Trending News
Sunday, December 7, 2025
17.2 C
Hyderabad
Trending News

సంకటంలో స్థానిక సంస్థల ఎన్నికలు!?|EDITORIAL

దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు అయితే, రాష్ట్రంలో పల్లెలు ఎవరికీ పట్టని కొమ్మలుగా మిగిలిపోయాయి. ఒకవైపు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విధించిన సెప్టెంబర్ 30 గడువు ముంచుకొస్తున్నది. మరోవైపు ఎన్నికల సంఘం ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నది. ఇంకోవైపు సర్పంచ్ లు లేని కారణంగా కేంద్రం ప్రతి ఏటా ఇచ్చే గ్రాంట్లు, దానికి సమానంగా వచ్చే రాష్ట్ర సర్కార్ నిధులు కలిపి రూ.6వేల కోట్లు నిలిచిపోయాయి. అభివృద్ధి ఆగిపోయింది. రాష్ట్ర సర్కార్ నిధులేవీ లేకపోవడంతో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. ఖర్చులు పెట్టలేక అప్పుల పాలవుతున్నామని కార్యదర్శులు మొత్తుకుంటున్నారు. ప్రత్యేకాధికారుల పాలన ప్రజారంజకంగా లేదు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల తర్వాతే ఎన్నికలంటున్న బిల్లుకు, రాష్ట్రపతి, గవర్నర్ల ఆమోదం లభించలేదు. అవి పొందేలా కూడా కనిపించడం లేదు. ఈలోగా రెండేళ్ల కాలం ఆవిరైంది. మరి ఈ దశలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? అన్నది జవాబులేని ప్రశ్నలా మారింది.
అడుగు’ చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ అందిస్తోన్న ‘సంకటంలో స్థానిక ఎన్నికలు!?’ 

స్థానిక సంస్థల ఎన్నికలు సంకట స్థితిలో పడ్డాయి. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్నదానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఒకవైపు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విధించిన సెప్టెంబర్ 30 గడువు దగ్గర పడుతున్నది. మరోవైపు ఎన్నికల సంఘం ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నది. ఇంకోవైపు సర్పంచ్ లు లేని కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే గ్రాంట్లు నిలిచిపోయాయి. అభివృద్ధి ఆగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లు, నిధులేవీ లేకపోవడంతో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. చిల్లర ఖర్చులు చేయలేక అప్పుల పాలవుతున్నామని గ్రామ కార్యదర్శులు మొత్తుకుంటున్నారు. ప్రత్యేకాధికారుల పాలన ప్రజారంజకంగా లేదు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల తర్వాతే ఎన్నికలంటున్న రాష్ట్ర ప్రభుత్వం బిల్లుకు, రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందలేదు. పొందేలా కనిపించడం లేదు. మరి ఈ దశలో స్థానిక సంస్థల ఎన్నికలు అసలు ఎప్పుడు జరుగుతాయి? అన్నది జవాబులేని ప్రశ్నలా మారింది.

స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసి రెండేండ్లు కావస్తున్నది. సర్పంచ్ ల పదవీ కాలం 2023 జనవరి 31తో ముగిసింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీకాలం 2023 మే నెలలోనే ముగిసింది. ఈ దశలో ఎన్నికలు ఆలస్యమవుతుండటం తో ప్రభుత్వం ప్రత్యేకాధికారుల పాలన ను ప్రవేశపెట్టింది. ఈ అంశంపై కొందరు కోర్టుకు వెళ్ళడంతో, 2023 జులైలో తెలంగాణ హైకోర్టు ప్రభుత్వం పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. 2025 జూన్‌లో హైకోర్టు మరింత స్పష్టంగా నిర్దేశిత ఆదేశాలిచ్చింది. 30 రోజుల్లో వోటర్ల జాబితా, రిజర్వేషన్ల ప్రకటన జరిపి, 60 రోజుల్లో పూర్తి ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహంచాలని ఆదేశించింది.
ఇందుకు అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిచాలని తలపోసింది. చట్టబద్ధత కోసం బిల్లు, ఆర్డినెన్స్, గవర్నర్, రాష్ట్రపతి ఆమోదాలు అవసరం. కాబట్టి, మంత్రిమండలి ఆమోదించి, అసెంబ్లీలో చర్చించి, ఏకగ్రీవం చేసి, ఆ ప్రక్రియను చేపట్టింది. అయితే, గవర్నర్, రాష్ట్రపతిల ఆమోదం నేటికీ లభించలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీ జంతర మంతర్ లో ఒక రోజు దీక్షను చేపట్టింది. ఆ తర్వాత మరోసారి కేబినెట్ నిర్ణయం మేరకు, అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించి, స్థానిక సంస్థలకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కేంద్రానికి, గవర్నర్లకు మరోసారి పంపించింది. ఇది సాధ్యం కాపోతే, పార్టీ పరంగా బీసీలకు 42శాతం టికెట్లు ఇవ్వాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది.

ఈ భావనలెలా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం కూడా జనాభాతోపాటు కుల గణనకు సిద్ధపడింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేసి ఉంది. ఇదొక అవరోధంగా మారింది. మరోవైపు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రావడం లేదు. ముంచుకొస్తున్న సెప్టెంబర్ లోగా ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్నది తేలడం లేదు. ప్రభుత్వమూ చెప్పడంలేదు. ఆ మధ్య హై కోర్టు ఆదేశిత నిర్ణీత గడువులోగా ఎన్నికలు జరుపుతామని సీఎం చెప్పారు. కానీ దానిపైనా స్పష్టత కొరవడింది.

ఇక సర్పంచ్ ల ఎన్నికలు జరగని కారణంగా, కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ కమిషన్ గ్రామ పంచాయతీలకు ప్రతి ఏటా ఇచ్చే నిధులను నిలిపివేసింది. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను కలుపుకుని 3వేల కోట్లకు పైగా నిధులు నిలిచి ఉన్నాయి. కేంద్ర గ్రాంట్ కు సమానంగా రాష్ట్ర గ్రాంటు అంటే మరో 3వేల కోట్లు కలిపి మొత్తం 6వేల కోట్లకు పైగా నిధులు నిలిచిపోయాయి. దీంతో గ్రామ పంచాయతీల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా తిష్ట వేసి ఉన్నాయి. ఈ దశలో పంచాయతీ ఎన్నికల పంచాయితీ తమకు వద్దని నేతలు దూరం ఉంటున్నారు.

తాజాగా బీసీ రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందడానికి, బీహార్ ఎన్నికల తర్వాతే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని తలపోస్తున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి. బీసీ రిజర్వేషన్లకు చట్టాలు సహా, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అడ్డంకిగా మారాయి. ఇదే తరుణంలో అధికార కాంగ్రెస్ ప్రజా, ప్రజాస్వామిక ప్రయోజనాలకంటే, పార్టీ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. బీసీలకు రిజర్వేషన్లపై పార్టీలు నెపాన్ని ఎదుటి పార్టీలమీద తోస్తూ తప్పించుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో ప్రజలు, ప్రజాస్వామ్యం, స్థానిక సంస్థలు అపహాస్యం పాలవుతున్నాయి.

 

Latest News

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

గురువారం డిసెంబర్ 04–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--శుక్లపక్షం దత్తాత్రేయ జయంతి తిధి శు.చతుర్దశి ఉదయం 07.37 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం కృత్తిక పగలు 03.12 వరకు ఉపరి రోహిణి యోగం శివ ఉదయం 11.45 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం...

భౌ భౌ…! భౌ భౌ…భౌ!!|DOGS|INDIA|SUPREME COURT

విచ్చలవిడిగా విస్తరిస్తోన్న వీధి కుక్కలు రెచ్చిపోతున్న పిచ్చి కుక్కలు కరచి, రక్కి, కొరికి పారేస్తున్న శునకాలు నియంత్రణకు ‘సుప్రీం’ ఆదేశాలు సాదుకునే రోజుల నుంచి... కుక్కలంటే భయపడే రోజులొచ్చాయ్ కుక్కకు కూడా ఓ రోజొస్తుందంటే ఏమో అనుకున్నాం! నిజంగానే...

ఒకే కుటుంబం నుంచి ఐదుగురు సర్పంచ్ పోటీదారులే|PANCHAYATI TRENDS

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ ఈ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో వార్తల్లో నిలిచింది. ఎస్సీ జనరల్‌గా రిజర్వ్‌ అయిన ఈ పంచాయతీ సర్పంచ్ పదవికి ఒకే కుటుంబానికి చెందిన...

గిదేం ఇచ్చెంత్రం!?|ADUGU TRENDS

‘నీల్లు పల్లమెరుగు.. నిజం దేవుడెరుగు!’ అన్నరు. నిజం సంగతేమో గనీ, నీల్లయితే పల్లానికే పోతయి గదా! నిజమా? కాదా? కనీ, ఓ దగ్గర మాత్రం నీల్లు మిట్టకు పోతున్నయుల్లా!? గిదైతే నిజమో, అబద్దమో కనీ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News