Trending News
Thursday, October 2, 2025
22.8 C
Hyderabad
Trending News

అప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర్యం సిద్ధించినట్లు!|INDIA|INDEPENDENCE DAY

1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్యం సాధించింది. రెండు శతాబ్దాలపాటు బ్రిటిష్ పాలనలో నలిగిపోయిన మన దేశం, ఎన్నో త్యాగాలు, పోరాటాలు, ప్రాణ త్యాగాలతో ఆ బంధనాల నుంచి విముక్తి పొందింది. అప్పట్లో స్వాతంత్ర్య సమరయోధులు స్వేచ్ఛతో పాటు అభివృద్ధి, సమానత్వం, సుఖశాంతులు నిండిన భారతావనిని కలగన్నారు. భవిష్యత్తు తరాలు సమృద్ధి చెందిన దేశంలో జీవించాలని కోరుకున్నారు.

దేశంలో రవాణా, విద్య, సాంకేతికత, వైద్యం వంటి రంగాల్లో పురోగతి కనిపించినా, అది సమగ్రాభివృద్ధిగా చెప్పుకోదగినంత స్థాయికి చేరుకోలేదు. మన తర్వాత చాలా కాలానికి స్వాతంత్ర్యం పొందిన దేశాలు ఆర్థికపరంగా, సామాజికంగా, సాంకేతికంగా మన దేశాన్ని ఎప్పుడో దాటిపోయాయి. ప్రధానంగా అవినీతి, రాజకీయ అస్థిరత, అసమాన వనరుల పంపిణీ, పౌరులలో బాధ్యతాభావం, సమర్థమైన ప్రణాళికల లోపం వంటి అంశాలు మన అభివృద్ధికి అడ్డంకులు అయ్యాయి. మొదటి కొన్ని దశాబ్దాలు దేశ పునర్నిర్మాణం, ఆహార భద్రత, ప్రాథమిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినా, దీర్ఘకాల దృష్టి, సమన్వయం, అమలు సామర్థ్యం లోపించాయి.

ముఖ్యంగా, రాజకీయ నాయకత్వం తమ స్వప్రయోజనా లకన్నా దేశ ప్రయోజనాలను ముందుకు పెట్టడంలో విఫలమైంది. అభివృద్ధి ప్రాజెక్టులు, సంస్కరణలు చాలా చోట్ల కాగితాల మీదే మిగిలిపోయాయి. కొన్ని మంచి విధానాలు అమలులోకి వచ్చినా, వాటి ప్రభావం సర్వసాధారణ ప్రజల జీవన ప్రమాణాల్లో సరిగా కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో యువత పాత్ర అత్యంత కీలకమైనది. యువత మార్పు కోసం పని చేయాలి. కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా, క్షేత్ర స్థాయిలో పనిచేయాలి. విద్య, నైపుణ్యం, కొత్త ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానం, సమ సమాజం పట్ల బాధ్యత ఇవన్నీ యూత్ కు బలం. ఈ బలాన్ని దేశ నిర్మాణానికి వినియోగించాలి.

దేశాభివృద్ధి అంటే కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాదు. సమాన అవకాశాలు, అవినీతి రహిత పాలన, పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం, ప్రజల ఆరోగ్య భద్రత, విద్యా ప్రమాణాల పెంపు ఇవన్నీ కలిస్తేనే నిజమైన అభివృద్ధి. అందుకు యూత్ ముందుకు రావాలి. రాజకీయ రంగంలో నిజాయితీ గల నాయకత్వం కోసం యువత నడుం బిగించాలి. మార్పు ఒక్కరోజులో రాదు. దానికి సహనం, కృషి, దీక్ష అవసరం. దేశభక్తి అంటే కేవలం జెండా ఎగరేయడం కాదు. జాతీయ గీతం పాడటం కాదు. ప్రతి పనిలోనూ అవి ప్రతిబింబించాలి. ఒక విద్యార్థి చదువులో ప్రతిభను చూపడం, ఒక రైతు కొత్త పంటలు పండించడం, ఒక వ్యాపారి నిజాయితీగా పన్నులు చెల్లించడం, ఒక ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా విధులు నిర్వర్తించడం లాంటివి కలిసే దేశాభివృద్ధికి తోడ్పడతాయి.

ఇప్పటికైనా మనం మేల్కొనాలి. దేశం నాకేమిచ్చిందని కాకుండా, దేశానికి మనమేమిచ్చామన్నదే ముఖ్యం. స్వాతంత్ర్యం సాధించిన 78 ఏళ్ల తరువాత కూడా ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. గడచిన కాలం పాఠాలు మనకు మార్గదర్శకాలు కావాలి. భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మన దేశం నిజమైన అభివృద్ధి దిశగా పయనించాలంటే, యువత కంకణబద్ధులై, నిస్వార్థంగా, దృఢ సంకల్పంతో దేశ సేవలో తలమునకలవ్వాలి. అప్పుడే మన జాతి నేతలు కలలగన్న పురోగామిక భారతం, సమగ్రాభివృద్ధి, సమానత్వం, సుఖశాంతులు నిండిన దేశం వాస్తవ రూపం దాల్చుతుంది. అప్పుడే మనది నిజమైన స్వాతంత్ర్యం అవుతుంది.

-సాయి సందేశ్ మార్గం
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,
‘అడుగు’ డిజిటల్ మీడియా

Latest News

శుక్రవారం అక్టోబర్ 03 –2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం ఏకాదశి తిధి ఏకాదశి పగలు 02.28 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం శ్రవణ ఉదయం 06.46 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ధృతి రాత్రి 06.46 వరకు ఉపరి శూల కరణం భద్ర సాయంత్రం...

ఓ మహాత్మా..|POETRY

నిన్న,నేడు,రేపు రోజు ఏదైనా వాదం ఒక్కటే 'గాంధేయవాదం' ఇది నొప్పి తెలియకుండా సూదిచ్చే యంత్రం కొట్టకనే దెబ్బలు చరిచే తంత్రం ఎదుటి వానిలో ఆలోచన రేపే మంత్రం 'మహాత్మాగాంధీ' శాంతికి బ్రాండ్ అంబాసిడర్ నాయకత్వానికి నిదర్శనం ఉద్యమానికి ఊపిరి మొత్తానికి భారతదేశ 'మనిమకుటం' ఒక్కమాటతో జనాలకు జవసత్వాలు నింపి స్వతంత్ర భావజాలాన్ని పంచి అలుపెరుగని...

విజయదశమి అంటే ఏంటి? దసరాను ఎలా ఆచరించాలి?|ESSAY|ARTICLES

కృతయుగంలో రాక్షస సంహారంలో భాగంగా ఆది పరాశక్తి శుంభ నిశుంభ రక్తబీజ మొదలైన రాక్షసులతో పాటు మహిషాసురుడిని సంహరించి లోక రక్షణ చేసిన కారణంగా ఆ రోజు ఆనందంగా అమ్మవారిని ఆరాధించాలి అనుగ్రహం...

గీ బ్లడ్ గ్రూపున్నోల్లు తొందరగ సావరట!?|ADUGU TRENDS

మనిసికి లోకం మీద పేమ కంటే, పానం మీద తీపే ఎక్కువ. ఎవలికైనా శానా కాలం బతకాల్ననే ఉంటది. గదైతాది. ఎవలికి ఎంత రాసి పెట్టి ఉంటే గంతే? అనుకుంటుం గనీ, ఇగో.....

దసరా వైశిష్ట్యం విజయోస్తు!|EDITORIAL

హిందువులు జరుపుకునే పండగలలో దసరా పండగకు విశిష్ట స్థానం ఉంది. ఈ విజయ దశమికి సంబంధించి పలు పురాణగాథలు చెలామణిలో ఉన్నాయి. రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం...

గురువారం అక్టోబర్ 02 –2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం విజయదశమి దసరాపండుగ గాంధీ జయంతి తిధి దశమి పగలు 02.38 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.03 వరకు ఉపరి శ్రవణ యోగం సుకర్మ రాత్రి 08.03 వరకు ఉపరి ధృతి కరణం...

డైబర్ లేని ఆటోలొత్తానయి!?|ADUGU TRENDS

ఇగో గీ ఆటోలకు డైబరుండడు. ఇగ మనం గా ఆటో ఎక్కి యేడికి పోవాల్నో సెప్తె సక్కగ గాడికే తీస్కపోతది. గదేంది? పట్నాలల్ల రద్దీ ఉంటది గదా? గదెట్ల తీస్కపోతది? మనమెట్ల పోతం?...

ఆదివాసీల అస్తిత్వ పోరాటం!|EDITORIAL

“ఆదివాసులు” మూల వాసులు. భారత దేశంలోని స్వదేశీ జనజాతులు. ప్రత్యేక సంప్రదాయ జీవన విధానం, భూభాగాలు, వనరులు, భాషలు, సంస్కృతులు కలిగి ఉన్న సమాజాలు. “లంబాడీలు లేదా బంజారాలు” ప్రత్యేక సంప్రదాయ జీవన...

బుధవారం అక్టోబర్ 01–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం మహర్నవమి తిధి నవమి పగలు 02.19 వరకు ఉపరి దశమి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా యోగం అతిగండ రాత్రి 08.56 వరకు సుకర్మ కరణం కౌలవ సాయంత్రం 04.18 వరకు గరజి వర్జ్యం పగలు 01.24...

క్రికెట్ ను ఆటగానే చూడాలి!|EDITORIAL

‘ఓటమి చావు కన్నా భయంకరమైంది.’ ప్రపంచంలో, జీవితంలో గెలుపోటములు లేనిదెక్కడ? కానీ, యుద్ధంలో గెలుపోటములు గెలిచినా, ఓడినా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. యుద్ధంలో చావు అమరత్వాన్నిస్తే, ఒక్కోసారి క్రీడల్లో ఓటమి మరణశాసనాన్ని కూడా...

ఆ స్నేహితులను చూసి స్నేహమే సలాం చేసింది!|FRIENDSHIP

పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు సమయంలో ఎప్పుడు.. ఎప్పుడాని కండ్లల్లో వొత్తులేసుకొని సూడాల్సిన స్థితి వొచ్చింది. యెందుకంటే గతంలో కరోనా సమయంలో ముందొకసారి, ఆ తర్వాతొకసారి, మళ్లీ రెండు సమయాల్లో మా ఆత్మీయ...

యెహె తియ్! గీ ఆటకు వానడ్డమా?|ADUGU TRENDS

యేడాదికోపాలొచ్చే పండుగాయె. తీరొక్క పూలతో పాడి, ఆడే ఆటాయె. ఇగ గా వానదేవునికి కండ్లు కుట్టి, కుండపోత పోయబట్టె. ఇగ గిదంత పని గాదని, గా ఆడోళ్ళు ఏం చేసిండ్లో సూత్తె మీరు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News