Trending News
Thursday, October 2, 2025
22.8 C
Hyderabad
Trending News

పాఠాలు, గుణపాఠాలు నేర్పిన PLANE ACCIDENT|విమాన ప్రమాదం!|EDITORIAL

AHMEDABAD| అహ్మదాబాద్‌ AEROPLANE| విమాన దుర్ఘటన నుంచి మనం ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. సాంకేతిక లోపమో, మానవ తప్పిదమో కానీ, మారణహోమం జరిగిపోయింది. ఎన్నో కలలు, మరెన్నో ఆశలతో ఆ విమానాన్ని ఎక్కిన వారు గమ్యాన్ని ముద్దాడక ముందే మృత్యువుని ముద్దాడారు. ఎంతో నమ్మకమైన, భద్రంగా పేరున్న AIR INDIA| ఎయిర్ ఇండియా విమానం పూర్తిగా ఎయిర్ లోకి వెళ్ళక ముందే కుప్పకూలిపోయింది. విమానాన్ని గమ్యానికి చేర్చే ట్యాంక్ నిండా ఉన్న ఫ్యూయల్ అందులోని వాళ్ళని మంటల్లో మాడ్చి మసి చేసింది. ఒకేసారి వెయ్యి డిగ్రీల వేడిని రగిల్చిన ఆ మంటలకు అందులోని ప్రయాణీకులు, సిబ్బంది, పైలట్ సహా అంతా కాలిబూడిదైపోయారు. ఒకే ఒక్కడు మృత్యుంజయుడైయ్యాడు. తనను తానే నమ్మలేని విధంగా బతికి బట్టకట్టాడు.

గగన ప్రయాణం గరళ ప్రయాణంగా మారిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం పౌర విమాణ చరిత్రలోనే అత్యంత విషాదాన్ని మిగిల్చింది. విమానం ఎగిరిన కొద్ది నిమిషాల్లోనే నేలకొరిగింది. మంటల్లో మాడిపోయింది. యంత్రాలు పని చేయలేదో? మరెదో? కానీ, పైలట్ ఇచ్చిన సమాచారానికి, సమాధానం కూడా వినలేని దీన స్థితిలో అది కూలిపోయింది. బహుషా జనావాసాల్లో కూలిపోకుండా పైలట్ తీసుకున్న జాగ్రత్త వల్లనో ఏమో పక్కకు తప్పించబోయినా, అది పైలట్ చేతిలో లేకుండా పోయి, మెడికల్ కాలేజీ భవనంలోకి దూసుకుపోయింది. దీంతో డాక్టర్లు, మెడికోలు ఈ ప్రమాదంలో మరణించారు. జానవాసాల్లోని కొందరు మృత్యువాతపడ్డారు. మొత్తానికి ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 డ్రీమ్‌ లైనర్ విమాన ప్రమాదం ఘోర విషాదాన్ని నింపింది. విమానంలోని 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 మంది సిబ్బంది మొత్తం 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరు బతికారు. విమానం కూలిన వైద్య కళాశాల మెడికోల వసతి గృహ సముదాయం ధ్వంసమై 33 మంది వరకూ మృతి చెందడటంతో మృతుల సంఖ్య 274కు చేరింది.

2009లో 787-8 డ్రీమ్‌ లైనర్ ప్రపంచంలో వాడుకలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన తొలి ప్రమాదం కూడా ఇదే కావడం విశేషం. బోయింగ్ 787 లోపభూయిష్టమని, ప్రయాణికులకు ప్రమాదకరమని సలోహ్‌పోర్ అనే విజిల్‌బ్లోయర్ ఏడాది క్రితమే హెచ్చరించారని ప్రచారం జరుగుతోంది. లోపాల కారణంగా విమానం పదేపదే ప్రయాణించిన తర్వాత ముక్కలైపోవచ్చని చెప్పారట. ఆ సమస్యే ఎయిర్ ఇండియా విమానం కూలడానికి కారణం కావచ్చని అన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే విమాన ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవచ్చని కూడా తన వాంగూల్మంలో పేర్కొన్నారు. ఇప్పుడు సలోహ్‌పోర్ అనుమానమే నిజమైందా?

ఇక విమానం కూలిన ప్రదేశంలో దొరికిన బ్లాక్ బాక్స్ ఆధారంగా ప్రమాద కారణాలను అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాయిస్, సిస్టమ్ డాటాను విశ్లేషిస్తున్నారు. ప్రమాదంపై దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

విమానం కూలిపోయే సమయంలో పరిస్థితిని ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)తో పైలెట్ మాట్లాడిన మాటలు అర్థం చేస్తున్నాయి. ‘విమానంలో పవర్ లేదు. నో థ్రస్ట్. గోయింగ్ డౌన్.. మేడే.. మేడే.. మేడే..’ అని పైలెట్ సుమత్ చెప్పారు. థ్రస్ట్ అంటే విమానాన్ని ముందుకు నడిపే శక్తి. ఇది విమానం ఇంజిన్‌లు లేదా ప్రొపెల్లర్ల ద్వారా ఉత్పత్తి అవుతుంది. థ్రస్ట్ అంటే నెట్టడం అనే అర్థం కూడా ఉంది. అయితే ఈ విమాన ప్రమాదానికి ఇంజిన్ లేదా ప్రొపెల్లర్ల వైఫల్యం కారణమని భావించవచ్చా? ప్రమాద కారణాలను అన్వేషించేందుకు జాతీయ దర్యాప్తు బృందం(ఎన్‌ఐఏ) రంగంలోకి దిగింది.

ఈ ఘటన మనకు ప్రధానంగా విమాన యానంలోని సాంకేతికత నైపుణ్యాలని మరింత సాధించాలన్న సత్యాన్ని చాటింది. సాధారణంగా విమనాలు బయలుదేరే ముందు దాని సామర్థ్యం, యంత్రాల పనితీరు, సాంకేతికతలు, లోపాలను పరిశీలించిన తరవాతనే ప్రయాణానికి సంసిద్ధమవుతారు. అలా జరిగిందా? లేదా? అలాగే ఆ ఎయిరిండియా విమానం ఢిల్లీ నుండి అహ్మదాబాద్ మీదుగా లండన్ వెళుతున్నది. అహ్మదాబాద్ వరకు బాగానే వచ్చిన విమానం ఒక్కసారిగా ఎందుకలా అయ్యింది? మరే కోణమైనా ఉందా? అన్నవి తేలాల్సిన అంశాలు. 146 కోట్లు ఉన్న దేశ జనాభాకు తగ్గట్లుగా ఇప్పటికీ విమానయానం లేదు, విమానాలు లేవు, విమానాశ్రయాలు లేవన్న విమర్శలను ఒకసారి ఆలోచించుకోవాలి. తాజా ఘటనపై సునిశిత పరిశోధన జరగాలి.

నిజానికి అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటన ఒళ్ళు జలదరింప చేస్తోంది. ఆ పెనువిషాదం గుండెలను పిండేస్తున్నది. వందల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఎందరో కలలను చిదిమేసింది. తప్పెవరిదైనా వందలాది ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. కొన్ని బతుకులు ఛిద్రం అయ్యాయి. విమనాల ఉత్పత్తి మొదలు సాంకేతికత వరకు సమగ్ర అధ్యయనం చేయాలి. ఈ ప్రమాదం నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా తన విమానాల సంపూర్ణ ప్రక్షాళనకు సిద్ధపడాలి. దేశీయ విమానయాన సంస్థల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి. సాంకేతిక వైఫల్యాల నుంచి మానవ నిర్లక్ష్యం వరకూ ఈ ప్రమాదానికి దోహదం చేసిన అన్ని అంశాలను గుర్తించి, అవసరమైన చర్యలను చేపట్టాలి.

Latest News

శుక్రవారం అక్టోబర్ 03 –2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం ఏకాదశి తిధి ఏకాదశి పగలు 02.28 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం శ్రవణ ఉదయం 06.46 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ధృతి రాత్రి 06.46 వరకు ఉపరి శూల కరణం భద్ర సాయంత్రం...

ఓ మహాత్మా..|POETRY

నిన్న,నేడు,రేపు రోజు ఏదైనా వాదం ఒక్కటే 'గాంధేయవాదం' ఇది నొప్పి తెలియకుండా సూదిచ్చే యంత్రం కొట్టకనే దెబ్బలు చరిచే తంత్రం ఎదుటి వానిలో ఆలోచన రేపే మంత్రం 'మహాత్మాగాంధీ' శాంతికి బ్రాండ్ అంబాసిడర్ నాయకత్వానికి నిదర్శనం ఉద్యమానికి ఊపిరి మొత్తానికి భారతదేశ 'మనిమకుటం' ఒక్కమాటతో జనాలకు జవసత్వాలు నింపి స్వతంత్ర భావజాలాన్ని పంచి అలుపెరుగని...

విజయదశమి అంటే ఏంటి? దసరాను ఎలా ఆచరించాలి?|ESSAY|ARTICLES

కృతయుగంలో రాక్షస సంహారంలో భాగంగా ఆది పరాశక్తి శుంభ నిశుంభ రక్తబీజ మొదలైన రాక్షసులతో పాటు మహిషాసురుడిని సంహరించి లోక రక్షణ చేసిన కారణంగా ఆ రోజు ఆనందంగా అమ్మవారిని ఆరాధించాలి అనుగ్రహం...

గీ బ్లడ్ గ్రూపున్నోల్లు తొందరగ సావరట!?|ADUGU TRENDS

మనిసికి లోకం మీద పేమ కంటే, పానం మీద తీపే ఎక్కువ. ఎవలికైనా శానా కాలం బతకాల్ననే ఉంటది. గదైతాది. ఎవలికి ఎంత రాసి పెట్టి ఉంటే గంతే? అనుకుంటుం గనీ, ఇగో.....

దసరా వైశిష్ట్యం విజయోస్తు!|EDITORIAL

హిందువులు జరుపుకునే పండగలలో దసరా పండగకు విశిష్ట స్థానం ఉంది. ఈ విజయ దశమికి సంబంధించి పలు పురాణగాథలు చెలామణిలో ఉన్నాయి. రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం...

గురువారం అక్టోబర్ 02 –2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం విజయదశమి దసరాపండుగ గాంధీ జయంతి తిధి దశమి పగలు 02.38 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.03 వరకు ఉపరి శ్రవణ యోగం సుకర్మ రాత్రి 08.03 వరకు ఉపరి ధృతి కరణం...

డైబర్ లేని ఆటోలొత్తానయి!?|ADUGU TRENDS

ఇగో గీ ఆటోలకు డైబరుండడు. ఇగ మనం గా ఆటో ఎక్కి యేడికి పోవాల్నో సెప్తె సక్కగ గాడికే తీస్కపోతది. గదేంది? పట్నాలల్ల రద్దీ ఉంటది గదా? గదెట్ల తీస్కపోతది? మనమెట్ల పోతం?...

ఆదివాసీల అస్తిత్వ పోరాటం!|EDITORIAL

“ఆదివాసులు” మూల వాసులు. భారత దేశంలోని స్వదేశీ జనజాతులు. ప్రత్యేక సంప్రదాయ జీవన విధానం, భూభాగాలు, వనరులు, భాషలు, సంస్కృతులు కలిగి ఉన్న సమాజాలు. “లంబాడీలు లేదా బంజారాలు” ప్రత్యేక సంప్రదాయ జీవన...

బుధవారం అక్టోబర్ 01–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం మహర్నవమి తిధి నవమి పగలు 02.19 వరకు ఉపరి దశమి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా యోగం అతిగండ రాత్రి 08.56 వరకు సుకర్మ కరణం కౌలవ సాయంత్రం 04.18 వరకు గరజి వర్జ్యం పగలు 01.24...

క్రికెట్ ను ఆటగానే చూడాలి!|EDITORIAL

‘ఓటమి చావు కన్నా భయంకరమైంది.’ ప్రపంచంలో, జీవితంలో గెలుపోటములు లేనిదెక్కడ? కానీ, యుద్ధంలో గెలుపోటములు గెలిచినా, ఓడినా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. యుద్ధంలో చావు అమరత్వాన్నిస్తే, ఒక్కోసారి క్రీడల్లో ఓటమి మరణశాసనాన్ని కూడా...

ఆ స్నేహితులను చూసి స్నేహమే సలాం చేసింది!|FRIENDSHIP

పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు సమయంలో ఎప్పుడు.. ఎప్పుడాని కండ్లల్లో వొత్తులేసుకొని సూడాల్సిన స్థితి వొచ్చింది. యెందుకంటే గతంలో కరోనా సమయంలో ముందొకసారి, ఆ తర్వాతొకసారి, మళ్లీ రెండు సమయాల్లో మా ఆత్మీయ...

యెహె తియ్! గీ ఆటకు వానడ్డమా?|ADUGU TRENDS

యేడాదికోపాలొచ్చే పండుగాయె. తీరొక్క పూలతో పాడి, ఆడే ఆటాయె. ఇగ గా వానదేవునికి కండ్లు కుట్టి, కుండపోత పోయబట్టె. ఇగ గిదంత పని గాదని, గా ఆడోళ్ళు ఏం చేసిండ్లో సూత్తె మీరు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News