Saturday, March 28, 2026
35.2 C
Hyderabad

ప్రజల పక్షపాతి ప్రభంజన్!|PRABHANJAN YADAV

ప్రభంజన్ కుమార్ యాదవ్ ప్రతిభ గల జర్నలిస్టు, కవి, రచయిత, వరంగల్ జిల్లా వాసి. కాకతీయ విశ్వ విద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యిండు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. భాషా శాస్త్రం, మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ & జర్నలిజం (ఎం.సి.జె.) చదివిండు. రూరల్ & డెవలప్మెంట్ కమ్యూనికేషన్ ఐచ్ఛికంగా ఎం.ఫిల్ పూర్తి చేసిండు.

1988 నుంచి వివిధ తెలుగు పత్రికల్లో దశాబ్ద కాలం జర్నలిస్టుగా పనిచేసిండు. జర్నలిజంలో నిలదొక్కుకోవాలనుకున్నడు. 1998లో భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో క్షేత్ర ప్రచార శాఖ అధికారిగా ఉద్యోగం వచ్చింది. విధి నిర్వహణలో భాగంగా, స్వభావ రీత్యా నిత్యం ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో నిమగ్నమైండు. ఆత్మవంచన, శక్తివంచన లేకుండా ప్రజల కోసం పనిచేసే బహుకొద్దిమంది ప్రభుత్వ అధికారుల్లో ప్రభంజన్ కుమార్ యాదవ్ ఒకడు.

స్వభావ రీత్యా ప్రభంజన్ చాల సెన్సిటివ్. పేద ప్రజల పట్ల, ఉత్పత్తి కులాల పట్ల అభిమానం, ఆదరణ గల వ్యక్తి అనడానికి ఆయన రచనలే ప్రత్యక్ష సాక్ష్యం. జర్నలిస్టుగా ప్రభంజన్ వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలను పుస్తకంగా తీసుకురావడం సంతోషం. నడుస్తున్న చరిత్రను సజీవంగా చిత్రీకరించే ప్రయత్నం ప్రభంజన్ ది. నిజాలను నిర్భయంగా రాసే సాహసం ఆయన కలానిది. అన్యాయం ఏ రూపంలో ఉన్నా ప్రశ్నించడం ప్రభంజన్ మనస్తత్వం. రాగద్వేషాలకు అతీతంగా ఉండే ప్రయత్నం ఆయనది. ఏ రోటికాడి మాట ఆ రోటికాడ చెప్పడం చాతకానివాడు. నొప్పించక తానొవ్వక తప్పించుక తిరగటం తెలియనివాడు. నిష్టూరమైనా పరవాలేదని నిగ్గు తేల్చాలనుకునేవాడు. కష్టాలకు, నష్టాలకు వెరవడు. ఏటికి ఎదురీదడమే తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభంజన్ ప్రజల పక్షపాతి. ఆయన రచనల్లో ప్రతిబింభించిన ఉత్పత్తి కులాల ఆవేదన, బీదల బాధలు అందుకు నిదర్శనం. ప్రజల ఆలోచనలకు, ఆవేదనలకు ప్రభంజన్ అక్షర నివేదనే ఈ వ్యాస సంకలనం.

‘ప్రభంజన పథం’
“గొల్లల సంస్కృతి-గొప్ప సంస్కృతి” అనే పరిశోధన వ్యాసంతో మొదలైంది ఈ పుస్తకం. ఈ సమాజానికి తన కులం ‘అయిదు రకాల పరిశ్రమలను, ఉత్పత్తులను అందించినందుకు ప్రతిఫలం అవమానమా?’ అని ప్రభంజన్ నిలదీసిండు. శ్రమను గౌరవించని దోపిడి సంస్కృతిని ఈసడించుకున్నడు. వెట్టిచాకిరి చేస్తున్న రజకుల కష్టాలు తీరాలన్నడు. గీత కార్మికులకు ఊతం యివ్వాలని, వెలవెల బోతున్న నేతగాళ్ల బతుకుల్లో వెలుగులు నింపాలన్న ఆశతో రాసిండు. మూలవాసుల విముక్తి బాటలో కలిసి పయనించిండు. దళిత గేయాలు రాసి పల్లవి కలిపిండు. దళిత రచయితల, కళాకారుల, మేధావుల (దరకమే) ఐక్యవేదికలో, నాస్తిక సంఘంలో పనిచేసిండు. రచనలు, ఉపన్యాసాలతోనే ఊర్కోలేదు. ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొన్నడు. జన చైతన్యం కోసం సంఘటిత ఉద్యమాల్లో భాగస్వామి అయిండు. ఆచరణే గీటురాయని నిరూపించిండు.

‘చూడు చూడు వాడలు నిర్లక్ష్యపు నీడలు’ అన్న వ్యాసంలో ప్రభుత్వం ప్రజల పట్ల చూపుతున్న నిర్లక్ష్యానికి అద్దం పట్టిండు. ‘జనజీవనాడి పాట’, ‘పరిగెత్తే కాలంతో పయనించలేక’, ‘బతుకు బాటలో ఒంటరి పయనం’, ‘బూటకపు ఎన్ కౌంటర్లలో బలహీన వర్గాలే బలి’, ‘కమ్యూనిస్టులకు కనువిప్పు కలిగే మేడే ఏనాడో!’, ‘కమ్యూనిస్టులకు కుల నిర్మూలన ఇప్పుడు గుర్తొచ్చిందా!’, ‘సామాన్యుడి ముంగిట ఇంకా వికసించని విద్యుత్తేజం’ అన్న వ్యాసాలతో అన్ని వర్గాల ప్రజల కోసం స్పందించిండు. కమ్యూనిస్టు పార్టీలు కుల సమస్యను గుర్తించినా సామాజిక అసమానతలను తొలగించేందుకు ఎలాంటి కార్యాచరణకు ఉపక్రమించలేదని ప్రశ్నించిండు. కమ్యూనిస్టులే ఐక్యం కానప్పుడు ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని పిలుపివ్వడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేసిండు.

ప్రభంజన్ వ్యంగ్య రచనలు కూడా చేసిండు. ‘లత్కోర్ కౌంటర్’, ‘భలే ఓట్లు…. బాయినెట్లు’, ‘రామోజీరావు గారు అందుకో ఈ లేఖ’, ‘నేనే రారాజు చూసేవాళ్లే బేజారు’ అన్న రచనల్లో సూటిగా చురకలంటించిండు. కథనం చాల సాఫీగా సాగిపోయింది.

ఈ రచనలతో పాటు ప్రభంజన్, యాదవ కులాన్ని సమీకరించిండు. సమాజంలో యాదవులు బాగా వెనకబడి ఉన్న సంగతి తెలిసిందే. యాదవ కులంలో మేధావి వర్గం కూడా తక్కువే. అటువంటి యాదవ కులాన్ని సమీకరించడమే కాక, మేధావి వర్గాన్ని ఆర్జనైజ్ చేయాల్సిన అవసరముందని గుర్తించిండు. యాదవ మేధావుల ఫోరానికి వ్యవస్థాపక కన్వీనర్ గా పనిచేసిండు. నేను రాసిన “గొల్ల కురుమలు ఈ సమాజానికి ఏం చేసిండ్రు?”, “డోలు దెబ్బ” పాటల సంకలనాన్ని మేధావుల ఫోరం తరపున వెలువరించడంలో కన్వీనర్ గా కీలకపాత్ర పోషించిండు.

ప్రభంజన్ పాటలు కూడా రాసిండు. దొడ్డి కొమురన్న పాట చాల మంచి పాట. దొడ్డి కొమురయ్య జీవితాన్ని తిరిగి మనకు గుర్తు చేస్తుంది. ‘మంద కదిలింది రా జంబాయిరే’ అనే పాట కూడా యాదవ జీవన పోరాటాన్ని అద్దంలో చూపుతుంది.

ప్రభంజన్ వ్యాసాలు, పాటలు, కవితలు, కథలు కూడా రాసిండు. రచనలన్నీటిలోనూ సామాజిక స్పృహ, చైతన్యం కనిపిస్తుంది. సామాజిక ప్రయోజనం లేని రచనలు చేయడమెందుకని ప్రశ్నిస్తాడు కూడా!

-ఆచార్య కంచె ఐలయ్య
(23/3/2004న రాసిన వ్యాసం)

Latest News

దెబ్బకు సోఫా జిడ్డు సఫా!?|ADUGU TRENDS

ఎన్కటికి ఇండ్లల్ల నులక మంచాలు, ఎత్తు పీటలు, శెక్క బెంచీలు, కుర్సీలుంటే సాలయ్యేది. ఇగిప్పుడు గయన్నీ పోతానయి. ఇనుప, కేన్ కుర్సీలు, సోఫాలొచ్చె. గా సోఫాలకు లోపల మెత్తటి దూది.. గదేనుల్ల కుషన్,...

ద్రవ్యోల్బణ సవాళ్ళకు పరిష్కారాలివే!|EDITORIAL

ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువ పతనం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు...

28-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి దశమి ఉదయం 10.27 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.24 వరకు ఉపరి ఆశ్లేష యోగం సుకర్మ రాత్రి 09.35 వరకు ఉపరి ధృతి కరణం గరజి ఉదయం 10.28...

బంకులకి బాహు బలి!?|ADUGU TRENDS

వచ్చి రాని యుద్ధం వచ్చె. బొచ్చెడు కట్టాలు తెచ్చె. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబట్టె. నో స్టాకు బోర్డులు పెట్టబట్టిరి. కొరతే లేదని సర్కారోల్లు అనబట్టిరి. అసలు మా దగ్గర పెట్రోలే లేదని...

ట్రంప్ మూర్ఖత్వానికి ప్రపంచం మూల్యం!|EDITORIAL

ప్రపంచంలో యుద్ధాలు కొత్తేమీ కావు. కానీ, ఆ యుద్ధాల పరిణామాలు, ప్రభావాలు తీవ్రం. ఈసారి యుద్ధం మొదలైన తీరే విచిత్రం. ఏకపక్షం. అగ్రరాజ్యం అమెరికా సామ్రాజ్యవాదానికి, ట్రంపు టెంపరితనానికి పరాకాష్ట. అయితే, అమెరికా–ఇరాన్...

27-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం శ్రీరామనవమి శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం తిధి నవమి మధ్యాహ్నం 12.22 వరకు ఉపరి దశమి నక్షత్రం పునర్వసు సాయంత్రం 05.34 వరకు ఉపరి పుష్యమి యోగం అతిగండ రాత్రి 12.08 వరకు ఉపరి సుకర్మ కరణం కౌలవ మధ్యాహ్నం...

గా దారం ఊసిపోదు! శార్జింగ్ వైరు తెగిపోదు!?|ADUGU TRENDS

ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం అన్నరు. ఇగిప్పుడైతే సెల్లే! ఎవల సేతుల సూసినా సెల్లే. పుస్తకానికి శెల్లు శీటీ రాసేసి, సెల్లుకు విల్లు రాసేసిండ్రు. మరి గా సెల్లు పోన్ల శార్జింగుంటేనే గది...

చమురు సంక్షోభమే సంస్కరణలకు సానుకూలం!|EDITORIAL

భారత్‌ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ఇంధన భద్రత ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని, సవాళ్లను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్‌ను అస్థిర పరుస్తున్నాయి. ఈ పరిణామాలు దిగుమతులపై...

26-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి అష్టమి పగలు 02.35 వరకు ఉపరి నవమి నక్షత్రం ఆరుద్ర రాత్రి 06.55 వరకు ఉపరి పునర్వసు యోగం సౌభాగ్య ఉదయం 05.55 వరకు ఉపరి శోభ కరణం బవ పగలు 02.35...

రైతంటే గీ ఇగురుమున్నాయినే పో!|ADUGU TRENDS

ఇప్పటోల్లకేమో గనీ, ఎన్కటోల్లకు, నడీడుకొచ్చినోల్లకు ఎడ్ల బండంటే తెలుత్తది. దాన్ని ఎక్కిన అనుభవం ఉంటది. ఎన్కటికి యాడికిపోయినా ఎడ్లబండ్లే. సైకిలుంటే మహా, స్కూటరు, సైకిలు మోటరుంటే ఓ మోతుబరి, ఇగ కారున్నోల్లు దొరలు,...

పునర్విభజన పార్టీలకు పండగే!|EDITORIAL

జనాభా ఆధారంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల స్థానాలను పునర్విభజించడం అనే ప్రక్రియ, ప్రజాప్రాతినిధ్యపు వ్యవస్థకు అవసరమైన సంస్కరణ కాగా, రాజకీయ ప్రయోజనాల పరంగానూ ఎంతో లాభదాయకం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా...

25-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి సప్తమి సాయంత్రం 04.44 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మృగశిర రాత్రి 08.30 వరకు ఉపరి ఆరుద్ర యోగం ఆయుష్మాన్ ఉదయం 09.00 వరకు ఉపరి సౌభాగ్య కరణం గరజి ఉదయం 06.05...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News