా యోగం అతిగండ రాత్రి 08.56 వరకు సుకర్మ కరణం కౌలవ సాయంత్రం 04.18 వరకు గరజి వర్జ్యం పగలు 01.24...

క్రికెట్ ను ఆటగానే చూడాలి!|EDITORIAL

‘ఓటమి చావు కన్నా భయంకరమైంది.’ ప్రపంచంలో, జీవితంలో గెలుపోటములు లేనిదెక్కడ? కానీ, యుద్ధంలో గెలుపోటములు గెలిచినా, ఓడినా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. యుద్ధంలో చావు అమరత్వాన్నిస్తే, ఒక్కోసారి క్రీడల్లో ఓటమి మరణశాసనాన్ని కూడా...

ఆ స్నేహితులను చూసి స్నేహమే సలాం చేసింది!|FRIENDSHIP

పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు సమయంలో ఎప్పుడు.. ఎప్పుడాని కండ్లల్లో వొత్తులేసుకొని సూడాల్సిన స్థితి వొచ్చింది. యెందుకంటే గతంలో కరోనా సమయంలో ముందొకసారి, ఆ తర్వాతొకసారి, మళ్లీ రెండు సమయాల్లో మా ఆత్మీయ...

యెహె తియ్! గీ ఆటకు వానడ్డమా?|ADUGU TRENDS

యేడాదికోపాలొచ్చే పండుగాయె. తీరొక్క పూలతో పాడి, ఆడే ఆటాయె. ఇగ గా వానదేవునికి కండ్లు కుట్టి, కుండపోత పోయబట్టె. ఇగ గిదంత పని గాదని, గా ఆడోళ్ళు ఏం చేసిండ్లో సూత్తె మీరు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News