Trending News
Friday, July 11, 2025
32.8 C
Hyderabad
Trending News

Greenary| పచ్చదనం, Women empowerment| మహిళా సాధికారత మా telangana government| ప్రభుత్వ బాధ్యత

వన మహోత్సవం–2025 ప్రారంభోత్సవంలో CM|సీఎం Revanth Reddy| రేవంత్ రెడ్డి

Rangareddy District| రంగారెడ్డి జిల్లా, rajendranagar|రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో|university వన మహోత్సవం–2025ను రుద్రాక్ష మొక్క నాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రకృతి పరిరక్షణపై ప్రజల బాధ్యతను గుర్తుచేస్తూ, మహిళల సాధికారతపై ప్రభుత్వ కృషిని గురించి వివరించారు. వనమే మనం… మనమే వనం అని పెద్దలు చెప్పినట్లుగా ప్రకృతి మన జీవనంలోని అంతర్భాగమని సీఎం అన్నారు. ప్రకృతిని మనం కాపాడితే, అదే మనల్ని కాపాడుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం 18 కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుననుసరించి, ప్రతి ఒక్కరూ తమ అమ్మ పేరుతో ఒక మొక్కను నాటాలని, అలాగే అమ్మలు తమ పిల్లల పేరుతో మొక్కలు నాటాలని ఆయన సూచించారు. ప్రతీ ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటాలి. వాటిని మీ పిల్లల్లా సంరక్షించండి. అప్పుడు మాత్రమే తెలంగాణ పచ్చదనంతో నిండుతుంది అని సీఎం అన్నారు.

మహిళా సాధికారత విషయానికొస్తే, రాష్ట్ర ప్రభుత్వం అనేక వినూత్న చర్యలు చేపట్టిందని సీఎం వివరించారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు బాధ్యత, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను మహిళలకు అప్పగించామని తెలిపారు. ఇది మహిళలకు ఆర్థిక, సామాజిక స్వావలంబనకు దోహదం చేస్తుందన్నారు. ఆర్టీసీ ప్రయాణాల్లో ఉచిత సౌకర్యం కల్పించడం ద్వారా మహిళల చలనం పెరిగిందని, అదే సమయంలో 1,000 బస్సులను మహిళల చేత అద్దెకు తీసుకుని, వారిని యజమానులుగా తీర్చిదిద్దే అవకాశం కల్పించామన్నారు. హైటెక్ సిటీలో ఉన్న విప్రో, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఉన్న ప్రాంతాల్లో మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే మా లక్ష్యం అని స్పష్టం చేశారు. పట్టణాల్లో నివసించే మహిళలు కూడా మహిళా సంఘాల్లో చేరాలని పిలుపునిచ్చారు. మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు చెప్పారు.

అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలు గౌరవంగా బతకేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. త్వరలోనే మహిళా రిజర్వేషన్ అమలు కానుందనీ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్లు మహిళలకు కేటాయించే బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటానని సీఎం ప్రకటించారు. సమాజానికి మంచి జరగాలంటే ప్రకృతితో పాటు మహిళల స్థానం అభివృద్ధి చెందాలన్నదే ఈ వనమహోత్సవం సందేశమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత పరంగా దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంగా తెలిపారు.

Latest News

FARM HOUSE|‘వ్యవసాయ క్షేత్రం’ రణ క్షేత్రం కాబోతోందా!?

సంచలనమైన CM|సీఎం REVANTH REDDY|రేవంత్ రెడ్డి CHALLENGE|సవాల్! సీఎం ఛాలెంజ్ కు KCR|కేసీఆర్ FAMILY|ఫ్యామిలీ జవాబేంటి? రేవంత్ అన్నంత పనీ చేస్తారా? MINISTERS|మంత్రులను పంపుతారా? లేక తనే వెళతారా? ఫాం హౌస్ పంచాయతీ పరాకాష్టకు... ఆ పరిస్థితి వస్తుందా?.. వస్తే...

ప్రపంచ జనాభాలో మనమే నెంబర్ వన్!|EDITORIAL

ప్రపంచ జనాభా ఇప్పటికే 800 కోట్లు దాటింది. భారతదేశ జనాభా అధికారికంగా 146కోట్లకు చేరుకుంది. చైనా పకడ్బందీ జనాభా నియంత్రణతో 2వ స్థానానికి చేరుకుంది. 1987 జూలై 11న ప్రపంచ జనాభా ఐదు...

శుక్రవారం జూలై 11–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి రాత్రి 01.52 వరకు ఉపరి విదియ నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 06.18 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వైదృతి రాత్రి 08.21 వరకు ఉపరి విష్కంభ కరణం బాలవ పగలు 03.44...

పురుగుల మందే రైతుకు పెరుగన్నమాయెనా!|EDITORIAL

ఎద్దు ఏడ్చిన ఎవుసం... రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్లు చరిత్రలో లేదు. అందరికీ అన్నం పెట్టే రైతు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు? ఆరుగాలం కష్టపడే రైతు అంతకు ఎందుకు తెగిస్తున్నాడు? ప్రక్రుతి వైపరీత్యాలకు,...

గురువారం జూలై 10–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం గురు పూర్ణిమ తిధి శు.పౌర్ణమి రాత్రి 01.36 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పూర్వాషాఢ పూర్తిగా యోగం ఐంద్ర రాత్రి 09.02 వరకు ఉపరి వైదృతి కరణం భద్ర పగలు 03.16 వరకు ఉపరి బాలవ వర్జ్యం...

ఎన్డీఎ పక్షాలకు పరిపాలనలో భాగస్వామ్యమేది!?|EDITORIAL

పేరుకే జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్‌డిఎ). పరిపాలన మొత్తం ఆ కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీదే. ఇంకా చెప్పాలంటే మోడీదే. వరుసగా మూడోసారి మోడీ ప్రధాని కావడానికి కారణమైన ఎన్‌డిఎ పక్షాల పాత్ర...

బుధవారం జూలై 09–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం గురు మౌఢ్య నివృత్తి తిధి శు.చతుర్దశి రాత్రి 12.50 వరకు నక్షత్రం మూల తెల్ల 05 01 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం బ్రహ్మ రాత్రి 08.24 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి...

ఊహించని కలయిక!|PALLA RAJESHWAR REDDY| KOMMURI PRATHAP REDDY

PALLA| పల్లాను కలిసి KOMMURI| కొమ్మూరి పరామర్శ JANGAON| జనగామ POLITICS| రాజకీయాల్లో విమర్శ జనగామ నియోజకవర్గ రాజకీయాల్లో ఒక ఊహించని కలయిక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యే స్థానానికి...

‘వృక్షో రక్షతి రక్షితః!’|EDITORIAL

ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకం లోనిది. జన ప్రాముఖ్యం పొందిన వాక్యాలలో ఇది ఒకటి. ఈ వాక్యం అర్ధం ‘ధర్మాన్ని మనము అనుసరిస్తే ఆ...

మీ‘మాంసం’!?|BJP|KONDA VISHWESHWAR REDDY

మాంసాహారులకు బీజేపీలో స్థానం లేదా!? అలా అయితే PARTY| పార్టీ ఎలా బలపడుతుంది? పైన MODI| మోడీ, ఇక్కడ నేను గెలిస్తే ఏం లాభం? రాజకీయ పార్టీగా బీజేపీది బలమైన స్థానం స్వార్థానికి వాడుకునే వాళ్లతోనే బలహీనం...

మంగళవారం జూలై 08–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం తిధి శు.త్రయోదశి రాత్రి 11.39 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి తెల్ల 03.11 వరకు ఉపరి మూల యోగం శుక్ల రాత్రి 08.48 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ పగలు...

Bjp Party|స్వంత పార్టీపై MP|ఎంపీ Konda Vishweshwar Reddy|కొండా సంచలన వ్యాఖ్యలు| Sensational Comments

Vikarabad| వికారాబాద్ District|జిల్లాలో BJP|బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. కార్యకర్తల్ని ఉద్దేశించి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News