Trending News
Thursday, October 2, 2025
22.8 C
Hyderabad
Trending News

యూరియాపైనా రాజకీయ అరాచకమేనా!?|EDITORIAL

దేశంలో ఒక విచిత్రం వితండం చేస్తోంది. ఒకవైపు రైతులు తమ చెప్పులు కూడా పెట్టి, గంటలు, రోజుల తరబడి నిలబడి క్యూలైన్లు కడుతున్నారు. మరోవైపు పార్లమెంటులో విపక్ష ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం యూరియాపై పెద్దగా స్పందించడంలేదు. పైగా రైతుల పక్షాన గొంతెత్తిన ఎంపీల గొంతునొక్కుతోంది. ఎదురుదాడికి దిగుతోంది. యూరియా కొరత లేదని బుకాయిస్తున్నది. అన్నదాతలకు, ఆహారంగా వచ్చే పంటలకవసరమైన యూరియాను రాజకీయం చేస్తున్న దురుద్రుష్టం మన దేశంలోనే ఉన్నందుకు సిగ్గులేని మన నేతలను చూసి, మనమంతా సిగ్గుపడాలి.
పంటల సాగుకు అవసరమైన నత్రజని ఎరువులలో యూరియా ప్రధానమైంది. యూరియా వినియోగం పంటల సాగుపై ఆధారపడి ఉంటుంది. వరి, గోధుమ వంటి పంటలకు యూరియా చాలా అవసరం. దేశీయంగా యూరియా ఉత్పత్తి సరిపోనందున, దిగుమతులు కూడా చేసుకుంటున్నాం. యూరియా కొరత పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అది 10 నుంచి 20శాతం వరకు ఉంటుందని అంచనా. రష్యా, అమెరికా, ఉజ్బెకిస్తాన్ దేశాలు అత్యధికంగా ప్రపంచానికి యూరియా ఎగుమతులు చేస్తుండగా, మన దేశం యూరియా వినియోగంలో రెండో అతి పెద్ద దేశంగా ఉంది. మన ఉత్పత్తులకు మించి, అవసరాలు తీరడానికి ఒమన్, చైనా, ఖతార్, రష్యా, సౌదీ అరేబియా నుండి దిగుమతి కూడా చేసుకుంది. అయితే, ప్రభుత్వాల దగ్గర దేశంలో రైతాంగానికి అవసరమైన యూరియా అంచనాలే తప్ప కచ్చితమైన లెక్కలు లేకపోవడం విచాకరమే కాదు. విషాదం కూడా. అయితే దేశంలో ప్రతి ఏటా 3 కోట్ల 60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం అవుతున్నట్లు అంచనా. 2023–24 ఏడాదిలో ఒక్క తెలంగాణలోనే 20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం జరగగా, దేశంలో 3కోట్ల 58 లక్షల 80వేల మెట్రిక్ టన్నులు వినియోగించినట్లు కేంద్రం నివేదిక తెలుపుతోంది.
తెలంగాణలో ఖరీఫ్ కి 10 లక్షల 48వేల మెట్రిక్ టన్నులు అవసరముండగా, కేవలం 9 లక్షల 80వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా జరిగింది. ఆగస్టు ఒక నెలలోనే మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల డిమాండ్ ఉండగా, కేవలం లక్షా 70వేల మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉందని సమాచారం.

2024 ఖరీఫ్‌లో ఏపీ యూరియా వినియోగం 6.32 లక్షల టన్నులు కాగా 2025లో 6.22 లక్షల టన్నులకు కేటాయింపు తగ్గింది. జులైలో 3.05 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా 2.85 లక్షల టన్నులే వచ్చాయి. ఒకవైపు యూరియా కేటాయింపులు 5 శాతం నుంచి 10శాతం తగ్గుతుండగా, మరోవైపు వినియోగం 15 శాతం నుంచి 20శాతం పెరుగుతోంది.
గత ఖరీఫ్‌లో నైరుతి రుతుపవనాలు ముందే ప్రవేశించడంతో సీజన్‌ నెల రోజులు ముందుకొచ్చింది. రైతులు మందస్తుగానే పంటలు వేశారు. దీంతో వినియోగం నెల ముందు నుంచే ప్రారంభమైంది. దీంతో ఒక్కసారిగా డిమాండ్ కూడా ముందుగానే పెరిగింది. చాలీచాలని యూరియా తక్కువతోపాటు ఆలస్యంగా అందుబాటులోకి రావడంతో రైతుల ఆందోళన అంతా ఇంతా కాదు. ఇక ప్రభుత్వం రూ.242 రూపాయల నిర్ణయించిన 45 కిలోల యూరియా బస్తా, బ్లాక్ మార్కెట్ లో రూ.350 నుంచి 450 వరకు నడుస్తోంది.
ఇందుకే ఇప్పుడు రైతులు యూరియా అందక క్యూలో నిలబడుతుంటే, పార్లమెంటులో విపక్షాలు యూరియా కేటాయింపుల కోసం తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగాఉన్నందున ఏపీ అధికార కూటమి ఎంపీ ఆందోళనలకు దూరం గప్ చుప్ గా ఉండగా, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. తెలంగాణకు ఇంకా 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉందని, వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా యూరియా కొరత ఇలా ఉండగా, తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్, దాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంగా ఆరోపిస్తోంది. బీజేపీ ఎంపీలు, నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. భారాన్ని రైతుల మీదకు తోసేశారు. అన్నదాతల అవసరాలపై కూడా రాజకీయం చేసే సిగ్గుమాలిన అరాచకం తాండవిస్తుండటం శోచనీయం.
కేంద్రం ఎరువుల కేటాయింపులను తగ్గిస్తుంటే, అధికార ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు, కేంద్ర మంత్రులు మౌనముద్ర దాల్చారు. రైతుల తరపున ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం చేయడం లేదు. ఎన్‌డీఏ ఎంపీలు మాటమాత్రానికైనా ప్రధాని మోదీకి చెప్పలేకపోతున్నారు.
వ్యవసాయరంగంపై సరైన అవగాహన లేని పాలకుల తీరుకారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా ఎంత ఇచ్చాం..ఎంత అవసరం అన్నది కూడా తెలియకుండా విమర్శలతో కాలం గడిపితే నష్టపోయేది రైతులే. రైతులకు అసవరమైన ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల కోసం రోడ్డెక్కకుండా చూడడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం.
ఎరువులపై రైతులకు ఇచ్చే సబ్సిడీని భారంగా భావించిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులను తగ్గిస్తూ వస్తోంది. వ్యవసాయం, పర్యావరణం, ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే. ఇందుకు ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. రైతులను చైతన్యపరచడం వంటి తగిన కార్యాచరణ లేకుండానే కోతలు విధించడం, పైగా అమ్మకాలపై ఆంక్షలు పెట్టడం సరికాదు. ధరలు, తెగుళ్లు, నీటికొరత, ఇత్యాది కారణాలతో రైతులు పంటలను మారుస్తున్నారు. యూరియా డిమాండ్‌కు ఇది కూడా కారణం. ఇవన్నీ కలిసి రైతును రోడ్డున పడేస్తున్నాయి.

Latest News

శుక్రవారం అక్టోబర్ 03 –2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం ఏకాదశి తిధి ఏకాదశి పగలు 02.28 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం శ్రవణ ఉదయం 06.46 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ధృతి రాత్రి 06.46 వరకు ఉపరి శూల కరణం భద్ర సాయంత్రం...

ఓ మహాత్మా..|POETRY

నిన్న,నేడు,రేపు రోజు ఏదైనా వాదం ఒక్కటే 'గాంధేయవాదం' ఇది నొప్పి తెలియకుండా సూదిచ్చే యంత్రం కొట్టకనే దెబ్బలు చరిచే తంత్రం ఎదుటి వానిలో ఆలోచన రేపే మంత్రం 'మహాత్మాగాంధీ' శాంతికి బ్రాండ్ అంబాసిడర్ నాయకత్వానికి నిదర్శనం ఉద్యమానికి ఊపిరి మొత్తానికి భారతదేశ 'మనిమకుటం' ఒక్కమాటతో జనాలకు జవసత్వాలు నింపి స్వతంత్ర భావజాలాన్ని పంచి అలుపెరుగని...

విజయదశమి అంటే ఏంటి? దసరాను ఎలా ఆచరించాలి?|ESSAY|ARTICLES

కృతయుగంలో రాక్షస సంహారంలో భాగంగా ఆది పరాశక్తి శుంభ నిశుంభ రక్తబీజ మొదలైన రాక్షసులతో పాటు మహిషాసురుడిని సంహరించి లోక రక్షణ చేసిన కారణంగా ఆ రోజు ఆనందంగా అమ్మవారిని ఆరాధించాలి అనుగ్రహం...

గీ బ్లడ్ గ్రూపున్నోల్లు తొందరగ సావరట!?|ADUGU TRENDS

మనిసికి లోకం మీద పేమ కంటే, పానం మీద తీపే ఎక్కువ. ఎవలికైనా శానా కాలం బతకాల్ననే ఉంటది. గదైతాది. ఎవలికి ఎంత రాసి పెట్టి ఉంటే గంతే? అనుకుంటుం గనీ, ఇగో.....

దసరా వైశిష్ట్యం విజయోస్తు!|EDITORIAL

హిందువులు జరుపుకునే పండగలలో దసరా పండగకు విశిష్ట స్థానం ఉంది. ఈ విజయ దశమికి సంబంధించి పలు పురాణగాథలు చెలామణిలో ఉన్నాయి. రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం...

గురువారం అక్టోబర్ 02 –2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం విజయదశమి దసరాపండుగ గాంధీ జయంతి తిధి దశమి పగలు 02.38 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.03 వరకు ఉపరి శ్రవణ యోగం సుకర్మ రాత్రి 08.03 వరకు ఉపరి ధృతి కరణం...

డైబర్ లేని ఆటోలొత్తానయి!?|ADUGU TRENDS

ఇగో గీ ఆటోలకు డైబరుండడు. ఇగ మనం గా ఆటో ఎక్కి యేడికి పోవాల్నో సెప్తె సక్కగ గాడికే తీస్కపోతది. గదేంది? పట్నాలల్ల రద్దీ ఉంటది గదా? గదెట్ల తీస్కపోతది? మనమెట్ల పోతం?...

ఆదివాసీల అస్తిత్వ పోరాటం!|EDITORIAL

“ఆదివాసులు” మూల వాసులు. భారత దేశంలోని స్వదేశీ జనజాతులు. ప్రత్యేక సంప్రదాయ జీవన విధానం, భూభాగాలు, వనరులు, భాషలు, సంస్కృతులు కలిగి ఉన్న సమాజాలు. “లంబాడీలు లేదా బంజారాలు” ప్రత్యేక సంప్రదాయ జీవన...

బుధవారం అక్టోబర్ 01–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం మహర్నవమి తిధి నవమి పగలు 02.19 వరకు ఉపరి దశమి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా యోగం అతిగండ రాత్రి 08.56 వరకు సుకర్మ కరణం కౌలవ సాయంత్రం 04.18 వరకు గరజి వర్జ్యం పగలు 01.24...

క్రికెట్ ను ఆటగానే చూడాలి!|EDITORIAL

‘ఓటమి చావు కన్నా భయంకరమైంది.’ ప్రపంచంలో, జీవితంలో గెలుపోటములు లేనిదెక్కడ? కానీ, యుద్ధంలో గెలుపోటములు గెలిచినా, ఓడినా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. యుద్ధంలో చావు అమరత్వాన్నిస్తే, ఒక్కోసారి క్రీడల్లో ఓటమి మరణశాసనాన్ని కూడా...

ఆ స్నేహితులను చూసి స్నేహమే సలాం చేసింది!|FRIENDSHIP

పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు సమయంలో ఎప్పుడు.. ఎప్పుడాని కండ్లల్లో వొత్తులేసుకొని సూడాల్సిన స్థితి వొచ్చింది. యెందుకంటే గతంలో కరోనా సమయంలో ముందొకసారి, ఆ తర్వాతొకసారి, మళ్లీ రెండు సమయాల్లో మా ఆత్మీయ...

యెహె తియ్! గీ ఆటకు వానడ్డమా?|ADUGU TRENDS

యేడాదికోపాలొచ్చే పండుగాయె. తీరొక్క పూలతో పాడి, ఆడే ఆటాయె. ఇగ గా వానదేవునికి కండ్లు కుట్టి, కుండపోత పోయబట్టె. ఇగ గిదంత పని గాదని, గా ఆడోళ్ళు ఏం చేసిండ్లో సూత్తె మీరు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News