Trending News
Thursday, October 2, 2025
22.8 C
Hyderabad
Trending News

కల’వరంగా ఐటీ ఉద్యోగరంగం!|EDITORIAL

9వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్న మైక్రోసాఫ్ట్. పాకిస్తాన్ కు మైక్రోసాఫ్ట్ బై బై. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఒక ఐటీ కంపెనీకి సంబంధించి మచ్చుకు ఒకటి రెండు ఉదాహరణలివి. మిగతా అనేకానేక కంపెనీలో చెప్పి తొలగించేవి. చెప్పకనే తొలగించేవి. చెప్పినా, చెప్పకపోయినా, వెల్లడి కాని కంపెనీలు కొన్ని. ఇలా అనేకానేక ఐటీ కంపెనీలు ఇప్పుడు ఉద్యోగులను తగ్గించుకునే పనిలో ఉన్నాయి. కంపెనీలకు ఉద్యోగులు భారంగా మారారు అనడం కంటే, ఖర్చు తగ్గించుకోవడం, లాభాలు ఆర్జించడం ఒక ఎత్తైతే. ఇప్పుడు వందల వేల మంది ఉద్యోగులు చేసే పనులను ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ చేసేస్తోంది. కాబట్టి, ఉద్యోగులతో పనేంటి? వారికి జీతాలు దండగ. పైగా ఉద్యోగి పనిలో పరిపక్వత సంగతి పక్కన పెట్టండి. ఎఐ ద్వారా అంతకంటే అద్భుతం అనే విధంగా పనులు చక చకా జరిగిపోతుంటే, మానవ వనరులు, మనుషులతో పనే లేకుండా పోతోంది. ఆశ్చర్యమనిపించినా అంగీకరించక తప్పని పరిస్థితి ముంగిట మనమున్నాం.

నిజానికి ఐటి రంగం ఎంతగా ఆకర్షించి, ఊరిస్తున్నదో అంతకంటే ఎన్నో రెట్లు క్షోభ కూడా పెడుతోంది. దేశ, భాష సరిహద్దులు చెరిగిపోయి, ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఐటి ఉద్యోగాలు ఉన్న పళంగా ఊడిపోతున్నాయి. ఉద్యోగులను అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇది మామూలై పోయింది. చిన్నా చితక కంపెనీలు మాత్రమే కాదు, పేరు ప్రతిష్టలు ఉన్న కంపెనీలే ఇలా చేస్తున్నాయి. పైగా అవి జీతం ఎక్కువగా ఉన్న ఉద్యోగులనే టార్గెట్‌ చేస్తున్నాయి. దీంతో ఉన్న ఉద్యోగం ఊడిపోతుండటంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడే దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. ఖర్చు తగ్గించుకునే పనైతే, కంపెనీని నమ్ముకుని, దీర్ఘకాలంగా పని చేస్తున్న వారికి నచ్చచెప్పి, జీతాల్లో కోతలు విధించవచ్చు. తగ్గించవచ్చు. కరోనా సమయంలోలా తగ్గించుకోవడానికి కూడా ఓ పద్దతి అంటూ ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో ఆలా జరగడం లేదు. ఐటి కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు పెరుగుతున్న తీరు ఆ రంగం మీద ఆధారపడి జీవిస్తున్న వారిని తీవ్రంగా కలవరపెడుతోంది. ఉద్యోగం పోయినా బతకగల, ఇతర ప్రత్యామ్నాయ ఏదైనా రంగంలో రాణించే బహుముఖ ప్రావీణ్యం కూడా ఐటీ ఉద్యోగులకు ఉండటం లేదు. దీంతో పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి.

నిజానికి క్షేత్రస్థాయి లోనే విద్యారంగంలో మార్పులు రావాలి. విద్యార్థులు రాటుదేలేలా తర్ఫీదు ఇవ్వాలి. వారు ఎంచుకంటున్న ఆయా రంగాల్లో నిష్ణాతులను తయారు చేయాలి. అప్పుడే వారు ఏ పరిశ్రమలో అయినా, ఉపాధి రంగంలో అయినా రాణిస్తారు. విద్యావిధానంలో మార్పుల తోనే ఇది సాధ్యం. కేవలం బట్టీ చదువుల వల్ల విద్యార్థుల్లో నైపుణ్యాలు లోపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించేలా మార్కెట్‌ విస్తరించాలి. ఉద్యోగమంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగమే కాదు.. ప్రైవేట్‌ రంగంలోనూ వారికి అవకాశాలు కల్పించాలి. అలాగే సొంతకాళ్ల మీద నిలబడేలా ఉపాధికి అవకాశాలను పెంచాలి. బ్యాంకులు ఇతోధికంగా రుణాలు ఇవ్వాలి. ఇవన్నీ సాకారం కావాలంటే వ్యవసాయరంగం, అనుబంధ రంగాలు బలపడాలి. పారిశ్రామిక రంగం పురోగమించాలి. ఇవన్నీ కూడా ఓ క్రమద్దతిలో అభివృద్ది చేసుకుంటూ పోవాలి. ఎంతసేపు పెన్షన్లు పంచడం, కిలో రూపాయికి బియ్యిం ఇవ్వడం, ఇందిరమ్మ ఇళ్లు కట్టించడం ఇదే అభివృద్ది కాదు. ప్రజలు తమకాళ్ల మీద తాము నిలబడగలిగేలా వాతావరణం సృష్టించాలి. ఇది ప్రభుత్వాల బాధ్యత. యువత ఆకాంక్షల మేరకు అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వాల విధానాలు ఉండాలి.

ఆంధ్రప్రదేశ్‌లో క్వాంటమ్‌ గురించి సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. తెలంగాణ సిఎం రేవంత్‌ స్కిల్‌ వర్సిటీ అంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కొత్తగా పరిశ్రమలు వస్తాయి. తమకు ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సీఎంలు, మంత్రులు అమెరికా, దావొస్, జపాన్ తదితర దేశాలు చుట్టివచ్చారు. ఐటీ, ఇతర పరిశ్రమల ఏర్పాటుకు ఆహ్వానాలు పలికారు. అయితే ఆయా కంపెనీలు మన దేశానికి వచ్చి ఉద్యోగాలిచ్చేదాకా, ఇక్కడి నిరుద్యోగులేం కాను? పైగా ఆయా దేశాల కంపెనీలు నైపుణ్యం గల ఉద్యోగులను, ఉద్యోగాలను తామే నియమించుకుని, అన్ స్కిల్డ్ లేబర్ గా మన వాళ్ళని వాడుకుంటున్నాయి. దీంతో ఆశించిన కంపెనీలు వచ్చినా, ఆశించే ఉద్యోగాలు మాత్రం ఉండటం లేదు.

అయినా, మనకు అందుబాటులో ఉన్న వనరులతో ఏం చేయవచ్చన్నది ప్రభుత్వాలు ఆలోచించాలి. మనకు విస్తారంగా సహజవనరులు ఉన్నాయి. సముద్రతీరం ఉంది. అతి పెద్ద రంగంగా వ్యవసాయం ఉంది. వ్యవసాయాధారిత రంగాల పురోగతిపై ఆలోచించాలి. ఇవన్నీ కూడా ఉపాధికి అభివృద్ది కేంద్రాలు. పారిశ్రామకవేత్తలకు మోకరిల్లి, రెడ్‌ కార్పెట్‌ పరవడం కంటే, స్థానికంగా మనదైన రంగంలో మనం ఎదగడంపై ఆలోచిస్తే మంచి ఫలితాలుంటాయి. కంపెనీలకు మేలు చేసేలా నిర్ణయాలు కాకుండా, ప్రజలకు మేలు చేసేలా విధానాలు ఉండాలి. ఎస్‌.ఇ.జెడ్‌ లలో వచ్చిన కంపెనీలకు భూములు ఇచ్చి రైతులు ఆ కంపెనీల్లో కూలీలుగా మారుతున్నారు. పరిశ్రమల నిర్మాణ సమయంలో వచ్చే, పోయే లారీల్లో దింపుడు, ఎత్తుడు హమాలీలయ్యారు. గంగవరం పోర్టు, పోలవరం ప్రాజెక్ట్‌, ఫార్మాసిటీల లాంటి వాటికోసం, విశాఖ ఉక్కు కోసం భూములు త్యాగాలు చేసిన వారు రోడ్డున పడుతున్నారు. ఇలాంటి ఘోరాలు జరక్కుండా దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. తెలంగాణలో మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ లాంటి వాటికి భూములు ఇచ్చిన రైతులు ఇవాళ దిక్కులేకుండా పోయారు. ఇలాంటి అభివృద్ది ఎవరి కోసమన్నది కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు ఏకపక్షంగా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాయి. ప్రైవేట్‌ పరిశ్రమల్లో తనిఖీలను, కార్మికుల భద్రతను గాలికొదిలేశారు. వెట్టి చాకిరీ చేయించుకునే వ్యవస్థను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. సిగాచీ పరిశ్రమలో జరిగిన దారుణమే ఇందుకు నిదర్శనం.

Latest News

శుక్రవారం అక్టోబర్ 03 –2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం ఏకాదశి తిధి ఏకాదశి పగలు 02.28 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం శ్రవణ ఉదయం 06.46 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ధృతి రాత్రి 06.46 వరకు ఉపరి శూల కరణం భద్ర సాయంత్రం...

ఓ మహాత్మా..|POETRY

నిన్న,నేడు,రేపు రోజు ఏదైనా వాదం ఒక్కటే 'గాంధేయవాదం' ఇది నొప్పి తెలియకుండా సూదిచ్చే యంత్రం కొట్టకనే దెబ్బలు చరిచే తంత్రం ఎదుటి వానిలో ఆలోచన రేపే మంత్రం 'మహాత్మాగాంధీ' శాంతికి బ్రాండ్ అంబాసిడర్ నాయకత్వానికి నిదర్శనం ఉద్యమానికి ఊపిరి మొత్తానికి భారతదేశ 'మనిమకుటం' ఒక్కమాటతో జనాలకు జవసత్వాలు నింపి స్వతంత్ర భావజాలాన్ని పంచి అలుపెరుగని...

విజయదశమి అంటే ఏంటి? దసరాను ఎలా ఆచరించాలి?|ESSAY|ARTICLES

కృతయుగంలో రాక్షస సంహారంలో భాగంగా ఆది పరాశక్తి శుంభ నిశుంభ రక్తబీజ మొదలైన రాక్షసులతో పాటు మహిషాసురుడిని సంహరించి లోక రక్షణ చేసిన కారణంగా ఆ రోజు ఆనందంగా అమ్మవారిని ఆరాధించాలి అనుగ్రహం...

గీ బ్లడ్ గ్రూపున్నోల్లు తొందరగ సావరట!?|ADUGU TRENDS

మనిసికి లోకం మీద పేమ కంటే, పానం మీద తీపే ఎక్కువ. ఎవలికైనా శానా కాలం బతకాల్ననే ఉంటది. గదైతాది. ఎవలికి ఎంత రాసి పెట్టి ఉంటే గంతే? అనుకుంటుం గనీ, ఇగో.....

దసరా వైశిష్ట్యం విజయోస్తు!|EDITORIAL

హిందువులు జరుపుకునే పండగలలో దసరా పండగకు విశిష్ట స్థానం ఉంది. ఈ విజయ దశమికి సంబంధించి పలు పురాణగాథలు చెలామణిలో ఉన్నాయి. రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం...

గురువారం అక్టోబర్ 02 –2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం విజయదశమి దసరాపండుగ గాంధీ జయంతి తిధి దశమి పగలు 02.38 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.03 వరకు ఉపరి శ్రవణ యోగం సుకర్మ రాత్రి 08.03 వరకు ఉపరి ధృతి కరణం...

డైబర్ లేని ఆటోలొత్తానయి!?|ADUGU TRENDS

ఇగో గీ ఆటోలకు డైబరుండడు. ఇగ మనం గా ఆటో ఎక్కి యేడికి పోవాల్నో సెప్తె సక్కగ గాడికే తీస్కపోతది. గదేంది? పట్నాలల్ల రద్దీ ఉంటది గదా? గదెట్ల తీస్కపోతది? మనమెట్ల పోతం?...

ఆదివాసీల అస్తిత్వ పోరాటం!|EDITORIAL

“ఆదివాసులు” మూల వాసులు. భారత దేశంలోని స్వదేశీ జనజాతులు. ప్రత్యేక సంప్రదాయ జీవన విధానం, భూభాగాలు, వనరులు, భాషలు, సంస్కృతులు కలిగి ఉన్న సమాజాలు. “లంబాడీలు లేదా బంజారాలు” ప్రత్యేక సంప్రదాయ జీవన...

బుధవారం అక్టోబర్ 01–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం మహర్నవమి తిధి నవమి పగలు 02.19 వరకు ఉపరి దశమి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా యోగం అతిగండ రాత్రి 08.56 వరకు సుకర్మ కరణం కౌలవ సాయంత్రం 04.18 వరకు గరజి వర్జ్యం పగలు 01.24...

క్రికెట్ ను ఆటగానే చూడాలి!|EDITORIAL

‘ఓటమి చావు కన్నా భయంకరమైంది.’ ప్రపంచంలో, జీవితంలో గెలుపోటములు లేనిదెక్కడ? కానీ, యుద్ధంలో గెలుపోటములు గెలిచినా, ఓడినా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. యుద్ధంలో చావు అమరత్వాన్నిస్తే, ఒక్కోసారి క్రీడల్లో ఓటమి మరణశాసనాన్ని కూడా...

ఆ స్నేహితులను చూసి స్నేహమే సలాం చేసింది!|FRIENDSHIP

పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు సమయంలో ఎప్పుడు.. ఎప్పుడాని కండ్లల్లో వొత్తులేసుకొని సూడాల్సిన స్థితి వొచ్చింది. యెందుకంటే గతంలో కరోనా సమయంలో ముందొకసారి, ఆ తర్వాతొకసారి, మళ్లీ రెండు సమయాల్లో మా ఆత్మీయ...

యెహె తియ్! గీ ఆటకు వానడ్డమా?|ADUGU TRENDS

యేడాదికోపాలొచ్చే పండుగాయె. తీరొక్క పూలతో పాడి, ఆడే ఆటాయె. ఇగ గా వానదేవునికి కండ్లు కుట్టి, కుండపోత పోయబట్టె. ఇగ గిదంత పని గాదని, గా ఆడోళ్ళు ఏం చేసిండ్లో సూత్తె మీరు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News