Trending News
Thursday, October 2, 2025
22.8 C
Hyderabad
Trending News

ప్రజలను విస్మరిస్తున్న పార్టీలు, పాలకులు!|EDITORIAL

సొంత లాభం కొంత మానుకుని.. పొరుగువాడికి తోడుపడవోయ్! దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్!! అని గురజాడ ఏనాడో ‘గురు’ జాడ చూపించాడు. కానీ మన పాలకులు మాత్రం సొంత లాభం కోసం మాత్రమే పని చేస్తున్నారు. దేశ సేవ, ప్రజా సేవ పేరుతో రాజకీయాలు చేస్తూ ఆరాచకంగా ప్రవర్తిస్తున్నారు. దేశ మంటే మనుషులన్న సంగతి మరచి, దేశమంటే గనులు, భూములు, నిధులు అని నమ్మి పాలించే ఘనులు మన పాలకులు అయ్యారు. ఒకసారి ప్రజాప్రతినిధి అయితే చాలు, తరతరాలకు సరిపడా తెగేసి పోగేసుకుంటున్నారు. మనం నవ నాగరిక ఆధునిక యుగంలో ఉన్నామనా పరస్పర దోపిడీతో అనామకంగా అన్యాయమై పోతున్నామా? రూపాలు మారుతున్నాయి తప్ప మార్పులేమీ ఉండటం లేదు.

ప్రజల అవసరాలు, ఆశయాలు, ఆకాంక్షల కోసం పోరాడుతాం. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేస్తామని ఏర్పడ్డ పార్టీలు తమ లక్ష్యాలను విస్మరించాయి. అధికారం రాకముందు ఒకలా, వచ్చిన తరవాత మరోలా వ్యవహరిస్తూ ప్రజలకు గుదిబండలుగా మారాయి. పార్టీలోనే కాక, ప్రజలు అందించిన అధికారాన్ని తమ కుటుంబ వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం చేసుకున్నాయి. విపరీతంగా అవినీతికి పాల్పడుతున్నాయి. ప్రజల నిస్సహాయతను ఆసరా చేసుకుని పార్టీలు పరస్పరం అవగాహనతో దోపిడీకి పాల్పడుతున్నాయి. ఒకప్పుడు జాతీయ పార్టీలను మాత్రమే అభిమానించిన ప్రజలు, వాటి పనితీరును అసహ్యించుకుని, ప్రాంతీయ పార్టీలను ఆదరించారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల తీరు చూస్తూ, మళ్ళీ మరో ప్రత్యామ్నాయం కనిపించక జాతీయ పార్టీల వైపు చూడాల్సిన అగత్యంలో ప్రజలు పడ్డారు. ఉమ్మడి ఏపీలో బీఆర్‌ఎస్‌, వైసీపీలు ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపాయి. కానీ రాష్ర్టాలను అప్పుల కుప్ప చేసి వెళ్లాయి. ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి, కాంగ్రెస్ లు కూడా అప్పులపైనే కాలం వెళ్ళదీస్తున్నాయి. అప్పులు చేయకుండా అడుగు వేయలేని దుస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి. అధికారం కోసం ఇచ్చిన అలవి కాని హమీలు, వాటి అమలు, ఉచిత పథకాలు, పందేరాలతో రోజురోజుకు ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నా అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం వెంపర్లాడుతున్నారు.

పైగా పార్టీలు ఆత్మస్తుతి, పర నిందనే నమ్ముకున్నాయి. ఒక పార్టీ మిగతా పార్టీలను కలిసి పని చేస్తున్నాయని నిందిస్తున్నాయి. నిజానికి పార్టీలన్నీ కలిసే దోస్తున్నాయి. ఒకరినొకరు లోలోన సహకరించుకుంటూ, సమర్థించుకుంటూ, పైకి మాత్రం విమర్శించుకుంటూ ప్రజలను నయా నయవంచన చేస్తున్నాయి. ప్రజలను సమస్యల్లో వదిలేశారు. నిత్యావసర ధరలు, నిరుద్యోగంపై చర్చించే దమ్ము ఏపార్టీకి లేదు. తమ అవసరాల కోసం ప్రజావసరాలను విస్మరించి ఎంతకైనా దిగజారే నీచపు దిగజారుడు రాజకీయ యుగంలో మనమున్నాం. ప్రాంతీయంగా బలమైన నేతలుగా ముద్ర ఉన్న చంద్రబాబు, నితీశ్‌ కుమార్‌ వంటి వారు కూడా ఈ కోవలోనే ఉన్నారు.

ప్రజా రంజకమైన పాలన మీద ద్రుష్టి పెట్టకుండా, పరపార్టీపై నిందలు మోపడం, మన బలంగా ఎదగడం కంటే, ఎదుటి పార్టీలన బలహీనం చేయడమనే అరాచక క్రీడకు పాల్పడుతున్నారు. మోడీ తీసుకున్న కాంగ్రెస్‌ ముక్త్ భారత్‌ నినాదాం కూడా అలాంటిదే. గత ఎన్నికల్లో ‘చార్ సౌ పార్’ పారలేదు. కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా మారింది. దీంతో నిర్వీర్యం చేయాలని గడచిపోయిన, ప్రజలు మరచిపోయిన, ఇప్పటి తరానికి పెద్దగా గుర్తులేని, అవసరంలేని ‘ఎమర్జెన్సీ’ని ‘యమ అర్జెన్సీ’ అయినట్లు ఎత్తుకున్నారు. ఆనాటి చీకటి రోజులు అంటూ ఉపన్యాసాలు గుప్పిస్తున్నారు. పరిపాలన ప్రజల ఆకాంక్షలకు అనుగుంగా చేస్తే, పసలేని, పనికి మాలిన పార్టీల పని ప్రజలే చూసుకుంటారు కదా?

ఇక కేంద్రంలో బీజేపీ ఎన్డీఎ భాగస్వామ్య పక్షాలతో కలిసి దేశంలో అధికారంలో ఉంది. తమ పార్టీలోనే కాదు, ఆపార్టీల మెప్పుతో పని చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ప్రజల మెప్పుకంటే తమకు మద్దతు ఇచ్చే పార్టీల మెప్పుకోసమే పనిచేయడం మనం చూస్తున్నాం. ఇప్పుడు రాజకీయాలలో నమ్మకమైన మిత్రపక్షం, భాగస్వామ్య పార్టీలు లేకుండా పోయింది. అందుకే రాజకీయ నాయకులు బలమైన శత్రువు లేకుండా చూసుకుంటున్నారు.
నిజానికి ప్రభుత్వాలు, పార్టీలు ప్రజావసరాలను గుర్తెరిగి ప్రవర్తించాలి. హైదరాబాద్‌ మెట్రో విస్తరణ, కంటోన్మెంట్‌లో రోడ్ల విస్తరణ వంటి విషయాల్లో ప్రజల అవసరాలను చూడాలి. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉందని ప్రజల సమస్యలను విస్మరిస్తే బీజేపీకి ఒనగూరేదేంటి? బీజేపీ మంత్రులు, ఎంపీలు, నేతలు కూడా రాష్ట్ర ప్రయోజనాలపై ఎందుకు ప్రతిస్పందించడం లేదు? కేవలం ‘డబుల్‌ ఇంజిన్‌’ సర్కారే శరణ్యమని ఊదరగొట్టడం బాగానే ఉంది. కానీ, రేపు ప్రజలు అసలు ఇంజిన్ నే పనిచేయుకుండా చేస్తే?

బీజేపీ పనితీరు సక్రమంగా లేకపోవడం వల్లనే కర్నాటక, తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించారు. తెలంగాణలో కేసీఆర్‌ అహంకారాన్ని అణచివేసేందుకు ప్రజలు కాంగ్రెస్‌ను ఎంచుకున్నారు. ఇదంతా స్వయంకృతాపరాధమని తెలంగాణ నిరూపించింది. ఢిల్లీలో ఆప్ ని పని పట్టారు. కానీ, పంజాబ్ లో ఆ పార్టీ గెలిచింది. హిమాచల్‌లో కూడా కాంగ్రెస్‌ అధికారంలోకి రాగలిగింది. ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ, జనసేన కారణంగగా బీజేపీ నిలదొక్కుకో గలిగింది. బీజేపీ ఈడీ, సీబీఐలను ప్రయోగించి మహారాష్ట్రలో నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ, శివసేనలను చీల్చింది. పంజాబ్‌లో అకాలీదళ్‌ను దెబ్బతీసింది. బీహార్‌లో లోక్‌ జనశక్తిని ముక్కలు చేసింది. నితీశ్‌ కుమార్‌కు పొమ్మనకుండా పొగపెట్టి మళ్లీ దారికి తెచ్చుకుంది. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీని నిర్వీర్యం చేసింది. ఒడిషాలో నవీన్‌ పట్నాయక్‌ను దెబ్బతీసారు. పార్టీ ఏదైనా ఈ పద్ధతి తప్పని గత ప్రజా తీర్పులున్నాయి. ఇది గమనించకపోతే, ఏ పార్టీ అయినా ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.

Latest News

శుక్రవారం అక్టోబర్ 03 –2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం ఏకాదశి తిధి ఏకాదశి పగలు 02.28 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం శ్రవణ ఉదయం 06.46 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ధృతి రాత్రి 06.46 వరకు ఉపరి శూల కరణం భద్ర సాయంత్రం...

ఓ మహాత్మా..|POETRY

నిన్న,నేడు,రేపు రోజు ఏదైనా వాదం ఒక్కటే 'గాంధేయవాదం' ఇది నొప్పి తెలియకుండా సూదిచ్చే యంత్రం కొట్టకనే దెబ్బలు చరిచే తంత్రం ఎదుటి వానిలో ఆలోచన రేపే మంత్రం 'మహాత్మాగాంధీ' శాంతికి బ్రాండ్ అంబాసిడర్ నాయకత్వానికి నిదర్శనం ఉద్యమానికి ఊపిరి మొత్తానికి భారతదేశ 'మనిమకుటం' ఒక్కమాటతో జనాలకు జవసత్వాలు నింపి స్వతంత్ర భావజాలాన్ని పంచి అలుపెరుగని...

విజయదశమి అంటే ఏంటి? దసరాను ఎలా ఆచరించాలి?|ESSAY|ARTICLES

కృతయుగంలో రాక్షస సంహారంలో భాగంగా ఆది పరాశక్తి శుంభ నిశుంభ రక్తబీజ మొదలైన రాక్షసులతో పాటు మహిషాసురుడిని సంహరించి లోక రక్షణ చేసిన కారణంగా ఆ రోజు ఆనందంగా అమ్మవారిని ఆరాధించాలి అనుగ్రహం...

గీ బ్లడ్ గ్రూపున్నోల్లు తొందరగ సావరట!?|ADUGU TRENDS

మనిసికి లోకం మీద పేమ కంటే, పానం మీద తీపే ఎక్కువ. ఎవలికైనా శానా కాలం బతకాల్ననే ఉంటది. గదైతాది. ఎవలికి ఎంత రాసి పెట్టి ఉంటే గంతే? అనుకుంటుం గనీ, ఇగో.....

దసరా వైశిష్ట్యం విజయోస్తు!|EDITORIAL

హిందువులు జరుపుకునే పండగలలో దసరా పండగకు విశిష్ట స్థానం ఉంది. ఈ విజయ దశమికి సంబంధించి పలు పురాణగాథలు చెలామణిలో ఉన్నాయి. రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం...

గురువారం అక్టోబర్ 02 –2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం విజయదశమి దసరాపండుగ గాంధీ జయంతి తిధి దశమి పగలు 02.38 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.03 వరకు ఉపరి శ్రవణ యోగం సుకర్మ రాత్రి 08.03 వరకు ఉపరి ధృతి కరణం...

డైబర్ లేని ఆటోలొత్తానయి!?|ADUGU TRENDS

ఇగో గీ ఆటోలకు డైబరుండడు. ఇగ మనం గా ఆటో ఎక్కి యేడికి పోవాల్నో సెప్తె సక్కగ గాడికే తీస్కపోతది. గదేంది? పట్నాలల్ల రద్దీ ఉంటది గదా? గదెట్ల తీస్కపోతది? మనమెట్ల పోతం?...

ఆదివాసీల అస్తిత్వ పోరాటం!|EDITORIAL

“ఆదివాసులు” మూల వాసులు. భారత దేశంలోని స్వదేశీ జనజాతులు. ప్రత్యేక సంప్రదాయ జీవన విధానం, భూభాగాలు, వనరులు, భాషలు, సంస్కృతులు కలిగి ఉన్న సమాజాలు. “లంబాడీలు లేదా బంజారాలు” ప్రత్యేక సంప్రదాయ జీవన...

బుధవారం అక్టోబర్ 01–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం మహర్నవమి తిధి నవమి పగలు 02.19 వరకు ఉపరి దశమి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా యోగం అతిగండ రాత్రి 08.56 వరకు సుకర్మ కరణం కౌలవ సాయంత్రం 04.18 వరకు గరజి వర్జ్యం పగలు 01.24...

క్రికెట్ ను ఆటగానే చూడాలి!|EDITORIAL

‘ఓటమి చావు కన్నా భయంకరమైంది.’ ప్రపంచంలో, జీవితంలో గెలుపోటములు లేనిదెక్కడ? కానీ, యుద్ధంలో గెలుపోటములు గెలిచినా, ఓడినా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. యుద్ధంలో చావు అమరత్వాన్నిస్తే, ఒక్కోసారి క్రీడల్లో ఓటమి మరణశాసనాన్ని కూడా...

ఆ స్నేహితులను చూసి స్నేహమే సలాం చేసింది!|FRIENDSHIP

పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు సమయంలో ఎప్పుడు.. ఎప్పుడాని కండ్లల్లో వొత్తులేసుకొని సూడాల్సిన స్థితి వొచ్చింది. యెందుకంటే గతంలో కరోనా సమయంలో ముందొకసారి, ఆ తర్వాతొకసారి, మళ్లీ రెండు సమయాల్లో మా ఆత్మీయ...

యెహె తియ్! గీ ఆటకు వానడ్డమా?|ADUGU TRENDS

యేడాదికోపాలొచ్చే పండుగాయె. తీరొక్క పూలతో పాడి, ఆడే ఆటాయె. ఇగ గా వానదేవునికి కండ్లు కుట్టి, కుండపోత పోయబట్టె. ఇగ గిదంత పని గాదని, గా ఆడోళ్ళు ఏం చేసిండ్లో సూత్తె మీరు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News