Trending News
Sunday, December 7, 2025
25.2 C
Hyderabad
Trending News

DOCTORS|వైద్యులు ప్రత్యక్ష దైవాలు!|EDITORIAL

ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన మన దేశంలో ‘డాక్టర్స్ డే’ జరుపుకుంటున్నాం. ఇది వృత్తిపరంగా వైద్యుల సేవలను స్మరించుకోవడమే గాకుండా, అత్యున్నత సేవలందించే వైద్యులకు కృతజ్ఞత తెలియజేసే అరుదైన సందర్భం కూడా. ఈ రోజు భారతదేశ ప్రఖ్యాత వైద్యుడు, పూర్వ ముఖ్యమంత్రి డాక్టర్ బిడన్ చంద్ర రాయ్ జన్మదినం, వర్ధంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ జరుపుకుంటారు. డాక్టర్ బిడన్ చంద్ర రాయ్ జీవితం సంపూర్ణంగా ప్రజాసేవకే అంకితమైంది. అలాంటి మహానుభావుడిని స్మరించుకుంటూ, ప్రతి వైద్యుడి సేవను సముచింగా సత్కరించేందుకు ఈ రోజును ప్రత్యేకంగా ఉత్సవంగా నిర్వహించుకుంటున్నాం.

వైద్య వృత్తి అనేది కేవలం ఉద్యోగం కాదు. ఇది ఓ నిబద్ధత, సమాజం పట్ల తపన, సేవా స్ఫూర్తితో నిండిన పిలుపు. రోగికి వైద్యుడంటే దేవుడితో సమానం. వైద్యో నారాయణ హరి అన్నారు. నేటి ఆధునిక సమాజంలో తీవ్ర ఒత్తిళ్ళు, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న వేళ, వైద్యుల పాత్ర మరింత కీలకమవుతోంది. అనేక భౌతిక పరిమితులు, మానసిక వత్తిడుల మధ్య ప్రజలకు అందుబాటులో ఉండే వైద్యుడు నిజంగానే దేవుడికి ప్రతి రూపం.

కలరా, మశూచి, డెంగీ, కరోనా వంటి మహమ్మారిల విపత్తుల సమయంలో వైద్యులు తమ ప్రాణాలను ఫణంగా ప్రజల ప్రాణాలను కాపాడారు. విశేష, విస్త్రుత సేవలందించారు. మన కుటుంబ సభ్యులను మనమే చూసుకోలేని పరిస్థితుల్లోనూ, రోగులకు తల్లిదండ్రుల్లా, కుటుంబ సభ్యల్లా, బంధువుల్లా మద్దతుగా నిలిచారు. వైద్యుల అంకితభావం, సేవానిరతిని, మానవత్వాన్ని ప్రతిబింబించింది. వారిని “కోవిడ్ వారియర్స్” అని, ఫ్రంట్ వారియర్స్ అని పిలవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అయితే రంగం ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తక్కువేమీ కావు. ప్రభుత్వ రంగంలో వైద్యుల సంఖ్య సరిపోకపోవడం, పల్లెల్లో వైద్యుల కొరత, సమర్ధవంతమైన వైద్యసేవలందించడంలో లోపాలు వంటి సమస్యలు ఇవాళ మనం ఎదుర్కొంటున్నవే. ప్రైవేట్ వైద్యరంగంలో నాణ్యతతో పాటు ఖర్చుల భారం సామాన్యులకు నెత్తిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్యను మరింత పెంచాలి, గ్రామీణ వైద్యుల సంఖ్యను బలోపేతం చేయాలి.

ఇక వైద్య విద్య పట్ల మరింత కృషి అవసరం. మెడికల్ సీట్లు పెంచినప్పటికీ, ప్రైవేట్ కళాశాలల ఫీజులు సామాన్యుల పిల్లలకు వైద్య విద్యను దూరం చేస్తున్నాయి. మెరిట్ ఉన్న పేద విద్యార్థులకు మెడికల్ చదువు కలగా మిగులుతోంది. క్యూబా లాంటి దేశం కేవలం వైద్య విద్యను విద్యార్థులకు అందించడం ద్వారా ప్రపంచానికి అసరమైన అద్భుత వైద్యులను అందించి, అనేక యుద్ధాలు, విపత్తుల సమయంలో ఆ వైద్యుల ద్వారా అందిస్తున్న సేవలను మనం గుర్తు చేసుకోవాలి. అందుకే సేవాభావంతో కూడిన వైద్య విద్యను, ఉచిత వైద్యాన్ని ప్రజలకు అందించే విధంగా, ప్రోత్సహించే విధంగా బోధన, వైద్య రంగ ప్రణాళికలు రూపొందించాలి.

వైద్యులకు తగిన రక్షణ కూడా అవసరం. ఇటీవలి కాలంలో కొన్ని చోట్ల రోగుల బంధువుల చేతుల్లో వైద్యులు దాడులకు గురవుతున్న సంఘటనలు కలచివేస్తున్నాయి. ఇది ఆత్మీయ సంబంధాలను, వైద్యుల మనోధైర్యాన్ని కూడా దెబ్బతీస్తోంది. ప్రభుత్వాలు దీనిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి. వైద్యులు నిర్భయంగా, నిరుపేదలకు సేవలందించాలంటే సురక్షిత వాతావరణం అత్యవసరం. అలాగే దేశంలో ఎప్పటి నుంచో సంప్రదాయ వైద్యం కొనసాగుతోంది. అది కాస్తా అలోపతి వైద్యంగా కొందరు అందిస్తున్నారు. వారినే మనం రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటున్నారు. గ్రామీణ వైద్యులను పూర్తిగా విస్మరించి, మన దేశ ప్రజలకు అవసరమైన వైద్యాన్ని అందించగలిగిన వైద్యులను మనం తయారు చేయలేదు. కాబట్టి, గ్రామీణ వైద్యులకు తగిన శిక్షణ ఇచ్చి, సర్టిఫికేట్లు, ప్రభుత్వ గుర్తింపునిచ్చి, వారి ద్వారా కూడా వైద్య సేవలను ప్రజలకు అందించడాన్ని చట్టబద్ధం చేస్తే బాగుంటుందా? అన్నది నిపుణుల ద్వారా అధ్యయనం చేసి, ఒక పరిష్కారాన్ని కనుక్కోవాల్సిన అవసరం ఉంది.

వైద్యం ఇవ్వాళ సేవా భావన నుంచి వ్యాపారానికి మారింది. వ్యాపారం కోసమే వైద్యం చేస్తున్న వైద్యులను మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వారు సేవా భావానని పెంపొందించుకుంటే మంచిది. సమాజం కూడా వైద్యులపై గౌరవాన్ని, నమ్మకాన్ని చూపించాలి. అలాగే వైద్య వృత్తిలో ఉన్నవారు నైతిక విలువలు పాటించాలి. అప్పుడే వైద్య వ్యవస్థ పునాదులు బలపడతాయి. మానవతా దృక్పథంతో వైద్యులు పని చేస్తే ఆరోగ్యంగా, శాంతిగా మన సమాజం ఎదుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి వైద్యుడికి మనం “ధన్యవాదాలు” చెబుదాం. వారి సేవలు గుర్తిద్దాం. మన కుటుంబంలో వైద్యుడి ప్రాముఖ్యత ఎంత ఉంటుందో, సమాజం లోనూ అలాగే ఉండాలని గుర్తించాలి. ఈ వైద్య దినోత్సవం ప్రతి ఒక్కరికి సేవా స్పూర్తిని అందించాలి. వైద్య వృత్తిలో ఉన్న మిగతా విభాగావారందరికీ ఇది మరింత జాగ్రత్తగా, బాధ్యతతో పని చేసేలా ప్రేరణ కలిగించాలి.

డాక్టర్స్ డే కేవలం ఒక వేడుక కాదని, ఇది బాధ్యతను గుర్తుచేసే రోజు అని మనం తెలుసుకోవాలి. రోగాన్ని కాదు, రోగిని చికిత్స చేసే ఔషధం మానవత్వం అని గుర్తించినప్పుడే సమాజంలో శాంతి సౌఖ్యాలు నిలుస్తాయి. అందుకే వైద్యులు, వైద్య వృత్తిలో అన్ని విభాగాల, రకాల సిబ్బంది మొత్తానికి చప్పేదొక్కటే, వారి అంచనాలకు మించిన అవసరాలను ఈ సమాజం కోరుకుంటోంది. అందుకు తగ్గ సేవలు వారందించాలి. వారిని గౌరవిద్దాం, ప్రోత్సహిద్దాం, కృతజ్ఞతలు తెలుపుదాం.

Latest News

సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని సర్పంచ్ రేసులో|PANCHAYATI TRENDS

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పంచాయతీలో అరుదైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా రైతులు, స్థానిక నాయకులు సర్పంచ్ పదవికి పోటీ చేసే గ్రామ రాజకీయాల్లో ఈసారి సాఫ్ట్‌వేర్ కంపెనీ...

తంగెడాకులతోటి ఇనుప ధాతువు తయారు?!|ADUGU TRENDS

ఆకే కదాని తీసిపారేయొద్దు! పువ్వే కదాని పీకి పారేయొద్దుల్లా!! ఏ పుట్టల ఏ పాముందో! అన్నట్లు... గా ఏ ఆకుల ఏం బలముందో ఎవరికి ఎరుక?! గిప్పటి దాకా మనకు ఆకులు, అలములల్ల ఔషధ...

కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం సాధ్యమేనా?!|EDITORIAL

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సఫలం కాలేకపోతోంది? ప్రజల నాడీ పట్టుకోవడంలో విఫలమవుతోందా? ప్రజా సమస్యలను గుర్తించలేకపోతోందా? గుర్తించినా వాటిని సరైన రీతిలో డీల్ చేయలేకపోతోందా? అధికార బీజేపీని ఎదుర్కోలేకపోతోందా? మోదీ,...

ఈ రోజు /వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

డిసెంబర్ 07--2025 నుండి డిసెంబర్ 13--2025 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీ శక్తి మరియు నిర్ణయాత్మకత మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తిపరమైన రంగంలో, మీరు ఎదుర్కొంటున్న ఎత్తు తక్కువలను...

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News