Trending News
Thursday, October 2, 2025
22.8 C
Hyderabad
Trending News

మద్యం, మత్తు అదుపుతోనే నేరాలు చిత్తు!

పేరుకే ఎక్సైజ్ మద్య నిషేధ శాఖ. కానీ మద్య నిషేధం పక్కన పెట్టి భారీగా మద్యం అమ్మకాలు సాగాలన్నదే ఆ శాఖ లక్ష్యం. ప్రభుత్వాల లక్ష్యం కూడా అదే. మద్యంతో సంభవించే అనర్థాలు కంటే కూడా, సంపాదించే అర్థం (డబ్బు) మీదే ప్రభుత్వాద ధ్యాసంతా. ప్రజలేమైనా ప్రభుత్వాలకు, వాటిని నడిపే పార్టీలకనవసరం. తమ పదవులు, పీఠాలు పదిలంగా ఉన్నాయా లేదా అన్నదే వాళ్ళ ప్రథమ కర్తవ్యంగా మారింది. మద్యం ప్రభుత్వాల ప్రధాన ఆదాయ వనరై పోవడంతో, మద్యం పర్యవసనాలు ఎవరికీ పట్టడం లేదు. మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో ఉచిత పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వాలు అలవాటు పడ్డాయి. మద్య నిషేధాన్ని అమలు చేయాలన్న ఆలోచనే చేయడం లేదు. జనమేమైపోయినా, ఆదాయం పెరగాలన్న ధోరణిలో ప్రభుత్వాలు ఉన్నాయి.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇందుకు భిన్నంగా ఏమీ లేవు. నిజానికి ఉచిత పథకాలు ఆపితే మద్యాన్ని అమ్మాల్సిన అవసరమేలేదు. విచ్చలవిడి మద్యం అమ్మకాలపై అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మద్యం ధరలు పెంచినా అమ్మకాలు ఆగడం లేదు. బ్యాడ్ అయినా, బ్రాండ్‌ ఏదైనా డబ్బులు తెచ్చి పెడుతోంది. మద్యంతోపాటు మాదక ద్రవ్యాలు అందుబాటులో ఉండడంతో జులాయిల అకృత్యాలకు అంతు లేకుండాపోతోంది. మత్తులో ఉన్న వారిలో దూకుడు స్వభావం, విపరీత ధోరణి ఉంటుంది. ఈ మత్తే నేరాలకు హేతువవుతోంది. విపరీత ప్రవర్తన, సమాజంపై ద్వేష భావం ఉండేవారికి మద్యం మత్తు తోడైతే అది తీవ్రమైన నేరాలకు కారణమవుతుంది. అందుకే మద్యం సహా, మత్తు పదార్థాలను అరికట్టే మార్గాలు ఆలోచించాలి. అకృత్యాల కట్టడికి ఏం చేయాలన్నది చర్చించాలి. మహిళలపై లైంగిక నేరాలు, అత్యాచారాలకు పాల్పడుతున్న వారిలో మద్యం మత్తులో ఉన్నవారే ఎక్కువ. అయితే, ఎక్కడపడితే అక్కడ మద్యం లభించడం మరింత ఆందోళన కలిగించే అంశం. చెడు సావాసాలతో మత్తులో మునిగి నేరాలకు పాల్పడుతున్నారు. దీనికంతటకీ నిరుద్యోగాన్ని కూడా ఒక కారణంగా చూడాలి. ఇవన్నీ అరికట్టేందుకు ఏం చూయాలో ఆలోచించి ముందుకు కదిలితేనే నేరాలను అరికట్టగలం.

ఇటీవల గంజాయి కూడా విపరీతంగా పట్టుబడుతోంది. ఎంతగా స్వాధీనం చేసుకున్నా అంతకంతకూ రవాణా ఆగడం లేదు. అంటే మార్కెట్లో గంజాయికి అంత డిమాండ్‌ ఉందన్నమాట. ఏపీతో పోలిస్తే తెలంగాణలో మద్యం అమ్మకాలు పెరిగాయి. మద్యం అమ్మకాలతో పాటు నేరాలు, ఘోరాలు కూడా పెరుగుతున్నాయి. మద్యం మత్తులోనే నేరాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అత్యాచారలు, దొంగతనాలు, కిడ్నాప్‌లు ఇలా అనేక రకాలైన నేరాలకు మద్యం కారణం అవుతోంది.

సంపూర్ణ మద్యనిషేధం విధిస్తామని అధికారంలోకి వచ్చినప్పుడు నాటి సీఎం జగన్‌ హావిూ ఇచ్చి డొల్ల కంపెనీల బ్రాండ్లతో వేలకోట్లు సంపాదించారు. మద్యం కుంభకోణంపై ఇప్పుడు సిట్‌ విచారణ జరుగుతోంది. మద్యం అమ్మకాలు లేకపోతే ప్రభుత్వాలు నడిచే పరిస్థితి లేదు. దీంతో మద్యం అమ్మకాలను బాహాటంగానే ప్రోత్సహిస్తున్నారు. ఇష్టం వచ్చిన బ్రాండ్లతో అమ్మకాలు చేసి ఖజానా నింపుకుంటున్నారు. అంతెందుకు పార్టీల మీటింగులకు కార్యకర్తలు రావాలంటే సుక్క, ముక్క పెట్టాల్సిందే. ఒక్క ఏపీ మాత్రమే కాదు, తెలంగాణతో పాటు యూపీ వంటి అన్ని రాష్ట్రాల్లనూ ఇదే వరస. కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉన్న కేరళలోనూ ఇదే తంతు. ఇటీవలి అత్యాచార ఘటనలను చూస్తే సామాన్యలకు కూడా భయమేస్తోంది. బయటకు రావాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఉంది. చిన్నపిల్లలను కూడా వదలడం లేదు. కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధించి కొంత ఊరటను కలిగిస్తున్నాయి.

ఇలాంటి ఘటనలన్నింటిలో అరెస్టవుతున్న నిందితుల్లో 60 శాతం మద్యం మత్తులో ఉన్నప్పుడే ఆ పైశాచిక చర్యకు పాల్పడుతున్నట్లు వెల్లడవుతోంది. మత్తులో ఉన్నవారికి విచక్షణ ఉండదు. నియంత్రణ ఉండదు. అలాంటి సందర్భాల్లో బాధితులు ఎవరైనా వారిని ఎదిరించినా, వారి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించినా మరింత రెచ్చిపోతారు. హింసాత్మక చర్యలకు దిగుతారు. వీటిని మానసిక నిపుణులు కూడా ధ్రువీకరిస్తున్నారు. మద్యం మత్తులో ఉండే వ్యక్తికి అదే మైకంలో ఉన్న మరో ఇద్దరు, ముగ్గురు తోడైతే వారి అరాచకాలకు అడ్డూ అదుపు ఉండదు. తాను ఒక్కడినే కాదని.. తనతో పాటు మరి కొందరు ఉన్నారన్న భరోసాతో మరింతగా రెచ్చి పోతారు. తమవల్ల వారికి ఏమవుతుందో అన్న భయం కానీ, తరవాత తామేవుతామో అన్న ఆలోచనకానీ ఆ సమయంలో ఉండదు. అందువల్ల మద్యంపై నియంత్రణ విధించడం అవసరం అని పాలకులు గుర్తించాలి.

మద్యం, మాదక ద్రవ్యాల విషయంలో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోక పోవడం వల్లే ఇదంతా. యువత ఈ పెడ దారి పట్టకుండా చూడాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. మద్య, మత్తు మందు సంబంధ ఘటనల్లో దోషులకు కఠిన శిక్షలు పడేలా చట్టాలను బలోపేతం చేయాలి. వాటిని పకడ్బందీగా అమలు చేయాలి. మద్యం వల్ల వచ్చే ఆదాయం కంటే అనర్థాలను గుర్తించి మద్యం అమ్మకాలను నిలిపేయాలి. మద్య నిషేధాన్ని అమలు చేయాలి. ప్రభుత్వాలు వ్యాపార వాణిజ్య సంస్థలు కావు. వాటి అధినేతలు ఆ కంపెనీలకు సీఇఓలు కాదు. ప్రభుత్వాలు, ప్రజల కేర్ టేకర్స్. అవి ఎప్పుడూ ప్రజల శ్రేయోభిలాషిలానే ఉండాలి.

Latest News

శుక్రవారం అక్టోబర్ 03 –2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం ఏకాదశి తిధి ఏకాదశి పగలు 02.28 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం శ్రవణ ఉదయం 06.46 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ధృతి రాత్రి 06.46 వరకు ఉపరి శూల కరణం భద్ర సాయంత్రం...

ఓ మహాత్మా..|POETRY

నిన్న,నేడు,రేపు రోజు ఏదైనా వాదం ఒక్కటే 'గాంధేయవాదం' ఇది నొప్పి తెలియకుండా సూదిచ్చే యంత్రం కొట్టకనే దెబ్బలు చరిచే తంత్రం ఎదుటి వానిలో ఆలోచన రేపే మంత్రం 'మహాత్మాగాంధీ' శాంతికి బ్రాండ్ అంబాసిడర్ నాయకత్వానికి నిదర్శనం ఉద్యమానికి ఊపిరి మొత్తానికి భారతదేశ 'మనిమకుటం' ఒక్కమాటతో జనాలకు జవసత్వాలు నింపి స్వతంత్ర భావజాలాన్ని పంచి అలుపెరుగని...

విజయదశమి అంటే ఏంటి? దసరాను ఎలా ఆచరించాలి?|ESSAY|ARTICLES

కృతయుగంలో రాక్షస సంహారంలో భాగంగా ఆది పరాశక్తి శుంభ నిశుంభ రక్తబీజ మొదలైన రాక్షసులతో పాటు మహిషాసురుడిని సంహరించి లోక రక్షణ చేసిన కారణంగా ఆ రోజు ఆనందంగా అమ్మవారిని ఆరాధించాలి అనుగ్రహం...

గీ బ్లడ్ గ్రూపున్నోల్లు తొందరగ సావరట!?|ADUGU TRENDS

మనిసికి లోకం మీద పేమ కంటే, పానం మీద తీపే ఎక్కువ. ఎవలికైనా శానా కాలం బతకాల్ననే ఉంటది. గదైతాది. ఎవలికి ఎంత రాసి పెట్టి ఉంటే గంతే? అనుకుంటుం గనీ, ఇగో.....

దసరా వైశిష్ట్యం విజయోస్తు!|EDITORIAL

హిందువులు జరుపుకునే పండగలలో దసరా పండగకు విశిష్ట స్థానం ఉంది. ఈ విజయ దశమికి సంబంధించి పలు పురాణగాథలు చెలామణిలో ఉన్నాయి. రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం...

గురువారం అక్టోబర్ 02 –2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం విజయదశమి దసరాపండుగ గాంధీ జయంతి తిధి దశమి పగలు 02.38 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.03 వరకు ఉపరి శ్రవణ యోగం సుకర్మ రాత్రి 08.03 వరకు ఉపరి ధృతి కరణం...

డైబర్ లేని ఆటోలొత్తానయి!?|ADUGU TRENDS

ఇగో గీ ఆటోలకు డైబరుండడు. ఇగ మనం గా ఆటో ఎక్కి యేడికి పోవాల్నో సెప్తె సక్కగ గాడికే తీస్కపోతది. గదేంది? పట్నాలల్ల రద్దీ ఉంటది గదా? గదెట్ల తీస్కపోతది? మనమెట్ల పోతం?...

ఆదివాసీల అస్తిత్వ పోరాటం!|EDITORIAL

“ఆదివాసులు” మూల వాసులు. భారత దేశంలోని స్వదేశీ జనజాతులు. ప్రత్యేక సంప్రదాయ జీవన విధానం, భూభాగాలు, వనరులు, భాషలు, సంస్కృతులు కలిగి ఉన్న సమాజాలు. “లంబాడీలు లేదా బంజారాలు” ప్రత్యేక సంప్రదాయ జీవన...

బుధవారం అక్టోబర్ 01–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం మహర్నవమి తిధి నవమి పగలు 02.19 వరకు ఉపరి దశమి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా యోగం అతిగండ రాత్రి 08.56 వరకు సుకర్మ కరణం కౌలవ సాయంత్రం 04.18 వరకు గరజి వర్జ్యం పగలు 01.24...

క్రికెట్ ను ఆటగానే చూడాలి!|EDITORIAL

‘ఓటమి చావు కన్నా భయంకరమైంది.’ ప్రపంచంలో, జీవితంలో గెలుపోటములు లేనిదెక్కడ? కానీ, యుద్ధంలో గెలుపోటములు గెలిచినా, ఓడినా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. యుద్ధంలో చావు అమరత్వాన్నిస్తే, ఒక్కోసారి క్రీడల్లో ఓటమి మరణశాసనాన్ని కూడా...

ఆ స్నేహితులను చూసి స్నేహమే సలాం చేసింది!|FRIENDSHIP

పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు సమయంలో ఎప్పుడు.. ఎప్పుడాని కండ్లల్లో వొత్తులేసుకొని సూడాల్సిన స్థితి వొచ్చింది. యెందుకంటే గతంలో కరోనా సమయంలో ముందొకసారి, ఆ తర్వాతొకసారి, మళ్లీ రెండు సమయాల్లో మా ఆత్మీయ...

యెహె తియ్! గీ ఆటకు వానడ్డమా?|ADUGU TRENDS

యేడాదికోపాలొచ్చే పండుగాయె. తీరొక్క పూలతో పాడి, ఆడే ఆటాయె. ఇగ గా వానదేవునికి కండ్లు కుట్టి, కుండపోత పోయబట్టె. ఇగ గిదంత పని గాదని, గా ఆడోళ్ళు ఏం చేసిండ్లో సూత్తె మీరు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News