Trending News
Thursday, October 2, 2025
22.8 C
Hyderabad
Trending News

బాబు భజనలో బీజేపీ!?|CHANDRABABU|BJP|EDITORIAL

దోయి, దాయి అన్నది పవర్ లోకి వచ్చిన పార్టీ ప్రభుత్వాల పనిగా మారింది. అధికారం అందితే చాలు, దొడ్డి దారిన దోపిడీ చేయాలి. దొంగదారిలో దాచుకోవాలి. అవకాశం దొరికితే కాదు, కల్పించుకుని మరీ ఏదో రకంగా డబ్బులు వెనకేసుకోవడం రాజకీయ నేతలకు అలవాటుగా మారింది. మరీ ముఖ్యంగా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల పాలకులు అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నా, కేంద్రం చోద్యం చూస్తోంది. ఎన్‌డిఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి ఇప్పుడు బీజేపీ వంతపాడుతోంది. ఏపీ తానా అంటే కేంద్రం తందానా అంటోంది. చంద్రబాబు ఎంపీల మద్దతుతో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతోంది. బాబు కూడా ఇదే అదనుగా తన పనులను చక్కబెట్టుకుంటున్నారు. మోడీ, అమిత్‌ షాలు కూడా బాబు ఆడించినట్లు ఆడుతున్నారు.

విశాఖ ఉక్కుకు నిధులు కేటాయించారు. పోలవరంకు పోలోమంటూ నిధులిచ్చారు. అమరావతికి అడిగినన్ని ఇచ్చేశారు. విశాఖలో యోగా డేకు రమ్మనగానే కిమ్మనకుండా ప్రధాని వచ్చారు. కేంద్ర మంత్రులు వలస పక్షుల్లా ఏపీకి అదేపనిగా వచ్చి వాలుతున్నారు. అశోకగజపతిని గవర్నర్‌ను చేశారు.

ఇదే అదనుగా చంద్రబాబు అమరావతిలో ఇప్పటికే సేకరించిన 35వేల ఎకరాలు సరిపోవంటూ మరో 40వేల ఎకరాలకు ఎసరు పెట్టారు. విభజన తర్వాత తొలి ఐదేళ్లలో అమరావతిని పూర్తి చేయలేదు. పోలవరాన్ని పట్టాలెక్కించలేదు. పోలవరం నిర్వాసితులను నిలువునా ముంచారు. ఇప్పటికీ వారు కూడు, గూడు కోసం అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదు. విభజన టైమ్ లో ఏపీలో కలుపుకున్న ఐదు మండలాల సంగతి మాట్లాడటం లేదు. భద్రాచలం ఇవోపై దాడి చేసినా దిక్కు లేదు. పోలవరం ఇంకా పూర్తి కానేలేదు. పోలవరం-బనకచర్ల లింకు ప్రాజెక్టుపై చంద్రబాబు హడావుడి చేస్తుండటం అనేక అనుమానాలకు తావిస్తున్నది. తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి అన్నట్లు నదుల నీటి సమస్యలపై రాష్ట్రాల రౌడీల్లా తన్నుకున్నా పట్టించుకోని కేంద్రం, చంద్రబాబు చెప్పగానే బనకచర్లపై మాట్లాడుకుందాం రా.. అంటూ తెలంగాణ సీఎంకు కబురు పెట్టడం ఆశ్చర్యమే. అసలు నీటి కేటాయింపుల వివాదాలు మిగిలి ఉండగానే, కొత్తగా బనకచర్లపై కేంద్రం మధ్యవర్తిత్వమేంటి? ఆ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఆలోచించకుండా, చర్చలేంటి?

చంద్రబాబు చేస్తున్న హడావుడి చూస్తుంటే బనకచర్ల మరో కాళేశ్వరంగా మారడం ఖాయంగా కనిపిస్తున్నది. కేవలం డబ్బులు దండుకోవడానికే ఈ ప్రాజెక్టుపై తెగ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే రూ.10 లక్షల కోట్ల అప్పుల పాలైన ఏపీ సర్కారు, బనకచర్ల కోసం మరో రూ. 82వేల కోట్ల అప్పు చేసేందుకు ఎందుకు ఉబలాటపడుతోంది? అక్కడ వరద జలాలే లేవని కేంద్ర సంస్థలు మొత్తుకుంటున్నా వినడం లేదు? ఏపీ పాలిట తెల్ల ఏనుగు అవుతుందని అక్కడి ఇరిగేషన్‌ నిపుణులు, మేధావులు హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు? చంద్రబాబు ఎక్కిడికి వెళ్లినా బనకచర్లను బంకలా పట్టుకున్నారు. మిగులు జలాలని తెగ పలవరిస్తున్నారు. గతంలో తెలంగాణలో కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి లాంటి కీలక ప్రాజెక్టులతో పాటు అటు- ఏపీలో రాయలసీమ లిప్ట్‌ ఇరిగేషన్‌ లాంటి భారీ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు చేపట్టి లక్షల కోట్లు సంపాదించిన ఓ బడా కాంట్రాక్ట్‌ సంస్థే.. ఇప్పుడు ఈ బనకచర్ల ప్రాజెక్టునూ చేపట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. కావాలంటే తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పిస్తానని ఆ కాంట్రాక్ట్‌ సంస్థ ఆఫర్‌ ఇచ్చినట్లు అక్కడి అధికార, రాజకీయ, మేధావి వర్గాల్లో తెగ చర్చ జరుగుతోంది.

40,500 ఎకరాల వ్యవసాయ భూములు, 17 వేల ఎకరాల అటవీ భూములు సేకరించి, 18 గ్రామాలను ముంచి, 10 లిఫ్టులు పెట్టి, వేల కోట్లు కరెంటుకు ఖర్చు పెడ్తూ, 575 కిలోమీటర్ల మేర నీటిని ఎత్తిపోయడం అసాధ్యమని వేరుగా చెప్పనక్కరలేదు. కాళేశ్వరాన్ని మహాద్భుత కట్టడంగా కేసీఆర్‌ ప్రచారం చేసి లక్ష కోట్లు తగలేశారు. అధికారులు మాత్రం కోట్లకు పడగలెత్తారు. ఏసీబీకి చిక్కి ఊచలు లెక్కబెడుతున్నారు. బనకచర్ల పేరుతో ఇన్‌ఫ్రాస్టక్చ్రర్‌ డెవలప్‌ చేసి, శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని మళ్లించే ఎత్తుగడ కుట్ర కోణం కూడా ఇందులో దాగివుందని స్పష్టమవుతున్నది. బీఆర్‌ఎస్‌ హయాంలో లాగే ఏపీలోనూ బనకచర్ల ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ఫాలో అవుతున్నట్లుగా ఉంది. బనకచర్లకు రూ.82 వేల కోట్లన్నది ప్రస్తుత అంచనా మాత్రమే అది లక్ష కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు నీళ్లను తరలించే సెగ్మెంట్‌ పనులకు టెండర్లను పిలిచేందుకు ఏపీ సర్కారు రెడీ అవుతోంది. పనిలో పనిగా సెగ్మెంట్‌ పనులను సైతం సమాంతరంగా చేసే అంశంపైనా కసరత్తు చేస్తోంది. కాళేశ్వరం రీతిలో సబ్‌ కాంట్రాక్టుల దందాకు తెరలేపు తున్నట్టు తెలుస్తోంది. లక్షల కోట్లతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మించినా పెద్దగా ప్రయోజనం ఉండదని ఇంజనీర్లు, మేధావులు అంటున్నారు. పోలవరం పూర్తయితే తప్ప నీటి చుక్క కూడా తరలించే పరిస్థితి లేనప్పటికీ చంద్రబాబు మాత్రం బనకచర్ల ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని చెప్పడంపై ఏపీలో ఇరిగేషన్‌ నిపుణులు, మేధావులు, ఆర్థికవేత్తల నుంచి విస్మయం వ్యక్తమవుతోంది. బనకచర్లకు వ్యతిరేకంగా విజయవాడ కేంద్రంగా ఇటీవల ఆలోచనాపరుల వేదిక పురుడుపోసుకుంది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వేదిక బాధ్యులు మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వర్రావు, కంభంపాటి పాపారావు, అక్కినేని భవాని ప్రసాద్‌, టి.లక్ష్మీనారాయణ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకు పోయిన ఏపీపై బనకచర్ల పెనుభారం కానుందని, ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. మరివి ప్రజలకు పట్టేనా?

Latest News

శుక్రవారం అక్టోబర్ 03 –2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం ఏకాదశి తిధి ఏకాదశి పగలు 02.28 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం శ్రవణ ఉదయం 06.46 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ధృతి రాత్రి 06.46 వరకు ఉపరి శూల కరణం భద్ర సాయంత్రం...

ఓ మహాత్మా..|POETRY

నిన్న,నేడు,రేపు రోజు ఏదైనా వాదం ఒక్కటే 'గాంధేయవాదం' ఇది నొప్పి తెలియకుండా సూదిచ్చే యంత్రం కొట్టకనే దెబ్బలు చరిచే తంత్రం ఎదుటి వానిలో ఆలోచన రేపే మంత్రం 'మహాత్మాగాంధీ' శాంతికి బ్రాండ్ అంబాసిడర్ నాయకత్వానికి నిదర్శనం ఉద్యమానికి ఊపిరి మొత్తానికి భారతదేశ 'మనిమకుటం' ఒక్కమాటతో జనాలకు జవసత్వాలు నింపి స్వతంత్ర భావజాలాన్ని పంచి అలుపెరుగని...

విజయదశమి అంటే ఏంటి? దసరాను ఎలా ఆచరించాలి?|ESSAY|ARTICLES

కృతయుగంలో రాక్షస సంహారంలో భాగంగా ఆది పరాశక్తి శుంభ నిశుంభ రక్తబీజ మొదలైన రాక్షసులతో పాటు మహిషాసురుడిని సంహరించి లోక రక్షణ చేసిన కారణంగా ఆ రోజు ఆనందంగా అమ్మవారిని ఆరాధించాలి అనుగ్రహం...

గీ బ్లడ్ గ్రూపున్నోల్లు తొందరగ సావరట!?|ADUGU TRENDS

మనిసికి లోకం మీద పేమ కంటే, పానం మీద తీపే ఎక్కువ. ఎవలికైనా శానా కాలం బతకాల్ననే ఉంటది. గదైతాది. ఎవలికి ఎంత రాసి పెట్టి ఉంటే గంతే? అనుకుంటుం గనీ, ఇగో.....

దసరా వైశిష్ట్యం విజయోస్తు!|EDITORIAL

హిందువులు జరుపుకునే పండగలలో దసరా పండగకు విశిష్ట స్థానం ఉంది. ఈ విజయ దశమికి సంబంధించి పలు పురాణగాథలు చెలామణిలో ఉన్నాయి. రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం...

గురువారం అక్టోబర్ 02 –2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం విజయదశమి దసరాపండుగ గాంధీ జయంతి తిధి దశమి పగలు 02.38 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.03 వరకు ఉపరి శ్రవణ యోగం సుకర్మ రాత్రి 08.03 వరకు ఉపరి ధృతి కరణం...

డైబర్ లేని ఆటోలొత్తానయి!?|ADUGU TRENDS

ఇగో గీ ఆటోలకు డైబరుండడు. ఇగ మనం గా ఆటో ఎక్కి యేడికి పోవాల్నో సెప్తె సక్కగ గాడికే తీస్కపోతది. గదేంది? పట్నాలల్ల రద్దీ ఉంటది గదా? గదెట్ల తీస్కపోతది? మనమెట్ల పోతం?...

ఆదివాసీల అస్తిత్వ పోరాటం!|EDITORIAL

“ఆదివాసులు” మూల వాసులు. భారత దేశంలోని స్వదేశీ జనజాతులు. ప్రత్యేక సంప్రదాయ జీవన విధానం, భూభాగాలు, వనరులు, భాషలు, సంస్కృతులు కలిగి ఉన్న సమాజాలు. “లంబాడీలు లేదా బంజారాలు” ప్రత్యేక సంప్రదాయ జీవన...

బుధవారం అక్టోబర్ 01–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం మహర్నవమి తిధి నవమి పగలు 02.19 వరకు ఉపరి దశమి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా యోగం అతిగండ రాత్రి 08.56 వరకు సుకర్మ కరణం కౌలవ సాయంత్రం 04.18 వరకు గరజి వర్జ్యం పగలు 01.24...

క్రికెట్ ను ఆటగానే చూడాలి!|EDITORIAL

‘ఓటమి చావు కన్నా భయంకరమైంది.’ ప్రపంచంలో, జీవితంలో గెలుపోటములు లేనిదెక్కడ? కానీ, యుద్ధంలో గెలుపోటములు గెలిచినా, ఓడినా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. యుద్ధంలో చావు అమరత్వాన్నిస్తే, ఒక్కోసారి క్రీడల్లో ఓటమి మరణశాసనాన్ని కూడా...

ఆ స్నేహితులను చూసి స్నేహమే సలాం చేసింది!|FRIENDSHIP

పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు సమయంలో ఎప్పుడు.. ఎప్పుడాని కండ్లల్లో వొత్తులేసుకొని సూడాల్సిన స్థితి వొచ్చింది. యెందుకంటే గతంలో కరోనా సమయంలో ముందొకసారి, ఆ తర్వాతొకసారి, మళ్లీ రెండు సమయాల్లో మా ఆత్మీయ...

యెహె తియ్! గీ ఆటకు వానడ్డమా?|ADUGU TRENDS

యేడాదికోపాలొచ్చే పండుగాయె. తీరొక్క పూలతో పాడి, ఆడే ఆటాయె. ఇగ గా వానదేవునికి కండ్లు కుట్టి, కుండపోత పోయబట్టె. ఇగ గిదంత పని గాదని, గా ఆడోళ్ళు ఏం చేసిండ్లో సూత్తె మీరు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News