Trending News
Thursday, October 2, 2025
22.8 C
Hyderabad
Trending News

ప్రజల పక్షపాతి ప్రభంజన్!|PRABHANJAN YADAV

ప్రభంజన్ కుమార్ యాదవ్ ప్రతిభ గల జర్నలిస్టు, కవి, రచయిత, వరంగల్ జిల్లా వాసి. కాకతీయ విశ్వ విద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యిండు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. భాషా శాస్త్రం, మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ & జర్నలిజం (ఎం.సి.జె.) చదివిండు. రూరల్ & డెవలప్మెంట్ కమ్యూనికేషన్ ఐచ్ఛికంగా ఎం.ఫిల్ పూర్తి చేసిండు.

1988 నుంచి వివిధ తెలుగు పత్రికల్లో దశాబ్ద కాలం జర్నలిస్టుగా పనిచేసిండు. జర్నలిజంలో నిలదొక్కుకోవాలనుకున్నడు. 1998లో భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో క్షేత్ర ప్రచార శాఖ అధికారిగా ఉద్యోగం వచ్చింది. విధి నిర్వహణలో భాగంగా, స్వభావ రీత్యా నిత్యం ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో నిమగ్నమైండు. ఆత్మవంచన, శక్తివంచన లేకుండా ప్రజల కోసం పనిచేసే బహుకొద్దిమంది ప్రభుత్వ అధికారుల్లో ప్రభంజన్ కుమార్ యాదవ్ ఒకడు.

స్వభావ రీత్యా ప్రభంజన్ చాల సెన్సిటివ్. పేద ప్రజల పట్ల, ఉత్పత్తి కులాల పట్ల అభిమానం, ఆదరణ గల వ్యక్తి అనడానికి ఆయన రచనలే ప్రత్యక్ష సాక్ష్యం. జర్నలిస్టుగా ప్రభంజన్ వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలను పుస్తకంగా తీసుకురావడం సంతోషం. నడుస్తున్న చరిత్రను సజీవంగా చిత్రీకరించే ప్రయత్నం ప్రభంజన్ ది. నిజాలను నిర్భయంగా రాసే సాహసం ఆయన కలానిది. అన్యాయం ఏ రూపంలో ఉన్నా ప్రశ్నించడం ప్రభంజన్ మనస్తత్వం. రాగద్వేషాలకు అతీతంగా ఉండే ప్రయత్నం ఆయనది. ఏ రోటికాడి మాట ఆ రోటికాడ చెప్పడం చాతకానివాడు. నొప్పించక తానొవ్వక తప్పించుక తిరగటం తెలియనివాడు. నిష్టూరమైనా పరవాలేదని నిగ్గు తేల్చాలనుకునేవాడు. కష్టాలకు, నష్టాలకు వెరవడు. ఏటికి ఎదురీదడమే తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభంజన్ ప్రజల పక్షపాతి. ఆయన రచనల్లో ప్రతిబింభించిన ఉత్పత్తి కులాల ఆవేదన, బీదల బాధలు అందుకు నిదర్శనం. ప్రజల ఆలోచనలకు, ఆవేదనలకు ప్రభంజన్ అక్షర నివేదనే ఈ వ్యాస సంకలనం.

‘ప్రభంజన పథం’
“గొల్లల సంస్కృతి-గొప్ప సంస్కృతి” అనే పరిశోధన వ్యాసంతో మొదలైంది ఈ పుస్తకం. ఈ సమాజానికి తన కులం ‘అయిదు రకాల పరిశ్రమలను, ఉత్పత్తులను అందించినందుకు ప్రతిఫలం అవమానమా?’ అని ప్రభంజన్ నిలదీసిండు. శ్రమను గౌరవించని దోపిడి సంస్కృతిని ఈసడించుకున్నడు. వెట్టిచాకిరి చేస్తున్న రజకుల కష్టాలు తీరాలన్నడు. గీత కార్మికులకు ఊతం యివ్వాలని, వెలవెల బోతున్న నేతగాళ్ల బతుకుల్లో వెలుగులు నింపాలన్న ఆశతో రాసిండు. మూలవాసుల విముక్తి బాటలో కలిసి పయనించిండు. దళిత గేయాలు రాసి పల్లవి కలిపిండు. దళిత రచయితల, కళాకారుల, మేధావుల (దరకమే) ఐక్యవేదికలో, నాస్తిక సంఘంలో పనిచేసిండు. రచనలు, ఉపన్యాసాలతోనే ఊర్కోలేదు. ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొన్నడు. జన చైతన్యం కోసం సంఘటిత ఉద్యమాల్లో భాగస్వామి అయిండు. ఆచరణే గీటురాయని నిరూపించిండు.

‘చూడు చూడు వాడలు నిర్లక్ష్యపు నీడలు’ అన్న వ్యాసంలో ప్రభుత్వం ప్రజల పట్ల చూపుతున్న నిర్లక్ష్యానికి అద్దం పట్టిండు. ‘జనజీవనాడి పాట’, ‘పరిగెత్తే కాలంతో పయనించలేక’, ‘బతుకు బాటలో ఒంటరి పయనం’, ‘బూటకపు ఎన్ కౌంటర్లలో బలహీన వర్గాలే బలి’, ‘కమ్యూనిస్టులకు కనువిప్పు కలిగే మేడే ఏనాడో!’, ‘కమ్యూనిస్టులకు కుల నిర్మూలన ఇప్పుడు గుర్తొచ్చిందా!’, ‘సామాన్యుడి ముంగిట ఇంకా వికసించని విద్యుత్తేజం’ అన్న వ్యాసాలతో అన్ని వర్గాల ప్రజల కోసం స్పందించిండు. కమ్యూనిస్టు పార్టీలు కుల సమస్యను గుర్తించినా సామాజిక అసమానతలను తొలగించేందుకు ఎలాంటి కార్యాచరణకు ఉపక్రమించలేదని ప్రశ్నించిండు. కమ్యూనిస్టులే ఐక్యం కానప్పుడు ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని పిలుపివ్వడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేసిండు.

ప్రభంజన్ వ్యంగ్య రచనలు కూడా చేసిండు. ‘లత్కోర్ కౌంటర్’, ‘భలే ఓట్లు…. బాయినెట్లు’, ‘రామోజీరావు గారు అందుకో ఈ లేఖ’, ‘నేనే రారాజు చూసేవాళ్లే బేజారు’ అన్న రచనల్లో సూటిగా చురకలంటించిండు. కథనం చాల సాఫీగా సాగిపోయింది.

ఈ రచనలతో పాటు ప్రభంజన్, యాదవ కులాన్ని సమీకరించిండు. సమాజంలో యాదవులు బాగా వెనకబడి ఉన్న సంగతి తెలిసిందే. యాదవ కులంలో మేధావి వర్గం కూడా తక్కువే. అటువంటి యాదవ కులాన్ని సమీకరించడమే కాక, మేధావి వర్గాన్ని ఆర్జనైజ్ చేయాల్సిన అవసరముందని గుర్తించిండు. యాదవ మేధావుల ఫోరానికి వ్యవస్థాపక కన్వీనర్ గా పనిచేసిండు. నేను రాసిన “గొల్ల కురుమలు ఈ సమాజానికి ఏం చేసిండ్రు?”, “డోలు దెబ్బ” పాటల సంకలనాన్ని మేధావుల ఫోరం తరపున వెలువరించడంలో కన్వీనర్ గా కీలకపాత్ర పోషించిండు.

ప్రభంజన్ పాటలు కూడా రాసిండు. దొడ్డి కొమురన్న పాట చాల మంచి పాట. దొడ్డి కొమురయ్య జీవితాన్ని తిరిగి మనకు గుర్తు చేస్తుంది. ‘మంద కదిలింది రా జంబాయిరే’ అనే పాట కూడా యాదవ జీవన పోరాటాన్ని అద్దంలో చూపుతుంది.

ప్రభంజన్ వ్యాసాలు, పాటలు, కవితలు, కథలు కూడా రాసిండు. రచనలన్నీటిలోనూ సామాజిక స్పృహ, చైతన్యం కనిపిస్తుంది. సామాజిక ప్రయోజనం లేని రచనలు చేయడమెందుకని ప్రశ్నిస్తాడు కూడా!

-ఆచార్య కంచె ఐలయ్య
(23/3/2004న రాసిన వ్యాసం)

Latest News

శుక్రవారం అక్టోబర్ 03 –2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం ఏకాదశి తిధి ఏకాదశి పగలు 02.28 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం శ్రవణ ఉదయం 06.46 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ధృతి రాత్రి 06.46 వరకు ఉపరి శూల కరణం భద్ర సాయంత్రం...

ఓ మహాత్మా..|POETRY

నిన్న,నేడు,రేపు రోజు ఏదైనా వాదం ఒక్కటే 'గాంధేయవాదం' ఇది నొప్పి తెలియకుండా సూదిచ్చే యంత్రం కొట్టకనే దెబ్బలు చరిచే తంత్రం ఎదుటి వానిలో ఆలోచన రేపే మంత్రం 'మహాత్మాగాంధీ' శాంతికి బ్రాండ్ అంబాసిడర్ నాయకత్వానికి నిదర్శనం ఉద్యమానికి ఊపిరి మొత్తానికి భారతదేశ 'మనిమకుటం' ఒక్కమాటతో జనాలకు జవసత్వాలు నింపి స్వతంత్ర భావజాలాన్ని పంచి అలుపెరుగని...

విజయదశమి అంటే ఏంటి? దసరాను ఎలా ఆచరించాలి?|ESSAY|ARTICLES

కృతయుగంలో రాక్షస సంహారంలో భాగంగా ఆది పరాశక్తి శుంభ నిశుంభ రక్తబీజ మొదలైన రాక్షసులతో పాటు మహిషాసురుడిని సంహరించి లోక రక్షణ చేసిన కారణంగా ఆ రోజు ఆనందంగా అమ్మవారిని ఆరాధించాలి అనుగ్రహం...

గీ బ్లడ్ గ్రూపున్నోల్లు తొందరగ సావరట!?|ADUGU TRENDS

మనిసికి లోకం మీద పేమ కంటే, పానం మీద తీపే ఎక్కువ. ఎవలికైనా శానా కాలం బతకాల్ననే ఉంటది. గదైతాది. ఎవలికి ఎంత రాసి పెట్టి ఉంటే గంతే? అనుకుంటుం గనీ, ఇగో.....

దసరా వైశిష్ట్యం విజయోస్తు!|EDITORIAL

హిందువులు జరుపుకునే పండగలలో దసరా పండగకు విశిష్ట స్థానం ఉంది. ఈ విజయ దశమికి సంబంధించి పలు పురాణగాథలు చెలామణిలో ఉన్నాయి. రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం...

గురువారం అక్టోబర్ 02 –2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం విజయదశమి దసరాపండుగ గాంధీ జయంతి తిధి దశమి పగలు 02.38 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.03 వరకు ఉపరి శ్రవణ యోగం సుకర్మ రాత్రి 08.03 వరకు ఉపరి ధృతి కరణం...

డైబర్ లేని ఆటోలొత్తానయి!?|ADUGU TRENDS

ఇగో గీ ఆటోలకు డైబరుండడు. ఇగ మనం గా ఆటో ఎక్కి యేడికి పోవాల్నో సెప్తె సక్కగ గాడికే తీస్కపోతది. గదేంది? పట్నాలల్ల రద్దీ ఉంటది గదా? గదెట్ల తీస్కపోతది? మనమెట్ల పోతం?...

ఆదివాసీల అస్తిత్వ పోరాటం!|EDITORIAL

“ఆదివాసులు” మూల వాసులు. భారత దేశంలోని స్వదేశీ జనజాతులు. ప్రత్యేక సంప్రదాయ జీవన విధానం, భూభాగాలు, వనరులు, భాషలు, సంస్కృతులు కలిగి ఉన్న సమాజాలు. “లంబాడీలు లేదా బంజారాలు” ప్రత్యేక సంప్రదాయ జీవన...

బుధవారం అక్టోబర్ 01–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం మహర్నవమి తిధి నవమి పగలు 02.19 వరకు ఉపరి దశమి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా యోగం అతిగండ రాత్రి 08.56 వరకు సుకర్మ కరణం కౌలవ సాయంత్రం 04.18 వరకు గరజి వర్జ్యం పగలు 01.24...

క్రికెట్ ను ఆటగానే చూడాలి!|EDITORIAL

‘ఓటమి చావు కన్నా భయంకరమైంది.’ ప్రపంచంలో, జీవితంలో గెలుపోటములు లేనిదెక్కడ? కానీ, యుద్ధంలో గెలుపోటములు గెలిచినా, ఓడినా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. యుద్ధంలో చావు అమరత్వాన్నిస్తే, ఒక్కోసారి క్రీడల్లో ఓటమి మరణశాసనాన్ని కూడా...

ఆ స్నేహితులను చూసి స్నేహమే సలాం చేసింది!|FRIENDSHIP

పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు సమయంలో ఎప్పుడు.. ఎప్పుడాని కండ్లల్లో వొత్తులేసుకొని సూడాల్సిన స్థితి వొచ్చింది. యెందుకంటే గతంలో కరోనా సమయంలో ముందొకసారి, ఆ తర్వాతొకసారి, మళ్లీ రెండు సమయాల్లో మా ఆత్మీయ...

యెహె తియ్! గీ ఆటకు వానడ్డమా?|ADUGU TRENDS

యేడాదికోపాలొచ్చే పండుగాయె. తీరొక్క పూలతో పాడి, ఆడే ఆటాయె. ఇగ గా వానదేవునికి కండ్లు కుట్టి, కుండపోత పోయబట్టె. ఇగ గిదంత పని గాదని, గా ఆడోళ్ళు ఏం చేసిండ్లో సూత్తె మీరు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News